ప్రధాన వార్తలు
'అతడొక అద్భుతం.. ఆర్సీబీ ప్లాన్ ఇదే'
ఐపీఎల్-2026 వేలానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. గత సీజన్ మెగా వేలంలో లివింగ్స్టోన్ను రూ.8.75 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. కానీ ఆర్సీబీ యాజమాన్యం నమ్మకాన్ని ఈ ఇంగ్లీష్ క్రికెటర్ నిలబెట్టుకోలేకపోయాడు.ఎనిమిది మ్యాచ్లలో కేవలం 16 సగటుతో 112 పరుగులు చేసి తీవ్ర నిరాశపరిచాడు. దీంతో అతడిని వేలంలో బెంగళూరు ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. వారి పర్స్ బలాన్ని పెంచుకోవడం కోసం ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టుకు టీమిండియా మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ కీలక సూచన చేశాడు.వచ్చే నెలలో జరగనున్న మినీ వేలంలో లివింగ్స్టోన్ను తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేయాలని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మతో పాటు మూడో స్పిన్నర్గా లివింగ్స్టోన్ను ఉపయోగించుకోవచ్చని అతడు తెలిపాడు."ఐపీఎల్-2026 మినీ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లియామ్ లివింగ్స్టోన్ను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. వారు తమ పర్స్ బలాన్ని పెంచుకోవడం కోసం అతడిని వేలంలోకి విడిచిపెట్టి ఉండొచ్చు. గత సీజన్లో లివింగ్స్టోన్పై భారీ మొత్తాన్ని వెచ్చించారు. కాబట్టి ఈసారి ఆ మొత్తంతో ఇద్దరు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆర్సీబీ ప్రయత్నించవచ్చు. లివింగ్స్టోన్కు అద్భుతమైన ఆల్రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఆర్సీబీ ఒకవేళ పుణే(హోం గ్రౌండ్)లో ఆడితే అతడు మూడో స్పిన్నర్గా ఉపయోగపడతాడు.అదేవిధంగా వేలంలో ఉత్తరాఖండ్ పేసర్ ఆకాశ్ మధ్వల్ కోసం ఆర్సీబీ ప్రయత్నించాలి. గత సీజన్లో రాజస్తాన్ రాయల్స్ అతడిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. అతడు చాలా తక్కువ మ్యాచ్లు ఆడాడు. పిచ్ కాస్త డ్రైగా ఉంటే అతడు బంతిని అద్భుతంగా సీమ్ చేయగలడు. అదే అతడి బలం" అని తన యూట్యూబ్ ఛానల్లో కైఫ్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరిగే అవకాశముంది.చదవండి: Ashes: ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
హెవిట్ జోడీ పరాజయం..
సిడ్నీ: రిటైర్మెంట్ నుంచి బయటికొచ్చిన గ్రాండ్స్లామ్ మాజీ చాంపియన్ లీటన్ హెవిట్ తన తనయుడితో కలిసి ఆడుతున్న డబుల్స్ ఆటకు క్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. ఈ 44 ఏళ్ల ఆ్రస్టేలియన్ వెటరన్ స్టార్ న్యూసౌత్వేల్స్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో 16 ఏళ్ల టీనేజ్ కుమారుడు క్రూజ్తో కలిసి శుభారంభం చేశాడు. కానీ క్వార్టర్ ఫైనల్లో మాత్రం తండ్రీతనయుల జోడీకి చుక్కెదురైంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో హెవిట్–క్రూజ్ ద్వయం 5–7, 4–6తో డేన్ స్వీని– కలమ్ పుటెర్గిల్ (ఆ్రస్టేలియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది. అంతకుముందు తండ్రీతనయుల జోడీ 6–1, 6–0తో ఆసీస్కే చెందిన హేడెన్ జోన్స్–పావ్లె మారినకొవ్ ద్వయంపై అలవోక విజయం సాధించింది. ఆ్రస్టేలియా డేవిస్ కప్ కెపె్టన్గా వ్యవహరించిన మాజీ ప్రపంచ నంబర్వన్ హెవిట్ 2001లో యూఎస్ ఓపెన్, 2002లో వింబుల్డన్ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిళ్లను సాధించాడు. 2016లోనే ఆటకు వీడ్కోలు పలికాడు. దాదాపు దశాబ్దకాలం తర్వాత మళ్లీ టెన్నిస్ ఆటపై మనసుపెట్టి ఆడేందుకు సిద్ధమయ్యాడు. 2005లో ఆస్ట్రేలియా ప్రముఖ నటి బెక్ కార్ట్రైట్ను వివాహమాడిన వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు.
75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్(2025-26)కు తెర లేచింది. ఈ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మొదటి టెస్టుకు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ గాయాల కారణంగా దూరమయ్యారు.దీంతో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా సారథిగా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా జేక్ వెదరాల్డ్((31), బ్రెండన్ డాగెట్(31) ఆసీస్ తరపున టెస్టు అరంగేట్రం చేశారు. 30 ఏళ్ల వయస్సు దాటిన ఆటగాళ్లు టెస్టుల్లో ఆస్ట్రేలియా తరపున డెబ్యూ చేయడం 1946 తర్వాత ఇదే తొలిసారి.75 ఏళ్ల కిందట వెల్లింగ్టన్లో న్యూజిలాండ్పై 30 ఏళ్ల దాటిన ఆటగాళ్లు ఆసీస్ తరపున టెస్టు అరంగేట్రం చేశారు. కాగా వెదరాల్డ్, డాగెట్లు దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో ఆసీస్ జట్టులో చోటు దక్కింది.మరోవైపు గాయం కారణంగా గత కొన్నాళ్లగా జట్టుకు దూరంగా ఉంటున్న ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ ఈ మ్యాచ్తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఇంగ్లీష్ జట్టు ఒక్క స్పిన్నర్ కూడా లేకుండా బరిలోకి దిగింది.తుది జట్లుఆస్ట్రేలియా : ఉస్మాన్ ఖవాజా, జేక్ వెదరాల్డ్, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ , మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ , గస్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్చదవండి: SL vs ZIM: శ్రీలంకకు షాకిచ్చిన జింబాబ్వే
శ్రీలంకకు షాకిచ్చిన జింబాబ్వే
ముక్కోణపు టీ20 టోర్నమెంట్ తొలి పోరులో ఆతిథ్య పాకిస్తాన్ చేతిలో ఓడిన జింబాబ్వే... ఆ పరాజయం నుంచి వేగంగా కోలుకొని సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి టోర్నీలో బోణీ కొట్టింది. గురువారం రావల్పిండి వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో జింబాబ్వే 67 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. టీ20ల్లో శ్రీలంకతో పదోసారి ఆడిన జింబాబ్వే మూడో విజయాన్ని అందుకుంది. ఏడు మ్యాచ్ల్లో ఓడిపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. బ్రియాన్ బెనెట్ (42 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ సికందర్ రజా (32 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడారు. వీరిద్దరూ మూడో వికెట్కు 61 పరుగులు జోడించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ 3 వికెట్లు పడగొట్టగా... ఇషాన్ మలింగ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక పూర్తిగా విఫలమై 95 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ దసున్ షనక (25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్లు), రాజపక్స (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 3, రిచర్డ్ నగరవా 2 వికెట్లు తీశాడు.చదవండి: ‘యాషెస్’ సమరానికి సిద్ధం
‘యాషెస్’ సమరానికి సిద్ధం
టెస్టు క్రికెట్లో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న సుదీర్ఘ వైరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్కు నేటితో తెర లేవనుంది. ఇరు జట్ల ఆటగాళ్లను ఒక్క మంచి ప్రదర్శనతో హీరోలుగా, ఒక్క పరాజయంతో జీరోలుగా మార్చగల ఈ సమరంపై క్రికెట్ అభిమానులందరి దృష్టీ నిలిచింది. సొంతగడ్డపై ఆ్రస్టేలియా ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తున్నా... ‘బాజ్బాల్’ తరహా ఆటతో తమకంటూ విజయావకాశాలు ఉన్నాయని ఇంగ్లండ్ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఏడు వారాల పాటు హోరాహోరీ ఆట ఖాయం. పెర్త్ స్టేడియంలో పిచ్పై పచ్చిక ఉంది. ఆరంభంలో పేస్, బౌన్స్కు బాగా అనుకూలిస్తూ ఆ తర్వాత నెమ్మదించే అవకాశం ఉంది. పెర్త్: యాషెస్ సిరీస్లో భాగంగా రెండేళ్ల క్రితం ఇంగ్లండ్లో ఆ్రస్టేలియా పర్యటించగా, ఆ సిరీస్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. అంతకుముందు 2021లో ఆసీస్ గడ్డపై ఆడిన ఇంగ్లండ్ 0–4తో చిత్తుగా ఓడింది. ఈ గణాంకాలు చూస్తే ఎవరిది పైచేయో అర్థమవుతుంది. అయితే కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పర్యవేక్షణలో దూకుడు కనబరుస్తున్న ఇంగ్లండ్ తమ ప్రత్యర్థిని ఓడించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది.ముఖ్యంగా తొలి టెస్టులో ఇద్దరు ఆసీస్ ప్రధాన పేసర్లు జట్టుకు దూరం కావడం ఇంగ్లండ్కు సానుకూలంగా మారే అవకాశం ఉంది. సిరీస్లో శుభారంభం చేస్తే దానిని కొనసాగించాలని బెన్ స్టోక్స్ బృందం పట్టుదలగా ఉంది. అయితే సమర్థుడైన స్టీవ్ స్మిత్ టీమ్కు నాయకత్వం వహించడం ఆసీస్కు బలం. ఇద్దరు అరంగేట్రం... ‘స్మిత్ను 40 పరుగుల్లోపు ఆపగలిగితే మంచిది. లేదంటే మ్యాచ్ చేజారినట్లే’... ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన వ్యాఖ్య ఇది. అతని బ్యాటింగ్ ప్రభావం ఎలాంటిదో ఇది చెబుతుంది. ఇప్పుడు కూడా స్మిత్ బలమైన బ్యాటింగే ఆసీస్కు పెద్ద బలం. ఇతర సీనియర్లలో లబుషేన్, హెడ్లపై ప్రధానంగా బ్యాటింగ్ భారం ఉంది. చాలా కాలంగా విఫలమవుతున్నా ఉస్మాన్ ఖ్వాజా అదృష్టవశాత్తూ ఈ సిరీస్లో అవకాశం దక్కించుకున్నాడు. అతనికి ఓపెనింగ్ భాగస్వామిగా కొత్త ఆటగాడు జేక్ వెదరాల్డ్ బరిలోకి దిగుతాడు. కీపర్ అలెక్స్ కేరీకి కూడా టెస్టు బ్యాటర్గా మంచి రికార్డు ఉంది. ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ ఫిట్నెస్ సమస్యలు దాటి కొత్తగా మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. గాయాల కారణంగా రెగ్యులర్ కెపె్టన్ కమిన్స్, హేజల్వుడ్ తొలి టెస్టు నుంచి తప్పుకోవడంతో బౌలింగ్లో సీనియర్ మిచెల్ స్టార్క్పై చాలా పెద్ద బాధ్యత ఉంది. బోలండ్ అతనికి తగిన భాగస్వామి కాగా, మరో పేసర్ బ్రెండన్ డగెట్ తొలి టెస్టు ఆడబోతున్నాడు. ఎప్పటిలాగే ఏకైక స్పిన్నర్ లయన్ ప్రత్యర్థి కి సవాల్ విసురుతున్నాడు. 2019 తర్వాత ఆ్రస్టేలియా జట్టు తరఫున ఒకే టెస్టులో ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేయడం ఇదే తొలిసారి. స్పిన్నర్ లేకుండా... తొలి టెస్టు వరకు మాత్రం ఆసీస్తో పోలిస్తే ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఆ జట్టు ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగనుండటం విశేషం. ఆర్చర్, మార్క్వుడ్లాంటి ఫాస్టెస్ట్ బౌలర్లతో పాటు అట్కిన్సన్, కార్స్ ఆడనుండగా బౌలింగ్లో స్టోక్స్ కీలక పాత్ర పోషించడం ఖాయం. తుది జట్టులో ఇంగ్లండ్ ఒక్క స్పిన్నర్ను కూడా తీసుకోవడం లేదు. బ్యాటింగ్తో భారత్తో సిరీస్ సహా గత కొంతకాలంగా టాప్–7లో ఎలాంటి మార్పూ లేదు. పెద్దగా రాణించకపోయినా క్రాలీ, పోప్లపై జట్టు నమ్మకం ఉంచింది. డకెట్, బ్రూక్, స్టోక్స్ ఎలా ఆడతారనేది ఆసక్తికరం. అందరి దృష్టీ ఇప్పుడు జో రూట్పై నిలిచింది. ఆధునిక టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు ఉన్న రూట్ ఆసీస్ గడ్డపై ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. అతని తాజా ఫామ్ను బట్టి చూస్తే ఈ సిరీస్లో ఆ లోటును పూర్తి చేసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా, జట్టుపరంగా చూసినా కూడా రూట్ ఆట సిరీస్ ఫలితాన్ని నిర్దేశించగలదు. 34-32ఓవరాల్గా 73 యాషెస్ సిరీస్లు జరిగితే...ఆ్రస్టేలియా 34, ఇంగ్లండ్ 32 గెలవడం ఇరు జట్ల మధ్య పోటీని చూపిస్తోంది.152-111యాషెస్ సిరీస్లో ఇరు జట్ల మధ్య మొత్తం 361 టెస్టులు జరిగాయి. ఆ్రస్టేలియా 152 గెలవగా, ఇంగ్లండ్ 111 మ్యాచ్లలో విజయం సాధించింది. 13సొంతగడ్డపై జరిగిన గత 15 యాషెస్ టెస్టుల్లో ఆ్రస్టేలియా 13 గెలిచి, 2 ‘డ్రా’ చేసుకుంది. ఒక్కదాంట్లోనూ ఓడలేదు. 2011 జనవరి తర్వాత ఇక్కడ ఇంగ్లండ్ ఒక్క టెస్టు కూడా నెగ్గలేకపోయింది. 2023 తర్వాత ఓవరాల్గా అన్ని జట్లపై కలిపి ఆడిన 18 టెస్టుల్లో ఆసీస్ 14 గెలిచింది. ఆసీస్ గడ్డపై ఆడిన గత మూడు ‘యాషెస్’లలో ఇంగ్లండ్ 0–5, 0–4, 0–4తో ఓడింది.
142వ ర్యాంక్లో భారత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న భారత ఫుట్బాల్ జట్టు ‘ఫిఫా’ ప్రపంచ ర్యాంకింగ్స్లో మరింత వెనుకబడింది. ఆసియా కప్ క్వాలిఫయర్స్లో భాగంగా ఇటీవల బంగ్లాదేశ్ చేతిలో 0–1 గోల్స్ తేడాతో ఓడిన టీమిండియా ఆరు స్థానాలు కోల్పోయి 142వ ర్యాంక్తో సరిపెట్టుకుంది. ఆసియా కప్నకు అర్హత సాధించే అవకాశం కోల్పోయిన భారత జట్టుకు గత తొమ్మిదేళ్లలో ఇదే చెత్త ర్యాంక్. చివరిసారిగా 2016 అక్టోబర్లో 148వ ర్యాంక్లో నిలిచిన భారత్ జట్టుకు ఆ తర్వాత ఇదే అత్యధిక ర్యాంక్. 2023 డిసెంబర్లో 102వ స్థానంలో ఉన్న టీమిండియా... వరుస పరాజయాల కారణంగా 40 స్థానాలు దిగజారింది. ఆసియా ర్యాంకింగ్స్లో భారత్ 27వ ర్యాంక్లో ఉంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి టీమిండియా అత్యుత్తమంగా 1996లో 94వ స్థానం దక్కించుకుంది. ర్యాన్ విలియమ్స్కు అనుమతి ఆ్రస్టేలియా ఆటగాడు ర్యాన్ విలియమ్స్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు ‘ఫిఫా’ అంగీకారం తెలిపింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ర్యాన్ విలియమ్స్ ఇటీవల ఆసీస్ పౌరసత్వాన్ని వదులుకున్నాడు. దీంతో అతడు భారత జట్టు సెలెక్షన్కు అందుబాటులోకి వచ్చాడు. ఈ మేరకు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) వివరాలు వెల్లడించింది. 32 ఏళ్ల ర్యాన్ ఆ్రస్టేలియా పాస్పోర్ట్ అప్పగించి భారత పౌరసత్వం పొందాడు. విలియమ్స్ తల్లి ముంబైలో జన్మించడంతో అతడికి ముందు నుంచే భారత్పై ప్రత్యేక అభిమానం ఉంది. మరిప్పుడు జాతీయ జట్టు తరఫున అతడికి అవకాశం దక్కుతుందా చూడాలి. ‘ర్యాన్ విలియమ్స్కు సంబంధించిన అసోసియేషన్ మార్పు అభ్యర్థనను ఫిఫా ఆమోదించింది. దీంతో ర్యాన్ భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి అధికారికంగా అర్హత పొందాడు’ అని ఏఐఎఫ్ఎఫ్ వెల్లడించింది. ఆ్రస్టేలియా అండర్–20, అండర్–23 జట్లకు ప్రాతినిధ్యం వహించిన ర్యాన్... సీనియర్ టీమ్ తరఫున దక్షిణ కొరియాతో మ్యాచ్లో సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగాడు. ఇంగ్లిష్ క్లబ్లు ఫుల్హామ్, పోర్ట్స్మౌత్ తరఫున కూడా ర్యాన్ మ్యాచ్లు ఆడాడు.
‘ఫైనల్’ లక్ష్యంగా భారత్ ‘ఎ’ బరిలోకి
దోహా: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ క్రికెట్ టి20 టోర్నీలో జోరు మీదున్న భారత ‘ఎ’ జట్టు ఫైనలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. నేడు బంగ్లాదేశ్ ‘ఎ’తో జరిగే సెమీఫైనల్లో టాప్ ఫామ్లో ఉన్న ఓపెనింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బ్యాటర్ల సహకారం లభిస్తే చాలు భారత్ విజయానికి ఢోకా ఉండదు. ఈ టోర్నీలో వైభవ్ 201 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. కానీ మిగతా బ్యాటర్లలో కెపె్టన్ జితేశ్ శర్మ సహా నమన్ ధీర్, ప్రియాన్‡్ష ఆర్య, నేహల్ వధేరాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఇప్పటివరకు ఏ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. కీలకమైన సెమీస్లో వీరంతా బాధ్యత కనబరిస్తేనే బంగ్లాపై విజయం సాధించవచ్చు. లేదంటే ఊహించని ఫలితం ఎదురైనా ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ టోర్నీలో భారత్లాగే బంగ్లాదేశ్ కూడా దీటుగా రాణించింది. అఫ్గానిస్తాన్ ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ జట్లను కంగుతినిపించిన బంగ్లా... భారత్తో క్లిష్టమైన పోరుకు సై అంటోంది. పేసర్ రిపొన్ మోండల్, లెఫ్టార్మ్ స్పిన్నర్ రకీబుల్ హసన్ల నుంచి భారత బ్యాటర్లకు సవాళ్లు ఎదురవొచ్చు. భారత బౌలర్లలో గుర్జప్నీత్, స్పిన్నర్ హర్‡్ష దూబేలు నిలకడగా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. కీలకమైన సెమీస్లోనూ వీరి జోరు కొనసాగాలని జట్టు ఆశిస్తోంది. శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ ‘ఎ’తో శ్రీలంక ‘ఎ’ తలపడుతుంది. ఈ రెండు సెమీఫైనల్స్లో చిరకాల ప్రత్యర్థులు గెలిస్తే... ఆదివారం జరిగే ఫైనల్ సమరం దాయాదుల మధ్యే జరిగే అవకాశముంది. భారత్ ‘ఎ’ జట్టు: జితేశ్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ నేహల్, నమన్ ధీర్, సూర్యాన్ష్ రమణ్దీప్, హర్ష్ దూబే, అశుతోష్, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్, వైశాక్. బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు: అక్బర్ అలీ (కెప్టెన్), హబీబుర్, యాసిర్ అలీ, జీషాన్, అరిఫుల్ ఇస్లామ్, రకీబుల్, మహిదుల్, అహ్మద్ రేహాన్, రిపొన్ మోండల్, అబు హిదార్, గఫార్, అబ్రార్.
‘గంభీర్పై విమర్శలేల’
గువాహటి: తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోవడంతో వస్తున్న తీవ్ర విమర్శలపై భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ అసహనం వ్యక్తం చేశాడు. కొందరు పనిగట్టుకొని గంభీర్పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని అతను వ్యాఖ్యానించాడు. భారత జట్టు పరాజయంలో ఆటగాళ్ల పాత్రను వదిలి కోచ్ను లక్ష్యంగా చేసుకోవడంలో అర్థం లేదని కొటక్ అన్నాడు. రేపటి నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనున్న నేపథ్యంలో అతను గురువారం మీడియాతో మాట్లాడాడు. ‘గంభీర్, గంభీర్ అంటూ ఒకే వ్యక్తిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. నేను కూడా సహాయక సిబ్బందిలో భాగం కాబట్టి చాలా బాధగా ఉంది. కొందరికి తమ వ్యక్తిగత అజెండాలు ఉండవచ్చు. అందుకే పనిగట్టుకొని ఇలా చేస్తున్నారని అనిపిస్తోంది’ అని కొటక్ స్పందించాడు. ఓటమి బాధ్యతను గంభీర్ తన మీదకు వేసుకున్నాడని కొటక్ గుర్తు చేశాడు. ‘మ్యాచ్ ఓడిపోయాక ఫలానా బ్యాటర్ బాగా ఆడలేదని లేదా ఫలానా బౌలర్ ఇలా ఆడలేదని ఎవరూ విమర్శించడం లేదు. బ్యాటింగ్లో ఇలా ఉంటే బాగుండేదని ఎవరూ సూచించడం లేదు. కోల్కతాలో పిచ్ గురించి మాట్లాడుతూ గంభీర్ ఓటమి బాధ్యత అంతా తన మీద వేసుకున్నాడు. క్యురేటర్పై ఎవరూ విమర్శలు చేయకుండా కాపాడేందుకే అతను ఇలా చేశాడు’ అని తమ హెడ్ కోచ్ను సితాన్షు వెనకేసుకొచ్చాడు. బ్యాటర్ క్రీజ్లోకి వెళ్లేటప్పుడు ఇలాగే ఆడాలని తాము చెప్పలేమని, పరిస్థితిని బట్టి అతను తన ఆటను మార్చుకుంటాడని కోచ్ అన్నాడు. నేడు గిల్కు ఫిట్నెస్ పరీక్ష కెప్టెన్ శుబ్మన్ గిల్ రెండో టెస్టు నుంచి తప్పుకోవడం దాదాపు ఖాయంగానే అనిపిస్తున్నా... టీమ్ మేనేజ్మెంట్ మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన ఇవ్వడం లేదు. కోల్కతా టెస్టు రెండో రోజు మెడ నొప్పితో తప్పుకున్న అనంతరం ఇప్పటి వరకు గిల్కు చికిత్స కొనసాగుతూనే ఉంది. అతను ఆ తర్వాత ఒక్కసారి కూడా మైదానంలోకి దిగలేదు. అయితే మ్యాచ్కు ముందు రోజు గిల్ను ఫిట్నెస్ పరీక్ష నిర్వహిస్తామని కొటక్ వెల్లడించాడు. ‘గిల్ వేగంగా కోలుకుంటున్నాడు. అయితే అతను ఆడే విషయంపై టీమ్ వైద్యులు, ఫిజియో నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు సాయంత్రం ఫిట్నెస్ పరీక్ష నిర్వహించిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుంది. ఒకవేళ కోలుకున్నా... టెస్టు మధ్యలో మెడ నొప్పి తిరగబడితే కష్టం కదా. గిల్ లాంటి ఆటగాడు లేకపోవడం ఏ జట్టుకైనా లోటే’ అని సితాన్షు వివరించాడు.
ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్షిప్ బరిలో హంపి
దోహా: వచ్చే నెలలో జరిగే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్షిప్ మహిళల విభాగంలో భారత స్టార్ క్రీడాకారిణులు బరిలోకి దిగనున్నారు. డిసెంబర్ 25 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో మహిళల ర్యాపిడ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి డిఫెండింగ్ చాంపియన్గా పోటీపడనుంది. గత ఏడాది న్యూయార్క్లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్షిప్లో హంపి 8.5 పాయింట్లతో విజేతగా అవతరించి రెండోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను సొంతం చేసుకుంది. ఈసారి హంపితోపాటు భారత్ నుంచి మరో 12 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గ్రాండ్మాస్టర్లు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్ముఖ్, వైశాలి, వంతిక, పద్మిని రౌత్, సవిత శ్రీ, నందిత, నూతక్కి ప్రియాంక, ఇషా శర్మ, రక్షిత, చర్వీ తమ ఎంట్రీలను ఖరారు చేశారు. ఓపెన్ విభాగంలో భారత్ నుంచి గ్రాండ్మాస్టర్లు ఇరిగేశి అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణ, కార్తీక్ వెంకటరామన్, రాజా రితి్వక్ తదితరులు బరిలో ఉన్నారు.
పసిడి ‘దీక్ష’
టోక్యో: భారత బధిర క్రీడాకారిణి దీక్షా డాగర్ డెఫిలింపిక్స్లో టైటిల్ నిలబెట్టుకుంది. బధిరుల విశ్వక్రీడల్లో గురువారం జరిగిన మహిళల వ్యక్తిగత స్ట్రోక్ప్లే గోల్ఫ్ ఫైనల్లో ఆమె వరుసగా 68, 65, 72 స్కోర్లతో విజేతగా నిలిచింది. ఫైనల్లో మొత్తం 21 మంది తలపడగా భారత ప్లేయరే అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా 24 ఏళ్ల దీక్ష వరుస డెఫిలింపిక్స్ల్లో విజేతగా నిలిచిన గోల్ఫర్గా ఘనతకెక్కింది. నాలుగేళ్ల క్రితం 2021లో జరిగిన బధిర విశ్వక్రీడల్లోనూ ఆమె బంగారు పతకంతో మెరిసింది. అంతక్రితం 2017లో జరిగిన క్రీడల్లో ఆమె రజతం గెలుచుకుంది. పాల్గొన్న ప్రతి మెగా ఈవెంట్లోనూ ఆమె పతకంతోనే తిరిగొచ్చింది. జకార్తాలో 2018లో జరిగిన రెగ్యులర్ ఆసియా క్రీడల్లోనూ ఆమె పోటీ పడింది. ఆ మరుసటి ఏడాది (2019) మహిళల యూరోపియన్ టూర్లో 18 ఏళ్ల వయసులో టైటిల్ గెలిచింది. అదితి అశోక్ తర్వాత ఈ టైటిల్ గెలిచిన రెండో భారత గోల్ఫర్గా ఘనత వహించింది. ఈ పోటీల్లో భారత్ తరఫున ఆమెతో పాటు హర్‡్ష సింగ్, విభు త్యాగిలు కూడా పోటీపడినప్పటికీ వీళ్లిద్దరు వరుసగా 12వ, 14వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. మాహిత్ ‘ట్రిపుల్ ధమాకా’ భారత రైఫిల్ షూటర్ మాహిత్ సంధూ డెఫిలింపిక్స్లో ట్రిపుల్ ధమాకా సాధించింది. 50 మీటర్ల ప్రోన్ ఈవెంట్లో ఆమె 246.1 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్లో ఆమె 619.7 స్కోరుతో కొత్త ప్రపంచ రికార్డు లిఖించింది. ఈ మెగా ఈవెంట్లో మాహిత్ 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం, 10 మీటర్ల వ్యక్తిగత విభాగంలో రజతం నెగ్గింది. ఆమె మూడు పతకాలతో ఒక్క షూటింగ్ క్రీడాంశంలోనే భారత్ డజను పతకాలను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి 12 పతకాలతో ఆరో స్థానంలో ఉంది.
తరుణ్ శుభారంభం
సిడ్నీ: ఆ్రస్టేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–...
తండ్రీకొడుకులు ‘డబుల్స్’ జంటగా...
సిడ్నీ: మాజీ వరల్డ్ నంబర్వన్, రెండు సింగిల్స్ గ...
ఫైనల్లో నిఖత్
న్యూఢిల్లీ: మాజీ ప్రపంచ చాంపియన్, భారత బాక్సర్ ని...
కురసావ్... కొత్త చరిత్ర
కింగ్స్టన్ (జమైకా): ప్రతికూలతల గురించి పదేపదే ప్...
‘గంభీర్పై విమర్శలేల’
గువాహటి: తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్...
రాణించిన సికందర్ రజా.. కష్టాల్లో శ్రీలంక
పాకిస్తాన్ ట్రై సిరీస్లో ఇవాళ (నవంబర్ 20) జింబా...
ముచ్చల్తో నిశ్చితార్థాన్ని ధృవీకరించిన మంధన
భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్, టీమిండియా 'క్...
కెప్టెన్గా ఇషాన్ కిషన్ పేరు ప్రకటన
త్వరలో ప్రారంభం కానున్న దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్...
క్రీడలు
నా జీవితంలోని ఆల్రౌండర్కు హ్యాపీ బర్త్ డే: సూర్యకుమార్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి దర్శనానికై మెట్ల మార్గంలో వరల్డ్కప్ విన్నర్ శ్రీచరణి (ఫొటోలు)
అక్షర్ పటేల్ నూతన గృహ ప్రవేశం.. విల్లా పేరు ఇదే! (ఫొటోలు)
కోట్ల విలువైన కారు కొన్న టీమిండియా క్రికెటర్ (ఫొటోలు)
కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)
నా హ్యాపీ బర్త్డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్ (ఫొటోలు)
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)
తిరుమల కొండపై ఏడు అడుగుల మహిళ (ఫోటోలు)
వరల్డ్ కప్ ట్రోఫీతో మంధాన, పలాష్ ముచ్చల్ జంట (ఫోటోలు)
వీడియోలు
తడబడ్డ భారత్.. ఘోర పరాజయం
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 42 బంతుల్లోనే 144 పరుగులు
బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిల
క్రీడా కీర్తి కిరీటం
ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉంది: అరుంధతి
మోదీని కలిసిన భారత మహిళల క్రికెట్ జట్టు
Women's World Cup Final 2025: మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
జీసస్ నన్ను నడిపించాడు బైబిల్ పోరాడేలా చేసింది? జెమిమా ఎమోషనల్
ఫైనల్ కు చేరిన భారత్
ఆసీస్ తొలి టీ20 మ్యాచ్.. టీమిండియాలో భారీ మార్పు
