Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Dinesh Karthik links up with London Spirit as part of support staff1
దినేశ్‌ కార్తీక్‌కు మరో కీలక పదవి

టీమిండియా మాజీ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌కు మరో కీలక పదవి దక్కింది. ద హండ్రెడ్‌ లీగ్‌ 2026 సీజన్‌ కోసం పురుషుల లండన్‌ స్పిరిట్‌ ఫ్రాంచైజీకి బ్యాటింగ్‌ కోచ్‌ మరియు మెంటర్‌గా ఎంపికయ్యాడు. హండ్రెడ్‌ లీగ్‌లో డీకే ఏ ఫ్రాంచైజీతో అయిన పని చేయడం (కోచ్‌గా) ఇదే మొదటిసారి.డీకే 2025 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్‌గా చేరి, ఆ జట్టు మొదటి సారి ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే పోర్ట్‌ఫోలియోతో లండన్‌ స్పిరిట్‌తోనూ జతకట్టాడు.లండన్ స్పిరిట్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ (ఆర్సీబీ డైరెక్టర్ కూడా) డీకేను స్వాగతిస్తూ.. ఈ టీ20 ఫార్మాట్‌ స్పెషలిస్ట్‌ లండన్‌ స్పిరిట్‌లో చేరడం ఆనందకరం. అతని ఆలోచన విధానం ప్రత్యేకం. పొట్టి ఫార్మాట్లో డీకేకు ఉన్న అనుభవం, అతని ఉత్సాహం మా ఆటగాళ్లకు అమూల్యమవుతుందని అన్నారు. లండన్‌ స్పిరిట్‌తో ఒప్పందం అనంతరం డీకే భావోద్వేగానికి లోనయ్యాడు. లార్డ్స్‌లో ఇంగ్లీష్ సమ్మర్ గడపనుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదే గ్రౌండ్‌లో నేను భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాను. చివరి టెస్ట్ కూడా ఇక్కడే ఆడాను. లండన్ స్పిరిట్‌తో కొత్త ప్రయాణం ప్రారంభించడం చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుందని అన్నాడు. 40 ఏళ్ల దినేశ్‌ కార్తీక్‌ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అలాగే ఐపీఎల్‌లో ప్రారంభ సీజన్‌ (2008) నుంచి 2024 ఎడిషన్‌ వరకు ఆడాడు. ఈ మధ్యలో అతను వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 257 మ్యాచ్‌లు ఆడాడు.

20 Stitches Shoulder Fracture: U19 Coach Allegedly Beaten By Players2
సెలక్ట్‌ కాకుండా అడ్డుకుంటావా?.. కోచ్‌పై క్రికెటర్ల పాశవిక దాడి!

భారత క్రికెట్‌లో విస్మయకర ఘటన చోటు చేసుకుంది. తాము జట్టుకు ఎంపిక కాకుండా అడ్డుకున్నాడనే అనుమానంతో యువ క్రికెటర్లు దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కోచ్‌ను చితకబాది.. అతడిని తీవ్రంగా గాయపరిచినట్లు వార్తలు వస్తున్నాయి.ఎన్‌డీటీవీ కథనం ప్రకారం.. పుదుచ్చేరి అండర్‌-19 క్రికెట్‌ కోచ్‌ వెంకటరామన్‌ (Venkataraman)కు తీవ్ర గాయాలయ్యాయి. పుదుచ్చేరి క్రికెట్‌ అసోసియేషన్‌ (CAP) పరిసరాల్లోనే ముగ్గురు స్థానిక క్రికెటర్లు అతడిపై దాడికి పాల్పడ్డారు. దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ (SMAT 2025)కి తమను ఎంపిక చేయకుండా.. సెలక్టర్లను ప్రభావితం చేశాడనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డారు.హత్యాయత్నం కింద నిందితులపై కేసుఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. హత్యాయత్నం కింద నిందితులపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా నెట్స్‌లో ఆటగాళ్లకు సూచనలు ఇస్తున్న వేళ.. అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు అతడిపై దాడికి దిగారు.విరిగిన భుజం, ఇరవై కుట్లుక్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి వెంకటరామన్‌ను గాయపరిచారు. ఈ ఘటనలో అతడి భుజానికి (విరిగినట్లు అనుమానం), పక్కటెముకలకు తీవ్రంగా గాయాలయ్యాయి. తలపై బలంగా కూడా కొట్టడంతో నుదుటిపై దాదాపు 20 కుట్లు పడ్డాయి. ఈ ఘటన గురించి పోలీస్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. నిందితులను కార్తికేయన్‌, అర్వింద్‌రాజ్‌, సంతోష్‌ కుమారన్‌గా గుర్తించినట్లు తెలిపారు.అత్యంత హింసాత్మకంగాప్రస్తుతం అసోసియేషన్‌లోని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని.. అయినప్పటికీ అక్కడ ఉన్నవారి సాయంతో నిందితులను గుర్తించామని తెలిపారు. ఈ ఘటనలో వెంకటరామన్‌ తీవ్రంగా గాయపడ్డారని.. అత్యంత హింసాత్మకంగా అతడిపై దాడి చేశారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని సదరు అధికారి పేర్కొన్నారు. నిందితులు పరారీలో ఉన్నారని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు.కాగా ఈ ఘటనపై క్రికెట్‌ వర్గాల్లో ఆందోళన రేకెత్తింది. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటమే కాకుండా.. కోచ్‌పై దాడి చేయడాన్ని పుదుచ్చేరి అసోసియేషన్‌ అధికారులు ఖండించారు. విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఏదేమైనా ఈ అనూహ్య పరిణామంతో సెలక్షన్‌ కమిటీలో కీలకంగా వ్యవహరించే ‘పెద్దలు’ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాష్ట్రస్థాయి కోచ్‌లకు కూడా సరైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.స్కామ్‌ చేశారా?అయితే, సెలక్షన్‌ విషయంలో పుదుచ్చేరి క్రికెట్‌ అసోసియేషన్‌ అవకతవలకు పాల్పడిందనే ఆరోపణలూ ఉన్నాయి. స్థానిక క్రికెటర్లను కాదని.. బయటి నుంచి వచ్చిన వారికి నకిలీ విద్యా సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డులు జారీ చేయించేసి.. వాటి ద్వారా లోకల్‌ కోటాలో ఇతరులను ఎంపిక చేసినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంది. ఈ కారణంగా రంజీ ట్రోఫీ 2021 సీజన్‌ నుంచి ఐదుగురు అర్హులైన క్రికెటర్లకు అన్యాయం జరిగిందని తన నివేదికలో వెల్లడించింది.చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్‌.. నమ్మశక్యంగా లేదు

MI Emirates dramatically collapse to hand Vipers victory3
ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్‌ ఓటమి

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ 2025 ఎడిషన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌ (MI Emirates) మిశ్రమ ఫలితాలను చవి చూస్తుంది. తొలి మ్యాచ్‌లో గల్ఫ్‌ జెయింట్స్‌పై ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఈ జట్టు.. రెండో మ్యాచ్‌లో షార్జా వారియర్స్‌పై ఘన విజయం సాధించింది. తాజాగా డెసర్ట్‌ వైపర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒత్తిడికిలోనై సీజన్‌లో రెండో ఓటమిని మూటగట్టుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వైపర్స్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. ఛేదనలో ఓ దశలో పటిష్టంగా ఉండిన ఎంఐ లక్ష్యానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. వైపర్స్‌ బౌలర్‌ డేవిడ్‌ పేన్‌ 19వ ఓవర్‌లో ఒక్క పరుగే ఇచ్చి 3 వికెట్లు తీసి ఎంఐని భారీ దెబ్బేశాడు. చివరి ఓవర్‌లో ఎంఐ గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. రషీద్‌ ఖాన్‌ వరుసగా సిక్సర్‌, బౌండరీ కొట్టి లక్ష్యానికి చేరువ చేశాడు. అయితే చివరి బంతికి 2 పరుగులు కావాల్సిన దశలో అర్వింద్‌ అద్భుతమైన త్రోతో ఎంఐ పుట్టి ముంచాడు. తొలి పరుగు పూర్తి చేసే లోపే ఘజన్‌ఫర్‌ను రనౌట్‌ చేశాడు. దీంతో ఎంఐకి ఓటమి తప్పలేదు.19వ ఓవర్‌లో 3 వికెట్లు సహా మ్యాచ్‌ మొత్తంలో 4 వికెట్లు తీసిన డేవిడ్‌ పేన్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. వైపర్స్‌ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌ హోల్డన్‌ (42 రిటైర్డ్‌ ఔట్‌) టాప్‌ స్కోరర్‌ కాగా.. ఫకర్‌ జమాన్‌ (35) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. ఎంఐ బౌలర్లలో ఘజన్‌ఫర్‌ 2, ఫజల్‌ హక్‌ ఫారూఖీ ఓ వికెట్‌ తీశారు.ఎంఐ ఇన్నింగ్స్‌లో టామ్‌ బాంటన్‌ (34) టాప్‌ స్కోరర్‌ కాగా.. పూరన్‌ (31), ముహమ్మద్‌ వసీం (24), పోలార్డ్‌ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వైపర్స్‌ బౌలర్లలో పేన్‌ 4, తన్వీర్‌ 2, ఫెర్గూసన్‌, సామ్‌ కర్రన్‌ తలో వికెట్‌ తీశారు.

Big Blow New Zealand Pacer Suffers Shoulder Injury Taken To Hospital4
న్యూజిలాండ్‌కు భారీ షాక్‌

వెస్టిండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బౌలర్‌ బ్లెయిర్‌ టిక్నర్‌ దారుణంగా గాయపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.కివీస్‌ జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌ (NZ vs WI)తో ఆల్‌ ఫార్మాట్‌ సిరీస్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత ఐదు టీ20ల సిరీస్‌ను 3-1తో గెలిచిన న్యూజిలాండ్‌.. వన్డే సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అనంతరం క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా తొలి టెస్టులో కివీస్‌ విజయం సాధించే దిశగా పయనించగా.. అద్భుత పోరాటంతో విండీస్‌ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.205 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య వెల్లింగ్‌టన్‌ వేదికగా బుధవారం రెండో టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన ఆతిథ్య న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. విండీస్‌ బ్యాటింగ్‌కు దిగింది. కివీస్‌ బౌలర్ల ధాటికి తాళలేక 75 ఓవర్లు ఆడి కేవలం 205 పరుగులకే ఆలౌట్‌ అయింది.నాలుగు వికెట్లతో చెలరేగిన టిక్నర్‌ విండీస్‌ ఓపెనర్లు జాన్‌ కాంప్‌బెల్‌ (44), బ్రాండన్‌ కింగ్‌ (33) ఓ మోస్తరుగా రాణించగా.. షాయీ హోప్‌ (48) కూడా ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ (29) మాత్రమే చెప్పుకోగదగ్గ స్కోరు చేశాడు. ఇక కివీస్‌ బౌలర్లలో పేసర్లు బ్లెయిర్‌ టిక్నర్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మైకేల్‌ రే మూడు వికెట్లు పడగొట్టాడు.మరోవైపు.. జేకబ్‌ డఫీ ఒక వికెట్‌ తీయగా.. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ (Glenn Phillips) సైతం ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. విండీస్‌ టెయిలెండర్‌ ఆండర్సన్‌ ఫిలిప్‌ (5) రనౌట్‌ రూపంలో కివీస్‌కు ఓ వికెట్‌ దక్కింది. ​నొప్పితో విలవిల్లాడుతూఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ 66వ ఓవర్లో మైకేల్‌ రే బంతితో రంగంలోకి దిగగా.. ట్రవిన్‌ ఇమ్లాచ్‌ ఫైన్‌ లెగ్‌ దిశగా బాల్‌ను గాల్లోకి లేపాడు. ఇంతలో ఫీల్డర్‌ టిక్నర్‌ బంతిని ఆపే క్రమంలో పల్టీ కొట్టాడు. ఈ క్రమంలో తన ఎడమ భుజం (Shoulder Injury)పై భారం మొత్తం పడగా.. నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో పడుకుండిపోయాడు.ఏడ్చేసిన బౌలర్‌!దీంతో కివీస్‌ శిబిరంలో ఆందోళన చెలరేగగా.. టిక్నర్‌ పరిస్థితి చూసి బౌలర్‌ మైకేల్‌ దాదాపుగా కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇంతలో ఫిజియో వచ్చి టిక్నర్‌ను మైదానం వెలుపలికి తీసుకువెళ్లగా.. అటు నుంచి అటే ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో టిక్నర్‌ ఎడమ భుజం విరిగినట్లు వార్తలు వస్తున్నాయి.మరోవైపు.. బుధవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి 9 ఓవర్లలో కివీస్‌ 24 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ 7, డెవాన్‌ కాన్వే 16 పరుగులతో క్రీజులో నిలిచారు. విండీస్‌ కంటే కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్‌గా తొలిరోజు ఆతిథ్య న్యూజిలాండ్‌దే పైచేయి కాగా.. టిక్నర్‌ గాయం ఆందోళనకరంగా పరిణమించింది. చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్‌.. నమ్మశక్యంగా లేదు

Australia Announce Squad For 3rd Ashes Test: Cummins Returns Replaces5
Ashes: మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్టుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టును బుధవారం ప్రకటించింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఈ మ్యాచ్‌తో తిరిగి ఆసీస్‌ టీమ్‌తో చేరినట్లు వెల్లడించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఈ ఒక్క మార్పు (కమిన్స్‌ చేరిక) జరిగినట్లు తెలిపింది.2-0తో ఆధిక్యంలో ఆసీస్‌ కాగా సొంతగడ్డపై ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ (The Ashes 2025-26)లో దుమ్ములేపుతోంది. పెర్త్‌ వేదికగా తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన కంగారూలు.. రెండో టెస్టులోనూ విజయం సాధించారు. బ్రిస్బేన్‌ వేదికగా పింక్‌ బాల్‌తో (డే- నైట్‌ మ్యాచ్‌) జరిగిన ఈ మ్యాచ్‌లోనూ ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేశారు.అదరగొట్టారుఇంగ్లండ్‌తో తొలి టెస్టులో మొత్తంగా పది వికెట్లతో సత్తా చాటి మిచెల్‌ స్టార్క్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలవగా.. నాలుగో ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (83 బంతుల్లో 123)తో ఓపెనర్‌గా వచ్చిన ట్రవిస్‌ హెడ్‌ (Travis Head) ఇరగదీశాడు. ఇక రెండో టెస్టులోనూ స్టార్క్‌ మొత్తంగా ఎనిమిది వికెట్లు తీసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.ఆ ఇద్దరూ దూరంఇదిలా ఉంటే.. ఆసీస్‌ పేసర్‌ జోష్‌ హాజల్‌వుడ్‌ (Josh Hazlewood)... ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ ‘యాషెస్‌’ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యారు. కండరాల గాయంతో ఇప్పటికే జరిగిన రెండు టెస్టులకు దూరమైన హాజల్‌వుడ్‌ మిగిలిన మూడు మ్యాచ్‌లకు సైతం అందుబాటులో ఉండబోడని ఆస్ట్రేలియా హెడ్‌ కోచ్‌ మెక్‌డొనాల్డ్‌ మంగళవారం వెల్లడించాడు. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ వరకు అతడు ఫిట్‌నెస్‌ సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. ‘ఈ సిరీస్‌కు హాజల్‌వుడ్‌ దూరమయ్యాడు. ఇక ఇప్పుడు అతడి దృష్టి అంతా టీ20 వరల్డ్‌కప్‌ పైనే’ అని మెక్‌డొనాల్డ్‌ అన్నాడు. డిసెంబరు 17 నుంచి అడిలైడ్‌ వేదికగామరోవైపు.. గాయంతో తొలి రెండు మ్యాచ్‌లూ ఆడని రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌... డిసెంబరు 17 నుంచి అడిలైడ్‌ వేదికగా జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. కమిన్స్‌ గైర్హాజరీలో స్టీవ్‌ స్మిత్‌ రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు సారథిగా వ్యవహరించగా... కమిన్స్‌ రాకతో అతడు కేవలం బ్యాటర్‌గా బరిలోకి దిగనున్నాడు.గత రెండు టెస్టుల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచిన మిచెల్‌ స్టార్క్‌ దెబ్బకు ఇంగ్లండ్‌ బ్యాటర్లు చేతులెత్తేయగా... ఇప్పుడు కమిన్స్‌ రాకతో కంగారూల పేస్‌ బలం మరింత పేరగనుంది. ఇక ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ ఈ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌ అనంతరం గాయంతో జట్టుకు దూరమైన వుడ్‌... మిగిలిన మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటనప్యాట్ కమిన్స్‌ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, జేక్‌ వెదరాల్డ్‌, బ్యూ వెబ్‌స్టర్‌.చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్‌.. నమ్మశక్యంగా లేదు

Bumrah Scripts History Is Third umpire blunder gifts Him 100th T20I wicket6
చరిత్ర సృష్టించిన బుమ్రా.. అంపైర్‌ తప్పు చేశాడా?

టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20 సందర్భంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. తద్వారా భారత్‌ తరఫున మూడు ఫార్మాట్లలోనూ వంద వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్‌గా రికార్డు సాధించాడు.175 పరుగులుకటక్‌ వేదికగా సౌతాఫ్రికా (IND vs SA T20Is)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. టాపార్డర్‌ కుప్పకూలినా హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్‌)కు తోడు తిలక్‌ వర్మ (26), అక్షర్‌ పటేల్‌ (23) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు స్కోరు చేయగలిగింది.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 74 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో టీమిండియా 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. రాణించిన బౌలర్లుభారత బౌలర్లలో పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh), జస్‌ప్రీత్‌ బుమ్రా చెరో రెండు.. పేస్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్యా, శివం దూబే తలా ఒక వికెట్‌ పడగొట్టారు. స్పిన్నర్లలో వరుణ్‌ చక్రవర్తి.. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (Axar Patel) చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ మ్యాచ్‌లో సఫారీ స్టార్‌, టాప్ రన్‌ స్కోరర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ (22)ను అవుట్‌ చేయడం ద్వారా.. బుమ్రా వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. అదే విధంగా.. కేశవ్‌ మహరాజ్‌ (0)ను కూడా పెవిలియన్‌కు పంపాడు.Boom boom, Bumrah! 🤩😎Wicket number 100 in T20Is for #JaspritBumrah! Simply inevitable 👏🇮🇳#INDvSA, 1st T20I, LIVE NOW 👉 https://t.co/tqu4j7Svcm pic.twitter.com/MuSZfrfh3L— Star Sports (@StarSportsIndia) December 9, 2025అంపైర్‌ తప్పు చేశాడా?సఫారీ జట్టు ఇన్నింగ్స్‌లో బుమ్రా పదకొండో ఓవర్‌లో బరిలోకి దిగగా.. రెండో బంతిని బ్రెవిస్‌ ఎదుర్కొన్నాడు. ఫుల్‌ స్వింగ్‌తో బంతిని వేసే క్రమంలో బుమ్రా క్రీజు లైన్‌ దాటేసినట్లుగా కనిపించింది. దీంతో ఫ్రంట్‌-ఫుట్‌ నోబాల్‌ కోసం చెక్‌ చేయగా.. బుమ్రా షూ భాగం క్రీజు లోపలే ఉన్నందున దానిని ఫెయిర్‌ డెలివరీగా ప్రకటించాడు. అయితే, ఈ విషయంలో సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అన్ని కోణాల్లో పరిశీలించకుండానే బ్రెవిస్‌ను థర్డ్‌ అంపైర్‌ పెవిలియన్‌కు పంపి తప్పు చేశాడంటూ సౌతాఫ్రికా జట్టు అభిమానులు నెట్టింట కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే.. బుమ్రా కంటే ముందుగా.. అర్ష్‌దీప్‌ టీమిండియా తరఫున టీ20లలో వంద వికెట్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.టెస్టు, వన్డే, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన బౌలర్లు వీరేలసిత్‌ మలింగ (శ్రీలంక)టిమ్‌ సౌతీ (న్యూజిలాండ్‌)షకీబ్‌ అల్‌ హసన్‌ (బంగ్లాదేశ్‌)షాహిన్‌ ఆఫ్రిది (పాకిస్తాన్‌)జస్‌ప్రీత్‌ బుమ్రా (ఇండియా).చదవండి: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్‌.. నమ్మశక్యంగా లేదు: సూర్యకుమార్‌At least show us another angle pic.twitter.com/NjDZ2lcxQT— Werner (@Werries_) December 9, 2025

Jitesh Sharma Breaks silence on WK Battle with Sanju Samson Ahead T20 WC7
సంజూ శాంసన్‌ పెద్దన్న లాంటోడు.. సై అంటే సై!

సంజూ శాంసన్‌.. భారత క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం ఈ పేరు మీదే చర్చ నడుస్తోంది. టీమిండియా టీ20 ఓపెనర్‌గా శుబ్‌మన్‌ గిల్‌ తిరిగి రావడంతో సంజూ స్థానం గల్లంతైంది. ఒకవేళ తుదిజట్టులో ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు చోటు దక్కినా.. వన్‌డౌన్‌లో... ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపి యాజమాన్యం చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి.ఫలితంగా.. వికెట్‌ కీపర్‌ కోటాలో సంజూ శాంసన్‌ స్థానాన్ని జితేశ్‌ శర్మ(Jitesh Sharma) భర్తీ చేశాడు. లోయర్‌ ఆర్డర్‌లో ఫినిషర్‌గానూ రాణించడం అతడికి అదనపు ప్రయోజనంగా మారింది. కాబట్టే సంజూ కంటే జితేశ్‌ వైపే తాము మొగ్గుచూపుతున్నట్లు టీమిండియా నాయకత్వ బృందం సంకేతాలు ఇచ్చింది కూడా!వికెట్‌ కీపర్‌గా జితేశ్‌కే పెద్ద పీటఇక సౌతాఫ్రికాతో తొలి టీ20లోనూ సంజూ (Sanju Samson)ను కాదని జితేశ్‌ను ఆడించింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియా వికెట్‌ కీపర్‌గా జితేశ్‌కే పెద్ద పీట వేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై జితేశ్‌ శర్మ స్పందించాడు.నాకు పెద్దన్న లాంటివాడు‘‘నిజం చెప్పాలంటే.. సంజూ నాకు పెద్దన్న లాంటివాడు. ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే మనలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుంది. జట్టుకు కూడా అదే మంచిది. భారత్‌లో టాలెంట్‌కు కొదవలేదు. అది అందరికీ తెలిసిన విషయమే.సంజూ భయ్యా గొప్ప ప్లేయర్‌. ఆయనతో నేను పోటీ పడాల్సి ఉంటుంది. అప్పుడే నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలుగుతాను. మేము ఇద్దరం టీమిండియాకు ఆడాలనే కోరుకుంటాం. మేము సోదరుల లాంటి వాళ్లం. మా అనుభవాలను పరస్పరం పంచుకుంటాం.టీమిండియాలో స్థానం కోసం సై అంటే సై!అతడు నాకు చాలా సాయం చేశాడు. సలహాలు ఇస్తాడు. ఒకవేళ అతడితోనే నాకు పోటీ అంటే.. బెస్ట్‌ ఇచ్చి ఢీకొట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను’’ అని 32 ఏళ్ల జితేశ్‌ శర్మ.. 31 ఏళ్ల సంజూ గురించి చెప్పుకొచ్చాడు. 𝙄. 𝘾. 𝙔. 𝙈. 𝙄6⃣, 4⃣, 6⃣Hardik Pandya 🤝 Jitesh Sharma Updates ▶️ https://t.co/tiemfwcNPh#TeamIndia | #INDvSA | @hardikpandya7 | @jiteshsharma_ | @IDFCFIRSTBank pic.twitter.com/806L1KmQac— BCCI (@BCCI) December 9, 2025భారత్‌ ఘన విజయంకాగా కటక్‌ వేదికగా మంగళవారం తొలి టీ20లో టీమిండియా సౌతాఫ్రికాను 101 పరుగులతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో జితేశ్‌ ఎనిమిదో స్థానంలో వచ్చి 5 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతేకాదు నాలుగు డిస్మిసల్స్‌లో భాగమై కీపర్‌గానూ సత్తా చాటాడు.మరోవైపు.. ఓపెనర్‌ గిల్‌ (4) విఫలమయ్యాడు. కాగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మెరుపు హాఫ్‌ సెంచరీ (28 బంతుల్లో 59 నాటౌట్‌)కి తోడు.. బౌలర్లు రాణించడంతో టీమిండియాకు విజయం సాధ్యమైంది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0తో ముందంజ వేసింది. ​చదవండి: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్‌.. నమ్మశక్యంగా లేదు: సూర్యకుమార్‌Total dominance from Team India! 💥🇮🇳#SouthAfrica suffer their lowest T20I score as #India storm to a 101-run win their 3rd highest margin of victory against SA to go 1–0 up in the series! 💪#INDvSA 👉 2nd T20I 👉 11th DEC, 6 PM onwards pic.twitter.com/uwoZvWJa6Y— Star Sports (@StarSportsIndia) December 9, 2025

Never going to be even considered to be dropped: Shaun Pollock on Gill8
‘నిన్ను తప్పిస్తారన్న ఆలోచనే ఉండదు.. కానీ ఇక్కడ అలా కాదు’

టీమిండియా స్టార్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌గా మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20లో అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. సఫారీ పేసర్‌ లుంగి ఎంగిడి బౌలింగ్‌లో మార్కో యాన్సెన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.ఈ నేపథ్యంలో గిల్‌ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20లలో ఓపెనర్‌గా గిల్‌ కంటే మెరుగైన రికార్డు ఉన్నా.. సంజూ శాంసన్‌ (Sanju Samson)ను కావాలనే బలి చేస్తున్నారనే ఆరోపణలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ షాన్‌ పొలాక్‌ గిల్‌ (Shubman Gill)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.నిన్ను తప్పిస్తారన్న ఊహే ఉండదుక్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్‌లో ఇలాంటి వాళ్లు ఎలా ఆడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. నిజానికి అక్కడ.. జట్టులో ప్రధాన ఆటగాడు అతడే. అతడిని జట్టు నుంచి తప్పిస్తారన్న ఊహ కూడా ఉండదు. కాబట్టి ఒత్తిడీ తక్కువే.కానీ ఇక్కడ అలా కాదుకానీ టీమిండియాకు వచ్చే సరికి కథ మారుతుంది. ఇక్కడ జట్టులో స్థానం కోసం పోటీ ఉంటుంది. కాబట్టి బ్యాటర్‌ మైండ్‌సెట్‌ మారిపోతుంది. కాస్త ఒత్తిడి కూడా పెరుగుతుంది. బాగా ఆడకుంటే జట్టులో స్థానం గల్లంతు అవుతుందనే ఆందోళన ఉంటుంది.కనీసం ఒక్క హాఫ్‌ సెంచరీఅయితే, శుబ్‌మన్‌ గిల్‌ విషయం మాత్రం ఇందుకు భిన్నం. అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లలో మెరుగైన స్కోరు సాధించకపోవడం అతడిని నిరాశపరిచి ఉండవచ్చు. ప్రతి మూడు- నాలుగు మ్యాచ్‌లలో అతడు కనీసం ఒక్క హాఫ్‌ సెంచరీ అయినా చేయాలి.లేదంటే విమర్శలు తప్పవు. ఐపీఎల్‌లో మాదిరి ఇక్కడా ఉంటుంది అనుకోవడం పొరపాటు. వరుసగా విఫలమైతే ఇక్కడ మళ్లీ ఆడే అవకాశం రాకపోవచ్చు’’ అని షాన్‌ పొలాక్‌ చెప్పుకొచ్చాడు. వరుస మ్యాచ్‌లలో ఫెయిలైనాకాగా టీమిండియా టెస్టు, వన్డే సారథి అయిన గిల్‌ను.. టీ20లలోనూ కెప్టెన్‌గా చేయాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. అందుకే వరుస మ్యాచ్‌లలో ఫెయిలైనా అవకాశాలు ఇస్తూనే ఉంది. అయితే, ఇందుకోసం సంజూ బలికావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో కటక్‌ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా తొలి టీ20 స్కోర్లు👉వేదిక: బారాబతి స్టేడియం, కటక్‌, ఒడిశా.👉టాస్‌: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్‌👉భారత్‌ స్కోరు: 175/6(20)👉సౌతాఫ్రికా స్కోరు: 74(12.3)👉 ఫలితం: 101 పరుగుల తేడాతో సఫారీ జట్టుపై భారత్‌ గెలుపు👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్‌, ఒక వికెట్‌).చదవండి: విరిగిన చెయ్యితోనే బ్యాటింగ్‌.. అతడి వల్లే టీమిండియా సెలక్ట్‌ అయ్యాను: సచిన్‌

That Was Unbelievable: Suryakumar Yadav Lauds Hardik Pandya9
అతడొక అద్భుతం.. నమ్మబుద్ధికాలేదు: సూర్యకుమార్‌

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో టీమిండియాకు శుభారంభం లభించింది. కటక్‌ వేదికగా మంగళవారం నాటి తొలి మ్యాచ్‌లో భారత జట్టు సఫారీలను ఏకంగా 101 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆరంభంలో తడబడినా.. హార్దిక్‌ పాండ్యా అద్భుత ప్రదర్శన కనబరచడంతో మెరుగైన స్కోరు సాధించింది.50- 50 అనుకున్నాంఅనంతరం బౌలర్ల విజృంభణ కారణంగా లక్ష్యాన్ని కాపాడుకుని సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో విజయంపై టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) స్పందించాడు. ‘‘టాస్‌ సమయంలో గెలుపు అవకాశాలు 50- 50 అనుకున్నాం. ఏదేమైనా తొలుత బ్యాటింగ్‌ చేయడం సంతోషంగా అనిపించింది.48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా.. ఆ తర్వాత తేరుకుని 175 పరుగులు చేయగలిగాము. హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya), అక్షర్‌ పటేల్‌, తిలక్‌ వర్మ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. చివర్లో జితేశ్‌ శర్మ (Jitesh Sharma)కూడా తన వంతు పాత్ర పోషించాడు.నమ్మశక్యం కాని విషయంతొలుత మేము 160 పరుగుల వరకు చేయగలుగుతామని అనుకున్నాం. అయితే, 175 పరుగులు సాధించడం అన్నది నమ్మశక్యం కాని విషయం. 7-8 మంది బ్యాటర్లలో ఇద్దరు- ముగ్గురు పూర్తిగా విఫలమైనా.. మిగిలిన నలుగురు రాణించి దీనిని సుసాధ్యం చేశారు.టీ20 క్రికెట్‌లోని మజానే ఇది. తదుపరి మ్యాచ్‌లో మా బ్యాటర్లంతా మెరుగ్గా ఆడతారని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరు ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడాలని కోరుకుంటున్నాము. టీమిండియా టీ20 ప్రయాణం గొప్పగా సాగుతోంది.అర్ష్‌దీప్‌, బుమ్రా పరిపూర్ణమైన బౌలర్లు. మేము టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంటే వాళ్లిద్దరే బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించేవారు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత హార్దిక్‌ పాండ్యా తన స్థాయి ఏమిటో మరోసారి చూపించాడు. Hard-hit Pandya is back in business! 🙌💪Two mammoth maximums in the same over and the crowd in Cuttack begins to chant his name. 🤩#INDvSA, 1st T20I, LIVE NOW 👉 https://t.co/tqu4j7Svcm pic.twitter.com/VYKUx3OhVT— Star Sports (@StarSportsIndia) December 9, 2025అతడొక అద్భుతం.. నిజంగా అద్భుతం చేశాడు. ఏదేమైనా అతడిని జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. అతడి బౌలింగ్‌ పట్ల కూడా నేను సంతోషంగా ఉన్నాను’’ అంటూ సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.టాపార్డర్‌ విఫలంకాగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో టాస్‌ ఓడిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (17), శుబ్‌మన్‌ గిల్‌ (4) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (12) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.ఆదుకున్న హార్దిక్‌ఇలాంటి దశలో తిలక్‌ వర్మ (32 బంతుల్లో 26), అక్షర్‌ పటేల్‌ (21 బంతుల్లో 23) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. హార్దిక్‌ పాండ్యా మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59)తో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో శివం దూబే (9 బంతుల్లో 11), జితేశ్‌ శర్మ (5 బంతుల్లో 10 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు.అనంతరం లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 12.3 ఓవర్లలో కేవలం 74 పరుగులు చేసి కుప్పకూలింది. భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్‌ పాండ్యా, శివం దూబే చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ప్రొటిస్‌ జట్టు బ్యాటర్లలో డెవాల్డ్‌ బ్రెవిస్‌ (14 బంతుల్లో 22) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.చదవండి: విరిగిన చెయ్యితోనే బ్యాటింగ్‌.. అతడి వల్లే టీమిండియా సెలక్ట్‌ అయ్యాను: సచిన్‌

Keystone and St Francis crowned basketball champions in Secunderabad10
చాంప్స్‌ కీ స్టోన్, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జట్లు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా వార్షిక లీగ్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల విభాగంలో కీ స్టోన్‌ బాస్కెట్‌బాల్‌ అకాడమీ... మహిళల విభాగంలో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజీ జట్టు విజేతలుగా నిలిచాయి. ఫైనల్స్‌లో కీ స్టోన్‌ జట్టు 75–66తో టైటాన్స్‌పై గెలుపొందింది. మ్యాచ్‌ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనే వరకు ఇరు జట్లు హోరాహోరీగా పోరాడగా... ఆఖర్లో జోరు పెంచిన కీ స్టోన్‌ జట్టు... కీలక పాయింట్లు ఖాతాలో వేసుకొని విజేతగా అవతరించింది. మ్యాచ్‌ ఆరంభంలో టైటాన్స్‌ చక్కటి ప్రదర్శన కనబర్చింది. ఒకదశలో 12–3తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత తేరుకున్న కీ స్టోన్‌ ప్లేయర్లు సత్తాచాటి జట్టును పోటీలోకి తెచ్చారు. కీ స్టోన్‌ అకాడమీ తరఫున సహర్ష్‌ 21 పాయింట్లతో విజృంభించగా... సుభాశ్‌ 17, ప్రీతమ్‌ 10 పాయింట్లు సాధించారు. క్రిష్య, ఆర్యన్‌ చెరో 8 పాయింట్లు సాధించగా... ప్రతీక్‌ 5, కార్తీక్‌ 4 పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. టైటాన్స్‌ తరఫున సల్మాన్‌ 16 పాయింట్లతో టాప్‌లో నిలవగా... నందిత్‌ 12, సూర్య 111, క్రిస్‌ 11, విక్కీ 10 పాయింట్లు సాధించారు. మహిళల విభాగంలో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జట్టు 57–55 పాయింట్లతో నిజాం బాస్కెట్‌బాల్‌ జట్టుపై గెలిచింది. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ తరఫున పరీ 17 పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించింది. సంహిత 14, సానియా 11, హిబా 6, రేఖ 5 పాయింట్లు సాధించారు. నిజాంబాస్కెట్‌బాల్‌ జట్టు తరఫున అమిత 16, జాహ్నవి 14, శ్రుతి 10, లాస్య 9, ఖుష్బూ 6 పాయింట్లు సాధించారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement