ప్రధాన వార్తలు

ENG VS IND 2nd Test: పాపం జైస్వాల్..!
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రాహుల్ తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్కే (31) ఔటయ్యాడు. ఈ వికెట్ బ్రైడన్ కార్స్కు దక్కింది. 11వ హాఫ్ సెంచరీఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్కు టెస్ట్ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్మన్ గిల్ మూడో వికెట్కు 66 పరుగులు జోడించాడు.పాపం జైస్వాల్ఈ దశలో జైస్వాల్ ఓ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని వికెట్కీపర్ జేమీ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది. వికెట్ తీసిన ఆనందంలో స్టోక్స్ సంబరాలు చేసుకోగా.. జైస్వాల్ క్రీజ్లో అలాగే ఉండిపోయాడు. ఈ ఇన్నింగ్స్లో జైస్వాల్ చాలా సార్లు కట్ షాట్లు ఆడే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. చివరికి అదే షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. జైస్వాల్ 107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. జైస్వాల్ సెంచరీకి ముందు ఔట్ కావడంతో టీమిండియా అభిమానులు నిరాశపడ్డారు. పాపం జైస్వాల్ అంటూ సోషల్మీడియా వేదికగా సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.50 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 170/3గా ఉంది. శుభ్మన్ గిల్ 38, రిషబ్ పంత్ 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.కాగా, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది.

శ్రీలంక కెప్టెన్ సూపర్ శతకం.. గత మూడు ఇన్నింగ్స్ల్లో రెండవది
కొలొంబో వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో శ్రీలంక సారధి చరిత్ అసలంక సూపర్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఐదో స్థానంలో బరిలోకి దిగిన అసలంక.. 123 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. గత మూడు ఇన్నింగ్స్ల్లో అసలంకకు ఇది రెండో సెంచరీ. ఓవరాల్గా అతని కెరీర్లో ఐదవది. అసలంక చివరిగా ఆస్ట్రేలియాతో ఆడిన వన్డేల్లో వరుసగా 127, 78 నాటౌట్ పరుగులు చేశాడు. గత కొన్నేళ్లుగా అసలంక వన్డేల్లో అత్యంత నమ్మదగిన బ్యాటర్గా మారాడు. 2024లో 97.11 స్ట్రయిక్రేట్తో 50.41 సగటున పరుగులు చేసిన అసలంక.. ఈ ఏడాది ఏకంగా 68 సగటున, 96.03 స్ట్రయిక్రేట్తో పరుగులు సాధిస్తున్నాడు. కెరీర్లో ఇప్పటివరకు 74 వన్డేలు ఆడిన అసలంక 44.98 సగటున 5 సెంచరీలు, 15 అర్ద సెంచరీల సాయంతో 2474 పరుగులు చేశాడు.బంగ్లాదేశ్తో మ్యాచ్లో అసలంక ఆదుకోవడంతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోర్ (49.2 ఓవర్లలో 244 పరుగులు) చేయగలిగింది. జట్టులో మిగతా బ్యాటర్లెవ్వరూ రాణించకపోగా అసలంక ఒక్కడే జట్టు భారం మొత్తాన్ని మోశాడు. కుసాల్ మెండిస్ (45), జనిత్ లియనాగే (29), మిలన్ రత్నాయకే (22), హసరంగ (22) రెండంకెల స్కోర్లు చేసి అసలంకకు సహకరించారు. కొద్ది రోజుల కిందట బంగ్లాదేశ్తోనే జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారీ శతకం బాదిన పథుమ్ నిస్సంక ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు. 8 బంతులు ఎదుర్కొని డకౌటయ్యాడు. మరో స్టార్ బ్యాటర్ కమిందు మెండిస్ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఓపెనర్ నిషాన్ మదుష్క 6, తీక్షణ 1, ఎషాన్ మలింగ 5, అశిత ఫెర్నాండో 1 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ అద్బుతంగా బౌలింగ్ చేశారు. వీరిలో తస్కిన్ 4 వికెట్లు పడగొట్టగా.. తంజిమ్ 3 వికెట్లు తీశాడు. తన్వీర్ ఇస్లాం, షాంటో తలో వికెట్ దక్కించుకున్నారు.3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరుగుతున్న తొలి వన్డే ఇది. దీనికి ముందు జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఆతిథ్య శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు మరో కొత్త కెప్టెన్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు రోజుల వ్యవధిలో ముగ్గురు కెప్టెన్లు మారారు. గత నెలలో జరిగిన డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్లో సౌతాఫ్రికాకు సారథ్యం వహించిన టెంబా బవుమా.. జింబాబ్వే పర్యటనకు విశ్రాంతి తీసుకోగా, కేశవ్ మహారాజ్ను తాత్కాలిక సారధిగా నియమించారు. జింబాబ్వే పర్యటనలో తొలి టెస్ట్లో అదరగొట్టిన కేశవ్ మహారాజ్ దురదృష్టవశాత్తు గాయపడటంతో, రెండో టెస్ట్లో అతనికి ప్రత్యామ్నాయంగా మరో కొత్త కెప్టెన్ను నియమించారు. కెరీర్లో కేవలం 20 టెస్ట్ మ్యాచ్లే ఆడిన వియాన్ ముల్దర్ను దక్షిణాఫ్రికా నూతన సారధిగా ఎంపిక చేశారు. జింబాబ్వేలో పర్యటిస్తున్న సౌతాఫ్రికా జట్టులో కేశవ్ మహారాజ్ తర్వాత ముల్దరే అత్యంత అనుభవజ్ఞుడు (కైల్ వెర్రిన్ (26) మినహా). మిగతా ఆటగాళ్లంతా 20కి మించి టెస్ట్లు ఆడలేదు. తొలి టెస్ట్తో ప్రిటోరియస్, బ్రెవిస్, కోడి యూసఫ్ అరంగేట్రం చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం సీనియర్ ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకోవడంతో సౌతాఫ్రికా మేనేజ్మెంట్ జింబాబ్వే టూర్కు యువ జట్టును పంపింది. ఈ యువ జట్టుకు అత్యంత సీనియర్ అయిన కేశవ్ మహారాజ్ను కెప్టెన్గా నియమించింది.అయితే అతను తొలి టెస్ట్ సందర్భంగా గజ్జల్లో గాయానికి గురయ్యాడు. రెండో టెస్ట్లో అతనికి ప్రత్నామ్నాయ ఆటగాడిగా సెనురన్ ముత్తుస్వామిని ఎంపిక చేశారు. జులై 6 నుంచి బులవాయోలో జరిగే రెండో టెస్ట్లో వియాన్ ముల్దర్ దక్షిణాఫ్రికా సారధిగా వ్యవహరిస్తాడు. దీంతో సౌతాఫ్రికా మూడు వరుస టెస్ట్ మ్యాచ్ల్లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో బరిలోకి దిగినట్లవుతుంది.కొత్త కెప్టెన్ ముల్దర్ జింబాబ్వేతో జరిగిన తొలి టెస్ట్లో అద్బుతంగా రాణించాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన అతను తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసి, ఆతర్వాత బ్యాటింగ్లో సెంచరీ (147) చేశాడు. తొలి టెస్ట్లో సారధిగా వ్యవహరించిన కేశవ్ మహారాజ్ కూడా ఆల్రౌండర్గా రాణించాడు. బ్యాటింగ్లో 21, 51 పరుగులు చేసి బౌలింగ్లో 3,1 వికెట్లు తీశాడు.గాయంతో బాధపడుతున్న కేశవ్ మహారాజ్ను స్వదేశానికి పిలిపించిన సౌతాఫ్రికా యాజమాన్యం అతనితో పాటు సీనియర్ పేసర్ లుంగి ఎంగిడిని కూడా జట్టు నుంచి రిలీజ్ చేసింది. తొలి టెస్ట్లో అద్బుతంగా రాణించిన యువ పేసర్లకు మరో అవకాశం ఇవ్వడం కోసం ఎంగిడిని స్వదేశానికి పిలిపించారు. తొలి టెస్ట్లో పేసర్లు కోడి యూసఫ్, మఫాకా, బాష్, ముల్దర్ విశేషంగా రాణించారు. ఆ మ్యాచ్లో కేశవ్ మహారాజ్ ఏకైక స్పిన్నర్గా బరిలోకి దిగాడు.కాగా, జింబాబ్వేతో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్లో సౌతాఫ్రికా 328 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో కార్బిన్ బాష్ (100, 5/43), డ్రి ప్రిటోరియస్ (153), వియాన్ ముల్దర్ (4/50, 147), కేశవ్ మహారాజ్ (3/70, 51), కోడి యూసఫ్ (3/42, 3/22) అద్భుత ప్రదర్శనలు చేసి సౌతాఫ్రికాను గెలిపించారు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా చివరి 9 మ్యాచ్ల్లో గెలిచిన జట్టుగా అరుదైన ఘనత సాధించింది. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో ఏ జట్టు ఈ ఘనత సాధించలేదు.

నిరాశపరిచిన రాహుల్.. మరో ఛాన్స్ను కూడా వృధా చేసుకున్న కరుణ్
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.నిరాశపరిచిన రాహుల్తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 42, రెండో ఇన్నింగ్స్లో సెంచరీ (137) చేసిన రాహుల్ స్వల్ప స్కోర్కే ఔట్ కావడం టీమిండియా అభిమానులకు తీవ్రంగా నిరాశపరిచింది. విదేశాల్లో ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన రాహుల్కు ఎడ్జ్బాస్టన్ అచ్చిరాలేదు. గతంలోనూ అతను ఇక్కడ ఆడిన రెండు ఇన్నింగ్స్ల్లో ఘోరంగా విఫలమయ్యాడు (13, 4).మరో ఛాన్స్ను కూడా వృధా చేసుకున్న కరుణ్రాహుల్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన కరుణ్ నాయర్ ఆదిలో కాస్త ఇబ్బంది పడినా ఆతర్వాత కుదురుకున్నాడు. అయితే దురదృష్టవశావత్తు బ్రైడన్ కార్స్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి 31 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో కరుణ్ మరో ఛాన్స్ను కూడా వృధా చేసుకన్నట్లైంది. 8 ఏళ్ల తర్వాత ఈ సిరీస్లోని తొలి టెస్ట్తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్.. ఆ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌటై, రెండో ఇన్నింగ్స్లో 20 పరుగులు చేశాడు. జైస్వాల్ ఖాతాలో మరో హాఫ్ సెంచరీరాహుల్, కరుణ్ ఔటైనా ఏమాత్రం ఒత్తిడికి గురి కాని యశస్వి జైస్వాల్ ఈ మధ్యలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్కు టెస్ట్ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగాడు.తొలి రోజు లంచ్ విరామం సమయానికి భారత్ 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. జైస్వాల్ 62, శుభ్మన్ గిల్ 1 పరుగుతో క్రీజ్లో ఉన్నారు.తొలి టెస్ట్లో ఇలా..కాగా, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది.ఛేదనలో బెన్ డకెట్ (149) సూపర్ సెంచరీ చేసి ఇంగ్లండ్ను గెలిపించాడు. జాక్ క్రాలే (65), జో రూట్ (53 నాటౌట్), బెన్ స్టోక్స్ (33), జేమీ స్మిత్ (44 నాటౌట్) తలో చేయి వేశారు. భారత బౌలర్లు సెకెండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని పరుగులు చేశారు. ప్రసిద్ద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవీంద్ర జడేజాది కూడా అదే పరిస్థితి.ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్ల్లో అద్బుతంగా ఆడారు. అయినా సెకెండ్ ఇన్నింగ్స్లో బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఐదు శతకాలు నమోదైన ప్రయోజనం లేకుండా పోయింది.తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134) సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు. ఇంగ్లండ్ తరఫున తొలి ఇన్నింగ్స్లో ఓలీ పోప్ (106) సెంచరీ చేయగా.. హ్యారీ బ్రూక్ (99) తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన చేసినప్పటికీ ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది.

దూసుకుపోతున్న రిషబ్ పంత్
టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూసుకుపోతున్నాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఓ స్థానం మెరుగుపర్చుకొని ఆరో ప్లేస్కు ఎగబాకాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్లో ట్విన్ సెంచరీస్ (రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు) చేసిన పంత్.. గత వారం ర్యాంకింగ్స్లోనే ఓ ర్యాంక్ మెరుగుపర్చుకున్నాడు. తాజాగా మరో ర్యాంక్ మెరుగుపర్చుకొని తన కెరీర్ అత్యుత్తమ ఐదో ర్యాంక్కు అ్యతంత చేరువయ్యాడు.గత వారం ర్యాంకింగ్స్ అనంతరం పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో 800 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత వికెట్కీపర్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ వికెట్కీపర్ బ్యాటర్ 800 రేటింగ్ పాయింట్లు సాధించలేదు. టీమిండియా దిగ్గజ వికెట్కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనికి కూడా ఇది సాధ్యపడలేదు. ప్రస్తుతం పంత్ 801 రేటింగ్ పాయింట్లు ఖాతాలో కలిగి ఉన్నాడు.ఇంగ్లండ్తో ప్రస్తుతం జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో పంత్ ఇదే జోరును కొనసాగిస్తే.. త్వరలోనే నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం టాప్ ర్యాంక్లో ఉన్న జో రూట్కు పంత్కు 88 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. పంత్ నెక్స్ట్ టార్గెట్ స్టీవ్ స్మిత్. స్మిత్ తాజా ర్యాంకింగ్స్లో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్, న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో ఉన్నారు.ఈ వారం ర్యాంకింగ్స్లో పంత్తో పాటు మరిన్ని చెప్పుకోదగ్గ మార్పులు జరిగాయి. ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్ 3, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక 14, ఆసీస్ ఆల్రౌండర్ బ్యూ వెబ్స్టర్ 11, సౌతాఫ్రికా ఆల్రౌండర్ 17, మరో సౌతాఫ్రికా ఆల్రౌండర్ కార్బిన్ బాష్ 15, వెస్టిండీస్ ప్లేయర్ జస్టిన్ గ్రీవ్స్ 15 స్థానాలు మెరుగుపర్చుకొని 10, 17, 53, 56, 59, 86 స్థానాలకు ఎగబాకారు.బౌలర్ల ర్యాంకింగ్స్లో బుమ్రా, రబాడ, కమిన్స్ టాప్-3లో కొనసాగుతుండగా.. విండీస్ పేసర్ షమార్ జోసఫ్ 14, ముల్దర్ 6, కార్బిన్ బాష్ 45, చివంగ 35 స్థానాలు మెరుగుపర్చుకొని 36, 52, 57, 88 స్థానాలకు ఎగబాకారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. రవీంద్ర జడేజా, మెహిది హసన్, జన్సెన్ మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.

అందుకే కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టాం: శుబ్మన్ గిల్
టీమిండియా- ఇంగ్లండ్ (India vs England) మధ్య రెండో టెస్టు నేపథ్యంలో ప్రధానంగా చర్చకు వచ్చిన పేరు కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav). ఎడ్జ్బాస్టన్ పిచ్పై ఈ చైనామన్ స్పిన్నర్ను ఆడిస్తే భారత్కు ప్రయోజనకరంగా ఉంటుందని మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్తో పాటు.. సునిల్ గావస్కర్ వంటి భారత దిగ్గజ క్రికెటర్లు కూడా టీమిండియా మేనేజ్మెంట్కు సూచించారు.అతడికి విశ్రాంతి.. వారిపై వేటుఅయితే, రెండో టెస్టు ఆడే జట్టులో మాత్రం కుల్దీప్ యాదవ్కు చోటు దక్కలేదు. ఈ మణికట్టు స్పిన్నర్కు బదులు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)కు సెలక్టర్లు తుదిజట్టులో స్థానం ఇచ్చారు. తొలి టెస్టులో ఆడిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో పాటు.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్లపై వేటు వేశారు.ఈ ముగ్గురి స్థానంలో పేసర్ ఆకాశ్ దీప్తో పాటు ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో జట్టులో చేసిన మార్పుల గురించి స్పందించిన టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్.. కుల్దీప్ యాదవ్ను ఆడించకపోవడానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు.అందుకే కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టాం‘‘ఇంగ్లండ్తో రెండో టెస్టులో మేము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. రెడ్డి, వాషీలతో పాటు ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చారు. బుమ్రాను ఈ మ్యాచ్లో ఆడించడం లేదు. అతడి వర్క్లోడ్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం.మూడో టెస్టు లార్డ్స్లో జరుగనుంది. అక్కడ బుమ్రా అవసరం మాకు ఎక్కువగా ఉంటుంది. అక్కడి పిచ్ను బుమ్రా సద్వినియోగం చేసుకోగలడు. అందుకే ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చాం.ఇక కుల్దీప్ యాదవ్ను తీసుకోవాలని ఆఖరి వరకు అనుకున్నాం. అయితే, బ్యాటింగ్లో డెప్త్ గురించి ఆలోచించి అతడిని పక్కనపెట్టాం. ’’ అని శుబ్మన్ గిల్ వెల్లడించాడు. గత మ్యాచ్లో తమ లోయర్ ఆర్డర్ దారుణంగా విఫలమైందని... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కాగా గతంలో సొంతగడ్డపై ఇంగ్లండ్తో సిరీస్లోనూ కుల్దీప్ యాదవ్కు మొదట ప్రాధాన్యం ఇవ్వలేదు మేనేజ్మెంట్.భారత గడ్డపై ఇలాఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు ఓడిన తర్వాత.. రెండో మ్యాచ్ నుంచి అతడిని తుదిజట్టులోకి తీసుకున్నారు. తదుపరి నాలుగు మ్యాచ్లలో కుల్దీప్ ఆకాశమే హద్దుగా చెలరేగి మొత్తంగా 19 వికెట్లు కూల్చాడు. తద్వారా టీమిండియా ఇంగ్లండ్పై 4-1తో గెలిచి సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, ప్రస్తుతం సిరీస్ ఇంగ్లండ్లో జరుగుతున్నందున అతడికి ఎక్కువగా అవకాశం రాకపోవచ్చు. కానీ ఎడ్జ్బాస్టన్ పిచ్ స్వభావాన్ని బట్టి కుల్దీప్ను ఆడిస్తారని అంతా భావించారు. కాగా ఆండర్సన్-టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఐదు శతకాలు బాదినాఈ సిరీస్తో భారత టెస్టు జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.ఇక ఈ మ్యాచ్లో భారత్ ఐదు శతకాలు బాదినా ఫలితం లేకుండా పోయింది. యశస్వి జైస్వాల్తో పాటు శుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలు కొట్టగా.. రిషభ్ పంత్ రెండు శతకాలతో అలరించాడు. అయితే, అప్పుడు కూడా బ్యాటింగ్ డెప్త్ కోసమని శార్దూల్ ఠాకూర్ను తీసుకోగా.. అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఐదు పరుగులు చేయడంతో పాటు కేవలం రెండు వికెట్లే పడగొట్టగలిగాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య బుధవారం (జూలై 2) రెండో టెస్టు ఆరంభం కాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. 8.4 ఓవర్ వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. క్రిస్ వోక్స్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ (2) బౌల్డ్ కాగా.. యశస్వి జైస్వాల్ 12 పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 15/1 (8.4).చదవండి: IND vs ENG T20Is: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు

IND vs ENG: తుదిజట్టులోకి నితీశ్ రెడ్డి, వాషీ, ఆకాశ్.. ఆ ఇద్దరిపై వేటు
England vs India 2nd Test Birmingham: టీమిండియాతో రెండో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఎడ్జ్బాస్టన్ పిచ్ పరిస్థితులకు అనుగుణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తెలిపాడు. మరోవైపు.. టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.బుమ్రాకు విశ్రాంతితాను టాస్ గెలిస్తే తప్పక తొలుత బౌలింగే ఎంచుకునేవాడినని తెలిపాడు. ఇక రెండో టెస్టులో తాము మూడు మార్పులతో బరిలోకి దిగినట్లు గిల్ వెల్లడించాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చామని.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు.ఆ ఇద్దరిపై వేటుకాగా ఇంగ్లండ్తో తొలి టెస్టు ఆడిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్తో పాటు.. ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్పై వేటు పడింది. శార్దూల్ తొలి టెస్టులో కేవలం ఐదు పరుగులు చేయడంతో పాటు.. రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.కరుణ్ నాయర్కు రెండో అవకాశంమరోవైపు.. వన్డౌన్ బ్యాటర్ సాయి తొలి ఇన్నింగ్స్లో డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్లో ముప్పై పరుగులు చేయగలిగాడు. అయితే, సాయి సుదర్శన్తో పాటే విఫలమైన సీనియర్ కరుణ్ నాయర్పై మేనేజ్మెంట్ మరోసారి నమ్మకం ఉంచింది. అతడికి రెండో ఛాన్స్ ఇచ్చింది. కాగా కరుణ్ తొలి ఇన్నింగ్స్లో పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అదే విధంగా రెండో ఇన్నింగ్స్లోనూ 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలో లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరుగగా.. గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.ఫలితంగా ఇంగ్లండ్ ఈ సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. ఇరుజట్ల మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జూలై 2-6 రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఇంగ్లండ్జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జామీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు

‘అతడి డబుల్ సెంచరీ.. నా కెరీర్కు ముగింపు’
టీమిండియా ఓపెనర్గా శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ లెఫ్టాండర్.. ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా వన్డేల్లో అత్యుత్తమంగా రాణించాడు. తన కెరీర్లో మొత్తంగా 167 వన్డేలు ఆడిన గబ్బర్ 6793 పరుగులు సాధించాడు.అయితే, నయా స్టార్లు శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ (Ishan Kishan)ల రాకతో టీమిండియాలో ధావన్ స్థానం ప్రశ్నార్థకమైంది. ఈ ఇద్దరు ఓపెనర్లుగా పాతుకుపోవడంతో పాటు.. వీరికి తోడు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ కూడా రేసులోకి వచ్చారు. ఫలితంగా ధావన్ను సెలక్టర్లు పట్టించుకోవడమే మానేశారు.ఈ క్రమంలో 2022లో టీమిండియా తరఫున చివరగా ఆడిన శిఖర్ ధావన్.. రెండేళ్ల పాటు పునరాగమనం కోసం ఎదురుచూశాడు. కానీ యువ ఆటగాళ్ల జోరు ముందు నిలవలేక గతేడాది ఆగష్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు.అతడి డబుల్ సెంచరీ.. నా కెరీర్కు ముగింపుతాజాగా ఈ విషయాల గురించి శిఖర్ ధావన్ స్పందించాడు. బంగ్లాదేశ్ మీద ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ బాదినపుడే తన కెరీర్ ముగింపు దశకు వచ్చిందని భావించినట్లు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘నేను చాలాసార్లు ఫిఫ్టీలు బాదాను. ఎన్నోసార్లు డెబ్బైలలో అవుటయ్యాను.వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాను. ఎప్పుడైతే ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్తో వన్డేలో 200 పరుగులు చేశాడో.. అప్పుడే నా కెరీర్ ముగింపునకు వచ్చేసిందని నా మనసు చెప్పింది. నా అంతరాత్మ చెప్పినట్లే జరిగింది.ఆ సమయంలో నా స్నేహితులు, శ్రేయోభిలాషులు నా గురించి చాలా ఫీలయ్యారు. నేనెక్కడ బాధపడిపోతానో అని నన్ను కనిపెట్టుకుని ఉన్నారు. కానీ నేను మాత్రం జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాను’’ అని హిందుస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. కాగా డబుల్ సెంచరీ వీరుడు ఇషాన్ కిషన్ కూడా అనతికాలంలోనే క్రమశిక్షణా రాహిత్యం వల్ల జట్టులో చోటుతో పాటు.. సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోవడం గమనార్హం. మరోవైపు.. గిల్ మాత్రం నిలకడైన ఆటతో టీమిండియా టెస్టు కెప్టెన్గా ఎదిగాడు.ఒక్కరూ మాట్లాడలేదుఇక జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత ఒక్కరు కూడా తనను మళ్లీ కాంటాక్టు చేయలేదని ఈ సందర్భంగా ధావన్ చెప్పుకొచ్చాడు. ‘‘జట్టులో చోటు కోల్పోవడం సాధారణ విసయమే. పద్నాలుగేళ్ల వయసు నుంచే మాకు ఇది అలవాటు అవుతుంది.అంతేకాదు ఎవరి బిజీలో వాళ్లుంటారు. పర్యటనల్లో బిజీబిజీగా గడుపుతూ ఉంటారు. అయితే, ద్రవిడ్ భాయ్ మాత్రం ఆ సమయంలో నాతో మాట్లాడాడు. ఆయన నాకు మెసేజ్ చేశారు’’ అని ధావన్ తెలిపాడు. కాగా శిఖర్ ధావన్ ప్రస్తుతం లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్లో, లెజెండ్స్ లీగ్ క్రికెట్లోనూ అతడు భాగమవుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు

రోహిత్ శర్మ సరసన మంధాన.. భారత మూడో ప్లేయర్గా ఘనత
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన భారత ప్లేయర్ల జాబితాలో స్థానం సంపాదించింది. ఈ క్రమంలో టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సరసన చేరింది.ఇంగ్లండ్ మహిళా జట్టు (England Women vs India Women)తో రెండో టీ20 సందర్భంగా స్మృతి మంధాన ఈ ఫీట్ నమోదు చేసింది. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లండ్కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. మొదటి మ్యాచ్లో భారత్ 97 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.150వ టీ20 మ్యాచ్ఇక బ్రిస్టల్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20లోనూ ఆతిథ్య ఇంగ్లండ్పై.. భారత్ 24 రన్స్ తేడాతో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో ముందంజలో నిలిచింది. ఇక స్మృతి మంధానకు ఇది అంతర్జాతీయ స్థాయిలో 150వ టీ20.రోహిత్, హర్మన్ సరసనఇప్పటి వరకు భారత్ తరఫున టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (159), మహిళా జట్టు సారథి హర్మన్ప్రీత్ కౌర్ (179) మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. తాజాగా స్మృతి మంధాన కూడా ఈ లిస్టులో చేరిపోయింది. కాగా 149 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లలో కలిపి స్మృతి మంధాన 124కు పైగా స్ట్రైక్రేటుతో 3873 పరుగులు సాధించింది.తద్వారా మహిళల టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్గా స్మృతి కొనసాగుతోంది. అంతేకాదు.. అంతర్జాతీయ టీ20లలో నాలుగు వేల మైలురాయికి కూడా స్మృతి చేరువైంది. పురుషుల క్రికెట్లో ఇప్పటి వరకు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు మాత్రమే ఈ ఘనత సాధ్యమైంది. ఇక భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో శతకం బాదిన తొలి మహిళా క్రికెటర్గానూ స్మృతి చరిత్రకెక్కిన విషయం తెలిసిందే.రెండో టీ20లో విఫలంఇదిలా ఉంటే... తన 150వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో స్మృతి మంధాన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. ఇంగ్లండ్తో తొలి టీ20లో శతకంతో చెలరేగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. తాజాగా రెండో టీ20లో 13 బంతులు ఎదుర్కొని 13 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బ్రిస్టల్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హర్మన్ సేన నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 157 పరుగులకే పరిమితమైంది. దీంతో 24 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఇక భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన అమన్జోత్ కౌర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 40 బంతుల్లోనే 63 పరుగులతో అజేయంగా నిలవడంతో పాటు.. ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్-బ్రంట్ (13) రూపంలో కీలక వికెట్ తీసింది పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అమన్జోత్.అగ్ర స్థానానికి చేరువైన స్మృతిభారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఒక స్థానం మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరింది. ఇంగ్లండ్తో తొలి టీ20లో సెంచరీతో విజృంభించిన స్మృతి... మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో 771 పాయింట్లతో నాలుగు నుంచి మూడో ర్యాంక్ను అందుకుంది. మంధాన కెరీర్లో ఇవే అత్యధిక రేటింగ్ పాయింట్లు కావడం విశేషం.హర్మన్ప్రీత్ కౌర్ అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లండ్తో తొలి మ్యాచ్లో కెప్టెన్గానూ వ్యవహరించిన మంధాన... ఈ ఫార్మాట్లో తొలి శతకం తన పేరిట లిఖించుకున్న విషయం తెలిసిందే. తద్వారా మూడు ఫార్మాట్ల (టెస్టు, వన్డే, టి20)లో సెంచరీ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వన్డే బ్యాటింగ్ ర్యాకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న స్మృతి... టీ20ల్లో సైతం ఆ దిశగా ఆడుగులు వేస్తోంది.టీ20 ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా ప్లేయర్ బెత్ మూనీ (794 పాయింట్లు), వెస్టిండీస్ ప్లేయర్ హీలీ మాథ్యూస్ (774 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి హర్మన్ప్రీత్ కౌర్ (12వ ర్యాంక్), షఫాలీ వర్మ (13వ ర్యాంక్), జెమీమా రోడ్రిగ్స్ (15వ ర్యాంక్) టాప్–20లో చోటు దక్కించుకున్నారు. బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి దీప్తి శర్మ (735 పాయింట్లు) మూడో ర్యాంక్లో ఉండగా... రేణుక సింగ్ (721 పాయింట్లు) ఆరో ర్యాంక్లో ఉంది. చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు

షిమ్రన్ హెట్మెయిర్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ప్లే ఆఫ్స్ దిశగా?
సీటెల్ ఒర్కాస్ స్టార్ క్రికెటర్ షిమ్రన్ హెట్మెయిర్ (Shimron Hetmyer) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్తో జరిగిన మ్యాచ్లో అద్భుత అర్ధ శతకంతో చెలరేగాడు. కేవలం 37 బంతుల్లోనే 78 పరుగులు సాధించిన ఈ విధ్వంసకర బ్యాటర్.. ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. సీటెల్కు వరుసగా ఇది మూడో విజయం కావడం మరో విశేషం.మేజర్ లీగ్ క్రికెట్-2025 (MLC)లో భాగంగా బుధవారం ఉదయం సీటెల్ ఒర్కాస్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్తో తలపడింది. ఫ్లోరిడా వేదికగా టాస్ గెలిచిన సీటెల్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. యూనికార్న్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ బ్యాటర్లలో ఫిన్ అలెన్ (23), జేక్ ఫ్రేజర్ మెగర్క్ (35)లతో పాటు సంజయ్ కృష్ణమూర్తి (41), టిమ్ సీఫర్ట్ (31) మాత్రమే రాణించారు. ఆఖర్లో రొమారియో షెఫర్డ్ (3 బంతుల్లో 13 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.మరో మూడు బంతులు మిగిలి ఉండగానే..ఇక సీటెల్ ఒర్కాస్ బౌలర్లలో అయాన్ దేశాయ్ రెండు, హర్మీత్ సింగ్, వకార్ సలామ్ఖీల్, కెప్టెన్ సికందర్ రజా ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ విధించిన లక్ష్యాన్ని సీటెల్ 19.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ షయాన్ జహంగీర్ (36) ఫర్వాలేదనిపించగా.. షిమ్రన్ హెట్మెయిర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లుఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ విండీస్ ప్లేయర్ 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 78 పరుగులతో అజేయంగా నిలిచాడు. షిమ్రన్ మెరుపు అర్ధ శతకం కారణంగా సీటెల్ ఒర్కాస్ 19.3 ఓవర్లలో కేవలం ఆరు వికెట్లు మాత్రమే నష్టపోయి 169 పరుగులు సాధించింది. శాన్ ఫ్రాన్సిస్కోపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి.. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది.ప్లే ఆఫ్స్ దిశగా కాగా అమెరికాలో జూన్ 12న మొదలైన మేజర్ లీగ్ క్రికెట్-2025 సీజన్.. జూలై 13న ఫైనల్తో ముగియనుంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టీ20 లీగ్లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఎనిమిదింట ఆరు, వాషింగ్టన్ ఫ్రీడమ్ ఏడింట ఆరు, టెక్సాస్ సూపర్ కింగ్స్ ఏడింట ఐదు గెలిచి టాప్-4లో అడుగుపెట్టాయి. ఇక నాలుగో స్థానం కోసం సీటెల్ ఒర్కాస్, ఎంఐ న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ బరిలో ఉన్నాయి. అయితే, వీటిలో సీటెల్ ఒర్కాస్ ఎనిమిదింట మూడు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ముందుంది. న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ జట్లు ఏడింట ఒక్కటి మాత్రమే గెలిచి పూర్తిగా వెనుకబడ్డాయి. చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డుThe six that all but sealed our third W in a row 😍#SeattleOrcas #AmericasFavoriteCricketTeam #ShimronHetmyer #MLC2025 #SFUvSO I @SHetmyer I @MLCricket pic.twitter.com/tcGxAFcWhr— Seattle Orcas (@MLCSeattleOrcas) July 2, 2025

IND vs ENG: తుదిజట్టులోకి నితీశ్ రెడ్డి, వాషీ, ఆకాశ్.. ఆ ఇద్దరిపై వేటు
England vs India 2nd Test Birmingham: టీమిండియాతో ...

‘అతడి డబుల్ సెంచరీ.. నా కెరీర్కు ముగింపు’
టీమిండియా ఓపెనర్గా శిఖర్ ధావన్ (Shikhar Dhawan)...

రోహిత్ శర్మ సరసన మంధాన.. భారత మూడో ప్లేయర్గా ఘనత
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandh...

షిమ్రన్ హెట్మెయిర్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ప్లే ఆఫ్స్ దిశగా?
సీటెల్ ఒర్కాస్ స్టార్ క్రికెటర్ షిమ్రన్ హెట్...
క్రీడలు


స్నేహితుడి పుట్టినరోజు వేడుకలో ఎంఎస్ ధోని (ఫొటోలు)


భారత్-ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)


IND Vs ENG: ఇంగ్లండ్ గడ్డపై అదరగొట్టిన భారత బ్యాటర్లు.. పట్టుబిగించిన ‘గిల్’ సేన (ఫొటోలు)


IND Vs ENG: నేటి నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం (ఫొటోలు)


స్వదేశంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్లకు ఘన స్వాగతం (ఫొటోలు)


భర్తతో కలిసి మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)


SA Vs AUS Photos: 27 ఏళ్ల నిరీక్షణకు తెర.. డబ్ల్యూటీసీ విజేతగా సౌతాఫ్రికా (ఫొటోలు)


కపిల్ శర్మ షోలో సందడి చేసిన భారత క్రికెటర్ అభిషేక్ శర్మ ఫ్యామిలీ (ఫొటోలు)


ఎంపీతో క్రికెటర్ రింకూ సింగ్ ఎంగేజ్మెంట్.. ప్రముఖుల సందడి (ఫొటోలు)


ఆల్ది బెస్ట్ టీమిండియా.. ఇంగ్లండ్కు పయనమైన గిల్ సేన (ఫోటోలు)
వీడియోలు


సెకండ్ టెస్టులో ఇండియా ఓడిపోతుందా?


టీ-20 సిరీస్ లో బోణీ కొట్టిన టీమిండియా ఉమెన్స్ జట్టు


వెళ్లి పక్కన కూర్చొ.. గంభీర్ తో పంత్ ఫైట్


సత్తా చాటిన నీరజ్ చోప్రా


లీడ్స్ టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం


భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మూడో రోజు ఆట ముగింపు


ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్ట్ రెండో రోజు ముగిసిన ఆట


తొలిరోజే ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించిన భారత్


సన్ రైజర్స్ ఫ్రాంఛైజ్ రద్దు కానుందా..?


భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ మ్యాచ్ ఇవాళ్టి నుంచి ప్రారంభం