ఇంటిపని చేయని అమ్మాయిలందరిని.. | Sakshi
Sakshi News home page

ఇంటిపని చేయని అమ్మాయిలందరిని..

Published Sun, May 15 2016 12:25 PM

ఇంటిపని చేయని అమ్మాయిలందరిని..

జింద్: ఇంటిపని చేయలేదని విద్యార్థినులను చితక బాదిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. దీంతో విద్యార్థినులకు తీవ్ర గాయాలవడంతో వారిని సమీప ఆస్పత్రిలో చేర్పించారు. ఆ టీచర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.  జింద్ జిల్లాలోని లిజ్వానా అనే గ్రామంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది.

అందులో చదువుతున్న ఏడో తరగతి అమ్మాయిలు హోం వర్క్ పూర్తి చేయలేదని కారణంతో క్లాస్ ఉపాధ్యాయురాలు వారిని కర్రతతో చితక్కొట్టడమే కాకుండా బెంచిలపై నిల్చోబెట్టింది. దీంతో ఆ పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పిల్ల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement