-
వేల కార్లు చోరీ, నకిలీ జడ్జి అవతారం, 2 వేల క్రిమినల్స్ రిలీజ్
చదివింది లా. కానీ వృత్తి మాత్రం దొంగతనం.చేతివ్రాత నిపుణుడు, గ్రాఫాలజీలో కోర్సు కూడా చేసాడు. కానీ చోరీలు చేయడంలో అతని ట్రాక్ రికార్డ్ చూస్తే ఔరా అంటారు. పోలీసులను సైతం బురిడీ కొట్టించడంలో అతని తర్వాతే మరెవ్వరైనా. దొంగతనంలో ఈ విధంగా ఆరితేరిన ప్రపంచంలోనే తొలి, ఏకైక వ్యక్తి. నకిలీ పత్రాలను ఉపయోగించి ఏకంగా జడ్జ్ అయిపోయాడు. 2000 మంది నేరస్థులను విడుదల చేశాడు. ఆశ్చర్యంగా ఉంది కదా..ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి. అతగాడి పేరే ధన్ రామ్ మిట్టల్...అత్యంత దుర్మార్గపు దొంగ. ఓ కారు దొంగతనం సందర్బంగా ధనిరామ్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతను చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం ఖంగుతిన్నారు. జడ్డిగా, ట్రాన్స్ పోర్టు అధికారిగా, రైల్వే స్టేషన్ మాష్టరుగా పక్కనున్నోడికి కూడా అనుమానం రాకుండా తన దందా కొనసాగించాడు. 1960 ప్రాంతంలో రోహ్ తక్ కోర్టులో క్లర్కుగా విధులు నిర్వర్తించాడు. క్లర్కుగా పనిచేస్తున్న సమయంలో అక్కడి జడ్జి రెండు నెలలు లీవులో ఉన్నాడు. దీంతో నకిలీ పత్రాల సాయంతో ఏకంగా తానే జడ్జి అవతారం ఎత్తేశాడు ధన్ రామ్. ఈ రెండు నెలల కాలంలో దాదాపు 2 వేలమంది నేరస్థులును విడుదల చేశాడు. అంతే కాదు చాలా మందిని జైల్లో కూడా పెట్టాడు.ఆ తర్వాత విషయం బయటపడే సమయానికి మనోడు పరార్. తర్వాత ఆయన కేసులన్నింటినీ మరోసారి విచారించి తీర్పులు వెలువరించారు. అతని కోసం పోలీసులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఆ తర్వాత రీజనల్ ట్రాన్స్పోర్టు అధికారిగాను అవతారమెత్తి కారు డాక్యుమెంట్లపై ఫోర్జరీ సంతకాలు పెట్టేశాడు. రోహ్ తక్ రైల్వే స్టేషన్ లోనే రైల్వే అధికారులను సైతం బురిడీ కొట్టించి స్టేషన్ మాష్టరు కొలువు దక్కించుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతని అరాచకాలకు లెక్కే లేదు. 25 ఏళ్ల వయసులో దొంగతనాల ద్వారా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దొంగతనం రుచిమరిగిన అతగాడు ఇక అక్కడనుంచి వరసగా దొంగతనాలతో పోలీసులకు చుక్కలు చూపించాడు. కానీ ధని రామ్ 1964లో తొలిసారి జైలుకి వెళ్లాడు. కథ ఇక్కడితో అయి పోలేదు. వరుసగా అరెస్టులవుతూ , విడుదలవుతూ అలా ఇప్పటివరకు 25 సార్లు అరెస్టు అయిన ధని రామ్ అత్యధికంగా అరెస్టయిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్. సమీప ప్రాంతాలలో కార్ల దొంగతనంలో కూడా మహా ముదురు. ఏ కారును పడితే ఆ కారును దొంగిలించడు. కేవలం ఎస్టీమ్, మారుతి 800, హుందాయ్ శాంత్రో తదితర సెక్యూరిటీ అలారం లేని కార్లను మాత్రమే దొంగతనం చేస్తుంటాడు. అదీ పట్టపగలు. వాటిని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేస్తాడు. ఒకవేళ పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లినా తగ్గేదేలే అంటాడు. మళ్లీ అదే తంతు. 81 సంవత్సరాలు మీద పడ్డా కూడా.. ఇప్పుడెక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. ధని రామ్ ఎప్పటికి చోరీలకు ఫుల్ స్టాప్ పెడుతాడో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. -
నకిలీ డాక్టర్లకు చెక్..
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకున్నా వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న వారిపై, అక్రమంగా ఆసుపత్రులు నడుపుతున్నవారిపైనా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎంసీ) ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్లో అర్హత లేకున్నా ప్రాక్టీస్ చేస్తున్న రెండు ఆసుపత్రు లకు ఇటీవలే ఎన్నికైన కొత్త మండలి నోటీసులు జారీ చేసింది. సదరు ఆసుపత్రుల్లో యాంటీబయా టిక్స్, స్టెరాయిడ్స్ వంటి షెడ్యూల్డ్ డ్రగ్స్ను గుర్తించి ఈ మేరకు వాటిపై కేసులు నమోదు చేసింది. ఇంకా అనేక చోట్ల నకిలీ వైద్యుల దందాపై దాడులకు శ్రీకారం చుట్టింది. డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు పెడతామని మండలి హెచ్చరించింది. పేరుకు ముందు ‘డాక్టర్’ హోదా పెట్టుకున్నా, ఆసుపత్రి అని రాసి ఉన్న బోర్డులు ప్రదర్శించినా, రోగులకు ప్రిస్క్రిప్షన్ రాసినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆర్ఎంపీల ముసుగులో రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలు 30 వేల మంది వర కు ఉన్నారని ఓ అంచనా. ప్రతీ గ్రామంలో వారు ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆర్ఎంపీలు, పీఎంపీల ముసుగులో డాక్టర్లుగా చెలామణీ అవుతూ.. ఇష్టారాజ్యంగా అబార్షన్లు చేయడం, అత్యధిక మోతాదులో ఉన్న యాంటీబయాటిక్స్ ఇవ్వడం, చిన్న రోగాలకు కూడా అధికంగా మందులు రాస్తున్నారని మండలి గుర్తించింది. ఇటీవల నగరంలోని మలక్పేట్ ప్రాంతంలో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ను కలిగి ఉన్న ఒక అర్హతలేని ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ను పరిశీలిస్తే, శిశువుకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ మెరోపెనెమ్ రాయడం చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సహజంగా శిశువులకు ఉపయోగించే యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు పెద్దలకు ఉప యోగించేవి కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి. పెద్ద లకు వాడే ఇంజెక్షన్లు శిశువుకు ప్రాణాంతకంగా మారతాయి. మలక్పేటలోని ఆ నకిలీ డాక్టర్ మాది రిగానే చాలామంది నకిలీ డాక్టర్లు మానసిక ఔష ధాల ప్రిస్క్రిప్షన్లోనూ ఇష్టారాజ్యంగా మందులు రాస్తున్నారని తేలింది. ఈ నేపథ్యంలో నకిలీ డిగ్రీని ప్రదర్శించడం, అర్హత లేకున్నా ప్రిస్క్రిప్షన్లు రాయ డం వంటి దృష్టాంతాలను మండలి తీవ్రంగా తీసు కుంది. మరోవైపు అడ్డగోలుగా అల్లోపతి మందు లను సూచిస్తున్న ఇద్దరు నకిలీ ఆయుష్ వైద్యులను గుర్తించి వారిపై ఆయుష్ శాఖకు లేఖ రాసింది. ఇక నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సాయాన్ని కూడా తీసుకోవాలని మండలి నిర్ణయించింది. నకిలీ ప్రైవేట్ ప్రాక్టీషనర్ల ద్వారా రోగులకు మందులు అందకుండా చేయాలని నిర్ణయించింది. -
అమెరికా నుంచి నకిలీ సర్టిఫికెట్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఉంటున్న ఓ స్నేహితుడు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో తన మిత్రుడిని అమెరికాకు రప్పించేందుకు యత్నించగా విఫలమై.. కటకటాలపాలయ్యాడు. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కర్మన్ఘాట్కు చెందిన పులిపాటి మణికంఠ బీటెక్ ఫెయిలయ్యాడు. ఉద్యోగ వెతుకులాటలో ఉన్నాడు. ఈ క్రమంలో అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడు జనార్దన్ సూచన మేరకు మేఘాలయ – షిల్లాంగ్లోని విల్లియం కార్వే యూనివర్సిటీ నుంచి నకిలీ డిగ్రీ సరి్టఫికెట్ పొందాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో జనార్దన్ సూచన మేరకు నకిలీ విద్యార్హత పత్రాల తయారీదారు నరే‹Ùను కలిశాడు. అతడిని సంప్రదించి రూ.1.6 లక్షలు చెల్లించి విల్లీయం కార్వే యూనివర్సీటీకి చెందిన నకిలీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ సర్టిఫికెట్ పొందాడు. ఈమేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం మణికంఠను అరెస్టు చేశారు. నరేష్, జనార్దన్లు పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి బీఎస్సీ సరి్టఫికెట్తో పాటు మూడు మార్క్స్ మెమోలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్ , మైగ్రేషన్ సర్టిఫికెట్, సీఎంఎం సర్టిఫికెట్ , టీసీ, రెండు ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. -
'అంగట్లో సర్టిఫికెట్లు' డబ్బు ఇచ్చారంటే.. తెలంగాణదైనా..! ఏపీదైనా..!
మహబూబ్నగర్: మీకు పుట్టిన తేదీ తెలియదా.. మీ కూతురికి పెళ్లి వయసు లేకపోయినా కల్యాణలక్ష్మి పథకం కోసం వయస్సు పెంచిన ఆధార్ కార్డు కావాలా.. బీమా సొమ్ము కోసం మరణ ధ్రువీకరణ పత్రం కావాలా.. మీరు చేయాల్సిందంతా ఒక్కటే ప్రభుత్వ ఆధార్ సెంటర్ పేరుతో నకిలీ దందా చేస్తున్న వారిని సంప్రదిస్తే చాలు. వారికి అడిగినంత సొమ్ము ఇచ్చారంటే మీకు కావాల్సిన సర్టిఫికెట్ మీ ముందుంటుంది. అది తెలంగాణకు చెందినదైనా, ఏపీదైనా. ఈ నకిలీ దందా జరుగుతోంది ఎక్కడో కాదు, జోగుళాంబ గద్వాల జిల్లాలోనే. ‘సాక్షి’ పరిశోధనలో ఇటీవల ఈ నకిలీ ధ్రువపత్రాల దందా వెలుగులోకి వచ్చింది. అవసరాలే ఆసరాగా నకిలీవి సృష్టిస్తూ.. ప్రస్తుతం ప్రతి పథకంలో కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా అవసరముంది. అయితే, గతంలో వివిధ ఆసుపత్రుల్లో ప్రసవాలు అయిన వారు తమ పిల్లల జనన తేదీలను నమోదు చేసుకోలేదు. వారికి ఇప్పుడు ఆధార్కార్డు అవసరం ఉండటంతో వారి జనన ధ్రువీకరణ పత్రాలను ఆధార్ కేంద్రం పేరుతో నడుపుతున్న వారు తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జోగుళాంబ గద్వాల ఆస్పత్రి ఇచ్చినట్లు ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రం జనన ధ్రువీకరణ పత్రాలన్నీ మీసేవల ద్వారానే అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఏపీలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ శాఖ ద్వారా జనన ధ్రువీకరణ పత్రం అందిస్తుండగా.. అక్కడి ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ పేరుతో కర్నూల్ జనరల్ హాస్పిటల్లో జన్మించినట్లుగా జనన ధ్రువీకరణ పత్రాన్ని అందించి అటు ప్రజలను, ఇటు అధికారులను మోసం చేస్తున్నారు. అసలు నకిలీ పత్రాలను అప్లోడ్ చేస్తున్నా, అధికారులు పరిశీలించడం లేదా? లేక అధికారులకు తెలిసే జరుగుతుందా అనే అను మానాలెన్నో ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో వందల సర్టిఫికేట్లు, కర్నూల్ జిల్లాలోని వారికి సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులుగా ఈ దందా సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు దారి తీస్తుంది. అవి నకిలీ ధ్రువపత్రాలు.. రాష్ట్ర ప్రభుత్వం పేరుతో ఇచ్చిన ధ్రువీకరణ పత్రం పూర్తిగా నకిలీది. ప్రస్తుతం జనన ధ్రువీకరణ పత్రాలు అన్ని మీసేవల ద్వారానే అందుతున్నాయి. కొందరు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని చేసే వాటిని సంబంధిత అధికారులు పర్యవేక్షించాలి. ప్రజలు కూడా మోసపోకూడదు. – డాక్టర్ కిషోర్, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వాసుపత్రి దందా జరుగుతోందిలా.. కేవలం పాఠశాలల విద్యార్థులకు, వారి ఆధార్ వివరాలు నమోదు చేయడం కోసం సర్వశిక్షా అభియాన్ ద్వారా జిల్లాలోని పలు విద్యా సంస్థల వద్ద ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ మార్కెట్లో నెట్వర్క్ సేవల పేరుతో పెద్దఎత్తున షాపులు తెరిచి, అక్కడ ఆధార్ కార్డులు, పేరు మార్పిడి, కొత్త కార్డులు తదితర సవరణలు చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, ఆధార్ కార్డులో సవరణల కోసం, కొత్త కార్డుల కోసం జనన ధ్రువీకరణ పత్రాలు అవసరముంటుంది. నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లకుండా నేరుగా ఆసుపత్రి నుండే ధ్రువీకరణ పత్రాలు వచ్చినట్లు నకిలీ పత్రాలను తయారు చేసి, వాటిని ప్రామాణికంగా తీసుకుని ఆధార్ కార్డు డౌన్లోడ్ చేస్తున్నారు. దీని కోసం రూ.5వేల నుంచి అత్యవసరమైతే మరింత ఎక్కువ వసూలు చేస్తున్నట్లు సమాచారం. ‘సాక్షి’ పరిశోధనలో ఇలాంటి నకిలీ ధ్రువీకరణ పత్రాలు చాలానే బయటపడ్డాయి. ఆధార్ సైట్లో ఉన్న లొసుగులను వాడుకుంటూ తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దానికి అమాయక ప్రజలు బలైపోతున్నారు. రూ.వేలకు వేలు డబ్బులు చిల్లు పెట్టుకుని తీరా అది నకిలీవి అని తెలిసినా చేసేదేమి లేక మౌనంగా ఉండిపోతున్నారు. -
హైదరాబాద్ లో నకిలీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు కలకలం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement