Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Junior World Cup Hockey Tournament from today1
నిరీక్షణ ముగించాలని...

భారత సీనియర్‌ పురుషుల హాకీ జట్టు ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించి 50 ఏళ్లు గడిచాయి. 1975లో ఒక్కసారి మాత్రమే భారత సీనియర్‌ జట్టు ప్రపంచకప్‌ టైటిల్‌ను అందుకుంది. ఆ తర్వాత 12 సార్లు ప్రపంచకప్‌ టోర్నీ జరిగినా భారత జట్టు మాత్రం కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది. సీనియర్‌ జట్టుతో పోలిస్తే భారత జూనియర్‌ పురుషుల హాకీ జట్టు ప్రపంచకప్‌లో నిలకడగా రాణిస్తోంది. రెండుసార్లు జగజ్జేతగా నిలిచింది. ఒకసారి రన్నరప్‌ ట్రోఫీని అందుకుంది. మూడుసార్లు మూడో స్థానంలో నిలిచింది. చివరిసారి 2016లో సొంతగడ్డపై ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత్‌... తొమ్మిదేళ్ల టైటిల్‌ నిరీక్షణకు సొంతగడ్డపై తెర దించాలని, ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా అవతరించాలనే లక్ష్యంతో నేడు మొదలయ్యే మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగనుంది. చెన్నై/మదురై: గత 12 ఏళ్లలో నాలుగోసారి జూనియర్‌ పురుషుల ప్రపంచకప్‌ అండర్‌–21 హాకీ టోర్నీకి భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. చెన్నై, మదురై నగరాల్లో జరిగే ఈ మెగా టోర్నీకి నేడు తెర లేవనుంది. 46 ఏళ్ల ఈ టోర్నమెంట్‌ చరిత్రలో తొలిసారి 24 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. 2009లో 20 జట్లు బరిలోకి దిగగా... ఆ తర్వాత జరిగిన నాలుగు ప్రపంచకప్‌లలో 16 జట్లు పోటీపడ్డాయి. ఈసారి 24 జట్లకు అవకాశం కల్పించారు. మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ జట్టు అర్హత సాధించినా... భారత్‌తో ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. పాకిస్తాన్‌ స్థానాన్ని ఒమన్‌ జట్టుతో భర్తీ చేశారు. నేడు జరిగే తమ తొలి లీగ్‌ మ్యాచ్‌లో చిలీ జట్టుతో భారత్‌ ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 8:30 నుంచి ఈ మ్యాచ్‌ జరుగుతుంది. అనంతరం భారత్‌ 29న ఒమన్‌ జట్టుతో, డిసెంబర్‌ 2న స్విట్జర్లాండ్‌ జట్టుతో తలపడుతుంది. సీనియర్‌ జట్టు దిగ్గజ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్న భారత జూనియర్‌ జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న భారత్‌కు ప్రపంచ నంబర్‌వన్, ఏడుసార్లు విజేత జర్మనీ జట్టు నుంచి గట్టిపోటీ ఎదురవనుంది. ఇటీవల మలేసియాలో జరిగిన సుల్తాన్‌ ఆఫ్‌ జొహోర్‌ కప్‌లో భారత జట్టు రజత పతకం సాధించి మంచి ఫామ్‌లో ఉంది. అయితే పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచే అంశమే భారత్‌ను వేధిస్తోంది. జొహోర్‌ కప్‌లో భారత జట్టుకు 53 పెనాల్టీ కార్నర్‌లు లభించగా... కేవలం ఎనిమిదింటిని మాత్రమే గోల్స్‌గా మలిచింది. ‘అవును. పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచే అంశంపై మేము దృష్టి పెట్టాం. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో రోజుకు 200–300 సార్లు డ్రాగ్‌ ఫ్లిక్‌ చేశాము. ఈ సాధన ఫలితాలు ఇస్తుందని ఆశాభావంతో ఉన్నాం’ అని హెడ్‌ కోచ్‌ శ్రీజేశ్‌ వ్యాఖ్యానించాడు. రోహిత్‌ సారథ్యంలో భారత జట్టు ఈ మెగా టోర్నీలో ఆడనుంది. ఇప్పటికే భారత సీనియర్‌ జట్టుకు 21 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన డ్రాగ్‌ఫ్లికర్‌ అరిజిత్‌ సింగ్‌ హుండల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఏ గ్రూప్‌లో ఎవరున్నారంటే... గ్రూప్‌ ‘ఎ’: కెనడా, జర్మనీ, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా. గ్రూప్‌ ‘బి’: భారత్, చిలీ, ఒమన్, స్విట్జర్లాండ్‌. గ్రూప్‌ ‘సి’: జపాన్, న్యూజిలాండ్, చైనా, అర్జెంటీనా. గ్రూప్‌ ‘డి’: బెల్జియం, స్పెయిన్, ఈజిప్‌్ట, నమీబియా. గ్రూప్‌ ‘ఇ’: ఇంగ్లండ్, మలేసియా, నెదర్లాండ్స్, ఆ్రస్టియా. గ్రూప్‌ ‘ఎఫ్‌’: ఆస్ట్రేలియా, కొరియా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్‌.ముందుకెళ్లాలంటే... మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లకు చోటు కల్పించారు. వరుసగా ఐదు రోజులపాటు లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మూడు రోజులు ఎనిమిది లీగ్‌ మ్యాచ్‌ల చొప్పున... ఆ తర్వాతి రెండు రోజులు నాలుగు మ్యాచ్‌ల చొప్పున నిర్వహిస్తారు. లీగ్‌ దశ ముగిశాక ఆరు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లు... ఆ తర్వాత రెండో స్థానంలో నిలిచిన మేటి రెండు జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మిగతా 16 జట్లు వర్గీకరణ మ్యాచ్‌లు ఆడతాయి. 5 ఇప్పటి వరకు ఐదు జట్లు మాత్రమే జూనియర్‌ ప్రపంచకప్‌లో విజేతలుగా నిలిచాయి. ఈ జాబితాలో జర్మనీ, భారత్, అర్జెంటీనా, ఆ్రస్టేలియా, పాకిస్తాన్‌ ఉన్నాయి.4 జూనియర్‌ ప్రపంచకప్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యమివ్వడం ఇది నాలుగోసారి. గతంలో భారత్‌ 2013, 2016, 2021లలో కూడా ఈ మెగా ఈవెంట్‌కు వేదికగా నిలిచింది.7 ఇప్పటి వరకు 13 సార్లు జూనియర్‌ ప్రపంచకప్‌ జరిగింది. అత్యధికంగా జర్మనీ జట్టు 7 సార్లు టైటిల్‌ సాధించింది. భారత్‌ (2001, 2016) అర్జెంటీనా (2005, 2021) జట్లు రెండు సార్లు చొప్పున చాంపియన్స్‌గా నిలిచాయి. ఆస్ట్రేలియా (1997), పాకిస్తాన్‌ (1979) ఒక్కోసారి టైటిల్‌ అందుకున్నాయి.

Former captain Sunil Gavaskar came out in support of Gambhir2
జట్టును సిద్ధం చేయడమే కోచ్‌ పని...మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే: గావస్కర్‌

న్యూఢిల్లీ: భారత జట్టు 25 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌ కోల్పోయింది. దాంతో హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ గంభీర్‌కు అండగా నిలిచాడు. కోచ్‌ కేవలం జట్టును సిద్ధం చేస్తాడని... మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే అని గావస్కర్‌ అన్నాడు. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 30 పరుగులతో ఓడిన టీమిండియా... రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. గంభీర్‌ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత జట్టు మూడో టెస్టు సిరీస్‌ ఓటమి చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో 0–3తో ఓడిన టీమిండియా, ఆస్ట్రేలియాలో 1–3తో సిరీస్‌ కోల్పోయింది. ఈ నేపథ్యంలో గావస్కర్‌ మాట్లాడుతూ... ‘అతడు ఒక కోచ్‌. జట్టును సిద్ధం చేయడం అతడి పని. తనకున్న అనుభవంతో ఎలా ఆడాలో చెప్పగలడు. కానీ, మైదానంలో ఆడాల్సింది ప్లేయర్లే. ఈ సిరీస్‌ పరాజయానికి గంభీర్‌ను బాధ్యుడిని చేయాలంటున్న వారికి నేను ఓ సూటి ప్రశ్న వేస్తున్నా. గంభీర్‌ నేతృత్వంలోనే భారత జట్టు చాంపియన్స్‌ ట్రోఫీ, ఆసియా కప్‌ గెలిచింది. అప్పుడు అతడిని వన్డే, టి20ల్లో జీవితాంతం కోచ్‌గా ఉంచాలని మీరు చెప్పారా. మరి అలాంటిది ఇప్పుడు టెస్టు సిరీస్‌ ఓడినప్పుడు అతడిని తొలగించాలని ఎలా డిమాండ్‌ చేయగలరు. ఒక జట్టు బాగా రాణించనప్పుడు మాత్రమే కోచ్‌ వైపు చూస్తారు’ అని గావస్కర్‌ అన్నాడు. మూడు ఫార్మాట్లకు గంభీర్‌ను కోచ్‌గా కొనసాగించడాన్ని సన్నీ సమర్థించాడు. ఇంగ్లండ్‌ జట్టుకు బ్రెండన్‌ మెక్‌ల్లమ్‌ అన్ని ఫార్మాట్లలో కోచింగ్‌ ఇస్తున్న అంశాన్ని గుర్తు చేశాడు. గంభీర్‌కు అండగా అశ్విన్‌ దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్‌ పరాజయానికి కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ను బాధ్యుడిని చేయడం తగదని... భారత మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. గంభీర్‌ కాంట్రాక్టు 2027 వరకు ఉండగా... అతడిని కోచ్‌ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌ వ్యక్తమవుతున్న నేపథ్యంలో అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఇదొక క్రీడ. గెలుపోటములు సహజం. జట్టును నిర్వహించడం అంత సులభం కాదు. ఈ పరాజయానికి గంభీర్‌ కూడా బాధపడుతున్నాడు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. దీనికి ఎవరినో ఒకరిని బాధ్యలను చేసి తప్పిస్తే మంచిదని అనిపించవచ్చు. కానీ అది సరైంది కాదు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం ఆశిస్తుంటారు. భారత క్రికెట్‌ ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉంది. అందుకే బాధ్యత ఎవరు తీసుకుంటారు అని అందరూ ఎదురుచూస్తున్నారు. అలా అని కోచ్‌ బ్యాట్‌ పట్టుకొని మైదానంలోకి దిగి ఆడలేడు కదా. ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి పైనా దాడి చేయడం తగదు’ అని అశ్విన్‌ వివరించాడు.

Tanvi Sharma defeats Okuhara in Syed Modi badminton tournament3
తన్వీ శర్మ సంచలనం

లక్నో: భారత యువ షట్లర్‌ తన్వీ శర్మ సంచలనం సృష్టించింది. సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ మాజీ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ నొజోమి ఒకుహరా (జపాన్‌)ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 16 ఏళ్ల తన్వీ శర్మ 13–21, 21–16, 21–19తో రెండో సీడ్‌ ఒకుహరాపై విజయం సాధించింది. 59 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో తొలి గేమ్‌ కోల్పోయిన అనంతరం పుంజుకున్న తనీ్వ... అద్వితీయ ఆటతీరుతో 2017 ప్రపంచ చాంపియన్‌ ఒకుహారాను కంగుతినిపించింది. ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ సూపర్‌–300 టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లిన తన్వీ... ఒకుహరాపై గెలవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. ‘ఈ ఏడాది నాకు గొప్పగా సాగుతోంది. ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించా. ఒకుహరాను ఓడిస్తానని అస్సలు ఊహించలేదు. అత్యుత్తమ ఆటతీరు కనబర్చాలనే లక్ష్యంతో బరిలోకి దిగా. తొలి గేమ్‌లో చాలా అనవసర తప్పిదాలు చేశాడు. ఆ సమయంలో గెలుపోటముల గురించి పక్కనపెట్టి నీ ఆట నువ్వు ఆడు అని కోచ్‌ సూచించారు. దాన్నే కొనసాగించి ఫలితం సాధించా. సుదీర్ఘ ర్యాలీస్‌ ఆడేందుకు నేను సిద్ధమే. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నా’ అని తన్వీ పేర్కొంది. ప్రణయ్‌ పరాజయం ఇక పురుషుల సింగిల్స్‌లో 19 ఏళ్ల మన్‌రాజ్‌ 21–15, 21–18తో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌పై విజయం సాధించాడు. 43 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ప్రణయ్‌ వరుస గేమ్‌ల్లో పరాజయం పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌ ఇతర మ్యాచ్‌ల్లో టాప్‌ సీడ్‌ ఉన్నతి హుడా 21–15, 21–10తో తస్నీమ్‌ మీర్‌పై విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇషారాణి బారువా 21–15, 21–8తో ఆరో సీడ్‌ పొలినా బుహ్‌రోవా (ఉక్రెయిన్‌)పై, రక్షిత శ్రీ 16–21, 21–19, 21–17తో దేవికా సిహాగ్‌పై విజయాలతో ముందంజ వేశారు. తాన్యా, అనుపమ పరాజయాలతో ఇంటిబాట పట్టారు. శ్రీకాంత్‌ ముందుకు పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ 21–6, 21–16తో సనీత్‌ దయానంద్‌పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో మిథున్‌ మంజునాథ్‌ 21–16, 17–21, 21–17తో ఆరో సీడ్, హైదరాబాద్‌ ప్లేయర్‌ తరుణ్‌ మన్నేపల్లిపై, ప్రియాన్షు రజావత్‌ 21–16, 10–21, 21–12తో రాహుల్‌ భరద్వాజ్‌పై గెలిచి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. కిరణ్‌ జార్జ్, ఆలాప్‌ మిశ్రా, సిద్ధార్థ్‌ గుప్తా టోర్నీ నుంచి నిష్క్రమించారు. పురుషుల డబుల్స్‌లో ఐదో సీడ్‌ హరిహరన్‌–అర్జున్‌ జంట 21–12, 21–18తో లా యీ షెంగ్‌–లిమ్‌ జె జియాన్‌ (మలేసియా) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో టాప్‌ సీడ్‌ గాయత్రి గోపీచంద్‌–ట్రెసా జాలీ ద్వయం 21–17, 21–12తో జెనిత్‌–లిఖిత (భారత్‌) జంటపై నెగ్గి క్వార్ట్‌ ఫైనల్లో అడుగు పెట్టింది.

Sumit Nagal misses out on direct qualification for Australian Open4
సుమిత్‌ నగాల్‌కు నిరాశ

చెంగ్డూ (చైనా): టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ చేజార్చుకున్నాడు. ఆసియా–పసిఫిక్‌ వైల్డ్‌ కార్డు ప్లే ఆఫ్‌ టోర్నీలో ప్రపంచ 278వ ర్యాంకర్‌ సుమిత్‌ నగాల్‌ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ సుమిత్‌ 2–6, 2–6తో టాప్‌ సీడ్, ప్రపంచ 120వ ర్యాంకర్‌ యుంచావోకెటె బు (చైనా) చేతిలో ఓడిపోయాడు. మ్యాచ్‌ మొత్తంలో ఒక్క ఏస్‌ కొట్టి, ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ చేసిన సుమిత్‌ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన సుమిత్‌కు 1,500 ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 87 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 28 ఏళ్ల సుమిత్‌ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మెయిన్‌ ‘డ్రా’లో పోటీపడ్డాడు. కానీ రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేకపోయాడు. ఫైనల్లో నిక్కీ పునాచా జోడీ ఇదే టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో నిక్కీ పునాచా (భారత్‌)–ప్రుచాయ ఇసారో (థాయ్‌లాండ్‌) జోడీ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో నిక్కీ–ఇసారో ద్వయం 6–4, 6–2తో జిసుంగ్‌ నామ్‌–యుసుంగ్‌ పార్క్‌ (దక్షిణ కొరియా) జంటపై గెలిచింది. ఫైనల్లో గెలిచిన జోడీకి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ వైల్డ్‌ కార్డు బెర్త్‌ లభిస్తుంది.

India to host Commonwealth Games again5
ఆహా... ఇక మాకు పండగే

న్యూఢిల్లీ: భారత్‌కు మళ్లీ కామన్వెల్త్‌ క్రీడల ఆతిథ్య భాగ్యం దక్కడంపై భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ), క్రీడాశాఖ కంటే కూడా అంతర్జాతీయ క్రీడా షూటింగ్‌ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌), ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) తెగ సంబరపడిపోతున్నాయి. భారత్‌కు 2030 ఆతిథ్య హక్కులు దక్కడాన్ని ఈ రెండు క్రీడా సమాఖ్యలు స్వాగతించాయి. దీంతో ఈ మెగా ఈవెంట్‌లో తిరిగి ఈ రెండు క్రీడాంశాలు చేరతాయని ఆశిస్తున్నాయి. వచ్చే ఏడాది స్కాట్లాండ్‌ దేశంలో జరిగే గ్లాస్గో–2026 కామన్వెల్త్‌ క్రీడల నుంచి షూటింగ్, బ్యాడ్మింటన్‌ ఈవెంట్‌లను తొలగించారు. ఇది భారత శిబిరాన్నే కాదు... ఐఎస్‌ఎస్‌ఎఫ్, బీడబ్ల్యూఎఫ్‌లను సైతం తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఎందుకంటే ఈ రెండు ఈవెంట్లలో చెప్పుకోదగ్గ సంఖ్యలో బంగారు, రజత, కాంస్య పతకాల్ని మన క్రీడాకారులు సాధిస్తారు. ఈ పతకాలతో ఆయా అథ్లెట్లకు నజరానాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఈపాటికే ఉద్యోగాలుంటే పదోన్నతులు సైతం దక్కుతాయి. కానీ ఈవెంట్లకు కత్తెర వేయడంతో భారత షూటర్లు, షట్లర్లకు అశనిపాతమైంది. అయితే 2030 కామన్వెల్త్‌ క్రీడల ఆతిథ్య హక్కుల్ని బుధవారం భారత్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆతిథ్య దేశం ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ రెండు క్రీడల్ని చేరుస్తారని ఐఎస్‌ఎస్‌ఎఫ్, బీడబ్ల్యూఎఫ్‌ గట్టిగా ఆశిస్తున్నాయి. వడోదరలో క్రికెట్‌! అహ్మదాబాద్‌ వేదికగా జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో భాగంగా నిర్వహించబోయే క్రికెట్‌ పోటీలకు సమీప నగరం వడోదర వేదికయ్యే అవకాశముందని ఐఓఏ సీఈఓ రఘురామ్‌ అయ్యర్‌ తెలిపారు. దీనిపై ఇంకా అధికారక నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. భారత్‌లో జరిగే మెగా ఈవెంట్‌లో 15 నుంచి 17 క్రీడాంశాలకు చోటు ఉంటుందని క్రీడా వర్గాలు వెల్లడించాయి.

India beat New Zealand in fourth league match6
ఫైనల్‌పై భారత్‌ గురి

ఇపో (మలేసియా): అందివచ్చిన అవకాశాలను సది్వనియోగం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టు సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ టోర్నీలో ఫైనల్‌ బెర్త్‌పై గురి పెట్టింది. న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో సంజయ్‌ సారథ్యంలోని టీమిండియా 3–2 గోల్స్‌ తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో భారత్‌కిది మూడో విజయం. భారత్‌ తరఫున అమిత్‌ రోహిదాస్‌ (4వ నిమిషంలో), సంజయ్‌ (32వ నిమిషంలో), సెల్వం కార్తీ (54వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. న్యూజిలాండ్‌ జట్టుకు జార్జి బాకెర్‌ (42వ, 48వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ అందించాడు. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్‌ తొమ్మిది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బెల్జియం జట్టు పది పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో... న్యూజిలాండ్‌ ఏడు పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. నేడు మ్యాచ్‌లకు విశ్రాంతి దినం. శనివారం జరిగే చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో కెనడాతో భారత్‌; బెల్జియంతో న్యూజిలాండ్‌; మలేసియాతో దక్షిణ కొరియా ఆడతాయి. కెనడాపై భారత్‌ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్‌ చేరుకుంటుంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను బెల్జియం ‘డ్రా’ చేసుకున్నా భారత్‌తో కలిసి ఫైనల్లోకి అడుగు పెడుతుంది. బెల్జియంపై 13 గోల్స్‌ తేడాతో గెలిస్తేనే న్యూజిలాండ్‌కు ఫైనల్‌ చేరే అవకాశం ఉంటుంది.

Deepti Sharma fetches huge price in Womens Premier League auction7
డబ్ల్యూపీఎల్‌ వేలంలో దీప్తి ధమాకా

భారత జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌ కప్‌ టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించిన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ దీప్తి శర్మకు మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) వేలంలో భారీ విలువ దక్కింది. 2026 సీజన్‌ కోసం నిర్వహించిన మెగా వేలంలో దీప్తిని అత్యధికంగా రూ.3 కోట్ల 20 లక్షలకు ఆమె గత జట్టు యూపీ వారియర్స్‌ సొంతం చేసుకుంది. డబ్ల్యూపీఎల్‌ వేలం చరిత్రలో అత్యధిక మొత్తం 2023లో స్మృతి మంధాన (రూ.3.40 కోట్లు)కు దక్కగా... దీప్తి రెండో స్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా మూడుసార్లు ఢిల్లీని ఫైనల్‌కు చేర్చిన ఆ్రస్టేలియా దిగ్గజం మెగ్‌ లానింగ్‌ను రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ తమ సారథిగా ఎంచుకునే అవకాశం ఉంది. వరల్డ్‌ కప్‌ విజయంలో భాగమైన ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.1.30 కోట్లు ఇచ్చి మళ్లీ తమ జట్టులోకి తీసుకుంది. న్యూఢిల్లీ: ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) –2026 సీజన్‌ కోసం గురువారం నిర్వహించిన వేలంలో 67 మంది మహిళా క్రికెటర్లను ఐదు ఫ్రాంచైజీలు ఎంచుకున్నాయి. వీరిలో 23 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం 276 మంది ప్లేయర్లు వేలంలోకి రాగా, గరిష్టంగా 73 ఖాళీలు ఉండగా... తమకు కావాల్సిన ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు టీమ్‌లు ఓవరాల్‌గా రూ.40.80 కోట్లు ఖర్చు చేశాయి. భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మకు అత్యధికంగా రూ.3.20 కోట్లు దక్కాయి. విదేశీ ఆటగాళ్లలో న్యూజిలాండ్‌ స్టార్‌ అమేలియా కెర్‌కు రూ. 3 కోట్లు లభించగా... 11 మంది ప్లేయర్లకు కనీసం రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలు దక్కాయి. వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు రెండు నగరాల్లో డబ్ల్యూపీఎల్‌ జరుగుతుంది. ముంబైలోని డీవై పాటిల్, వడోదరలోని కొటాంబి స్టేడియంలను టోర్నీకి వేదికలుగా నిర్ణయించారు. 2023లో మొదటిసారి డబ్ల్యూపీఎల్‌ వేలం జరిగింది. ఆ తర్వాత జరిగిన మెగా వేలం ఇదే కావడం గమనార్హం. తొలిసారి జట్లకు రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) కార్డును వాడుకునే అవకాశం కల్పించారు. వేలానికి ముందు యూపీ వారియర్స్‌ వద్ద ఏకంగా రూ.14.50 కోట్లు ఉండటంతో ఆ జట్టు చురుగ్గా పాల్గొని గరిష్టంగా 17 మంది ఆటగాళ్లను ఎంచుకుంది. డబ్ల్యూపీఎల్‌ వేలం విశేషాలు » ఆస్ట్రేలియా కెప్టెన్‌ అలీసా హీలీతో వేలం మొదలైంది. వన్డే వరల్డ్‌ కప్‌లో చెలరేగిన ఆమె ప్రాథమిక ధర రూ.50 లక్షలు కాగా... ఏ జట్టు కూడా తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. » దీప్తి కోసం 2023లో యూపీ వారియర్స్‌ రూ. 2.60 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఈ సీజన్‌కు ముందు ఆమెను విడుదల చేసింది. వేలంలో దీప్తి కనీస విలువ రూ. 50 లక్షలకు తీసుకునేందుకు ఢిల్లీ సిద్ధం కాగా... యూపీ ఆర్‌టీఎం కార్డును వాడుకొని తమ జట్టులోకి ఎంచుకుంది. » డబ్ల్యూపీఎల్‌లో మూడుసార్లు కెప్టెన్‌గా ఢిల్లీని ఫైనల్‌ చేర్చిన ఆసీస్‌ దిగ్గజం మెగ్‌ లానింగ్‌ కనీస ధర రూ.50 లక్షల నుంచి ఢిల్లీ, యూపీ పోటీ పడగా, చివరకు రూ.1.9 కోట్లతో యూపీ సొంతమైంది. » వేలంలో భారీ మొత్తం పలికిన ప్లేయర్ల జాబితాలో శిఖా పాండే కాస్త ఆశ్చర్యకరంగా అనిపించింది. భారత జట్టుకు ఎప్పుడో దూరమైన 36 ఏళ్ల శిఖా అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడి దాదాపు మూడేళ్లవుతోంది. అయితే ప్రస్తుతం కరీబియన్‌ లీగ్‌ సహా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతూ ఫిట్‌గా ఉండటం ఆమె ఎంపికకు ప్రధాన కారణం. ఆర్‌సీబీతో పోటీ పడిన యూపీ చివరకు శిఖాను సొంతం చేసుకుంది.శ్రీచరణి స్థాయి పెరిగింది... వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన నల్లపు రెడ్డి శ్రీచరణి 2025 డబ్ల్యూపీఎల్‌లో రూ.55 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడింది. ఇటీవలి వన్డే వరల్డ్‌ కప్‌ విజయంలో ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ప్రధాన పాత్ర పోషించడంతో సహజంగానే ఆమె స్థాయి పెరిగింది. వేలానికి ముందు ఆమెను విడుదల చేసిన ఢిల్లీ ఇక్కడ మళ్లీ పోటీ పడింది. కనీస విలువ రూ.30 లక్షలతో మొదలై ఢిల్లీ, యూపీ మధ్య పోరు సాగింది. చివరకు రూ.1.30 కోట్ల వద్ద వేలం ముగిసింది.మన అమ్మాయిలకు అవకాశం...డబ్ల్యూపీఎల్‌ వేలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన పలువురు అమ్మాయిలు అవకాశం దక్కించుకున్నారు. ఇటీవల వన్డే వరల్డ్‌ కప్‌ విజయంలో భాగమైన శ్రీచరణి, అరుంధతి రెడ్డి (హైదరాబాద్‌) మరో సందేహం లేకుండా ఎంపికయ్యారు. అరుంధతి రెడ్డిని రూ. 75 లక్షలకు ఆర్‌సీబీ జట్టు ఎంచుకుంది.అండర్‌–19 వరల్డ్‌ కప్‌ విజయంలో భాగమైన హైదరాబాద్‌ అమ్మాయి గొంగడి త్రిషకు తొలిసారి డబ్ల్యూపీఎల్‌లో చాన్స్‌ లభించడం విశేషం. మమత మాదివాల, నల్లా క్రాంతి రెడ్డి కూడా ఎంపికయ్యారు. త్రిషను రూ. 10 లక్షలకు యూపీ వారియర్స్‌... మమతను రూ. 10 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్‌... క్రాంతి రెడ్డిని రూ. 10 లక్షలకు ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకున్నాయి. వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల వివరాలు (విలువ రూ.లలో)ఢిల్లీ క్యాపిటల్స్‌: షినెల్‌ హెన్రీ (1.30 కోట్లు), శ్రీచరణి (1.30 కోట్లు), వోల్‌వార్ట్‌ (1.10 కోట్లు), స్నేహ్‌ రాణా (50 లక్షలు), మిన్ను మణి (40 లక్షలు), లిజెల్‌ లీ (30 లక్షలు), తానియా భాటియా (30 లక్షలు), నందిని శర్మ (20 లక్షలు), దియా యాదవ్‌ (10 లక్షలు), మమత మదివాల (10 లక్షలు), లూసీ హామిల్టన్‌ (10 లక్షలు).గుజరాత్‌ జెయింట్స్‌: సోఫీ డివైన్‌ (2 కోట్లు), జార్జ్‌ వేర్‌హామ్‌ (1 కోటి), భారతి ఫుల్‌మలీ (70 లక్షలు), కాశ్వీ గౌతమ్‌ (65 లక్షలు), రేణుకా సింగ్‌ (60 లక్షలు), కిమ్‌ గార్త్‌ (50 లక్షలు), యస్తిక భాటియా (50 లక్షలు), డానీ వ్యాట్‌ (50 లక్షలు), తనూజ కన్వర్‌ (45 లక్షలు), అనుష్క శర్మ (45 లక్షలు), రాజేశ్వరి గైక్వాడ్‌ (40 లక్షలు), టిటాస్‌ సాధు (30 లక్షలు), కనిక అహుజా (30 లక్షలు), ఆయుషి సోని (30 లక్షలు), హ్యాపీ కుమారి (10 లక్షలు), శివాని సింగ్‌ (10 లక్షలు).ముంబై ఇండియన్స్‌: అమేలియా కెర్‌ (3 కోట్లు), సజీవన్‌ సజన (75 లక్షలు), షబి్నమ్‌ ఇస్మాయిల్‌ (60 లక్షలు), నికోలా క్యారీ (30 లక్షలు), సైకా ఇషాక్‌ (30 లక్షలు), సంస్కృతి గుప్తా (20 లక్షలు), త్రివేణి వశిష్ట (20 లక్షలు), రాహిలా ఫిర్దోస్‌ (10 లక్షలు), పూనమ్‌ ఖెమ్మార్‌ (10 లక్షలు), నల్లా క్రాంతి రెడ్డి (10 లక్షలు), మిలీ ఇలింగ్‌వర్త్‌ (10 లక్షలు).రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: లారెన్‌ బెల్‌ (90 లక్షలు), పూజ వస్త్రకర్‌ (85 లక్షలు), అరుంధతి రెడ్డి (75 లక్షలు), గ్రేస్‌ హారిస్‌ (75 లక్షలు), డిక్లెర్క్‌ (65 లక్షలు), రాధ యాదవ్‌ (65 లక్షలు), జార్జ్‌ వోల్‌ (60 లక్షలు), లిన్సీ స్మిత్‌ (30 లక్షలు), హేమలత దయాళన్‌ (30 లక్షలు), ప్రేమ రావత్‌ (20 లక్షలు), గౌతమ్‌ నాయక్‌ (10 లక్షలు), ప్రత్యూష కుమార్‌ (10 లక్షలు).యూపీ వారియర్స్‌: దీప్తి శర్మ (3.20 కోట్లు), శిఖా పాండే (2.40 కోట్లు), మెగ్‌ లానింగ్‌ (1.90 కోట్లు), ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (1.20 కోట్లు), ఆశా శోభన (1.10 కోట్లు), సోఫీ ఎకెల్‌స్టోన్‌ (85 లక్షలు), డియాండ్రా డాటిన్‌ (80 లక్షలు), కిరణ్‌ నవ్‌గిరే (60 లక్షలు), హర్లీన్‌ డియోల్‌ (50 లక్షలు), క్రాంతి గౌడ్‌ (50 లక్షలు), ప్రతీక రావల్‌ (50 లక్షలు), క్లో ట్రయాన్‌ (30 లక్షలు), శిప్రా గిరి (10 లక్షలు), సిమ్రన్‌ షేక్‌ (10 లక్షలు), తారా నోరిస్‌ (10 లక్షలు), సుమన్‌ మీనా (10 లక్షలు), గొంగడి త్రిష (రూ. 10 లక్షలు). వీరికి నిరాశ అంతర్జాతీయ క్రికెట్‌లో తమదైన గుర్తింపు ఉన్న పలువురు ప్లేయర్లకు ఈసారి డబ్ల్యూపీఎల్‌ వేలంలో నిరాశే మిగిలింది. అలీసా హీలీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా ...విదేశీ ప్లేయర్లలో ఎమీ జోన్స్, హీతర్‌ నైట్, చమరి అటపట్టు, అలానా కింగ్, తజ్‌మీన్‌ బ్రిట్స్, సోఫీయా డంక్లీ, సుజీ బేట్స్‌ తది తరులను ఎవరూ పట్టించుకోలేదు. గతంలో లీగ్‌లో అవకాశం దక్కించుకొని ఈసారి వేలంలో ఎంపిక కాని భారత ప్లేయర్ల జాబితాలో ఉమా ఛెత్రి, సైమా ఠాకూర్‌లతోపాటు సబ్బినేని మేఘన, స్నేహ దీప్తి, అంజలి శర్వాణి (ఆంధ్రప్రదేశ్‌), యషశ్రీ (హైదరాబాద్‌) ఉన్నారు.

PM Modi praises winners of Blind Womens World Cup8
అంధుల మహిళల ప్రపంచకప్‌ విజేతలకు ప్రధాని మోదీ ప్రశంస

న్యూఢిల్లీ: అంధుల టి20 ప్రపంచకప్‌ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఫైనల్‌ గెలిచిన రోజు ‘ఎక్స్‌’ వేదికగా అభినందించిన మోదీ... గురువారం విజేత జట్టు సభ్యుల్ని ఆతీ్మయంగా పలకరించారు. ‘చరిత్ర సృష్టించిన భారత అంధుల జట్టుకు అభినందనలు. ఆరంభ మెగా ఈవెంట్‌లో టోర్నీ మొత్తం అజేయంగా నిలిచారు. మీ కఠోర శ్రమకు, జట్టు సమష్టి కష్టానికి ఈ ట్రోఫీ ఓ నిదర్శనం. ప్రతీ ఒక్కరు అంకితభావంతో ఆడారు. మైదానంలో నిబద్ధతను చూపారు’ అని మోదీ ఈ సందర్భంగా క్రికెటర్ల ప్రతిభను కొనియాడారు. యువతరానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అది్వతీయ విజయాలెన్నో సాధించాలని ఆకాంక్షించారు. ఇటీవల కొలంబో వేదికగా ఆరు జట్లతో జరిగిన ఈ మెగా ఈవెంట్‌ ఫైనల్లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో నేపాల్‌పై గెలిచింది.

WPL 2026 Auction: Check Top 10 most Expensive Signings This Time9
WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)-2026 మెగా వేలంలో భారత క్రికెటర్లు దీప్తి శర్మ, నల్లపురెడ్డి శ్రీచరణి సత్తా చాటారు. వన్డే వరల్డ్‌కప్‌-2025లో వీరిద్దరు అదరగొట్టిన విషయం తెలిసిందే. దీప్తి ఈ మెగా టోర్నీలో 215 పరుగులు సాధించడంతో పాటు.. 22 వికెట్లు కూల్చింది.మరోవైపు.. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ శ్రీచరణి (Shree Charani) పద్నాలుగు వికెట్లతో దుమ్ములేపింది. ఈ క్రమంలో అంచనాలకు అనుగుణంగా దీప్తి శర్మ ఈసారి వేలంపాటలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా నిలవగా.. శ్రీచరణి సైతం జాక్‌పాట్‌ అందుకుంది.మరి డబ్ల్యూపీఎల్‌ 2026 మెగా వేలంలో వీరితో పాటు టాప్‌-10లో ఉన్న ప్లేయర్లు ఎవరో చూసేద్దామా!దీప్తి శర్మ (భారత్‌)👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 3.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌అమెలియా కెర్‌ (న్యూజిలాండ్‌)👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 3 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్‌సోఫీ డివైన్‌ (న్యూజిలాండ్‌)👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 2 కోట్లకు కొనుక్కున్న గుజరాత్‌ జెయింట్స్‌మెగ్‌ లానింగ్‌ (ఆస్ట్రేలియా)👉బ్యాటర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 1.90 కోట్లకు సొంతం చేసుకున్న యూపీ వారియర్స్‌శ్రీచరణి (భారత్‌)👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.3 ​కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌చినెలె హెన్రి (వెస్టిండీస్‌)👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.30 కోట్లకు కొనుక్కున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ఫోబే లిచిఫీల్డ్‌ (ఆస్ట్రేలియా)👉బ్యాటర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌లారా వొల్వర్ట్‌ (సౌతాఫ్రికా)👉బ్యాటర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ఆశా శోభన (భారత్‌)👉బౌలర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న యూపీ వారియర్స్‌లారెన్‌ బెల్‌ (ఇంగ్లండ్‌)👉బౌలర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 90 లక్షలకు కొనుక్కున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.చదవండి: WPL 2026 Auction Updates: ఎవరికి ఎంత ధర?

Virat Kohli U-19 Teammate Saurabh Tiwary Welcomes Him In Ranchi10
కోహ్లితో ఉన్న‌దెవ‌రో క‌నిపెట్టారా?

రాంచీ: ద‌క్షిణాఫ్రికాతో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్ కోసం టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి గురువారం జార్ఖండ్‌లో ల్యాండ్ అయ్యాడు. రాంచీలోని బిర్సా ముండా విమానాశ్ర‌యంలో అత‌డికి స్పెష‌ల్ వెల్‌కం ల‌భించింది. ఒక‌ప్పుడు కోహ్లితో క‌లిసి క్రికెట్ ఆడిన‌ మాజీ క్రికెట‌ర్ సౌర‌భ్ తివారీ అత‌డికి ద‌గ్గ‌రుండి మ‌రీ స్వాగ‌తం ప‌లికాడు. చాలా కాలం త‌ర్వాత కోహ్లితో క‌లిసి సౌర‌భ్ తివారీ కెమెరాకు చిక్క‌డంతో వారిద్ద‌రి జ్ఞాపకాలను క్రికెట్ ల‌వ‌ర్స్ గుర్తు చేసుకుంటున్నారు. తొలి నాళ్ల నాటి అనుభ‌వాల‌ను నెమ‌రువేసుకుంటున్నారు.జూనియ‌ర్ ధోనిగా ముద్ర ప‌డిన 35 ఏళ్ల‌ సౌర‌భ్ తివారీ (Saurabh Tiwary).. చాలా సంవత్సరాలు జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2008లో కోహ్లి నాయ‌క‌త్వంలో అండ‌ర్-19 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన భార‌త జ‌ట్టులోనూ అత‌డు స‌భ్యుడిగా ఉన్నాడు. ఎడమచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అయిన తివారీ జ‌ట్టు విజ‌యంలో త‌న వంతు పాత్ర పోషించాడు. టీమిండియా త‌ర‌పున కేవ‌లం మూడు వ‌న్డేలు మాత్ర‌మే ఆడాడు. 2010, అక్టోబ‌ర్ 20న‌ విశాఖ‌ప‌ట్నంలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌తో వ‌న్డేల్లో అరంగ్రేటం చేశాడు.ఆర్సీబీలోనూ కోహ్లితో క‌లిసి..ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లోనూ నాలుగు జ‌ట్లకు ప్రాతినిథ్యం వ‌హించిన తివారీ 93 మ్యాచ్‌లు ఆడాడు. 2008 నుంచి 2010 ముంబై ఇండియన్స్‌తో ఉన్నాడు. 2011 నుండి 2013 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో జ‌ట్టులో మ‌ళ్లీ విరాట్ కోహ్లితో క‌లిసి ఆడాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా తన శక్తివంతమైన స్ట్రోక్ ఆటతో జూనియ‌ర్‌ ధోనిగా గుర్తింపు పొందాడు.ఆట‌కు వీడ్కోలు ప‌లికిన త‌ర్వాత అడ్మినిస్ట్రేష‌న్‌లోకి ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (JKCA) కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈ హోదాలోనే ఇప్పుడు విరాట్ కోహ్లికి హృదయపూర్వ స్వాగ‌తం ప‌లికాడు. చాలా కాలం త‌ర్వాత వీరిద్ద‌రూ క‌ల‌వ‌డం క్రికెట్ అభిమానుల్లో ఆస‌క్తి రేపింది. మాజీ సహచరులు తిరిగి కలిసిన వీడియో నెట్టింట‌ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి నెటిజ‌నులు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. "నీలం రంగు సూట్‌లో ఉన్న వ్యక్తి కోహ్లి అండ‌ర్‌-19 సహచరుడు అని ఎవరికీ తెలియదు" అని ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించారు. "విమానాశ్రయంలో సౌరభ్ తివారీ!" అని మ‌రొక‌రు పేర్కొన్నారు. "సౌరభ్ తివారీ.. కరణ్ ఔజ్లా లాగా కనిపిస్తున్నాడు!" అంటూ మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశారు.చ‌ద‌వండి: ప‌లాష్ ముచ్చ‌ల్‌ చాట్‌లను బ‌య‌ట‌పెట్టింది నేనే..కాగా, న‌వంబ‌ర్ 30 నుంచి భార‌త్- ద‌క్షిణాఫ్రికా వ‌న్డే సిరీస్ ప్రారంభ‌మ‌వుతుంది. ఇరు జ‌ట్లు మూడు వ‌న్డేలు ఆడ‌నున్నాయి. రెండు టెస్టుల సిరీస్‌ను సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసిన నేప‌థ్యంలో వ‌న్డే సిరీస్ అయినా గెల‌వాల‌ని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. View this post on Instagram A post shared by NDTV (@ndtv)

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement