Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

BCCI Announces India squad for IND vs SA T20I series Gill To Be1
BCCI: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలోని టీమిండియాలో మొత్తంగా పదిహేను మంది సభ్యులకు చోటిచ్చినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఇక వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా అందుబాటులో ఉంటాడని బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది. అదే విధంగా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరినట్లు తెలిపింది. అయితే, చాన్నాళ్లుగా టీ20 జట్టుతో కొనసాగుతున్న రింకూ సింగ్‌పై ఈసారి వేటుపడటం గమనార్హం.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదేసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుబ్‌‌మన్ గిల్ (వైస్‌ కెప్టెన్‌- ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌.

IND vs SA 2nd ODI: Nandre Burger struggles with injury2
సౌతాఫ్రికాకు భారీ షాక్‌

రాయ్‌పూర్ వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో సౌతాఫ్రికాకు భారీ షాక్ త‌గిలింది. ఈ మ్యాచ్‌లో ఆ జ‌ట్టు స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ నాండ్రే బర్గర్ గాయపడ్డాడు. భారత ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసే క్రమంలో బర్గర్ తొడ కండరాలు పట్టేశాయి. ఆ ఓవర్‌లో తొలి బంతిని కాస్త ఇబ్బంది పడుతూనే సంధించిన బర్గర్‌.. రెండో బంతిని మాత్రం బౌల్ చేయలేకపోయాడు. బంతిని వేసే క్రమంలో అతడు రెండు సార్లు తన రన్ అప్‌ను కోల్పోయాడు. బర్గర్ ఆసౌకర్యంగా కన్పించాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు. అయినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఆ సమయంలో బర్గర్ నడిచేం‍దుకు ఇబ్బంది పడినట్లు కన్పించింది. అతడు తిరిగి మైదానంలో రాలేదు. ఓవరాల్‌గా 6.1 ఓవర్లు బౌలింగ్ చేసిన బర్గర్ 43 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.అయితే టీ20 సిరీస్‌కు ముందు బర్గర్ గాయపడడం సౌతాఫ్రికా టీమ్‌మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఇప్పటికే స్టార్ పేసర్ కగిసో రబాడ కూడా గాయం కారణంగా జట్టు బయట ఉన్నాడు. టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఆ సమయానికి బర్గర్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.భారత్ భారీ స్కోర్‌..ఇక రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(102), రుతురాజ్ గైక్వాడ్‌(105) సెంచరీలతో సత్తాచాటగా.. కేఎల్ రాహుల్‌(66) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ప్రోటీస్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, ఎంగిడీ, బర్గర్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs SA 2nd Odi: విరాట్ కోహ్లి సూపర్‌ సెంచరీ.. సచిన్‌ వరల్డ్‌ రికార్డు బ్రేక్‌

IND vs SA 2nd ODI: Ruturaj Kohli Centuries Rahul Slams 50 Ind Score3
శతక్కొట్టిన రుతురాజ్‌, కోహ్లి.. రాహుల్‌ మెరుపు ఇన్నింగ్స్‌

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. రాయ్‌పూర్‌ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగులు సాధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (22), రోహిత్‌ శర్మ (14) విఫలం కాగా.. విరాట్‌ కోహ్లి (102), రుతురాజ్‌ (105) సెంచరీలతో చెలరేగారు.Firsts are always special! 💪#RuturajGaikwad lights up Raipur with an epic knock to bring up his first ODI ton. 👏🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/uDZZ6h8ulN— Star Sports (@StarSportsIndia) December 3, 2025 రాహుల్‌ మెరుపు అర్ధ శతకంతాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) అజేయ అర్ధ శతకం (43 బంతుల్లోనే 66)తో అదరగొట్టగా.. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (1) రనౌట్‌ అయ్యాడు. మిగిలిన వారిలో మరో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్‌ రెండు, నండ్రీ బర్గర్‌, లుంగి ఎంగిడి తలా ఒక వికెట్‌ పడగొట్టారు.A sight you never get tired of. Another ODI, another Virat Kohli century. 💯👑The nation roars. The blockbuster rolls on. 🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/YvZyupUqYa— Star Sports (@StarSportsIndia) December 3, 2025కాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ (IND vs SA ODIs)లో భాగంగా టీమిండియా రాంచిలో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో 349 పరుగులు చేసిన భారత్‌.. ప్రొటిస్‌పై 17 పరుగుల తేడాతో నెగ్గింది. తాజాగా మరోసారి 358 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన టీమిండియా.. సఫారీలకు 359 పరుగుల టార్గెట్‌ విధించింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాపై వన్డేల్లో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు.వన్డేల్లో సౌతాఫ్రికాపై టీమిండియా అత్యధిక స్కోర్లు టాప్‌-5 జాబితా🏏గ్వాలియర్‌ వేదికగా 2010లో 401/3🏏రాయ్‌పూర్‌ వేదికగా 2025లో 358/5🏏రాంచి వేదికగా 2025లో 349/8🏏కార్డిఫ్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీ 2013లో 331/7🏏కోల్‌కతా వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ 2023లో 326/5.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

IND vs SA: Virat Kohli Equals Kane Williamson World Record Check4
IND vs SA: ప్రపంచ రికార్డు సమం చేసిన కోహ్లి

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. సౌతాఫ్రికాతో రాంచి వేదికగా తొలి వన్డేల్లో శతక్కొట్టిన కోహ్లి.. రాయ్‌పూర్‌లో రెండో వన్డేలోనూ సెంచరీతో కదం తొక్కాడు. తద్వారా చాన్నాళ్ల తర్వాత ‘విన్‌టేజ్‌’ కోహ్లిని గుర్తు చేస్తూ వరుసగా రెండు శతకాల (Back to Back Centuries)తో సత్తా చాటాడు.ఈ క్రమంలో న్యూజిలాండ్‌ దిగ్గజ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamsion) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోహ్లి సమం చేశాడు. ఇంతకీ అదేమిటి అంటారా?... ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 తర్వాత ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కోహ్లి (Virat Kohli) పునరాగమనం చేశాడు. కానీ, ఆసీస్‌ గడ్డపై తొలి రెండు వన్డేల్లో అనూహ్య రీతిలో అతడు డకౌట్‌ అయ్యాడు.అయితే, మూడో వన్డేలో అజేయ అర్ధ శతకం (74) బాది ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్‌లో (IND vs SA ODIs)నూ దుమ్ములేపుతున్నాడు. సఫారీలతో తొలి వన్డేలో 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌... రెండో వన్డేలో తొంభై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కోహ్లి శతక ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి.A sight you never get tired of. Another ODI, another Virat Kohli century. 💯👑The nation roars. The blockbuster rolls on. 🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/YvZyupUqYa— Star Sports (@StarSportsIndia) December 3, 2025మొత్తంగా రాయ్‌పూర్‌లో 93 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 102 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లుంగి ఎంగిడి బౌలింగ్‌లో.. ఐడెన్‌ మార్క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు 22 పరుగులు జోడించిన కోహ్లి.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (105)తో కలిసి 195 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు.అనంతరం తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌తో కలిసి 27 పరుగులు జోడించి కోహ్లి నిష్క్రమించాడు. కాగా సౌతాఫ్రికాపై వన్డేల్లో కోహ్లికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. అంతకు ముందు కివీస్‌ స్టార్‌ కేన్‌ విలియమ్సన్‌.. సౌతాఫ్రికాపై ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా ఉండగా.. కోహ్లి తాజాగా కేన్‌ మామ ప్రపంచ రికార్డును సమం చేశాడు.సౌతాఫ్రికాపై వన్డేల్లో కోహ్లి సెంచరీలు🏏కోల్‌కతా వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ 2023లో 101 నాటౌట్‌🏏రాంచి వేదికగా 2025లో 135 పరుగులు🏏రాయ్‌పూర్‌ వేదికగా 2025లో 102 పరుగులుచదవండి: IND vs SA: గంభీర్ నమ్మక‌మే నిజమైంది.. శతక్కొట్టిన రుతురాజ్‌

IND vs SA 2nd Odi: Virat kohli slams 53 odi century5
విరాట్ కోహ్లి సూపర్‌ సెంచరీ.. సచిన్‌ వరల్డ్‌ రికార్డు బ్రేక్‌

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ కోహ్లి శతక్కొట్టాడు. కింగ్‌ కోహ్లి 90 బంతుల్లోనే తన 53వ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా విరాట్‌కు ఇది 84వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. మొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు.ఆరంభంలోనే రోహిత్‌ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లి జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ నాలుగో మూడో వికెట్‌కు 195 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లి ఓ వరల్డ్‌ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.సచిన్‌ వరల్డ్‌ రికార్డు బ్రేక్‌..వ‌న్డేల్లో అత్య‌ధిక సార్లు 150కు పైగా ప‌రుగుల భాగ‌స్వామ్యంలో పాలుపంచుకున్న‌ ఆట‌గాడిగా కోహ్లి రికార్డులెక్కాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు 32 సార్లు 150కు పైగా ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని మ‌రొక ఆట‌గాడితో క‌లిసి నెల‌కొల్పాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్క‌ర్ (31) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్ వ‌ర‌ల్డ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.టీమిండియా భారీ స్కోరుఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 358 పరుగులు సాధించింది. తద్వారా సఫారీ జట్టుకు 359 పరుగుల భారీ లక్ష్యం విధించింది. కాగా భారత బ్యాటర్లలో కోహ్లి, రుతురాజ్‌ సెంచరీలు కొట్టగా.. తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మెరుపు అర్ధ శతకం (43 బంతుల్లో 66 నాటౌట్‌) సాధించాడు.Play it on loop ➿Just like Virat Kohli 😎💯Yet another masterful knock! 🫡 Updates ▶️ https://t.co/oBs0Ns6SqR#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/WYbSDLEQRo— BCCI (@BCCI) December 3, 2025

Ruturaj Gaikwad slams maiden International odi century6
గంభీర్ నమ్మక‌మే నిజమైంది.. శతక్కొట్టిన రుతురాజ్‌

సౌతాఫ్రికాతో తొలి వన్డేలో విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తిరిగి పుంజుకున్నాడు. రాయ్‌పూర్ వేదికగా సఫారీలతో జరుగుతున్న రెండో వన్డేలో రుతురాజ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 77 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్క్‌ను ఈ మహారాష్ట్ర బ్యాటర్‌ అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 12 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.జైశ్వాల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రుతురాజ్‌.. తన ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కోహ్లితో కలిపి 150కి పైగా పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. గౌతీ నమ్మాడు.. రుతు అదరగొట్టాడురుతురాజ్ గైక్వాడ్ దాదాపు రెండేళ్ల త‌ర్వాత భార‌త వ‌న్డే జ‌ట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో నిల‌క‌డ‌గా రాణిస్తుండ‌డంతో సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు. అయితే ప్రోటీస్‌తో తొలి వ‌న్డేలో కేవ‌లం 8 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు.దీంతో అత‌డిని రెండో వ‌న్డేకు ప‌క్క‌న పెట్టాల‌ని చాలా మంది మాజీలు సూచించారు. కానీ భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం రుతుపై నమ్మకం ఉంచాడు. రెండో వన్డేలో కూడా అతడికి తుది జట్టులో చోటు దక్కింది. ఈసారి మాత్రం తనకు దక్కిన అవకాశాన్ని గైక్వాడ్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఓవరాల్‌గా 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కోహ్లి(102) కూడా శతక్కొట్టాడు.భారీ స్కోర్‌ దిశగా భారత్‌..రాయ్‌పూర్‌ వన్డేలో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా దూసుకుపోతుంది. 45 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(43), జడేజా(9) ఉన్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

IND vs SA 2nd ODI: Kohli Slams 50 Continuous form Scripts History7
చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వన్డే పునరాగమనంలో వరుస మ్యాచ్‌లలో దుమ్ములేపుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద భారీ అర్ధ శతకం (74 నాటౌట్‌) బాది ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. సొంతగడ్డపై అదే జోరును కొనసాగిస్తున్నాడు.సౌతాఫ్రికాతో రాంచి వేదికగా తొలి వన్డేలో కోహ్లి (Virat Kohli) శతక్కొట్టిన విషయం తెలిసిందే. కేవలం 120 బంతుల్లోనే 135 పరుగులతో సత్తా చాటి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు వన్డేల్లో 52వ, అంతర్జాతీయ కెరీర్‌లో ఓవరాల్‌గా 83వ శతకం నమోదు చేసి.. శతక శతకాలకు మరింత చేరువయ్యాడు.రెండో వన్డేలోనూ దూకుడుఇక తాజాగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలోనూ కోహ్లి దంచికొట్టాడు. రాయ్‌పూర్‌ వేదికగా 47 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో వరుసగా మూడోసారి యాభై పరుగుల మార్కును దాటేశాడు. ఈ క్రమంలోనే కోహ్లి సరికొత్త చరిత్ర లిఖించాడు.చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లియాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధికంగా13 వేర్వేరు సందర్భాల్లో (13 Streaks) వరుసగా మూడు లేదంటే అంతకంటే ఎక్కువసార్లు 50 ప్లస్‌ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు. అతడి నిలకడైన ఆటకు ఇదే నిదర్శనం. గతంలో భారత దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ 11 సందర్భాల్లో ఈ ఫీట్‌ నమోదు చేయగా.. సచిన్‌ టెండుల్కర్‌ పది సందర్భాల్లో ఈ ఘనత సాధించాడు.కోహ్లి- రుతు ధనాధన్‌మ్యాచ్‌ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య రాయ్‌పూర్‌ వేదికగా బుధవారం నాటి రెండో వన్డేలో టాస్‌ గెలిచిన ప్రొటిస్‌ జట్టు.. తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు ఎంచుకున్న టీమిండియా 31వ ఓవర్లు ముగిసేసరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, నాలుగో నంబర్‌ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ అర్ధ శతకాలు పూర్తి చేసుకుని నూటా యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (22), రోహిత్‌ శర్మ (14) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. UPDATE: IND vs SA 2nd Odi: విరాట్ కోహ్లి సూపర్‌ సెంచరీచదవండి: అదే జరిగితే నీపై వేటు వేస్తారు: గంభీర్‌పై రవిశాస్త్రి వ్యాఖ్యలు వైరల్‌

Virat Kohli overtakes Shubman Gill in ICC ODI Rankings, aims to snatch Rohit Sharmas No.1 spot8
వరల్డ్‌ నెం1 ర్యాంక్‌కు చేరువలో కోహ్లి.. గిల్‌ను వెనక్కి నెట్టి

ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకునేందుకు చేరువయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టి నాలుగో స్ధానానికి చేరుకున్నాడు. రాంచీ వన్డేలో సెంచరీతో సత్తాచాటడంతో కోహ్లి(751 రేటింగ్ పాయింట్లు) తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. విరాట్ కంటే ముందు ఇబ్రహీం జద్రాన్‌(764), డార్లీ మిచెల్‌(766 రేటింగ్‌ పాయింట్లు), రోహిత్‌ శర్మ(783) ఉన్నారు. అగ్రస్ధానంలో రోహిత్‌ కంటే విరాట్‌ ఇంకా కేవలం 33 రేటింగ్‌ పాయింట్లు మాత్రమే వెనకబడి ఉన్నాడు. ప్రస్తుతం రాయ్‌పూర్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో కింగ్‌ మరోసారి భారీ ఇన్నింగ్స్‌ ఆడితే రోహిత్‌ను అధిగమించడం ఖాయం. రెండో వన్డేలో రోహిత్‌ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.కాగా వన్డేల్లో కోహ్లి 2018 నుంచి 2021 వరకు దాదాపు మూడేళ్ల పాటు వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగాడు. ఆ తర్వాత పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం.. కోహ్లి స్ధానంలో దూసుకొచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు కోహ్లి ఒక్కసారి కూడా వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఇప్పటికే టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కింగ్ కోహ్లి ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌-2027లో ఆడటమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు.చదవండి: అదే జరిగితే నీపై వేటు వేస్తారు: గంభీర్‌పై రవిశాస్త్రి వ్యాఖ్యలు వైరల్‌

You Could Be Fired: Ravi Shastri Clear Warning And Advice To Gambhir9
అదే జరిగితే నీపై వేటు వేస్తారు: గంభీర్‌పై రవిశాస్త్రి వ్యాఖ్యలు వైరల్‌

టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ మిశ్రమ ఫలితాలు చవిచూస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫర్వాలేదనిపించినా.. టెస్టుల్లో అతడికి ఇప్పటికే రెండు చేదు అనుభవాలు చవిచూశాడు. గంభీర్‌ మార్గదర్శనంలో గతేడాది న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా 3-0తో వైట్‌వాష్‌కు గురైంది.గంభీర్‌ టెస్టు కోచ్‌గా పనికిరాడంటూ..భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో సొంతగడ్డపై ఇలా ఓ విదేశీ జట్టు చేతిలో మన జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ కావడం ఇదే తొలిసారి. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా దాదాపు దశాబ్దం తర్వాత తొలిసారి బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ (BGT)ని కోల్పోయింది. ఆసీస్‌ చేతిలో 3-1తో ఓడి ఇంటిబాట పట్టింది.ఆ తర్వాత ఇంగ్లండ్‌ పర్యటనలో 2-2తో టెస్టు సిరీస్‌ను సమం చేసిన టీమిండియా.. తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికా చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్‌ టెస్టు కోచ్‌గా పనికిరాడని.. అతడిని వెంటనే తొలగించాలంటూ డిమాండ్లు పెరిగాయి.బీసీసీఐదే నిర్ణయంఈ విషయంపై గంభీర్‌ (Gautam Gambhir) స్వయంగా స్పందిస్తూ.. తన హయాంలోనే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ (వన్డే)-2025, ఆసియా టీ20 కప్‌-2025లో జట్టు గెలిచిందని పేర్కొన్నాడు. తనను కోచ్‌గా కొనసాగించాలా? లేదా? అనే నిర్ణయం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తీసుకుంటుందని స్పష్టం చేశాడు.అదే జరిగితే నీపై వేటు వేస్తారుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. ప్రభాత్‌ ఖబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్‌ భవితవ్యం గురించి ప్రశ్న ఎదురుకాగా.. ‘‘మన ప్రదర్శన బాగా లేకుంటే.. కచ్చితంగా మనపై వేటు వేస్తారు. పదవి నుంచి తొలగిస్తారు.పరస్పర సమన్వయం, ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్‌ ఇక్కడ అత్యంత ముఖ్యం. మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ ఉంటేనే అంతా సాఫీగా సాగిపోతుంది. గెలిచేలా ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాలి. కోచ్‌లుగా మా పని అదే. అయితే, మనం చేసే పని పట్ల ఇష్టం ఉండాలి. దానిని ఆస్వాదించాలి. అంతేగానీ ఒత్తిడిగా ఫీలవ్వకూడదు’’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.కాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ అయిన రవిశాస్త్రి.. 2017- 2021 వరకు భారత జట్టు హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు. అతడి మార్గదర్శనంలోనే తొలిసారి టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండుసార్లు బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలు గెలిచింది. అంతేకాదు.. సౌతాఫ్రికాలో తొలిసారి వన్డే సిరీస్‌ను కూడా టీమిండియా కైవసం చేసుకుంది. రవిశాస్త్రి- నాటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కాంబినేషన్‌లో టెస్టుల్లో టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా అగ్రపీఠానికి చేరుకుంది.చదవండి: హర్షిత్‌ రాణాకు బిగ్‌ షాక్‌

Smriti Mandhana Brother Breaks Silence on new wedding date Palash10
స్మృతి పెళ్లి: ఆ వార్తలపై తొలిసారి స్పందించిన కుటుంబం

భారత స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధాన పెళ్లి అర్ధంతరంగా ఆగిపోవడంపై సోషల్‌ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి. పలాష్‌ ముచ్చల్‌ ఆమెను మోసం చేశాడంటూ ఓ వర్గం ట్రోల్‌ చేస్తుండగా.. ఇద్దరి మధ్య అంతా సవ్యంగానే ఉందని మరికొందరు వాదిస్తున్నారు.ఇలాంటి తరుణంలో పలాష్‌ ముచ్చల్‌ (Palash Mucchal) తల్లి అమితా ముచ్చల్‌ ఇటీవల స్పందిస్తూ.. ‘‘స్మృతి- పలాష్‌ ఇద్దరూ బాధలో ఉన్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. వారి వివాహం జరుగుతుంది’’ అని హిందుస్తాన్‌ టైమ్స్‌తో పేర్కొన్నారు. దీంతో స్మృతి త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుందని అభిమానులు సంతోషించారు.కొత్త తేదీ ఇదేనంటూ...ఈ నేపథ్యంలో స్మృతి- పలాష్‌ పెళ్లి (Smriti Mandhana Wedding Postponed)కి కొత్త తేదీ ఇదేనంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. డిసెంబరు 7న వీరిద్దరు వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ విషయంపై స్మృతి మంధాన సోదరుడు శ్రావణ్‌ మంధాన (Shravan Mandhana) తాజాగా స్పందించాడు.తొలిసారి స్పందించిన మంధాన కుటుంబంహిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈ వదంతులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో నాకైతే తెలియదు. ఇప్పటికీ ఈ వివాహం ఇంకా వాయిదా పడే ఉంది’’ అని శ్రావణ్‌ మంధాన రూమర్లను కొట్టిపాడేశాడు. స్మృతి- పలాష్‌ల పెళ్లి గురించి ఇప్పటి వరకు తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాడు.2019 నుంచి ప్రేమలో..కాగా సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌తో భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన 2019 నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గతేడాది ఈ విషయాన్ని బయటపెట్టిన ఈ జంట.. ఇటీవలే తమ వివాహ తేదీని కూడా వెల్లడించారు. నవంబరు 23న తాము పెళ్లితో ఒక్కటికానున్నట్లు తెలిపారు.అందుకు తగ్గట్లుగానే హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, పెళ్లికి మరి కొన్ని గంటల సమయం ఉందనగా అనూహ్య రీతిలో తంతు వాయిదా పడింది. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్‌ ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరగా.. వరుడు పలాష్‌ కూడా ఆస్పత్రిపాలయ్యాడు.తనతో చాట్‌ చేశాడంటూ ఓ అమ్మాయి..ఇంతలో పలాష్‌ తనతో చాట్‌ చేశాడంటూ ఓ అమ్మాయి.. ప్రైవేట్‌ విషయాలను బహిర్గతం చేసింది. దీంతో పెళ్లికి ముందు రోజు రాత్రి ఈ విషయం తెలిసి స్మృతి తండ్రి.. పలాష్‌తో గొడవపడి గుండెపోటుకు గురయ్యాడంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఇటు ముచ్చల్‌.. అటు మంధాన కుటుంబం స్పందించలేదు. కనీసం ఖండించనూ లేదు.దీంతో అనుమానాలు మరింత బలపడగా.. పలాష్‌ తల్లి మాత్రం త్వరలోనే తన కుమారుడి వివాహం జరుగుతుందని చెప్పడం గమనార్హం. అయితే, ఈ విషయంపై ఇంత వరకు గుంభనంగా ఉన్న మంధాన కుటుంబం మాత్రం తొలిసారి మౌనం వీడి.. పెళ్లికి కొత్త తేదీ ఖరారు చేయలేదని కుండబద్దలు కొట్టడం గమనార్హం.చదవండి: Smriti Mandhana Or Palash Muchhal: ఎవరు రిచ్‌?

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement