-
అఫీషియల్: కమల్హాసన్ మూవీలో స్టార్ క్రికెటర్ తండ్రి.. పోస్ట్ వైరల్
విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇండియన్-2'. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 1996లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్గా వస్తోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చిది. ఇవాళ చెన్నైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీలో పంజాబ్కు చెందిన ప్రముఖ నటుడు కనిపించనున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన మేకప్ వేసుకుంటున్న ఓ ఫోటోను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. యోగ్ రాజ్.. తన ఇన్స్టాలో రాస్తూ...' ఈ చిత్రంలోని నటీనటులందరికీ నా ధన్యవాదాలు. నన్ను ఇంత అందంగా తయారు చేస్తున్న మేకప్ మ్యాన్కు థ్యాంక్స్. కమల్ హాసన్ ఇండియన్-2 సినిమాలో నటించేందుకు పంజాబ్ సింహం సిద్ధంగా ఉంది.' అంటూ రాసుకొచ్చారు. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇప్పటికే తిరుపతిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్సింత్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. View this post on Instagram A post shared by Yograj Singh (@yograjofficial) -
'నా తండ్రి వ్యాఖ్యలు నన్ను బాధించాయి'
ముంబై : టీమిండియా మాజీ డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్.. నేడు 39వ పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా యువీ ట్విటర్ వేదికగా ఎమోషనల్ అయ్యాడు. 'ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలనుకుంటున్నా. దేశానికి రాజుగా అభివర్ణించే రైతు ఈరోజు నిరసనలు చేయడం బాధగా ఉంది. పుట్టినరోజులనేవి వస్తుంటాయి.. పోతుంటాయి.రైతులు దేశానికి వెన్నముక అన్న మాట నిజం.. వారు చేస్తున్న ఆందోళన త్వరలోనే సమసిపోవాలని.. కేంద్రంతో చర్చలు శాంతియుత వాతావరణంలో జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. (చదవండి : నెటిజన్ కామెంట్కు గబ్బర్ ధీటైన కౌంటర్) రైతుల చేస్తున్న ఆందోళనకు నా తండ్రి యోగరాజ్ మద్దతు పలికారు. వారి ఆందోళన సరైనదేనని.. వెంటనే రైతుల డిమాండ్లను నెరవేర్చాలని కేంద్రానికి తెలిపారు. అంతేగాక రైతుల ఆందోళనకు మద్దతుగా కొందరు క్రీడాకారులు తమ అవార్డులను కూడా వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇలా చేస్తున్నారంటే రైతుల ఉద్యమంలో నిజం ఉందని ..అందుకే వారి సమస్యలు తీర్చాలని నా తండ్రి పేర్కొనడం బాధ కలిగించింది. ఆయన ఆలోచన విధానాలతో నేను సరితూగలేను.ఎవరి ఐడియాలజీ వారికి ఉంటుంది. ఆయన వ్యాఖ్యలను నేను తప్పుబట్టలేను.. అలా అని సమర్థించలేను.అంతేకాదు కోవిడ్ -19 మహమ్మారి ఇంకా ముగియలేదు. కరోనా వైరస్ పై పోరాడటానికి జాగ్రత్తలు తీసుకోవాలని రైతులను కోరుతున్నా. జై జవాన్, జై కిసాన్! జై హింద్' అంటూ ఉద్వేగంతో ముగించాడు. (చదవండి : బీకేర్ ఫుల్.. మరిన్ని బౌన్సర్లు దూసుకొస్తాయి) pic.twitter.com/MOUj65QtDs — Yuvraj Singh (@YUVSTRONG12) December 11, 2020 ఇక 39వ పుట్టినరోజు జరుపుకుంటున్న యువరాజ్ సింగ్ 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అనతికాలంలోనే డాషింగ్ ఆల్రౌండర్గా పేరు పొందిన యువీ 304 వన్డేల్లో 8701, 40 టెస్టుల్లో 1900, 58 టీ20ల్లో 1177 పరుగులు చేశాడు. ఇందులో వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్ సెంచరీలు, టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే వన్డేల్లో 120 వికెట్లు.. టెస్టుల్లో 10 వికెట్లు తీశాడు. 