ఇంగ్లండ్ కు సాధారణ లక్ష్యం | india set target of 148 runs for england | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ కు సాధారణ లక్ష్యం

Jan 26 2017 6:10 PM | Updated on Sep 5 2017 2:11 AM

ఇంగ్లండ్ కు సాధారణ లక్ష్యం

ఇంగ్లండ్ కు సాధారణ లక్ష్యం

మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి మ్యాచ్లో భారత్ 148 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది.

కాన్పూర్: మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి మ్యాచ్లో భారత్ 148 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆది నుంచి తడబడతూ బ్యాటింగ్ కొనసాగించింది. ఈ మ్యాచ్లో ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి(29)ఫర్వాలేదనిపించగా, మరో్ ఓపెనర్ కేఎల్ రాహుల్(8) నిరాశపరిచాడు. ఆ తరువాత సురేశ్ రైనా(34; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో భారత్ తిరిగి తేరుకుంది.

 

అయితే  యువరాజ్ సింగ్(12) కూడా స్వల్ప వ్యవధిలోనే అవుట్ కావడంతో భారత్ జట్టు 75 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది. కాగా, ఎంఎస్ ధోని (36 నాటౌట్;26 బంతుల్లో 3 ఫోర్లు) ఆకట్టుకోవడంతో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.  ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ రెండు వికెట్లు సాధించగా, మిల్స్, జోర్డాన్, ప్లంకెట్, స్టోక్స్లకు తలో వికెట్ దక్కింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement