-
ధోని రికార్డును బ్రేక్ చేశాడు...
అబుదాబి: జింబాబ్వేతో జరిగిన మూడో టి20 మ్యాచ్లో అఫ్గానిస్తాన్ 47 పరుగులతో విజయం సాధించి సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేసింది. అస్గర్ కెప్టెన్సీలోని అఫ్గాన్ జట్టు తొలుత బ్యాటింగ్కు దిగి 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్ (35 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్లు) చెలరేగాడు. ఉస్మాన్ ఘనీ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), అస్గర్ (12 బంతుల్లో 24; 1 ఫోరు, 2 సిక్స్లు) కూడా తోడవ్వడంతో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు సాధించింది. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసి ఓడిపోయింది. సికిందర్ రజా (41 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), ర్యాన్ బుర్ల్ (31 బంతుల్లో 39 నాటౌట్; 1 ఫోరు, 3 సిక్స్లు) రాణించారు. నజీబుల్లాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’.... సిరీస్లో 100 పరుగులతో పాటు ఐదు వికెట్లు తీసిన అఫ్గాన్ ఆల్రౌండర్ కరీమ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. ఇక్కడ చదవండి: వైరల్: బట్లర్ తీరుపై కోహ్లి ఆగ్రహం ధోని రికార్డును బ్రేక్ చేసిన అస్గర్ ఇదిలా ఉంచితే, అఫ్గానిస్తాన్ టీ20 కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ ఈ ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్గా నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో 42 విజయాలను సాధించిన కెప్టెన్గా నయా రికార్డు లిఖించాడు. అస్గర్ సారథ్యంలో అఫ్గానిస్తాన్ 42 విజయాలు సాధించింది. అస్గర్ 52 టీ20 మ్యాచ్లకు అఫ్గాన్ తరఫున నాయకత్వం వహించగా, అందులో 42 విజయాలు సాధించడం విశేషం. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 72 టీ20 మ్యాచ్లకు సారథ్యం వహించి 41 మ్యాచ్ల్లో విజయాలు అందించాడు. ఇది ఇప్పటివరకూ ధోని పేరిట ఉండగా, తాజాగా అస్గర్ పేరిట లిఖించబడింది. ఆస్గర్, ధోని తర్వా త స్థానాల్లో టీ20ల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఉన్నాడు. మోర్గాన్ ఇప్పటివరకూ 59 టీ20 మ్యాచ్లకు కెప్టెన్గా చేసి 33 విజయాలను అందించాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటివరకూ 45 మ్యాచ్లకు సారథ్యం వహించి 27 విజయాలను దక్కించుకున్నాడు. ఈ జాబితాలో కోహ్లి ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ చదవండి: కోహ్లి ఓపెనింగ్ చేస్తే నాకు అభ్యంతరమేంటి! -
న్యూజిలాండ్ తో టీ20 భారత్ ఘన విజయం
-
టి20 జట్టులో మాథ్యూస్ రీఎంట్రీ
కొలంబో: దాదాపు 16 నెలల విరామం తర్వాత ఆల్రౌండర్ ఎంజెలో మాథ్యూస్ శ్రీలంక టి20 జట్టులోకి వచ్చాడు. భారత్తో ఈనెల 5న మొదలయ్యే మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో పాల్గొనే శ్రీలంక జట్టును బుధవారం ప్రకటించారు. 16 మంది సభ్యులుగల జట్టుకు లసిత్ మలింగ సారథ్యం వహిస్తాడు. 32 ఏళ్ల మాథ్యూస్ 2018 ఆగస్టులో చివరిసారి టి20 మ్యాచ్ ఆడాడు. శ్రీలంక టి20 జట్టు: మలింగ (కెప్టెన్), గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఎంజెలో మాథ్యూస్, దసున్ షనక, కుశాల్ పెరీరా, డిక్వెల్లా, ధనంజయ డిసిల్వా, ఇసురు ఉడాన, భానుక రాజపక్స, ఒషాడా ఫెర్నాండో, వనిందు హసరంగ, లాహిరు కుమార, కుశాల్ మెండిస్, సందకన్, కసున్ రజిత. -
టీ20 సిరీస్ను ‘స్వీప్’ చేశారు
కతునాయకే: శ్రీలంక మహిళలతో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను భారత్ ఓటమి లేకుండా ముగించింది. సోమవారం జరిగిన నాల్గో టీ20లో విజయం సాధించి సిరీస్ను గెలుచుకున్న భారత మహిళలు.. మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో సైతం అదే జోరు కనబర్చారు. కనీసం చివరి మ్యాచ్లో గెలిచి పరువు నిలుపుకుందామనుకున్న ఆతిథ్య శ్రీలంకకు భారత్ మరోసారి చుక్కలు చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, లంక మహిళలు 17.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలారు. పూనమ్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, రాధా యాదవ్, దీప్తి శర్మలు తలో రెండు వికెట్లు తీశారు. దాంతో భారత్ 51 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 4-0 తో ‘స్వీప్’ చేసింది. ఈ సిరీస్లో రెండో టీ20 వర్షం కారణంగా రద్దవ్వగా, మిగతా వాటిలో భారత్ విజయ ఢంకా మోగించింది. తాజా మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత మహిళలు 18.3 ఓవర్లలో 156 పరుగులు చేశారు. ఓపెనర్లు మిథాలీ రాజ్(12), స్మృతీ మంధాన(0) నిరాశపరిచినప్పటికీ, జెమీమా రోడ్రిగ్స్(46) మరోసారి ఆకట్టుకున్నారు. అనంతరం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(63;38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. -
టీ20 సిరీస్ భారత మహిళలదే
కొలంబో: శ్రీలంకతో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను భారత మహిళలు ఇంకా ఒక మ్యాచ్ ఉండగానే చేజిక్కించుకున్నారు. సోమవారం జరిగిన నాల్గో టీ20లో భారత మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను సాధించారు. శ్రీలంక నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింద. వర్షం కారణంగా 17 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో భారత ఓపెనర్లు మిథాలీ రాజ్(11), స్మృతీ మంధాన(5)లు విఫలమైనప్పటికీ, జెమిమా రోడ్రిగ్స్(52 నాటౌట్;37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అనుజా పాటిల్(54 నాటౌట్; 42 బంతుల్లో 7ఫోర్లు) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రోడ్రిగ్స్ సిక్స్తో ఇన్నింగ్స్ను ముగించారు. ఈ జోడి అజేయంగా 96 పరుగులు జోడించడంతో భారత్ 15.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. దాంతో సిరీస్ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. రెండో టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇక నామమాత్రపు ఐదో టీ20 మంగళవారం జరుగనుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
Advertisement