ప్రధాన వార్తలు
చెలరేగిన బౌలర్లు.. ఢిల్లీని చిత్తుగా ఓడించిన ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) జరిగిన 39వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్ కుమార్ (3-0-5-3), హాజిల్వుడ్ (3.3-0-12-4) చెలరేగడంతో 75 పరుగులకే కుప్పకూలింది. భువీ, హాజిల్కు రసిక్ (2-0-21-1), సుయాశ్ (4-1-7-1), కృనాల్ (2-0-9-1) తోడవడంతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది.ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే అభిషేక్ పోరెల్ (30) పుణ్యమే. అతనితో పాటు డేవిడ్ మిల్లర్ (19), జేమీసన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లలో సాహిల్ పరాఖ్, సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్ డకౌట్లు కాగా.. కేఎల్ రాహుల్, నితీశ్ రాణా తలో పరుగు చేశారు. స్టబ్స్ 5, కుల్దీప్ 3 పరుగులు చేశారు.అనంతరం ఢిల్లీ నిర్దేశించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 6.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఊదేసింది. 20 పరుగులు చేసి జేకబ్ బేతెల్ ఔట్ కాగా.. పడిక్కల్ (34 నాటౌట్), విరాట్ కోహ్లి (23 నాటౌట్) ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.బేతెల్ వికెట్ జేమీసన్కు దక్కింది.
చెత్త ఆటలోనూ మిల్లర్ అరుదైన రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణ ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్లో పిచ్ ఆది నుంచి పేసర్లకు అనుకూలంగా మారడంతో ఆర్సీబీ బౌలర్లు హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్లు చెలరేగిపోయారు. చెరో మూడు ఓవర్లు వేసిన ఈ ఇద్దరు చెరో మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకోవడం విశేషం. బంతి అనూహ్యంగా బౌన్స్, స్వింగ్ అవ్వడంతో 10 పరుగుల్లోపే ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు కీలక వికెట్లు కోల్పోయింది. ఇంత చెత్త ఆటలోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. టీ20ల్లో 12వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో సౌతాఫ్రికా క్రికెటర్గా డేవిడ్ మిల్లర్ నిలిచాడు. 11 పరుగుల స్కోరు వద్ద ఉన్నప్పుడు మిల్లర్ ఈ ఘనత సాధించాడు. మిల్లర్ టీ20ల్లో 12వేల పరుగులు పూర్తి చేయడానికి 565 మ్యాచ్లు (513 ఇన్నింగ్స్లు) తీసుకున్నాడు. మిల్లర్ కంటే ముందు క్వింటన్ డికాక్ (12,454 పరుగులు), పాఫ్ డుప్లెసిస్ (12,041 పరుగులు) ఈ ఫీట్ అందుకున్నారు. ఓవరాల్గా టీ20 క్రికెట్లో 12వేల పరుగులు పూర్తి చేసుకున్న 13వ బ్యాటర్గా మిల్లర్ నిలిచాడు. ఇక టీ20ల్లో మిల్లర్ 56 సార్లు ఫిఫ్టీ మార్క్ సాధించాడు. నాలుగుసార్లు సెంచరీలు బాదాడు. ఇక 2012లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మిల్లర్ ఇప్పటివరకు 149 మ్యాచ్లాడి 3,100 పరుగులు చేశాడు. సెంచరీ సహా 14 అర్థశతకాలు చేశాడు. అయితే ఈ పద్నాలుగింటిలో 13 హాఫ్ సెంచరీలను మిల్లర్ లక్ష్యఛేదనలో సాధించడం మరో విశేషం. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ పొరేల్ 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్ 4, భువనేశ్వర్ 3 వికెట్లు తీశారు.𝐀 𝐟𝐢𝐧𝐢𝐬𝐡𝐞𝐫. 𝐀 𝐟𝐢𝐠𝐡𝐭𝐞𝐫. 𝐀 𝐓𝟐𝟎 𝐠𝐫𝐞𝐚𝐭 💪🔥1️⃣2️⃣0️⃣0️⃣0️⃣ runs of pure impact 💣🏏David Miller continues to deliver in crunch moments, cementing his legacy as one of the finest finishers in T20 cricket 👏👑#IPL2026 I #DavidMiller pic.twitter.com/pgKR8OEuGn— CricTracker (@Cricketracker) April 27, 2026చదవండి: అమ్మాయి చేసిన పనికి అభిషేక్ శర్మ షాక్!
ముంబై ఇండియన్స్కు భారీ ఎదురుదెబ్బ
ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో సతమతమవుతూ, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ భుజం గాయం కారణంగా సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. అతని స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది.ఈ సీజన్లో సాంట్నర్ను గాయాల సమస్య వెంటాడింది. ఏప్రిల్ 4న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ అతని కుడి భుజానికి గాయమైంది. దీంతో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తదుపరి మ్యాచ్కు దూరమయ్యాడు.తరువాత కోలుకుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్పై మ్యాచ్లు ఆడాడు. అయితే ఏప్రిల్ 23న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన పోరులో మళ్లీ అదే భుజానికి గాయమైంది. దీంతో అతను సీజన్ మొత్తానికే దూరమవాల్సి వచ్చింది.సాంట్నర్ ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు ఆడి ఐదు వికెట్లు తీశాడు. ముంబై బౌలింగ్ విభాగంలో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు సాంట్నర్ దూరం కావడం ముంబై ఇండియన్స్కు భారీ దెబ్బగా పరిగణించబడుతుంది.ప్రత్యామ్నాయంగా మరో స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ను తీసుకున్నప్పటికీ.. అతను ఏ మేరకు ముంబై కష్టాలను తీర్చగలడో చూడాలి. సాంట్నర్ తరహాలోనే ఎడమచేతి స్పిన్నర్ అయిన మహారాజ్కు టీ20ల్లో అపార అనుభవం ఉంది. అతడు 218 టీ20 మ్యాచ్ల్లో 191 వికెట్లు పడగొట్టాడు.ముంబై ఏప్రిల్ 29న జరిగే తమ తదుపరి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. కేశవ్ మహారాజ్ రాకతో జట్టు బౌలింగ్ దళానికి కొత్త బలం చేకూరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
పరాభవంతో ముగించిన టీమిండియా
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికాలో పర్యటించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఓటమితో పర్యటనను ముగించింది. ఈ సిరీస్ను ఇదివరకే కోల్పోయిన టీమిండియా.. బెనోని వేదికగా ఇవాళ (ఏప్రిల్ 27) జరిగిన నామమాత్రపు చివరి టీ20లో 23 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తద్వారా 1-4 తేడాతో సిరీస్ను కోల్పోయింది. ఈ సిరీస్లో భారత్కు లభించిన ఏకైక గెలుపు నాలుగో మ్యాచ్లో వచ్చింది.ఐదో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (92 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో లారా మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. సూన్ లస్ 23, తజ్మిన్ బ్రిట్స్ 2, అన్నెరి డెర్క్సన్ డకౌట్, అన్నెకె బాష్ 8, క్లో ట్రయాన్ 12, నదినే డి క్లెర్క్ 1, సినాలో జఫ్టా 16 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్, శ్రీచరణి, దీప్తి శర్మ తలో 2 వికెట్లు తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో భారత్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ, ఒత్తిడికిలోనై చివరికి టార్గెట్ను పెద్దది చేసుకుంది. భారతి ఫుల్మలీ (40), రిచా ఘోష్ (25 నాటౌట్) భారత్ను విజయతీరాలకు చేర్చేందుకు విఫలయత్నం చేశారు. చివర్లో లక్ష్యం పెద్దది కావడంతో చేతులెత్తేశారు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్లో షఫాలీ వర్మ 4, అనుష్క శర్మ 17, జెమీమా రోడ్రిగ్స్ 1, కెప్టెన్ హర్మన్ప్రీత్ 22, దీప్తి శర్మ 8, అరుంధతి రెడ్డి 1, క్రాంతి గౌడ్ డకౌటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా, డి క్లెర్క్ చెరో 2, ఎలిజ్ మారి, క్లో ట్రయాన్, ఖాకా తలో వికెట్ తీశారు.
భారత బౌలర్లపై పాక్ బ్యాటర్ వివాదాస్పద వ్యాఖ్యలు
పాక్ క్రికెటర్లకు భారత ఆటగాళ్లపై అక్కసు వెళ్లగక్కడం పరిపాటిగా మారింది. ఇటీవలి కాలంలో ఈ తంతు మరీ ఎక్కువైంది. కొందరు ప్రస్తుత ఆటగాళ్లు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు.తాజాగా ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్ హసన్ నవాజ్ భారత బౌలర్లపై తనకెప్పుడూ ఆగ్రహంగా ఉంటుందని అన్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి.ఒక ఇంటర్వ్యూలో హసన్ నవాజ్కు ప్రపంచ స్థాయి బౌలర్లను ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానంగా, మ్యాచ్ పరిస్థితిని బట్టి ఏ బౌలర్ అయినా లక్ష్యంగా చేసుకుంటామని, అవసరమైతే ఎవరిపైనైనా దాడి చేస్తామని అన్నాడు.భారత్ గురించి అడిగినప్పుడు అతని సమాధానం మరింత వివాదాస్పదంగా మారింది. "భారత్ అనగానే, ప్రతి బౌలర్ను తప్పకుండా టార్గెట్ చేయాలనిపిస్తుంది. వారి ప్రతి బౌలర్పై మాకు ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. వారిని బలంగా ఎదుర్కోవాలనుకుంటాం" అని అన్నాడు.క్రీడల్లో ప్రత్యర్థిపై గెలవాలనే తపన సహజం. అయితే "ద్వేషం" వంటి పదాల వాడకం అనవసర వివాదాలకు కారణమవుతుంది. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లాంటి సున్నిత సందర్భాల్లో ఆటగాళ్లు మరింత బాధ్యతగా మాట్లాడాల్సి ఉంటుంది.హసన్ నవాజ్ ఇప్పటివరకు భారత్పై ఒక్క అంతర్జాతీయ టీ20 మాత్రమే ఆడాడు. ఆసియా కప్ 2025లో జరిగిన ఆ మ్యాచ్లో కేవలం ఐదు పరుగులకే ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ అతని వికెట్ను పడగొట్టాడు.ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్లో హసన్ మంచి ఫామ్లో కనిపించాడు. క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున పది మ్యాచ్ల్లో రెండు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయితే, అతని జట్టు ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది.
అమ్మాయి చేసిన పనికి అభిషేక్ శర్మ షాక్!
ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం కొనసాగుతుంది. 8 మ్యాచ్ల్లో 380 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్న అభిషేక్ సెంచరీతో పాటు మూడు అర్థశతకాలు సాధించాడు. ఇక శనివారం రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు హోటల్ రూంకు చేరుకునే సమయంలో అభిషేక్ శర్మకు ఊహించని పరిణామం ఎదురయ్యింది. అభిషేక్ శర్మను చూసి ఉత్సాహానికి లోనైన ఒక అమ్మాయి చేయి పట్టుకుని లాగింది. ఈ అనూహ్య ఘటనతో అభిషేక్ ఒక్కసారిగా షాకయ్యాడు. కాస్త ఇబ్బందిగానే అభిషేక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భద్రతా సిబ్బంది అక్కడే ఉన్నప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోవడంతో సెక్యూరిటీ లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. వరుస నాలుగు విజయాలు సాధించి సూపర్ ఫామ్లో ఉంది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.Abhishek Sharma getting pulled by a girl at team hotel. Imagine if roles are reversed? pic.twitter.com/GCqMI05G4f— Deepu (@deepu_drops) April 26, 2026 చదవండి: ఏమిటీ ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’.. ఎంతమంది ఔటయ్యారంటే?
ఏమిటీ ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’.. ఎంతమంది ఔటయ్యారంటే?
క్రికెట్ చరిత్రలో ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’ అనేది చాలా పాత రూల్. ఈ నిబంధన ఎప్పటి నుంచో అమల్లో ఉంది. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్, లక్నో సూపర్జెయింట్స్ మధ్య మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔట్ కావడంతో ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. మరి అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ అంటే ఏమిటీ? అంతర్జాతీయ క్రికెట్లో దీనికున్న రూల్ ఏంటి? ఇప్పటివరకు ఎంతమంది క్రికెటర్లు అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యారనేది ఇప్పుడు తెలుసుకుందాం.అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ అంటే?క్రికెట్ చట్టాలను రూపొందించే ఎంసీసీ చట్టాల్లో అబ్స్ట్రాకింగ్ ది ఫీల్డ్ అనే నిబంధన ఉంది. 37.2 నిబంధన ప్రకారం ఓ బ్యాటర్ ఉద్దేశపూర్వంగా తన వికెట్ కాపాడుకోవడానికి బంతిని చేతితో అడ్డుకున్నట్లయితే దాన్ని అబ్స్ట్రాకింగ్ ది ఫీల్డ్ గా కింద పరిగణిస్తూ బ్యాటర్ను ఔట్గా ప్రకటిస్తారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు ఇలా 11 మంది ఆటగాళ్లు ఔట్ అయ్యారు. ఈ జాబితాలో ముష్ఫీకర్ రహీం 11వ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. టెస్టు క్రికెట్లో మాత్రం ఇద్దరే ఇలా పెవిలియన్కు చేరుకున్నారు. వీరిలో రహీం రెండవ ఆటగాడు కాగా.. 1951లో ఇంగ్లాండ్కు చెందిన లియోనార్డ్ హటన్ మొదటి ప్లేయర్. భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్క ఆటగాడు అబ్స్ట్రాకింగ్ ది ఫీల్డ్ కింద ఔట్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మొహిందర్ అమర్నాథ్ ఇలా ఔట్ అయ్యాడు.అంతర్జాతీయ క్రికెట్లో అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ గా ఔటైన ఆటగాళ్లు..రస్సెల్ ఎండీన్, ఆండ్రూ హిల్డిచ్, మొహ్సిన్ ఖాన్, డెస్మండ్ హేన్స్, మొహిందర్ అమర్నాథ్, గ్రాహం గూచ్, డారిల్ కల్లినన్, స్టీవ్ వా, మైఖేల్ వాఘన్, చము చిభాభా, ముష్ఫికర్ రహీమ్.ఐపీఎల్లో నాలుగుసార్లు..ఇక ఐపీఎల్ విషయానికొస్తే ఇప్పటివరకు జరిగిన 19 సీజన్లలో నలుగురు ఆటగాళ్లు అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యారు. ఈ జాబితాలో యూసఫ్ పఠాన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా ఉండగా.. తాజాగా అంగ్క్రిష్ రఘువంశీ చేరాడు.యూసఫ్ పఠాన్ఐపీఎల్లో అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద వెనుదిరిగిన తొలి ఆటగాడిగా ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్ నిలిచాడు. 2013 సీజన్లో రైజింగ్ పుణే వారియర్స్తో కేకేఆర్ తలపడింది. కేకేఆర్ ఇన్నింగ్స్ సమయంలో 72 పరుగులతో ఆడుతున్న యూసఫ్ పఠాన్ బౌలర్ స్ట్రైకింగ్ ఎండ్వైపు విసిరిన బంతికి అడ్డువచ్చాడు. దీంతో ఉద్దేశపూర్వకంగానే బంతికి అడ్డువచ్చినట్లు పుణే ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు.అమిత్ మిశ్రా2019 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అమిత్ షా ఎస్ఆర్హెచ్తో ఎలిమినేటర్ మ్యాచ్లో అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద వెనుదిరిగాడు. బౌలర్ వేసిన బంతిని ఎడ్జ్ తీసుకొని సింగిల్ కోసం పిచ్ మధ్యలో పరిగెత్తాడు. అయితే బంతిని తీసుకున్న కీపర్ నాన్స్ట్రైక్ ఎండ్ వికెట్ల వైపు విసిరాడు.కానీ అమిత్ మిశ్రా బంతికి అడ్డంగా వెళ్లడంతో అంపైర్ ఔట్ ఇవ్వక తప్పలేదు.రవీంద్ర జడేజా2024 సీజన్లో రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా సీఎస్కే బ్యాటర్ రవీంద్ర జడేజా రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే స్ట్రైక్ ఎండ్లో ఉన్న బ్యాటర్పరుగు వద్దని వారించడంతో జడేజా వెనక్కి పరిగెత్తే క్రమంలో తన దిశను మార్చుకున్నాడు. అప్పటికే బంతిని అందుకున్న కీపర్ శాంసన్ బంతిని విసరడం, అదే సమయంలో జడేజా అడ్డు రావడంతో అంపైర్ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటిచ్చాడు.అంగ్క్రిష్ రఘువంశీతాజాగా 2026 సీజన్లో కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ ఇదే తరహాలో ఔటయ్యాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ఆఖరి బంతికి రఘువంశీ మిడ్-ఆన్ వైపు షాట్ ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే మిడ్ ఆన్లో ఉన్న మహ్మద్ షమీ బంతిని వేగంగా అందుకోవడంతో.. రఘువంశీ సగం దూరం వెళ్ళాక మళ్ళీ వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే వెనక్కి వెళ్లే క్రమంలో షమీ త్రో చేసిన బంతి రఘువంశీ కాలికి తగిలి వికెట్ కీపర్ పంత్ చేతికి వెళ్లలేదు. అయితే రఘువంశీ కావాలనే తన దారిని మార్చుకుని వెనక్కి పరిగెత్తాడని పంత్ అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్కు అప్పీల్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. చాలా సేపు రీప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్.. రఘువంశీ కావాలనే ఫీల్డర్ విసిరిన బంతికి అడ్డుపడ్డాడని నిర్ధారించారు. దీంతో ఆర్టికల్ 37 ప్రకారం అతడిని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కింద అవుట్గా ప్రకటించారు.𝗜.𝗖.𝗬.𝗠.𝗜A rare dismissal as Angkrish Raghuvanshi was given out 𝗼𝗯𝘀𝘁𝗿𝘂𝗰𝘁𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗳𝗶𝗲𝗹𝗱 😮WATCH how it all unfolded ▶️ https://t.co/uNqNFhXhoL#TATAIPL | #KhelBindaas | #LSGvKKR pic.twitter.com/tvKuRe4x5S— IndianPremierLeague (@IPL) April 26, 2026చదవండి: ‘నేను చాలా మారాను.. మునుపటి పాండ్యాను కాను’
ఆర్సీబీ ఘన విజయం
ఆర్సీబీ ఘన విజయంఢిల్లీ నిర్దేశించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 6.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఊదేసింది. 20 పరుగులు చేసి జేకబ్ బేతెల్ ఔట్ కాగా.. పడిక్కల్ (34 నాటౌట్), విరాట్ కోహ్లి (23 నాటౌట్) ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.బేతెల్ వికెట్ జేమీసన్కు దక్కింది. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ2.5వ ఓవర్- 76 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 26 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్లో నటరాజన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో జేకబ్ బేతెల్ (20) ఔటయ్యాడు. 75 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్ కుమార్ (3-0-5-3), హాజిల్వుడ్ (3.3-0-12-4) చెలరేగడంతో 75 పరుగులకే కుప్పకూలింది. భువీ, హాజిల్కు రసిక్ (2-0-21-1), సుయాశ్ (4-1-7-1), కృనాల్ (2-0-9-1) తోడవడంతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే అభిషేక్ పోరెల్ (30) పుణ్యమే. అతనితో పాటు డేవిడ్ మిల్లర్ (19), జేమీసన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లలో సాహిల్ పరాఖ్, సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్ డకౌట్లు కాగా.. కేఎల్ రాహుల్, నితీశ్ రాణా తలో పరుగు చేశారు. స్టబ్స్ 5, కుల్దీప్ 3 పరుగులు చేశారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ12.3వ ఓవర్- 62 పరుగుల వద్ద ఢిల్లీ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్లో జేమీసన్ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఏడో వికెట్ డౌన్8.6వ ఓవర్- 43 పరుగుల వద్ద ఢిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. రసిక్ సలాం బౌలింగ్లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి డేవిడ్ మిల్లర్ (19) ఔటయ్యాడు.ఆరో వికెట్ డౌన్3.5వ ఓవర్- ఆర్సీబీ పేసర్లు చెలరేగిపోతున్నారు. 8 పరుగుల వద్ద ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో నితీశ్ రాణా (1) ఔటయ్యాడు. 7 పరుగులకే సగం వికెట్లు డౌన్2.4వ ఓవర్- 7 పరుగుల వద్దే ఢిల్లీ ఐదో వికెట్ కూడా కోల్పోయింది. భువీ బౌలింగ్లో వికెట్కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ () ఔటయ్యాడు. 7 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ2.1వ ఓవర్- ఢిల్లీ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. భువీ బౌలింగ్లో ట్రిస్టన్ స్టబ్స్ (5) ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ 7 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే భారీ షాక్లు తగిలాయి. రెండో బంతికే భువీ సాహిల్ పారఖ్ (0), రెండో ఓవర్ తొలి బంతికే కేఎల్ రాహుల్ను (1), రెండో బంతికి సమీర్ రిజ్విని (0) హాజిల్వుడ్ ఔట్ చేశాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) జరుగుతున్న 39వ మ్యాచ్లో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ రెండో స్థానంలో, ఢిల్లీ ఏడో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఢిల్లీకి ఇకపై ప్రతి మ్యాచ్ కీలకమే. తుది జట్లు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): సాహిల్ పరాఖ్, కేఎల్ రాహుల్(w), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(సి), దుష్మంత చమీరా, కైల్ జామీసన్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్
రుతురాజ్ ఖాతాలో భారీ రికార్డు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 26) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్లో తన జట్టు ఓడినా, సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. ఈ మ్యాచ్లో 4 సిక్సర్లు బాదిన రుతురాజ్ ఐపీఎల్లో సీఎస్కే తరఫున 100 సిక్సర్ల మార్కును అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. రుతురాజ్కు ముందు ధోని (234), సురేశ్ రైనా (180), శివమ్ దూబే (106) మాత్రమే ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం రుతురాజ్ ఖాతాలో 101 సిక్సర్లు ఉన్నాయి.కాగా, నిన్నటి మ్యాచ్లో రుతురాజ్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో గౌరవప్రదమైన స్కోర్ అందించినప్పటికీ.. సీఎస్కే పరాజయంపాలైంది. రుతురాజ్ 60 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సీఎస్కే ఇన్నింగ్స్లో రుతురాజ్ మినహా ఎవరూ రాణించలేదు. సంజూ శాంసన్ 11, ఉర్విల్ పటేల్ 4, సర్ఫరాజ్ ఖాన్ డకౌట్, బ్రెవిస్ 2, శివమ్ దూబే 22, కార్తీక్ శర్మ 15, ఓవర్టన్ 18 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3, అర్షద్ ఖాన్ 2, సిరాజ్, సుతార్ తలో వికెట్ తీశారు.అనంతరం 159 పరుగుల సాధారణ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ఆడుతుపాడుతూ ఛేదించింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (87) భారీ అర్ద సెంచరీతో తన జట్టును గెలిపించాడు. అతనికి కెప్టెన్ గిల్ (33), బట్లర్ (39) సహకరించారు. సీఎస్కే బౌలర్లలో అకీల్ హొసేన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ తర్వాత గుజరాత్ ఐదో స్థానానికి ఎగబాకగా.. సీఎస్కే ఆరో స్థానానికి పడిపోయింది.
‘నేను చాలా మారాను.. మునుపటి పాండ్యాను కాను’
ఐపీఎల్ 2026 సీజన్లో కృనాల్ పాండ్యా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జట్టులో కీలక ఆల్రౌండర్గా కొనసాగుతూ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఒక క్రికెటర్గా తాను ఏంతో పరిణితి చెందానని, ఒకప్పటి పాండ్యాను కాదని.. చాలా మారిపోయానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ నేపథ్యంలో కృనాల్ పాండ్యా క్రికెటర్గా తన ప్రయాణంతో పాటు ఆర్సీబీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్య్వూలో పాండ్యా మాట్లాడుతూ.. ‘కాలక్రమేణా నేను మంచి వ్యక్తిగా మారాను. ప్రయాణంలో ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. నా తల్లిదండ్రులు నన్ను పెంచిన తీరుకు ఈ ఘనత దక్కుతుంది. ఒక మనిషిగా మాత్రం మారలేదు. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, ఆడటానికి ఇప్పటికీ అంతే ఉత్సాహంగా, ఆసక్తిగా ఉంటాను. నేను ఎప్పుడూ కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిని. నా కుటుంబాన్ని, పిల్లలను, భార్యను అమితంగా ప్రేమిస్తాను. నా తల్లిదండ్రులు ప్రతీ విషయంలో నాకు అండగా నిలిచారు. మీరు విజయాన్ని రుచి చూసినప్పుడు, రెండు విషయాలు జరగవచ్చు, ఒకటి మీరు పిచ్చివాళ్లు అయిపోతారు లేదా అది మిమ్మల్ని వినయవంతులుగా చేస్తుంది. నేను రెండో మార్గాన్ని ఎంచుకున్నాను. నేను ఎదిగే కొద్దీ, మరింత వినయవంతుడిగా మారాను, అందుకే నాకు కుటుంబం చాలా ముఖ్యం.’ అని చెప్పుకొచ్చాడు.ఆ తర్వాత ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున కేకేఆర్పై తొలి మ్యాచ్ ఆడిన క్షణాలను గుర్తుచేసుకున్నాడు. ‘ఆర్సీబీ తరఫున నా తొలి మ్యాచ్ ఆడటానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. అప్పుడే ప్రారంభోత్సవం జరిగింది. షారుఖ్ సర్ వేదికపై ఉండటం, ప్రేక్షకులు నినాదాలు చేయడం నాకు గుర్తుంది. పవర్ప్లేలో నా మొదటి ఓవర్ వేసి 15 పరుగులు ఇచ్చాను. 10 ఓవర్లలో కేకేఆర్ 110 పరుగులు చేసింది, వాళ్లు వేగంగా పరుగులు రాబడుతున్నారు. తర్వాతి ఓవర్లో నేను అజింక్య రహానేను డీప్ స్క్వేర్ లెగ్ వద్ద అవుట్ చేశాను. అప్పుడు వెంకటేష్ అయ్యర్ హెల్మెట్ లేకుండానే క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో నేను ఒక బౌన్సర్ వేయాలనుకున్నా. అయితే వెంటనే వెంకటేశ్ అయ్యర్ తన హెల్మెట్ పెట్టుకున్నాడు. కానీ తర్వాతి బంతికే వెంకటేశ్ అయ్యర్ క్లీన్బౌల్డ్ అయ్యాడు.’ అని పేర్కొన్నాడు. వాంఖడేలో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో గెలవడాన్ని గుర్తుచేసుకున్న కృనాల్ పాండ్యా 2025 సీజన్లో ఆర్సీబీ చాంపియన్గా నిలవడం తన కెరీర్లో మరిచిపోలేని క్షణమని తెలిపాడు. కోహ్లితో కలిసి ట్రోఫీని అందుకోవడం ఇప్పటికీ తన కళ్ల ముందు మెదులుతూనే ఉందని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో కృనాల్ పాండ్యా 7 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. ఓవరాల్గా ఐపీఎల్లో 149 మ్యాచ్లాడిన కృనాల్ 1792 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 101 వికెట్లు తీశాడు.చదవండి: థామస్ కప్లో సంచలనం.. క్వార్టర్స్కు భారత్
ప్రత్యక్ష ప్రసారం చూడలేమా!
టీమిండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుందంటే చాలు... అభి...
దివ్యాంశు–శాంభవి జోడీకి పసిడి పతకం
కైరో: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్...
ఫ్రెంచ్ ఓపెన్కు అల్కరాజ్ దూరం
పారిస్: కుడి మణికట్టు గాయం కారణంగా ఈ ఏడాది ఫ్రెంచ...
విజయోస్తు!
నాలుగేళ్ల క్రితం జరిగిన అద్భుత ఘట్టాన్ని పునరావృతం...
ఏమిటీ ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’.. ఎంతమంది ఔటయ్యారంటే?
క్రికెట్ చరిత్రలో ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’ ...
ఆర్సీబీ ఘన విజయం
ఆర్సీబీ ఘన విజయంఢిల్లీ నిర్దేశించిన 76 పరుగుల స్వల...
రుతురాజ్ ఖాతాలో భారీ రికార్డు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 26) మధ్యాహ్న...
‘నేను చాలా మారాను.. మునుపటి పాండ్యాను కాను’
ఐపీఎల్ 2026 సీజన్లో కృనాల్ పాండ్యా రాయల్ చాలెంజ...
క్రీడలు
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ బర్త్డే.. ఈ ఫొటోలు చూశారా?
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
వీడియోలు
SRHపై బుడ్డోడి వైల్డ్ ఫైర్ బ్యాటింగ్
GTపై RCB ఘన విజయం
మ్యాచ్ మధ్యలోనే లేచి వెళ్లిపోయిన ఆకాష్ అంబానీ..
కోట్లు సంపాదించి అద్దె ఎగ్గొట్టిన విరాట్ కోహ్లి.. హోటల్ మూసివేత
చేటా దెబ్బకి చేతులెత్తిసిన ముంబై.. IPL చరిత్రలోనే MIకి ఘోర ఓటమి
సామ్సన్ జిగేల్.. ముంబై ఢమాల్
హార్దిక్ తో గొడవ పై కృనాల్ పాండ్యా క్లారిటీ
అభిషేక్ సిక్సర్లు .. వెంకీ మామ స్టెప్పులు కావ్య పాప నవ్వులే నవ్వులు
హార్దిక్ తో గొడవ పై కృనాల్ పాండ్యా క్లారిటీ
సిక్సర్ల యుద్ధం అభిషేక్ ను భయపెడుతున్న బుడ్డోడు
