
కష్టాల్లో శ్రీలంక
మూడు టీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న రెండో మ్యాచ్ లో శ్రీలంక కష్టాల్లో పడింది.
రాంచీ:మూడు టీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న రెండో మ్యాచ్ లో శ్రీలంక కష్టాల్లో పడింది. 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 68 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది.శ్రీలంక ఆటగాళ్లలో దిల్షాన్(0),ప్రసన్న(1), గుణతిలకా(2), చండిమాల్(31), కపుగదెరా(32)లు పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో ఆశిష్ నెహ్రా, జడేజాలు రెండు వికెట్లు తీయగా, అశ్విన్ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 196 పరుగులు చేసింది.