
ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం
ఇంగ్లండ్పై వన్డే సిరీస్ను గెలిచి మంచి ఊపుమీద ఉన్న దక్షిణాఫ్రికా.. తొలి ట్వంటీ 20లో మాత్రం పోరాడి గెలిచింది.
కేప్టౌన్: ఇంగ్లండ్పై వన్డే సిరీస్ను గెలిచి మంచి ఊపుమీద ఉన్న దక్షిణాఫ్రికా.. తొలి ట్వంటీ 20లో మాత్రం పోరాడి గెలిచింది. రెండు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్లో దక్షిణాఫ్రికా చివ రిబంతికి గట్టెక్కింది. ఇరు జట్ల మధ్య ఆఖరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్పై సఫారీలే పైచేయి సాధించారు. దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్(17 నాటౌట్) ఆఖరి ఓవర్లో 14 పరుగులు సాధించడంతో పాటు, చివరి బంతికి రెండు పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్రపోషించాడు.
దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 135 కాగా, 19.0 ఓవర్లలో 120/7. ఇక మిగిలింది ఆఖరి ఓవర్. ఆ ఓవర్లో సఫారీలు విజయం సాధించాలంటే 15 పరుగులు చేయాలి. ఆ తరుణంలో ఇంగ్లండ్ బౌలర్ తోప్లీ వేసిన తొలి బంతిని అబాట్ సింగిల్ గా మలచడంతో క్రిస్ మోరిస్ బ్యాటింగ్ కు వచ్చాడు. ఆ తరువాత రెండు వరుస బంతులను ఫోర్, సిక్సర్గా మలచగా, నాల్గో బంతికి పరుగు రాలేదు. ఇంకా ఆఖరి రెండు బంతులకు నాలుగు పరుగులు కావాలి. ఆ సమయంలో మోరిస్ సమయోచితంగా రెండేసి పరుగుల చొప్పున తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20.0 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 134 పరుగులు నమోదు చేసింది.