ప్రధాన వార్తలు
సూర్యవంశీ మరోసారి విఫలం.. మాత్రే వరుస సెంచరీలు
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో నిన్న (నవంబర్ 30) పలు అద్బుత ప్రదర్శనలు నమోదయ్యాయి. యువ ఆటగాళ్లలో ఆయుశ్ మాత్రే వరుసగా సెంచరీతో విజృంభించగా.. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి వారు మెరుపు సెంచరీలతో విరుచుకుపడ్డారు. యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మాత్రం ఈ టోర్నీలో వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.అభి'షేక్' సెంచరీబెంగాల్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఓవరాల్గా 52 బంతుల్లో 148 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ ధాటికి పంజాబ్ రికార్డు స్థాయిలో 310 పరుగులు చేయగా.. బెంగాల్ కనీస పోరాటం కూడా చేయలేకపోయింది.విస్ఫోటనం సృష్టించిన పాకెట్ డైనమైట్త్రిపురతో జరిగిన మ్యాచ్లో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (జార్ఖండ్) విస్ఫోటనం సృష్టించాడు. కేవలం 50 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన 113 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో జార్ఖండ్ త్రిపురపై ఘన విజయం సాధించింది.మాత్రే వరుస సెంచరీలుముంబై ఆటగాడు ఆయుశ్ మాత్రే మూడు రోజుల వ్యవధిలో రెండో సెంచరీ చేశాడు. ఆంధ్రతో నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రే 59 బంతుల్లో అజేయమైన 104 పరుగులు చేసి తన జట్టుకు సునాయాస విజయాన్నందించాడు.వైభవ్ వరుస వైఫల్యాలుఈ టోర్నీలో యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ పరంపర కొనసాగుతుంది. జమ్మూ అండ్ కశ్మీర్తో నిన్న జరిగిన మ్యాచ్లో కేవలం 7 పరుగులకే ఔటయ్యాడు. సంచలన పేసర్, జమ్మూ అండ్ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీ వైభవ్ను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్లో బిహార్పై జమ్మూ అండ్ కశ్మీర్ ఘన విజయం సాధించింది.ఇవే కాక నిన్న మరిన్ని చెప్పుకోదగ్గ ప్రదర్శనలు నమోదయ్యాయి. సంజూ శాంసన్, రజత్ పాటిదార్, రింకూ సింగ్, కరుణ్ నాయర్, సూర్యకుమార్ యాదవ్ లాంటి నోటెడ్ స్టార్లు మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు.
భారత్తో తొలి వన్డే.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా
ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి (0-2తో క్లీన్ స్వీప్) టీమిండియా గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన తొలి వన్డేలో (India vs South Africa) ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్లో భారత జట్టు సఫారీలకు చుక్కలు చూపించింది.విరాట్ కోహ్లి (Virat Kohli) 52వ వన్డే శతకంతో చెలరేగిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (57), కేఎల్ రాహుల్ (60) కూడా అర్ద సెంచరీలతో సత్తా చాటారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆదిలో తబడిన సౌతాఫ్రికా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని కాసేపు టీమిండియాను భయపెట్టింది. మిడిలార్డర్ బ్యాటర్లు మాథ్యూ బ్రీట్జ్కే (72), జన్సెన్ (70), కార్బిన్ బాష్ (67) ఊహించని రీతిలో ప్రతిఘటించి టీమిండియా శిబిరంలో గుబులు పుట్టించారు. అంతింగా భారత్దే పైచేయి అయినప్పటికీ సఫారీల పోరాటం అందరినీ ఆకట్టుకుంది. 49.2 ఓవర్లలో ఆ జట్టు 332 పరుగులు చేసి లక్ష్యానికి 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది.ఈ మ్యాచ్లో ఓడినా సౌతాఫ్రికా (South Africa) ఓ విషయంలో చరిత్ర సృష్టించింది. వన్డే లక్ష్య ఛేదనల్లో 15 పరుగులలోపే 3 వికెట్లు కోల్పోయి అంతిమంగా 300 పరుగులు చేసిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. దీనికి ముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. 2019లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో పాక్ లక్ష్య ఛేదనలో 6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి, అంతిమంగా 297 పరుగులు చేసింది.
టిమ్ డేవిడ్ విలయతాండవం
అబుదాబీ టీ10 లీగ్ (Abu Dhabi T10 League) 2025 ఎడిషన్లో యూఏఈ బుల్స్ (UAE Bulls) విజేతగా ఆవిర్భవించింది. నిన్న (నవంబర్ 30) జరిగిన ఫైనల్లో ఆస్పిన్ స్టాల్లియన్స్పై 80 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 150 పరుగుల ఊహకందని స్కోర్ చేసింది.బుల్స్కు ఆడుతున్న ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు టిమ్ డేవిడ్ (Tim David) కేవలం 30 బంతుల్లో 12 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో అజేయమైన 98 పరుగులు చేసి విశ్వరూపం ప్రదర్శించాడు. మిగతా ఆటగాళ్లలో రోవ్మన్ పావెల్ 20 బంతుల్లో 24 (నాటౌట్), ఫిల్ సాల్ట్ 8 బంతుల్లో 18 పరుగులు చేశారు. జేమ్స్ విన్స్ డకౌటయ్యాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన స్టాల్లియన్స్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఓపెనర్ కమ్ కెప్టెన్ రహ్మానుల్లా గుర్బాజ్ (15 బంతుల్లో 18) సహా అంతా నిదానంగా ఆడారు. ఆండీ ఫ్లెచర్ 2 (రిటైర్డ్ హర్ట్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ డకౌట్, డు ప్లూయ్ 16, కట్టింగ్ 11, కరీమ్ జనత్ 15, సామ్ బిల్లింగ్స్ 3 పరుగులు మాత్రమే చేశారు. సిక్సర్ల సునామీ సృష్టించి యూఏఈని ఒంటిచేత్తో గెలిపించిన టిమ్ డేవిడ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 9 సీజన్ల లీగ్ చరిత్రలో యూఏఈ బుల్స్కు ఇదే మొదటి టైటిల్.
గాయత్రి–ట్రెసా జాలీ జోడీదే డబుల్స్ టైటిల్
లక్నో: సొంతగడ్డపై సత్తా చాటుకున్న పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ఈ ఏడాది తమ ఖాతాలో తొలి టైటిల్ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన సయ్యద్ మోడీ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోరీ్నలో టాప్ సీడ్ గాయత్రి–ట్రెసా జాలీ జంట తమ టైటిల్ను నిలబెట్టుకుంది. 76 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 17–21, 21–13, 21–15తో కహో ఒసావా–మాయ్ తనాబె (జపాన్) ద్వయంపై విజయం సాధించింది. భుజం గాయం కారణంగా ఐదు నెలలు ఆటకు దూరంగా ఉన్న గాయత్రి గత వారం ఆ్రస్టేలియన్ ఓపెన్ టోరీ్నతో పునరాగమనం చేసింది. విజేతగా నిలిచిన గాయత్రి–ట్రెసా జోడీకి 18,960 డాలర్ల (రూ. 16 లక్షల 94 వేలు) ప్రైజ్ మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఎనిమిదేళ్లుగా అంతర్జాతీయ టైటిల్ నెగ్గలేకపోయిన ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్కు మరోసారి నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీకాంత్ రన్నరప్గా నిలిచాడు. ప్రపంచ 59వ ర్యాంకర్ జేసన్ గుణవాన్ (హాంకాంగ్)తో జరిగిన ఫైనల్లో ప్రపంచ 38వ ర్యాంకర్ శ్రీకాంత్ 16–21, 21–8, 20–22తో పోరాడి ఓడిపోయాడు. ఈ సీజన్లో మలేసియా ఓపెన్ సూపర్–500 టోర్నీ ఫైనల్లోనూ శ్రీకాంత్ ఓడిపోయాడు. రన్నరప్ శ్రీకాంత్కు 9,120 డాలర్ల (రూ. 8 లక్షల 15 వేలు) ప్రైజ్మనీతోపాటు 5950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
కోహ్లి దూకుడు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
టెస్టు సిరీస్ పరాభవం నుంచి కోలుకున్న టీమిండియా... వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. ‘స్టార్స్’ రోహిత్ శర్మ తనలో చేవ తగ్గలేదని నిరూపించగా... కోహ్లి వీరోచిత సెంచరీతో సత్తా చాటాడు. సింగిల్స్, డబుల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా భారీ సిక్స్లతో అచ్చమైన వన్డే ఇన్నింగ్స్తో కట్టిపడేశాడు. బంతితో కుల్దీప్, హర్షిత్ రాణించారు. సుదీర్ఘ ఫార్మాట్ గెలుపు ఇచి్చన స్ఫూర్తితో వన్డే సిరీస్లో బరిలోకి దిగిన సఫారీ జట్టు కడదాకా పోరాడినా పరాజయం తప్పలేదు. రాంచీ: సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన భారత జట్టు... వన్డే సిరీస్లో బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి పోరులో టీమిండియా 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (120 బంతుల్లో 135; 11 ఫోర్లు, 7 సిక్స్లు) వన్డే కెరీర్లో 52వ సెంచరీతో కదంతొక్కగా... కెప్టెన్ కేఎల్ రాహుల్ (60; 2 ఫోర్లు, 3 సిక్స్లు), రోహిత్ శర్మ (51 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైంది. బ్రాట్కీ (80 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్), యాన్సెన్ (39 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్స్లు), కార్బిన్ బాష్ (51 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టారు. కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం రాయ్పూర్లో రెండో వన్డే జరగనుంది. సెంచరీ భాగస్వామ్యం...ఇప్పటికే టెస్టు, టి20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ... ఆడుతున్న ఒక్క ఫార్మాట్లోనే అదరగొడుతున్నారు. చివరగా ఆ్రస్టేలియాతో ఆడిన వన్డేలో దంచికొట్టిన ఈ జంట ... సిడ్నీలో ఎక్కడ ఆపిందో రాంచీలో అక్కడి నుంచే మోత మోగించింది. ఫామ్, ఫిట్నెస్లో యువ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోమని మరోసారి చాటింది. నాలుగో ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (18; 2 ఫోర్లు, 1 సిక్స్) అవుట్ కాగా.. ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాది విరాట్ తన ఉద్దేశాన్ని చాటాడు. సాధారణంగా నెమ్మదిగా ఇన్నింగ్స్ను ఆరంభించే కోహ్లి చూడచక్కటి షాట్లతో కట్టిపడేయగా... రోహిత్ కూడా లయ అందుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో భారత జట్టు 80/1తో నిలిచింది. సుబ్రాయెన్ బౌలింగ్లో రోహిత్ రెండు వరుస సిక్స్లు బాదితే... కార్బిన్ బాష్ బౌలింగ్లో కోహ్లి చెలరేగిపోయాడు. రోహిత్ తనదైన పుల్ షాట్లతో రెచ్చిపోగా... విరాట్ వన్డేల్లో తన రెండో అత్యధిక సిక్స్ (7)లు ఈ మ్యాచ్లో నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లి 48, రోహిత్ 43 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్కు 136 పరుగులు జోడించిన అనంతరం రోహిత్ అవుట్ కాగా... రుతురాజ్ (8), సుందర్ (13) విఫలమయ్యారు. 102 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాక జూలు విదిలి్చన విరాట్... సుబ్రాయెన్ వేసిన 39వ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 బాదాడు. మరో భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో కోహ్లి అవుటయ్యాడు. ఆఖర్లో జడేజా (20 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో... రాహుల్ కీలక పరుగులు జోడించాడు. యాన్సెన్ దూకుడు... భారీ లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా జట్టుకు శుభారంభం దక్కలేదు. రికెల్టన్ (0), డికాక్ (0), మార్క్రమ్ (7) పెవిలియన్కు చేరడంతో ఆ జట్టు 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో టోనీ జార్జి (39; 7 ఫోర్లు), బ్రెవిస్ (37; 2 ఫోర్లు, 3 సిక్స్లు)తో కలిసి బ్రిట్కీ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ ఇద్దరు ఎక్కువసేపు నిలవలేకపోయినా... యాన్సెన్ రాకతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. టెస్టు సిరీస్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యాన్సెన్... భారీ షాట్లతో టీమిండియాను భయపెట్టాడు. దీంతో సఫారీ జట్టు పోటీలోకి రాగా... కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో ఈ ఇద్దరినీ అవుట్ చేసి జట్టులో ఆనందం నింపాడు. చివరి వరుస బ్యాటర్లతో కలిసి బాష్ ఆఖర్లో పోరాడినా... జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.వన్డే ‘సిక్స్’లలో రోహిత్ రికార్డుఈ మ్యాచ్లో మూడు సిక్స్లు బాదిన ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ... వన్డే క్రికెట్లో అత్యధిక (352) సిక్స్లు కొట్టిన ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెపె్టన్ షాహిద్ అఫ్రిది (351) పేరిట 15 ఏళ్లుగా ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. అఫ్రిది 398 మ్యాచ్ల్లో 351 సిక్స్లు బాదగా... రోహిత్ 278 మ్యాచ్ల్లోనే అతడిని అధిగమించాడు. గేల్ (301 మ్యాచ్ల్లో 331 సిక్స్లు) మూడో స్థానంలో ఉన్నాడు.కోహ్లి కాళ్లు తాకాలని... ఈ మ్యాచ్లో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి విరాట్ వరకు చేరుకున్న అభిమాని... కోహ్లికి పాదాభివందనం చేశాడు. అంతలో అప్రమత్తమైన సిబ్బంది అతడిని బయటకు తీసుకెళ్లారు.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) డికాక్ (బి) బర్గర్ 18; రోహిత్ (ఎల్బీ) (బి) యాన్సెన్ 57; కోహ్లి (సి) రికెల్టన్ (బి) బర్గర్ 135; రుతురాజ్ (సి) బ్రెవిస్ (బి) బార్ట్మన్ 8;సుందర్ (సి) బాష్ (బి) బార్ట్మన్ 13; రాహుల్ (సి) డికాక్ (బి) యాన్సెన్ 60; జడేజా (సి) మార్క్రమ్ (బి) బాష్ 32; హర్షిత్ (నాటౌట్) 3; అర్షదీప్ (బి) బాష్ 0; కుల్దీప్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 23; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు)349. వికెట్ల పతనం: 1–25, 2–161, 3–183, 4–200, 5–276, 6–341, 7–347, 8–347. బౌలింగ్: యాన్సెన్ 10–0–76–2; బర్గర్ 10–0–65–2; బాష్ 10–0–66–2; బార్ట్మన్ 10–0–60–2; సుబ్రాయెన్ 10–0–73–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రాహుల్ (బి) అర్షదీప్ 7; రికెల్టన్ (బి) హర్షిత్ 0; డికాక్ (సి) రాహుల్ (బి) హర్షిత్ 0; బ్రీట్కీ (సి) కోహ్లి (బి) కుల్దీప్ 72; జోర్జి (ఎల్బీ) (బి) కుల్దీప్ 39; బ్రెవిస్ (సి) రుతురాజ్ (బి) హర్షిత్ 37; యాన్సెన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 70; బాష్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 67; సుబ్రాయెన్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 17; బర్గర్ (సి) రాహుల్ (బి) అర్‡్షదీప్ 17; బార్ట్మన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు: 6; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 332. వికెట్ల పతనం: 1–7, 2–7, 3–11, 4–77, 5–130, 6–227, 7–228, 8–270, 9–312, 10–332. బౌలింగ్: అర్షదీప్ 10–1–64–2; హర్షిత్ రాణా 10–0–65–3; సుందర్ 3–0–18–0; ప్రసిధ్ 7.2–1–48–1; కుల్దీప్ 10–0–68–4; జడేజా 9–0–66–0.
నరాలు తెగే ఉత్కంఠ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. రాంచిలో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో 17 పరుగుల తేడాతో సఫారీ జట్టును ఓడించింది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారత్కు ఈ గెలుపు సాధ్యమైంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో 1-0తో టీమిండియా ముందంజ వేసింది. రాంచిలోని జేఎస్సీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కాంప్లెక్స్లో టాస్ వేదికగా తొలి వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా (IND vs SA) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 349 పరుగులు సాధించింది. రోహిత్, కోహ్లి, రాహుల్ ధనాధన్ఓపెనర్లలో రీఎంట్రీ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (18) విఫలం కాగా.. దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) మెరుపు హాఫ్ సెంచరీ (51 బంతుల్లో 57)తో సత్తా చాటాడు. ఇక మరో లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat kohli) భారీ శతకం (120 బంతుల్లో 135)తో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (60) అర్ధ శతకంతో అలరించాడు. మిగిలిన వారిలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 20 బంతుల్లో 32 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆదిలోనే షాకులుసౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్, నండ్రీ బర్గర్, కార్బిన్ బాష్, ఒట్నీల్ బార్ట్మన్ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు భారత యువ పేసర్ హర్షిత్ రాణా ఆదిలోనే షాకులు ఇచ్చాడు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ను డకౌట్ చేసిన రాణా.. అతడి స్థానంలో వన్డౌన్లో వచ్చిన క్వింటన్ డికాక్ను కూడా డకౌట్గా వెనక్కి పంపాడు. అదరగొట్టిన మాథ్యూ, యాన్సెన్మరో ఓపెనర్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (7)ను అర్ష్దీప్ సింగ్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో కష్టాల్లో కూరుకుపోయిన ప్రొటిస్ జట్టును మాథ్యూ బ్రీట్జ్కే (72) ఆదుకున్నాడు. అతడికి తోడుగా ఆల్రౌండర్ యాన్సెన్ దంచికొట్టాడు. కేవలం 39 బంతుల్లోనే యాన్సెన్ 70 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో టోనీ డి జోర్జి (39), డెవాల్డ్ బ్రెవిస్ (37) ఫర్వాలేదనిపించారు. భయపెట్టిన బాష్అయితే, సగం ఇన్నింగ్స్లో (25) ఓవర్లలో 162 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా సులువుగానే తలవంచుతుందనిపించగా.. టెయిలెండర్లు ప్రెనెలర్ సుబ్రేయన్ (17), నండ్రీ బర్గర్ (17) ఆల్రౌండర్ కార్బిన్ బాష్తో కలిసి మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. మరోవైపు.. బాష్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి.. 40 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని మ్యాచ్ను ఎగురవేసుకుపోయే ప్రయత్నం చేశాడు. తొమ్మిది వికెట్లు పడినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ.. నరాలు తెగే ఉత్కంఠ రేపాడు. హాఫ్ సెంచరీ తర్వాత రెండు సిక్సర్లు బాది టీమిండియా శిబిరంలో ఆందోళన కలిగించాడు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో సౌతాఫ్రికా విజయ సమీకరణం ఆరు బంతుల్లో 18 పరుగులుగా మారింది. ఈసారి బంతి ప్రసిద్ కృష్ణ చేతికి ఇవ్వగా అతడు అద్భుతం చేశాడు. ప్రసిద్ కృష్ణ, రోహిత్ అద్భుతంఆఖరి ఓవర్లో రెండో బంతిని బాష్ గాల్లోకి లేపగా ఎక్స్ట్రా కవర్లో ఉన్న రోహిత్ శర్మ క్యాచ్ అందుకున్నాడు. దీంతో టీమిండియా విజయం ఖరారైంది. 17 పరుగుల తేడాతో భారత్ జయకేతనం ఎగురవేసింది.భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. పేసర్లలో హర్షిత్ రాణా మూడు, అర్ష్దీప్ రెండు, ప్రసిద్ కృష్ణ ఒక కీలక వికెట్ కూల్చి జట్టును విజయతీరాలకు చేర్చారు.చదవండి: కోహ్లి ప్రపంచ రికార్డులు.. 7000వ సెంచరీ
పొడిచేశావ్ కట్టప్పా!.. ఎందుకిలా చేశావు!.. పాపం మన కెప్టెన్!
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేశాడు రుతురాజ్ గైక్వాడ్. సౌతాఫ్రికాతో వన్డేలకు ఈ మహారాష్ట్ర ఆటగాడిని ఎంపిక చేసిన భారత జట్టు యాజమాన్యం.. రాంచిలో తుదిజట్టులోనూ ఆడే అవకాశం ఇచ్చింది.ఎట్టకేలకు ఓ అవకాశంఇటీవల సౌతాఫ్రికా-‘ఎ’ జట్టుతో అనధికారిక వన్డే సిరీస్లో రుతు (Ruturaj Gaikwad) సత్తా చాటిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో 129 బంతుల్లో 117 పరుగులు సాధించిన రుతురాజ్.. రెండో మ్యాచ్లో అజేయ అర్ధ శతకం (68)తో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే జాతీయ జట్టు నుంచి అతడికి పిలుపు వచ్చింది. కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ శుబ్మన్ గిల్ (Shubman Gill) గాయం వల్ల దూరం కావడం వల్ల రుతుకు సెలక్టర్లు మరో అవకాశం ఇచ్చారు.అయితే, ప్రస్తుత భారత వన్డే జట్టు కూర్పు దృష్ట్యా తుదిజట్టులో రుతురాజ్కు చోటు దక్కుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అనూహ్యంగా రిషభ్ పంత్కు మొండిచేయి చూపిన నాయకత్వ బృందం రుతుకు ప్లేయింగ్ ఎలెవన్లో స్థానం కల్పించింది. ఈ క్రమంలో మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఈ కుడిచేతి వాటం ఆటగాడు బ్యాటింగ్కు వచ్చాడు.ఊహించని రీతిలో షాక్నెమ్మదిగానే తన ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రుతురాజ్కు ఊహించని రీతిలో షాక్ తగిలింది. భారత ఇన్నింగ్స్లో 27వ ఓవర్ను సఫారీ పేసర్ ఒట్నీల్ బార్ట్మన్ వేశాడు. అతడి బౌలింగ్లో మూడో బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో రుతు గాల్లోకి లేపాడు. అంతే.. ఇన్సైడ్ సర్కిల్ లోపల ఇంతలో బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి పాదరసంలా దూసుకవచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ నమ్మశక్యం కాని రీతిలో... ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు.కోహ్లి సైతం.. నోరెళ్లబెట్టాడుబ్రెవిస్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకోవడంతో రుతు కథ ముగిసిపోయింది. మొత్తంగా 14 బంతుల్లో కేవలం 8 పరుగులే చేసి అతడు నిష్క్రమించాడు. నిజానికి బ్రెవిస్ ఆ క్యాచ్ అలా పడతాడని ఎవరూ ఊహించలేదు. అంతెందుకు రుతుకు తోడుగా మరో ఎండ్లో ఉన్న దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం.. ఆ క్యాచ్ చూసి నోరెళ్లబెట్టాడు.అలా బ్రెవిస్ అద్భుత ఫీల్డింగ్ కారణంగా రుతు రీఎంట్రీలో దురదృష్టవశాత్తూ పెద్దగా స్కోరు చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో బ్రెవిస్ సింగిల్ హ్యాండ్ క్యాచ్ హైలైట్ కాగా.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేసిన పోస్టు వైరల్గా మారింది. హృదయం ముక్కలైన ఎమోజీని షేర్ చేసిన సీఎస్కే.. ‘‘ఎందుకిలా చేశావు డీబీ? ఎందుకు?’’ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.Why, Brevis… why?Ruturaj was settling in so beautifully, playing with such calm and class —and then you flew in the air and snatched that catch out of nowhere.Brevis, you just broke the hearts of countless Rutu fans today. 💔pic.twitter.com/qEfyTuhfHC— Mahi Patel (@Mahi_Patel_07) November 30, 2025 పొడిచేశావు కదా కట్టప్పాతమ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో తమకూ బాధ మిగిల్చాడనే ఉద్దేశంతో సీఎస్కే ఈ మేరకు చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఇందుకు బదులుగా.. ‘‘పాపం.. రుతును పొడిచేశావు కదా కట్టప్పా’’ అంటూ నెటిజన్లు బాహుబలి స్టైల్ మీమ్స్తో ఇద్దరినీ ట్రోల్ చేస్తున్నారు. కాగా బేబీ ఏబీడీగా పేరొందిన బ్రెవిస్.. ఐపీఎల్లో రుతు కెప్టెన్సీలో సీఎస్కేకు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈసారి 2026 వేలానికి ముందు బ్రెవిస్ను సీఎస్కే అట్టిపెట్టుకుంది కూడా!భారత్ భారీ స్కోరుఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. రోహిత్ శర్మ (57), కెప్టెన్ కేఎల్ రాహుల్ (60), రవీంద్ర జడేజా (32) రాణించగా.. కోహ్లి (120 బంతుల్లో 135) శతక్కొట్టాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది.కష్టాల్లో సౌతాఫ్రికాలక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 134 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (7), ర్యాన్ రికెల్టన్ (0), క్వింటన్ డికాక్ (0) దారుణంగా విఫలమయ్యారు. టోనీ డి జోర్జి (39), డెవాల్డ్ బ్రెవిస్ (37) ఓ మోస్తరుగా రాణించారు. ఇలాంటి దశలో నాలుగో నంబర్ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే అర్ద శతకం పూర్తి చేసుకుని సఫారీల ఆశాకిరణంగా నిలిచాడు.అన్నట్లు హర్షిత్ రాణా బౌలింగ్లో బ్రెవిస్ ఇచ్చిన క్యాచ్ను రుతురాజ్ పట్టడం విశేషం. కాగా భారత పేసర్లు హర్షిత్ రాణా మూడు, అర్ష్దీప్ సింగ్ ఒక వికెట్ తీయగా.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో 25 ఓవర్ల ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. విజయానికి 188 పరుగుల దూరంలో నిలిచింది. మరోవైపు.. భారత్ గెలుపునకు ఐదు వికెట్లు కావాలి!!చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్ను దాటేసి తొలి ప్లేయర్గా.. 7000వ సెంచరీఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్ రియాక్షన్ వైరల్!Need a breakthrough? Call Harshit Rana! 📞A fine catch by Ruturaj as the dangerman Dewald Brevis departs 👏#INDvSA 1st ODI, LIVE NOW 👉 https://t.co/BBkwein9oF pic.twitter.com/w4PAuCIgUR— Star Sports (@StarSportsIndia) November 30, 2025
ఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్ రియాక్షన్ వైరల్!
‘‘వన్డే ప్రపంచకప్-2027 టోర్నమెంట్లో ఆడే విషయంపై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నుంచి మాకు ఎలాంటి హామీ లభించలేదు’’.. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన వేళ టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పిన మాట ఇది.ఆస్ట్రేలియా పర్యటనకు ముందు శుబ్మన్ గిల్ (Shubman Gill)ను వన్డే జట్టు కొత్త కెప్టెన్గా ప్రకటించిన అగార్కర్.. రో-కోల గురించి ఎదురైన ప్రశ్నకు అగార్కర్ (Ajit Agarkar) పైవిధంగా బదులిచ్చాడు. అయితే, ఆసీస్ టూర్లో ఆరంభంలో కోహ్లి తడబడ్డా.. రోహిత్ ఆద్యంతం అద్భుత బ్యాటింగ్తో అలరించాడు.రో- కో వన్డే భవితవ్యంపై చర్చమూడో వన్డేలో శతక్కొట్టి భారత్ను గెలిపించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. మరోవైపు.. ఆఖరిదైన మూడో మ్యాచ్లో కోహ్లి (Virat Kohli) సైతం భారీ అర్ద శతకంతో సత్తా చాటాడు. తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్కు ముందు కూడా రో- కో వన్డే భవితవ్యంపై చర్చ జరిగింది.టీమిండియాలో కొనసాగాలంటే దేశీ క్రికెట్ ఆడాలంటూ బోర్డు నుంచి రోహిత్, కోహ్లికి సందేశం వెళ్లిందనే వార్తలు వచ్చాయి. సఫారీ జట్టుతో సిరీస్ ముగిసిన తర్వాత వీరిద్దరి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ సమావేశం కానున్నారనే సమాచారం వచ్చింది.ఇచ్చిపడేశారు భయ్యా!ఇలాంటి తరుణంలో రాంచిలో సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రోహిత్ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57)తో దుమ్ములేపగా.. కోహ్లి శతకం (120 బంతుల్లో 135)తో చెలరేగి తనకు తానే సాటి మరోసారి నిరూపించుకున్నాడు. ఇద్దరూ కలిసి వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ తమ అనుభవంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.ఈ నేపథ్యంలో రో-కో అభిమానులు గంభీర్, అగార్కర్లను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దిగ్గజాల కెరీర్ ముగించాలని చూస్తే సహించేది లేదని.. ఒకవేళ మీ పంతం నెగ్గించుకోవాలని చూస్తే టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్అంతేకాదు.. రో- కో భవిష్యత్తుపై కాకుండా గంభీర్- అగార్కర్ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని.. సౌతాఫ్రికాతో టెస్టుల్లో 2-0తో వైట్వాష్కు బాధ్యతగా ముందుగా వీరిద్దరిని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో కోహ్లి సెంచరీ సెలబ్రేషన్ సమయంలో రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ మరింత హైలైట్ అయింది. వన్డేల్లో రికార్డు స్థాయిలో 52వ సెంచరీ బాదడం ద్వారా అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 83 శతకాలు పూర్తి చేసుకున్నాడు కోహ్లి. దీంతో గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకున్నాడు.A leap of joy ❤️💯A thoroughly entertaining innings from Virat Kohli 🍿Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025ముఖం మీద కొట్టినట్లుగా ఇంతలో డగౌట్లో ఉన్న రోహిత్ శర్మ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ.. ‘‘ఇదిరా మన సత్తా’’ అన్నట్లుగా కాస్త అసభ్య పదజాలంతో సెలబ్రేట్ చేసుకున్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. గంభీర్- అగార్కర్లకు రో- కో సరైన సమాధానం ఇచ్చారంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు అంకితభావం లేదన్న వారికి సెంచరీలతో ముఖం మీద కొట్టినట్లుగా కౌంటర్ ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు. కాగా రాంచిలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 349 పరుగులు సాధించింది.చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్ను దాటేసి తొలి ప్లేయర్గా.. 7000వ సెంచరీRohit Sharma reaction on Virat Kohli century. 😭pic.twitter.com/hmsllR1eYm— Selfless⁴⁵ (@SelflessCricket) November 30, 2025
దంచికొట్టిన కోహ్లి, రోహిత్, రాహుల్.. సౌతాఫ్రికాకు భారీ లక్ష్యం
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. రాంచి వేదికగా నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. తద్వారా సౌతాఫ్రికాతో వన్డేల్లో రెండో అత్యధిక స్కోరును భారత్ నమోదు చేసింది.రోహిత్ మెరుపు అర్ధ శతకంస్వదేశంలో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రాంచి వేదికగా సౌతాఫ్రికాతో తొలి వన్డే (IND vs SA 1st ODI)లో టాస్ ఓడిన టీమిండియా.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (18) నిరాశపరచగా.. రోహిత్ శర్మ (Rohit Sharma) ధనాధన్ దంచికొట్టాడు. మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) సాధించాడు.మరోవైపు.. రోహిత్తో కలిసి వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) కూడా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హిట్మ్యాన్తో కలిసి రెండో వికెట్కు 136 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లి రికార్డు సెంచరీఈ క్రమంలో 102 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న కోహ్లి.. ఆ తర్వాత జోరు పెంచాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 60)తో కలిసి ఐదో వికెట్కు 76 పరుగులు జోడించిన కోహ్లి.. నండ్రీ బర్గర్ బౌలింగ్లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఈ మ్యాచ్లో మొత్తంగా 120 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 11 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 83వ శతకం, వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేశాడు. 52nd ODI hundred for the King! 🤩👑Most in a single format in international cricket 🙌🔥#INDvSA 1st ODI, LIVE NOW 👉 https://t.co/BBkwein9oF pic.twitter.com/DPYCzEZ72J— Star Sports (@StarSportsIndia) November 30, 2025రాణించిన జడేజామిగిలిన వారిలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (20 బంతుల్లో 32) వేగంగా ఆడగా.. రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) విఫలమయ్యారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి భారత్ 349 పరుగులు సాధించి.. సౌతాఫ్రికాకు 350 పరుగుల టార్గెట్ విధించింది.సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్, నండ్రీ బర్గర్, కార్బిన్ బాష్, ఒట్నీల్ బార్ట్మన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా వన్డేల్లో టీమిండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు (349/8). ఇంతకు ముందు 2010లో గ్వాలియర్ వేదికగా టీమిండియా ప్రొటిస్ జట్టుపై మూడు వికెట్ల నష్టానికి 401 పరుగులు (401/3) చేసింది. ఇదిలా ఉంటే.. శుబ్మన్ గిల్ మెడ నొప్పి వల్ల వన్డే సిరీస్కు దూరం కాగా.. కేఎల్ రాహుల్ టీమిండియాను ముందుకు నడిపిస్తున్నాడు.చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. 7000వ సెంచరీ గురించి తెలుసా?
ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్ను దాటేసి తొలి ప్లేయర్గా..
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా సెంచరీతో చెలరేగిన కింగ్... యాభై ఓవర్ల ఫార్మాట్లో పలు ప్రపంచ రికార్డులు సృష్టించాడు.సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలురాంచి వేదికగా ప్రొటిస్ జట్టుతో ఆదివారం నాటి మ్యాచ్లో కోహ్లి (Virat Kohli) 102 బంతుల్లో శతక మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... సింగిల్ ఫార్మాట్లో అత్యధిక శతకాల వీరుడిగా ఉన్న టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) రికార్డును బద్దలు కొట్టాడు.ఏకైక బ్యాటర్గాకాగా శతక శతకాల వీరుడు సచిన్ టెస్టుల్లో 51 సెంచరీలు చేయగా.. కోహ్లి వన్డేల్లో 52వసారి వంద పరుగుల మార్కు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒకే ఫార్మాట్లో అత్యధిక శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్గా చరిత్రకెక్కాడు.అంతేకాదు వన్డేల్లో భారత్లో ఒకే వేదికపై అతి తక్కువ ఇన్నింగ్స్లోనే మూడు శతకాలు బాదిన బ్యాటర్గా కోహ్లి నిలిచాడు. కోహ్లి రాంచిలో ఐదు ఇన్నింగ్స్లో మూడు శతకాలు బాదగా.. సచిన్ వడోదరలో ఏడు ఇన్నింగ్స్లో మూడుసార్లు శతక్కొట్టాడు.అదే విధంగా.. సౌతాఫ్రికాతో వన్డేల్లో అత్యధిక సెంచరీ సాధించిన క్రికెటర్గా కోహ్లి నిలిచాడు. ప్రొటిస్ జట్టుపై కోహ్లికి ఇది ఆరో శతకం. అంతకు ముందు ఈ రికార్డు సచిన్ టెండుల్కర్, డేవిడ్ వార్నర్ (David Warner) పేరిట ఉండేది. వీరిద్దరు సౌతాఫ్రికాపై చెరో ఐదు శతకాలు బాదారు.అరుదైన నంబర్అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో కోహ్లి తాజాగా సాధించిన 83వ సెంచరీ (టెస్టుల్లో 30, వన్డేల్లో 52, టీ20లలో ఒకటి)కి చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం దక్కనుంది. కోహ్లి హండ్రెడ్ బాదడంతో మెన్స్ క్రికెట్లో వ్యక్తిగత శతకాల సంఖ్య 7000కు చేరింది. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఓవరాల్గా 7000వ సెంచరీ కోహ్లి పేరిట లిఖించబడింది. భారత్ స్కోరెంతంటే?కాగా సౌతాఫ్రికాతో తొలి వన్డేలో కోహ్లి మొత్తంగా 120 బంతులు ఎదుర్కొని పదకొండు ఫోర్లు, ఏడు సిక్స్ల సాయంతో 135 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మతో రెండో వికెట్కు 136 పరుగులు జోడించిన కోహ్లి.. కేఎల్ రాహుల్ (60)తో కలిసి ఐదో వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరితో పాటు రవీంద్ర జడేజా (32) కూడా రాణించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. చదవండి: రాక రాక వచ్చిన అవకాశం.. ఇలా చేస్తావా?.. ఫ్యాన్స్ ఫైర్
రొనాల్డో కల నెరవేరిన వేళ.. పోర్చు‘గోల్’ చేరింది!
దోహ: పోర్చుగల్ ఫుట్బాల్ అంటే ముందుగా గుర్తుకొచ్...
ఆర్చరీలో చికితకు రజతం
జైపూర్: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ (కేఐయూజీ)...
భారత్ శుభారంభం
చెన్నై: సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల జూనియర్ ప్ర...
రూ.1750 నుంచి రూ.13,500 వరకు...
సాక్షి, హైదరాబాద్: ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా...
దంచికొట్టిన కోహ్లి, రోహిత్, రాహుల్.. సౌతాఫ్రికాకు భారీ లక్ష్యం
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధిం...
ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్ను దాటేసి తొలి ప్లేయర్గా..
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి సరికొత్త చరి...
విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ.. వన్డే రారాజుకు తిరుగులేదు
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా దిగ్గజ బ్యాటర్...
రాక రాక వచ్చిన అవకాశం.. ఇలా చేస్తావా?
సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో పునరాగమనం...
క్రీడలు
ఉత్సాహంగా వైజాగ్ మారథాన్ ర్యాలీ (ఫొటోలు)
హైదరాబాద్కు మెస్సీ..ఫోటో దిగాలంటే రూ. 10 లక్షలు! (ఫొటోలు)
ధోనీ కేరళ వస్తే? ఇది ఏఐ అని చెబితే తప్ప తెలియదు (ఫొటోలు)
ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో మెరిసిన గీతా బస్రా, హర్భజన్ దంపతులు (ఫొటోలు)
ప్రీ మెచ్యూర్డ్ చిల్డ్రన్స్ కు ‘ప్రీమిథాన్’ (ఫొటోలు)
మంధాన పెళ్లి షురూ.. సంగీత్లో వరల్డ్ కప్ స్టార్స్ డాన్స్ (ఫోటోలు)
లేడీ క్రికెటర్ స్మృతి మంధాన హల్దీ సెలబ్రేషన్ (ఫొటోలు)
నా జీవితంలోని ఆల్రౌండర్కు హ్యాపీ బర్త్ డే: సూర్యకుమార్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి దర్శనానికై మెట్ల మార్గంలో వరల్డ్కప్ విన్నర్ శ్రీచరణి (ఫొటోలు)
వీడియోలు
రాంచీ వన్డేలో దుమ్ములేపిన భారత్
12 బంతుల్లో 50.. 32 బంతుల్లో 100.. ఇదేం బాదుడురా బాబు
జట్టులో కీలక మార్పులు
టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే..!
స్మృతి మందాన పెళ్లి రద్దు? వేరే అమ్మాయితో పలాస్ డేటింగ్!
మహిళా క్రికెటర్ స్మృతి మందాన వివాహం వాయిదా
Nikhat Zareen: అదరగొట్టిన తెలంగాణ బాక్సర్.. గోల్డ్ మెడల్
గిల్ అనుమానమే..!
తడబడ్డ భారత్.. ఘోర పరాజయం
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 42 బంతుల్లోనే 144 పరుగులు