2007టీ 20, 2011 వన్డే ప్రపంచకప్లు టీమిండియా గెలవడంలో యూవీ కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో యువీ బ్రాడ్ బౌలింగ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడం క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. టీమిండియా తరపున టీ20ల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ అతని పేరిట ఉండడం మరో రికార్డుగా చెప్పవచ్చు. -
‘ధోని, కోహ్లిలు వెన్నుపోటు పొడిచారు’
హైదరాబాద్: టీమిండియా ప్రస్తుత సారథి విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిలపై మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. యువీ కెరీర్ కష్టకాలంలో ఉన్నప్పుడు వీరిద్దరు అండగా నిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ జాతీయా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్రాజ్ మాట్లాడుతూ.. ‘యువరాజ్ను ఎంతో మంది వెన్నుపోటు పొడిచారు. అందులో ధోని, కోహ్లిలు కూడా ఉన్నారు. ఇది చాలా బాధాకరం. సెలక్టర్ శరణ్దీప్ కూడా యూవీని జట్టు నుంచి తప్పించాలని చూశాడు’అంటూ షాకింగ్స్ కామెంట్స్ చేశాడు. ధోని, కోహ్లిలపై యోగ్రాజ్ ఇలాంటి ఆరోపణలు చేయడం కొత్తేంకాదు. వన్డే ప్రపంచకప్-2011 సమయంలో యువీని తప్పించి రైనాను జట్టులోకి తీసుకోవాలని ధోని ప్రయత్నించాడని గతంలో ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. తన కొడుకు రాణిస్తే తమకు పేరు రాదనే ఉద్దేశంతోనే ధోని, కోహ్లిలు యువీ పట్ల వివక్ష చూపించేవారని యోగ్రాజ్ విమర్శించేవాడు. ఇక యువీ సైతం తన కెరీర్లో సౌరవ్ గంగూలీ నుంచి వచ్చిన మద్దతు మరెవరి నుంచి రాలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చదవండి: 'అందుకే రైనాను పక్కన పెట్టాం' శిఖర్ ధావన్ను చూడగానే ఏడ్చేశాను.. -
తలైవాతో తలపడుతున్నారు
అవును తలైవా (నాయకుడు) రజనీకాంత్తో తలపడుతున్నారట యోగ్రాజ్ సింగ్. ఇంతకీ ఎవరీ యోగ్రాజ్ సింగ్? అంటే క్రికెట్ను ఫాలో అయ్యేవాళ్లకు ఈ పేరు సుపరిచితమే. ఇండియన్ క్రికెట్ టీమ్ తరపున కొన్ని మ్యాచులు ఆడటంతో పాటు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ అని చాలామందికి తెలుసు. క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత పంజాబీ ఇండస్ట్రీలో యాక్టర్గా సినిమాలు చేస్తున్నారాయన. ఇప్పుడు రజనీకాంత్ తాజా చిత్రంలో నటిస్తున్నారని తెలిసింది. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తున్న చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. 25 ఏళ్ల తర్వాత ఈ చిత్రంలో రజనీ పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఇందులో యోగ్రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. సినిమాలో వచ్చే ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్లో రజనీ, యోగ్రాజ్ తలపడనున్నారని తెలిసింది. యోగ్రాజ్ ఇది వరకు ‘సింగ్ ఈజ్ కింగ్, భాగ్ మిల్కా భాగ్’ వంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించారు. ‘దర్బార్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
అతడిని ఎప్పటికీ క్షమించను: యువీ తండ్రి
చండీగఢ్: యువరాజ్ సింగ్కు చిన్నతనంలో క్రికెట్ అంటే ఇష్టముండేది కాదని అతడి తండ్రి యోగ్రాజ్ సింగ్ తెలిపారు. క్రికెట్ మీద తనకు ఉన్న ఇష్టంతోనే కొడుకుతో బ్యాట్ పట్టించానని ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. (చదవండి: యువరాజ్ గుడ్బై) ‘ఏడాదిన్నర వయసు ఉన్నప్పుడే యువీకి క్రికెట్ బ్యాట్ కొనిచ్చాను. వాడికి ఫస్ట్ బౌలర్ మా అమ్మ గుర్నమ్ కౌర్. మెల్లగా బంతి విసిరి వాడికి ఆట నేర్పేది. ఇప్పటికీ ఈ ఫొటో మా దగ్గర ఉంది. వయసు పెరిగేకొద్ది స్కేటింగ్, టెన్నిస్ ఆడటం మొదలుపెట్టాడు. క్రికెట్కు దూరమైపోతాడన్న భయంతో స్కేటింగ్ కిట్ను బయటకు విసిరేసి, టెన్నిస్ రాకెట్ను విరగొట్టేశాడు. అప్పుడు యువీ బాగా ఏడ్చాడు. నా మీద కోపంతో సెక్టార్ 11లో ఉన్న మా ఇంటిని జైలు అని, నన్ను డ్రాగన్ సింగ్ అంటూ పిలిచేవాడు. తర్వాత మెల్లగా వాడి దృష్టిని క్రికెట్వైపు మళ్లించాను. ఆరేళ్ల ప్రాయంలో యూవీని సెక్టార్ 16లోని స్టేడియంలోని పేస్ బౌలింగ్ అకాడమీకి తీసుకెళ్లాను. హెల్మెట్ లేకుండా ప్రాక్టీస్ చేయమని వాడికి చెప్పాను. శిక్షణలో భాగంగా రోజూ గంటన్నరపాటు స్టేడియంలో పరుగెత్తేవాడు. నాకు బాగా గుర్తుంది. యువీకి కఠిన శిక్షణ ఇప్పించడం చూసి మరణశయ్యపై ఉన్న మా అమ్మ ఒకసారి నన్ను మందలించింది. వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నానని మండిపడింది. ఈ ఒక్క విషయంలోనే నా కుమారుడి పట్ల కఠినంగా ఉన్నందుకు బాధ పడ్డాను. మొదట్లో క్రికెట్ను యువీ ద్వేషించాడు. కానీ క్రికెట్ను అతడు ప్రేమించేలా చేశాను. క్రికెట్లో అతడు ఏం సాధించాడో ఇప్పుడు ప్రపంచానికి మొత్తానికి తెలుసున’ని యోగ్రాజ్ ఒకింత గర్వంగా అన్నారు. ఒంటరిగా కూర్చుని ఏడ్చాను తన కుమారుడికి క్యాన్సర్ సోకిందని తెలియగానే అంతులేని బాధ కలిగిందని యోగ్రాజ్ సింగ్ తెలిపారు. క్యాన్సర్తో యువీ కథ ముగియకూడదని దేవుడిని ప్రార్థించాను. తానేప్పుడు యువీ ఎదుట బాధ పడలేదని, గదిలో ఒంటరిగా ఏడ్చేవాడినని వెల్లడించారు. క్యాన్సర్తో తాను చనిపోతే.. తన చేతిలో వరల్డ్కప్ ట్రోఫినీ ప్రపంచమంతా చూడాలని తనతో యువీ చెప్పినట్టు గుర్తుచేసుకున్నారు. రిటైర్మెంట్ ప్రకటనకు ముందు చండీగఢ్లో రెండు రోజుల పాటు యువీ సంతోషంగా గడిపాడని చెప్పారు. (చదవండి: మైదానంలో ‘మహరాజు’) చాపెల్ను క్షమించను యువీ కెరీర్ను భారత క్రికెట్ మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ నాశనం చేశాడని యోగ్రాజ్ సింగ్ మండిపడ్డారు.‘చాపెల్ కోచ్గా ఉన్నప్పుడు ఖోఖో ఆడుతుండగా యువీ మోకాలికి గాయమైంది. ఇది అతడి క్రీడాజీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. గాయపడకుంటే వన్డే, టీ20ల్లో అంతర్జాయతీయ రికార్డులన్నిటినీ యువీ బద్దలుకొట్టేవాడు. కోచ్గా ఉన్నప్పుడు నెట్ ప్రాస్టీస్కు ముందు ఖోఖో లాంటి దేశీయ ఆటలను చాపెల్ ఆడించేవాడు. ఇలా ఆడుతున్నపుడే యువీ గాయపడ్డాడు. నా కుమారుడి క్రీడా జీవితాన్ని నాశనం చేసినందుకు చాపెల్ను ఎన్నటికీ క్షమించలేన’ని యోగ్రాజ్ అన్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement