Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

India Enters Womens Kabaddi World Cup 2025 Finals1
ప్రపంచకప్‌ కబడ్డీ ఫైనల్‌కు భారత్‌

ప్రపంచకప్‌ మహిళల కబడ్డీ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఢాకా వేదిక‌గా జ‌రిగిన సెమీఫైనల్లో భారత్‌ 33–21 పాయింట్ల తేడాతో ఇరాన్‌ జట్టును ఓడించింది. మరో సెమీఫైనల్లో చైనీస్‌ తైపీ 25–18 పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది.నేడు జరిగే ఫైనల్లో చైనీస్‌ తైపీతో భారత్‌ తలపడుతుంది. మొత్తం 11 జట్లు పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత్, చైనీస్‌ తైపీ అజేయంగా ఫైనల్‌కు చేరాయి. గ్రూప్‌ ‘ఎ’లో భారత్‌ తాము ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ... గ్రూప్‌ ‘బి’లో చైనీస్‌ తైపీ తాము ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాయి.చదవండి: Australian Open 2025: ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా లక్ష్య సేన్‌

BCCI explains why Rahul was named ODI captain2
పంత్‌ను కాదని రాహుల్‌కు కెప్టెన్సీ.. కారణమిదే?

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంపికైన సంగతి తెలిసిందే. రెగ్యూలర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గైర్హాజరీ కారణంగా జట్టు పగ్గాలను రాహుల్‌కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ అప్పగించింది. అయితే తొలుత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను తాత్కాలిక వన్డే కెప్టెన్‌గా నియమిస్తారని వార్తలు వచ్చాయి.పంత్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మెన్ ఇన్ బ్లూకు స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. దీంతో అత‌డికే జ‌ట్టు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని అంతా భావించారు. కానీ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాత్రం రాహుల్ వైపే మొగ్గు చూపింది. అయితే పంత్‌కు కాకుండా రాహుల్‌ను నియ‌మించ‌డానికి గ‌ల కార‌ణాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా వెల్ల‌డించారు."సౌతాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌లో మాత్ర‌మే కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించనున్నాడు. శుభ్‌మ‌న్ గిల్ తిరిగి న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్ స‌మ‌యానికి అందుబాటులో వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అత‌డు త‌న గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు.ఇక రిష‌బ్ పంత్ సంవత్సర కాలంలో కేవలం ఒక వన్డే మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. అందుకే అత‌డిని కెప్టెన్సీ ఎంపిక‌కు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు" అని స‌ద‌రు అధికారి పీటీఐతో పేర్కొన్నారు. కాగా పంత్ గతేడాది శ్రీలంక‌పై భార‌త్ త‌ర‌పున చివ‌ర‌గా ఆడాడు. అప్ప‌టి నుంచి వ‌న్డే జ‌ట్టుకు దూరంగా ఉన్నాడు. మ‌ళ్లీ ఇప్పుడు అతడు సౌతాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌ సందర్భంగా పున‌రాగ‌మ‌నానికి అత‌డు సిద్ద‌మ‌య్యాడు.ఇక ఈ వన్డే సిరీస్‌కు గిల్‌తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా దూరమయ్యారు. అదేవిధంగా బుమ్రా, సిరాజ్, అక్షర్ పటేల్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో జట్టులోకి రిషబ్ పంత్‌, రుతురాజ్ గైక్వాడ్‌, జైశ్వాల్ వచ్చారు. నవంబర్ 30 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది.భారత వన్డే జట్టు: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), రోహిత్, జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్‌ వర్మ, పంత్, సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, రుతురాజ్‌ గైక్వాడ్, ప్రసిధ్, అర్ష్‌దీప్‌, ధ్రువ్‌ జురెల్‌. చదవండి: Prithvi Shaw: కెప్టెన్‌గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన

IND vs SA 2nd Test: SA on top as bowlers take 4 before Tea3
భారత బ్యాటర్లు అట్టర్ ప్లాప్

గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తొలుత బ్యాటింగ్‌లో తేలిపోయిన భారత్‌.. ఇప్పుడు బ్యాటింగ్‌లో కూడా అదే తీరును కనబరుస్తోంది. మూడో రోజు టీ బ్రేక్ సమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది.9/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ఆరభించిన భారత్‌కు రాహుల్‌(22), జైశ్వాల్‌(58) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్‌ ఔటయ్యాక భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. సాయిసుదర్శన్‌(15), ధ్రువ్‌ జురెల్‌(0) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. మరోసారి సఫారీ స్పిన్నర్లు చక్రం తిప్పారు. హర్మర్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. మహారాజ్‌, జాన్సెన్‌ ఓ వికెట్‌ సాధించారు. ప్రస్తుతం క్రీజులో రిషబ్‌ పంత్‌(6), జడేజా(0) ఉన్నారు. భారత్‌ ఇంకా సౌతాఫ్రికా 387 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

Pakistan Shaheens win super over thriller vs BAN to clinch 2025 Asia Cup Rising Stars4
ఉత్కంఠ పోరు.. సూపర్ ఓవర్‌లో పాకిస్తాన్ విజయం

ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 ఛాంపియన్స్‌గా పాకిస్తాన్ షాహీన్స్ నిలిచింది. ఆదివారం దోహ వేదికగా బంగ్లాదేశ్‌-ఎ జట్టుతో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో పాకిస్తాన్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. తద్వారా వరుసగా మూడో ఆసియాకప్ కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్‌ను పాక్ కైవసం చేసుకుంది.ఈ తుది పోరులో తొలుత ‍బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌-ఎ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 125 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఆరంభంలో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మాజ్ సదాకత్ (18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23) , అరఫాత్ మిన్హాస్( 23 బంతుల్లో 4 ఫోర్లతో 25) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.ఆఖరిలో సాద్ మసూద్ (26 బంతుల్లో 38) దూకుడుగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. బంగ్లాదేశ్-ఎ బౌలర్లలో రిపన్ మోండల్ మూడు వికెట్లు పడగొట్టగా.. రకిబుల్ హసన్ రెండు, మెహెరోబ్, జిషన్ అలామ్, అబ్దుల్ గఫ‌ర్‌ సక్లెయిన్ తలా వికెట్ సాధించారు.స్కోర్లు సమం..అనంతరం లక్ష్య చేధనలో బంగ్లాదేశ్‌ కూడా నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. చేజింగ్‌లో హబీబుర్ రెహమాన్ సోహన్(23) మెరుపు వేగంతో ఆడ‌డంతో మ్యాచ్ త్వ‌ర‌గా ముగిసిపోతుంద‌ని అంతా భావించారు. కానీ ఆ త‌ర్వాతే బంగ్లా వికెట్ల ప‌త‌నం మొద‌లైంది. 53 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో రకిబుల్ హసన్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 24), అబ్దుల్ గ‌ఫ‌ర్‌(16) దూకుడుగా ఆడ‌డంతో స్కోర్లు స‌మం అయ్యాయి. దీంతో సూప‌ర్ ఓవ‌ర్‌తో ఫ‌లితం తేల్చాల‌ని అంపైర్‌లు నిర్ణ‌యించారు.సూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మూడు బంతుల్లో రెండు వికెట్ల న‌ష్టానికి 6 ప‌రుగుల‌కే చేసింది. సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం రెండు వికెట్లు పడితే ఆలౌటైనట్లు ప‌రిగ‌ణిస్తారు. అహ్మద్ డానియల్ మ‌రోసారి అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.బంగ్లా నిర్ధేశించిన 7 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పాక్ నాలుగు బంతుల్లో చేధించింది. పాక్ విజ‌యంలో కీలక పాత్ర పోషించిన అహ్మద్ దనియాల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. ఓపెన‌ర్‌ మాజ్ సదఖత్‌ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.చదవండి: Prithvi Shaw: కెప్టెన్‌గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన

Prithvi Shaw promoted to Maharashtra captain after Ruturaj Gaikwad gets India ODI call-up5
కెప్టెన్‌గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 ఆరంభానికి ముందు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దేశవాళీ టోర్నీ కోసం తమ జట్టు కెప్టెన్‌గా ఓపెనింగ్ బ్యాటర్ పృథ్వీ షాను ఎంసీఎ నియమించింది. కాగా ఎంసీఎ రెండు రోజుల క్రితం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది.వాస్తవానికి రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర జట్టుకు సారథ్యం వహించాల్సి ఉండేది. కానీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు రుతురాజ్‌ను భారత సెలక్టర్లు పిలుపునివ్వడంతో అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ క్రమంలో మహారాష్ట్ర కెప్టెన్ మార్పు అనివార్యమైంది. ఎంసీఎ సెలక్టర్లు ఇప్పటికే తమ నిర్ణయాన్ని షాకు తెలియజేసినట్లు సమాచారం. ఈ విషయంపై మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సోమవారం(నవంబర్ 24) అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పృథ్వీ షాకు కెప్టెన్‌గా అనుభవం ఉంది. గతంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌, లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ముంబై జట్టుకు పలు మ్యాచ్‌లలో సారథ్యం వహించాడు. కాగా రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌కు ముందు పృథ్వీ తన మకాంను ముంబై నుంచి మహారాష్ట్రకు మార్చిన సంగతి తెలిసిందే. ముంబై క్రికెట్‌ అసోయేషిన్‌తో విబేధాలు కారణంగా షా మహారాష్ట్రకు వచ్చాడు. ముంబై నుండి మహారాష్ట్రకు మారినప్పటి నుంచి పృథ్వీ షా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో షా 7 ఇన్నింగ్స్‌లు ఆడి 67.14 సగటుతో 470 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ నవంబర్‌ 26 నుంచి ప్రారంభం కానుంది. మహారాష్ట్ర అదే రోజున తమ తొలి మ్యాచ్‌లో జమ్మూ అం‍్డ్‌ కాశ్మీర్‌తో తలపడనుంది.మ‌హారాష్ట్ర జ‌ట్టురుతురాజ్ గైక్వాడ్, నిఖిల్ నాయక్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, రామకృష్ణ ఘోష్, రాజవర్ధన్ హంగర్గేకర్, జలజ్ సక్సేనా, అజీమ్ కాజీ, అర్షిన్ కులకర్ణి, ముఖేష్ చౌదరి, విక్కీ ఓస్త్వాల్, ప్రశాంత్ సోలంకి, మందార్ భండారి, యోగేష్ డోంగరే, యోగేష్ డోంగరే

Sanju Samson Snubbed for ODI Team Against South Africa6
పాపం సంజూ.. వ‌ర‌ల్డ్ మోస్ట్ అన్‌ల‌క్కీ క్రికెట‌ర్‌

సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ ఆదివారం ప్ర‌క‌టించింది. రెగ్యులర్ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో... అతడి స్థానంలో సీనియ‌ర్ బ్యాట‌ర్‌ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు.అదేవిధంగా ఈ సిరీస్‌కు గిల్‌తో పాటు వైస్ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్, హార్దిక్‌ పాండ్యా గాయాల కార‌ణంగా దూర‌మ‌య్యారు. సీనియర్‌ పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్‌తో పాటు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు విశ్రాంతినివ్వగా... రవీంద్ర జడేజా ఎనిమిది నెలల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు.దిగ్గ‌జ‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి చాన్నాళ్ల తర్వాత బ్లూ జెర్సీలో సొంత అభిమానుల ముందు మైదానంలో అడుగు పెట్టనున్నారు. మ‌రోవైపు మ‌హారాష్ట్ర క్రికెట‌ర్ రుతురాజ్ గైక్వాడ్ ఛాన్నాళ్ల త‌ర్వాత జ‌ట్టులోకి తిరిగొచ్చాడు. గిల్‌ స్ధానంలో గైక్వాడ్‌కు చోటు దక్కింది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ స్ధానంలో తిలక్‌ వర్మకు సెలక్టర్లు పిలుపునిచ్చారు.సంజూ మ‌రో 'సారీ'..ఇక భారత వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్‌కు మ‌రోసారి సెల‌క్ట‌ర్లు మొండిచేయి చూపించారు. సఫారీలతో వన్డే సిరీస్‌కు రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు చోటు దక్కింది. పంత్ కూడా ఏడాది త‌ర్వాత వ‌న్డే జ‌ట్టులోకి వ‌చ్చాడు. పంత్ గైర్హ‌జ‌రీలో కూడా సంజూకు చోటు ద‌క్క‌లేదు. వ‌న్డేల్లో కూడా బ్యాక‌ప్ వికెట్ కీప‌ర్‌గా ధ్రువ్ జురెల్‌ను సెల‌క్ట‌ర్లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్నారు. సఫారీలతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో కూడా జురెల్‌ ఉన్నాడు. ఈ క్రమంలో వ‌న్డేల్లో మంచి రికార్డు ఉన్న‌ప్ప‌టికి సంజూను జ‌ట్టులోకి తీసుకోక‌పోవ‌డంపై నెటిజ‌న్లు ఫైర‌వ‌తున్నారు. బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌పై విమర్శల వర్షం కురుపిస్తున్నారు.శాంస‌న్ చివ‌ర‌గా 2023 డిసెంబరులో దక్షిణాఫ్రికాపై వ‌న్డే మ్యాచ్ ఆడాడు. ఆ త‌ర్వాత శ్రీలంక‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల‌తో సిరీస్‌ల‌కు అత‌డికి చోటు ద‌క్క‌లేదు. ఇప్ప‌టివ‌ర‌కు 16 వ‌న్డేలు ఆడిన సంజూ 56.66 స‌గ‌టుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.భారత వన్డే జట్టు: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), రోహిత్, జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్‌ వర్మ, పంత్, సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, రుతురాజ్‌ గైక్వాడ్, ప్రసిధ్, అర్ష్‌దీప్‌, ధ్రువ్‌ జురెల్‌.

Babar azam 74, Tariq hat-trick take Pakistan into final Tri seires7
బాబర్‌ మెరుపులు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్తాన్‌

సొంతగడ్డపై జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌ జట్టు వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆతిథ్య పాకిస్తాన్‌... ఆదివారం మూడో మ్యాచ్‌లో 69 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసి ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసుకుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సీనియర్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ (52 బంతుల్లో 74; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో ఆకట్టుకున్నారు. సయీమ్‌ అయూబ్‌ (8 బంతుల్లో 13; 2 సిక్స్‌లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడగా... ఆఖర్లో ఫఖర్‌ జమాన్‌ (10 బంతుల్లో 27 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధనాధన్‌ షాట్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జింబాబ్వే బౌలర్లలో సింకందర్‌ రజా 2 వికెట్లు పడగొట్టగా... బ్రాడ్‌ ఇవాన్స్, రిచర్డ్‌ నగరవ చెరో వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో జింబాబ్వే 19 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. ర్యాన్‌ బుర్ల్‌ (49 బంతుల్లో 67 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేయగా... కెప్టెన్‌ సికందర్‌ రజా (18 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. తక్కినవాళ్లంతా విఫలమయ్యారు.పాకిస్తాన్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఉస్మాన్‌ తారిఖ్‌ ‘హ్యాట్రిక్‌’ సహా 4 వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌ రెండో బంతికి టోనీ (1)ని అవుట్‌ చేసిన అతడు... ఆ తర్వాత వరుస బంతుల్లో తషింగ ముసెకివా (0), వెల్లింగ్టన్‌ మసకద్జ (0)ను పెవిలియన్‌ బాట పట్టించాడు. మొహమ్మద్‌ నవాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన పాకిస్తాన్‌ 6 పాయింట్లతో ఫైనల్‌కు చేరింది. టోర్నమెంట్‌ తదుపరి మ్యాచ్‌లో మంగళవారం శ్రీలంకతో జింబాబ్వే తలపడనుంది.చదవండి: IND vs SA: పాపం సంజూ.. వ‌ర‌ల్డ్ మోస్ట్ అన్‌ల‌క్కీ క్రికెట‌ర్‌! అగార్కర్‌పై ఫైర్‌

Lakshya Sen beats Yushi Tanaka to clinch title 8
ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా లక్ష్య సేన్‌

ఏడాది విరామం తర్వాత భారత నంబర్‌వన్‌ షట్లర్‌ లక్ష్య సేన్‌ తన ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ ప్రపంచ 14వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో విజేతగా అవతరించాడు.38 నిమిషాల్లోనే ముగిసిన ఫైనల్లో లక్ష్య సేన్‌ 21–15, 21–11తో ప్రపంచ 26వ ర్యాంకర్‌ యుషి తనాకా (జపాన్‌)పై నెగ్గాడు. గత ఏడాది నవంబర్‌లో సయ్యద్‌ మోడీ ఓపెన్‌ సూపర్‌–300 టోరీ్నలో టైటిల్‌ నెగ్గిన లక్ష్య సేన్‌ ఆ తర్వాత మరో టైటిల్‌ సాధించలేకపోయాడు.ఈ ఏడాది హాంకాంగ్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరినప్పటికీ రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. విజేతగా నిలిచిన లక్ష్య సేన్‌కు 35,625 డాలర్ల (రూ. 31 లక్షల 92 వేలు) ప్రైజ్‌మనీ, 9200 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Max Verstappen wins Las Vegas Grand Prix title9
లక్కీ వెర్‌స్టాపెన్‌

లాస్‌ వేగస్‌: ఫార్ములావన్‌ (ఎఫ్‌1) 2025 సీజన్‌లో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్, నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌కు అదృష్టం కలిసివచ్చింది. ఈ సీజన్‌ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయి డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ రేసులో వెనుకబడిన ఈ నెదర్లాండ్స్‌ డ్రైవర్‌... ద్వితీయార్థంలో అదరగొడుతున్నాడు. తాజాగా లాస్‌ వేగస్‌ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో అతడికిది ఆరో విజయం కావడం విశేషం. మెక్‌లారెన్‌ డ్రైవర్లు లాండో నోరిస్, ఆస్కార్‌ పియాస్ట్రి అనర్హతకు గురవడంతో... డిఫెండింగ్‌ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ రేసులో దూసుకొచ్చాడు. సీజన్‌లో మరో రెండు రేసులు మాత్రమే మిగిలుండగా... చాంపియన్‌షిప్‌ కైవసం చేసుకునేదెవరనేది ఆసక్తికరంగా మారింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన ప్రధాన రేసులో వెర్‌స్టాపెన్‌ 50 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 21 నిమిషాల 8.429 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు.తద్వారా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న మెక్‌లారెన్‌ డ్రైవర్‌ ఆస్కార్‌ పియాస్ట్రిని వెర్‌స్టాపెన్‌ సమం చేశాడు. గతేడాది ఈ రేసు ద్వారానే నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన వెర్‌స్టాపెన్‌... మరోసారి ఈ రేసు ద్వారానే పోటీలోకి వచ్చాడు. తొలి మలుపులోనే... రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్‌... తొలి మలుపులోనే రేసుపై పట్టు సాధించాడు. నోరిస్‌ వాయువేగంతో దూసుకెళ్తున్నా... వెర్‌స్టాపెన్‌ నిలకడగా ప్రయత్నిస్తూ అతడిని అధిగమించాడు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోని వెర్‌స్టాపెన్‌... చివరి వరకు అదే జోరు కొనసాగిస్తూ కెరీర్‌లో 69వ విజయం ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో వెర్‌స్టాపెన్‌ ఫాస్టెస్ట్‌ ల్యాప్‌ను సైతం తన పేరిట లిఖించుకున్నాడు. నోరిస్‌ రెండో స్థానంతో రేసును ముగించినా... అతడిపై అనర్హత వేటు పడటంతో మెర్సిడెస్‌ డ్రైవర్‌ జార్జ్‌ రసెల్‌ (1 గంట 21 నిమిషాల 31.975 సెకన్లు)కు ద్వితీయ స్థానం దక్కింది. మెర్సిడెస్‌కే చెందిన కిమీ ఆంటొనెల్లి (1 గంట 21 నిమిషాల 38.917 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (1 గంట 21 నిమిషాల 39.107 సెకన్లు; ఫెరారీ), కార్లోస్‌ సెయింజ్‌ (1 గంట 21 నిమిషాల 43.353 సెకన్లు; విలియమ్స్‌ రేసింగ్‌) వరుసగా నాలుగో, ఐదో స్థానాలు దక్కించుకున్నారు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ (1 గంట 22 నిమిషాల 7.798 సెకన్లు; ఫెరారీ) ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఆ ఇద్దరిపై అనర్హత వేటు ఎందుకంటే... ఈ ఏడాది డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ సాధించాలని కలలు కంటున్న మెక్‌లారెన్‌ డ్రైవర్లకు షాక్‌ తగిలింది. రేసులో చక్కటి ప్రదర్శన కనబర్చిన ఆ జట్టుకు చెందిన నోరిస్‌ (2వ స్థానం), పియాస్ట్రి (4వ స్థానం)పై అనర్హత వేటు పడింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న వీరిద్దరూ ప్రధాన రేసు అనంతరం తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంటారనుకుంటే... సాంకేతిక కారణాల వల్ల ఈ ఇద్దరిపై వేటు వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నోరిస్‌ కారు ప్లాంక్‌ పరికరాల మందం... అనుమతించిన కనీస మందం కంటే తక్కువగా ఉండటంతో అతడి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోలేదు. ఇదే కారణంగా పియా్రస్టిపై కూడా వేటు పడింది. నిబంధనల ప్రకారం దాని కనీస మందం 9 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉంది. అయితే పియాస్ట్రి నడిపిన కారు ఎల్‌హెచ్‌ఎస్‌ ముందు భాగం 8.96 మిల్లీమీటర్లు, ఆర్‌హెచ్‌ఎస్‌ ముందు భాగం 8.74 మిల్లీమీటర్లు, ఆర్‌హెచ్‌ఎస్‌ వెనుక భాగం 8.90 మిల్లీమిటర్లుగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. నోరిస్‌ కారు కూడా 9 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉన్నట్లు గుర్తించారు. తయారీ సమయంలో అత్యధికంగా 0.001 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ తేడా ఉండదని... కానీ, రేసు అనంతరం ఈ ఇద్దరి కార్లు పరిశీలించగా... అవి నిబంధనలకు లోబడి లేవని నిర్వాహకులు తేల్చారు. దీంతో నోరిస్, పియా్రస్టిపై అనర్హత వేటు విధించారు. టైటిల్‌ రేసు రసవత్తరం 24 రేసుల తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 22 రేసులు ముగిశాయి. అందులో మెక్‌లారెన్‌ డ్రైవర్లు లాండో నోరిస్, ఆస్కార్‌ పియాస్ట్రి చెరో ఏడు రేసుల్లో విజయాలు సాధించగా... వెర్‌స్టాపెన్‌ ఆరు టైటిల్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే పాయింట్ల పరంగా చూసుకుంటే నోరిస్‌ 390 పాయింట్లతో డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ రేసులో అగ్రస్థానంలో ఉండగా... పియాస్ట్రి, వెర్‌స్టాపెన్‌ చెరో 366 పాయింట్లతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నారు. ‘టాప్‌’లో ఉన్న నోరిస్‌కు... వెర్‌స్టాపెన్‌కు మధ్య 24 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఈ సీజన్‌లో మరో రెండు రేసులు మిగిలి ఉన్నాయి. గరిష్టంగా 50 పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. చివరి రెండు రేసుల్లో నోరిస్‌ టాప్‌–10లో నిలవకుండా... వెర్‌స్టాపెన్‌ టైటిల్‌ గెలిస్తే వరుసగా ఐదో ఏడాది అతని ఖాతాలో డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ అతడికే దక్కుతుంది. సీజన్‌లోని తదుపరి రెండు రేసులు వరుసగా ఈ నెల 30న ఖతర్‌ గ్రాండ్‌ప్రి... డిసెంబర్‌ 7న అబుదాబి గ్రాండ్‌ప్రి జరుగుతాయి.

Ireland lose second Test10
బంగ్లాదేశ్‌ క్లీన్‌స్వీప్‌

మిర్పూర్‌: బ్యాటర్ల విజృంభణకు బౌలర్ల సహకారం తోడవడంతో... ఐర్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను బ్లంగాదేశ్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్‌ 217 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో చేజిక్కించుకుంది. 509 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 176/6తో ఆదివారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఐర్లాండ్‌ చివరకు 113.3 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. కర్టీస్‌ కాంపెర్‌ (259 బంతుల్లో 71 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మ్యాచ్‌ను ‘డ్రా’ చేసేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. చివరి వరుస బ్యాటర్లతో కలిసి చక్కటి పోరాటంతో బంగ్లాదేశ్‌ను విసిగించాడు. ఆఖరి రోజు దాదాపు 60 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన అతడు మ్యాచ్‌ను కాపాడలేకపోయినా... తన అసమాన పోరాటంతో ఆకట్టుకున్నాడు. జోర్డాన్‌ నీల్‌ (46 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి 85 బంతుల్లో 48 పరుగులు జోడించిన కాంపెర్‌... ఆ తర్వాత పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచి్చన గవిన్‌ హోయ్‌ (104 బంతుల్లో 37; 4 ఫోర్లు)తో సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేశాడు. ఈ జోడీ 9వ వికెట్‌కు 191 బంతులాడి 54 పరుగులు చేసింది. బంగ్లా స్పిన్నర్లు ఎంతగా పరీక్షిస్తున్నా ఈ జంట సహనం కోల్పోలేదు. దీంతో ఐర్లాండ్‌ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకునేలా కనిపించినా... హసన్‌ మురాద్‌ వరుస బంతుల్లో గవిన్, మాథ్యూ (0)ను అవుట్‌ చేసి ఐర్లాండ్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లామ్, హసన్‌ మురాద్‌ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగులు చేయగా... ఐర్లాండ్‌ 265 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బంగ్లా 297/4 వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. కెరీర్‌లో వందో టెస్టులో సెంచరీతో మెరిసిన ముష్ఫికర్‌ రహీమ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, తైజుల్‌ ఇస్లామ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి టి20 సిరీస్‌ ప్రారంభం కానుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement