Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

T20 WC 2026 IND vs USA Toss Playing XIs Updates Highlights1
IND vs USA: టాస్‌ గెలిచిన యూఎస్‌ఏ.. సంజూపై వేటు

T20 World Cup 2026 India vs United States of America Updates: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియా ప్రయాణం మొదలైంది. గ్రూప్‌-‘ఎ’లో భాగంగా తొలుత యూఎస్‌తో భారత్‌ తలపడుతోంది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో టాస్‌ గెలిచిన యూఎస్‌ఏ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్‌కు సిద్ధమైంది.

Wont consider him big cricketer until He: Vaibhav Suryavanshi father2
బిగ్‌ క్రికెటర్‌ అని ఒప్పుకోను: వైభవ్‌ సూర్యవంశీ తండ్రి

వైభవ్‌ సూర్యవంశీ.. క్రికెట్‌ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే హాట్‌టాపిక్‌. ఫార్మాట్‌ ఏదైనా ఈ పాలబుగ్గల పిల్లాడికి బంతిని బౌండరీకి తరలించడమే తెలుసు.. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు పీడకలను మిగల్చడం ఈ యువ బ్యాటర్‌కు అలవాటుగా మారింది..ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీ-2026లో వైభవ్‌ ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. పద్నాలుగేళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. ఈ ఈవెంట్లో ఏడు మ్యాచ్‌లలో కలిపి మూడు అర్ధ శతకాలు.. ఓ సెంచరీ సాధించాడు. ఆ శతకం కూడా ఫైనల్లో.. అదీ ఇంగ్లండ్‌ జట్టుపై ఏకంగా 175 పరుగులు సాధించడం విశేషం.Carnage continues as Vaibhav Sooryavanshi brings up 150 in style! 🔥🤩The English bowlers have no answers as the Boss Baby is going all guns blazing with towering sixes! 🙌🏻😮‍💨ICC Men's #U19WorldCup | FINAL | #INDvENG | LIVE NOW 👉 https://t.co/ZFk8pN9tv3 pic.twitter.com/Dkh4YCXOEC— Star Sports (@StarSportsIndia) February 6, 2026 55 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్‌వరల్డ్‌కప్‌ ఫైనల్లో 55 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్‌.. పలు చిరస్మరణీయ రికార్డులు నెలకొల్పాడు. పద్నాలుగేళ్ల వయసులోనే ఈ బిహారీ కుర్రాడు.. వరల్డ్‌కప్‌ టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలవడంతో పాటు.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు కూడా అందుకున్నాడు.Team India be like: Top karne ki aadat ho gayeli hai apun ko 🏆😎The 6th trophy for Team India in the ICC Men’s #U19WorldCup 🇮🇳Watch the highlights 👉 https://t.co/nXMmxDoivS pic.twitter.com/VDeA2PH3Gh— Star Sports (@StarSportsIndia) February 6, 2026పుత్రోత్సాహంఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లో ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా సాగిన అతడి విధ్వంసం గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఇక వైభవ్‌ తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. పుత్రోత్సాహంతో ఆయన ఉప్పొంగిపోతున్నారు.అప్పటిదాకా బిగ్‌ క్రికెటర్‌ అని ఒప్పుకోనుఈ క్రమంలో సంజీవ్‌ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. తను సాధించాల్సింది ఇంకెంతో ఉంది. వైభవ్‌ టెస్టు మ్యాచ్‌ ఆడేదాకా తననొక స్టార్‌ క్రికెటర్‌గా నేను పరిగణించను’’ అని సంజీవ్‌ సూర్యవంశీ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో పేర్కొన్నారు.అదే విధంగా.. ‘‘నువ్వెంత గొప్పగా ఆడితే అంత హుందాగా, ఒద్దికగా ఉండాలని తనకు చెబుతూ ఉంటాను. సీనియర్లు, కోచ్‌లతో చర్చిస్తూ లోపాలు సరిచేసుకోవాలని చెప్తాను. ‘అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో సెంచరీ చేశావు.. భేష్‌.. అయితే, ఇప్పుడు అది ముగిసిన అధ్యాయం.టెస్టు క్రికెట్‌ ఆడటమే లక్ష్యంటీమిండియా తరఫున టెస్టు క్రికెట్‌ ఆడటమే లక్ష్యంగా పెట్టుకోవాలి’ అని తనకు చెప్పాను. సచిన్‌ టెండుల్కర్‌ను చూసి ఓ క్రికెటర్‌ ఎలా ఉండాలో నేర్చుకోవాలని తనకి బోధించాను. టన్నుల కొద్దీ పరుగులు సాధించినా.. ఆయన ఎప్పుడూ ఒక్క వివాదంలోనూ చిక్కుకోలేదు. ‍క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఆయనను ఆరాధిస్తున్న తీరు గురించి తరచూ చెబుతూ ఉంటాను’’ అని సంజీవ్‌ సూర్యవంశీ పేర్కొన్నారు. తద్వారా తన కుమారుడు కెరీర్‌లోనే కాదు వ్యక్తిత్వంలోనూ మిన్నగా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పకనే చెప్పారు సంజీవ్‌.చదవండి: IND vs PAK: శ్రీలంక లేఖ.. దిగొచ్చిన పాక్‌ బోర్డు? యూటర్న్‌?

T20 WC 2026: England Announce playing XI Vs Nepal Salt Included3
T20 WC: నేపాల్‌తో మ్యాచ్‌.. ఇంగ్లండ్‌ తుదిజట్టు ప్రకటన

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ మొదలైంది. పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌ మ్యాచ్‌తో శనివారం ఈ పొట్టి క్రికెట్‌ సంగ్రామానికి తెరలేచింది. తొలిరోజు ఈ మ్యాచ్‌తో పాటు.. వెస్టిండీస్‌- స్కాట్లాండ్‌.. టీమిండియా- యూఎస్‌ఏ మ్యాచ్‌లకు షెడ్యూల్‌ ఖరారైంది.ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లుఇక గ్రూప్‌-సిలో ఉన్న ఇంగ్లండ్‌ తొలత నేపాల్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఆదివారం మ్యాచ్‌ జరుగనుండగా.. ఇందుకు సంబంధించి ఇంగ్లండ్‌ శనివారమే తమ తుదిజట్టును ప్రకటించింది. హ్యారీ బ్రూక్‌ సారథ్యంలోని ఈ జట్టులో ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లు ఆదిల్‌ రషీద్‌, లియామ్‌ డాసన్‌లకు చోటు దక్కింది.హార్డ్‌ హిట్టర్‌ వచ్చేశాడు!అంతేకాదు.. పూర్తి ఫిట్‌నెస్‌తో హార్డ్‌ హిట్టర్‌ ఫిల్‌ సాల్ట్‌ కూడా తుదిజట్టులోకి వచ్చేశాడు. సాల్ట్‌కు తోడు మాజీ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌తో పాటు కెప్టెన్‌ బ్రూక్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను మరింత పటిష్టం చేశారు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో సామ్‌ కర్రాన్‌, విల్‌ జాక్స్‌, జేకబ్‌ బెతెల్‌ ఉన్నారు. పేస్‌ దళంలో జోఫ్రా ఆర్చర్‌, ల్యూక్‌ వుడ్‌ పేర్లు ఖరారయ్యాయి. కాగా ఇంగ్లండ్‌- నేపాల్‌ మధ్య ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్‌ ఆరంభం అవుతుంది.టీ20 ప్రపంచకప్‌-2026: నేపాల్‌తో మ్యాచ్‌కు ఇంగ్లండ్‌ తుదిజట్టుఫిల్‌ సాల్ట్‌, జోస్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), జేకబ్‌ బెతెల్‌, టామ్‌ బాంటన్‌, హ్యారీ బ్రూక్‌ (కెప్టెన్‌), సామ్‌ కర్రాన్‌, విల్‌ జాక్స్‌, లియామ్‌ డాసన్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, ల్యూక్‌ వుడ్‌.బెంచ్‌: రెహాన్‌ అహ్మద్‌, జోష్‌ టంగ్‌, బెన్‌ డకెట్‌, జేమీ ఓవర్టన్‌.వరల్డ్‌కప్‌ టోర్నీకి నేపాల్‌ జట్టురోహిత్ పౌడెల్ (కెప్టెన్‌), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షి, షేర్ మల్లా, లోకేష్ బామ్.చదవండి: T20 WC: పాక్‌కు చుక్కలు చూపించిన పసికూన.. ఆఖరికి..

Pak Drops At U Turn Hint India Boycott Stance After Sri Lanka Request: Report4
IND vs PAK: పాకిస్తాన్‌ యూటర్న్‌?

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. బంగ్లాదేశ్‌కు అనుకూలంగా ఓటు వేసి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) నిర్ణయాన్ని వ్యతిరేకించిన పీసీబీ.. భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామంటూ నాటకానికి తెరతీసింది. ఈ విషయం గురించి పాక్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ స్వయంగా ప్రకటించడం గమనార్హం.టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, ముందుగా ఐసీసీ కుదిర్చిన ఒప్పందం ప్రకారం.. పాక్‌ కోసం తటస్థ వేదికను ఏర్పాటు చేశారు. పాక్‌ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడేలా షెడ్యూల్‌ ఖరారైంది.భారత్‌- బంగ్లా.. మధ్యలో పాక్‌అయితే, భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు భారత్‌లో రక్షణ ఉండదని.. అందుకే తమ వేదికను కూడా లంకకు మార్చాలంటూ బంగ్లా బోర్డు ఐసీసీని కోరింది. బంగ్లా వాదనలో నిజం లేదని తేల్చిన ఐసీసీ ఇందుకు నిరాకరించింది. అయినా సరే బంగ్లాదేశ్‌ పంతం వీడలేదు. ఫలితంగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది ఐసీసీ.భారత్‌తో మాత్రమే ఆడమంటూఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందని.. లంకలో భారత్‌తో మ్యాచ్‌కు తమకు భద్రత ఉండదంటూ పాక్‌.. టీమిండియాతో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. లీగ్‌ దశలో మిగతా మ్యాచ్‌లకు లేని ఇబ్బంది భారత్‌తో మాత్రమే ఉందని చెప్పడం పాక్‌ ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. అంతేకాదు.. ఒకవేళ భారత్‌- పాక్‌ మ్యాచ్‌ నిజంగానే ఆగిపోతే ఐసీసీతో పాటు సభ్య బోర్డులన్నింటికీ పెద్ద ఎత్తున నష్టం వస్తుంది.ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీలంక క్రికెట్‌ బోర్డు పాకిస్తాన్‌కు లేఖ రాసింది. గతంలో పాక్‌లో తమ జట్టుపై ఉగ్రదాడి జరిగినా.. తిరిగి ఆ దేశంలో పర్యటించిన తొలి జట్టుగా నిలిచామని గుర్తు చేసింది. ఇటీవల కూడా బాంబుల మోతతో దద్దరిల్లిన వేళ పాక్‌లో పర్యటించి పరిమిత ఓవర్ల సిరీస్‌ పూర్తి చేశామని సుతిమెత్తగానే చురకలు అంటించింది.ఉగ్రదాడిని గుర్తుచేస్తూఅలాంటిది.. భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు తాము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక.. అకస్మాత్తుగా మ్యాచ్‌ను బహిష్కరిస్తే.. ఆర్థికంగా భారీ నష్టం వస్తుందని.. ఈ అంశంలో పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇలా పాత విషయాలు ముఖ్యంగా ఉగ్రదాడిని గుర్తుచేస్తూ లంక బోర్డు రాసిన లేఖ పాక్‌ను ఇరకాటంలో పడేసినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ బోర్డు చైర్మన్‌, పాక్‌ మంత్రి మొహ్సిన్‌ నక్వీ భారత్‌తో మ్యాచ్‌ ఆడే విషయమై పునరాలోచన చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సమాచారం. ఈ విషయం గురించి పీసీబీ సన్నిహిత వర్గాలు జాతీయ మీడియాతో మాట్లాడుతూ..గతంలో సాయం చేశాము కదా!‘‘శ్రీలంక ప్రభుత్వం, క్రికెట్‌ బోర్డుతో పాకిస్తాన్‌ ఎల్లప్పుడూ సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. అందుకు తగిన ఫలాలు పొందింది. కాబట్టి లంక బోర్డు నుంచి వచ్చిన లేఖను పాక్‌ నిర్లక్ష్యం చేయలేదు.లంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా.. మొహ్సిన్‌ నక్వీని నేరుగా సంప్రదించి.. పాక్‌ తమకు సాయపడాల్సిందిగా కోరారు. భారత్‌- పాక్‌ మ్యాచ్‌ల వల్ల వచ్చే అదనపు ఆదాయానికి గండికొట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తాము పాక్‌ బోర్డుకు సహాయపడిన విషయాన్ని గుర్తు చేశారు.నక్వీ ఈ విషయం గురించి తప్పక ప్రధాని దృష్టికి తీసుకువెళ్తారు. శ్రీలంక బోర్డు మాత్రమే కాదు.. శ్రీలంక ప్రభుత్వం కూడా గతేడాది నవంబరులో ఆటగాళ్లు మధ్యలోనే వెళ్లిపోకుండా ఒప్పించి.. పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ పూర్తి చేసేలా ఒప్పించారు’’ అని పేర్కొన్నాయి.కఠిన చర్యలు తప్పవుఇదిలా ఉంటే.. పాక్‌ అన్నంత పనిచేస్తే ఐసీసీ కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఐసీసీతో పాటు బ్రాడ్‌కాస్టర్లు, ఇతర సభ్య దేశాలు పెద్ద ఎత్తున నష్టపోయే క్రమంలో పీసీబీని ఆ పరిహారం చెల్లించాలని కోరే అవకాశాలు లేకపోలేదు. పరిస్థితి చేయిదాటితే ఇంకాస్త కఠినంగా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. కాగా ఫిబ్రవరి 15న భారత్‌- పాకిస్తాన్‌ మధ్య వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది.చదవండి: పసికూనను ఓడించేందుకు కష్టపడ్డ పాకిస్తాన్‌

T20 WC 2026: Pakistan Beat Netherlands In Last Over Thirller5
T20 WC: పాక్‌కు చుక్కలు చూపించిన పసికూన.. ఆఖరికి..

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు శనివారం తెరలేచింది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌ తలపడ్డాయి. గ్రూప్‌-ఎ నుంచి ఇరుజట్ల మధ్య పోటీ జరుగగా.. సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.147 పరుగులుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ 19.5 ఓవర్లలో 147 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్లలో మైకేల్‌ లెవిట్‌ (24) ఫర్వాలేదనిపించగా.. బాస్‌డీ లీడే (30), కొలిన్‌ అకెర్‌మాన్‌ (20), కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌ (37) రాణించారు. పాక్‌ బౌలర్లలో సల్మాన్‌ మీర్జా మూడు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్‌ నవాజ్‌, అబ్రార్‌ అహ్మద్‌, సయీబ్‌ ఆయుబ్‌ రెండేసి వికెట్లు కూల్చారు. మిగిలిన వారిలో షాహిన్‌ ఆఫ్రిది ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.ఓపెనర్ల శుభారంభంఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (31 బంతుల్లో 47), సయీబ్‌ ఆయుబ్‌ (13 బంతుల్లో 24) శుభారంభం అందించారు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (12)తో పాటు బాబర్‌ ఆజం (15) తడబడగా.. ఉస్మాన్‌ ఖాన్‌ (0) డకౌట్‌ అయ్యాడు.The pressure is back on Pakistan! 😮‍💨Babar Azam is caught as half of the side is back into the hut!Will Netherlands pull off an upset here? 🤔ICC Men's #T20WorldCup | #PAKvNED | LIVE NOW 👉 https://t.co/GKcXaJHm9F pic.twitter.com/PK1NOGXYju— Star Sports (@StarSportsIndia) February 7, 2026మారిన సీన్‌.. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠషాబాద్‌ ఖాన్‌ (8), నవాజ్‌ (6) చేతులెత్తేయగా.. ఆఖర్లో ఫాహీమ్‌ అష్రఫ్‌ (11 బంతుల్లో 29 నాటౌట్‌) ధనాధన్‌ దంచికొట్టాడు. అతడి తోడు షాహిన్‌ ఆఫ్రిది (5) అజేయంగా నిలిచాడు. అయితే, ఆఖరి ఓవర్లో మూడో బంతికి ఆష్రఫ్‌ కష్టమ్మీద ఫోర్‌ బాదగా పాక్‌ గెలుపు ఖరారైంది. 19.3 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసిన పాక్‌.. మూడు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచి ఊపిరి పీల్చుకుంది.కాగా నెదర్లాండ్స్‌ బౌలర్లలో ఆర్యన్‌ దత్‌.. ఆయుబ్‌, ఆఘా రూపంలో రెండు కీలక వికెట్లు తీయగా.. పాల్‌ వాన్‌ మీకెరెన్‌ సాహిబ్‌జాదా, ఉస్మాన్‌ ఖాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. మిగిలిన వారిలో లోగాన్‌ వాన్‌ బీక్‌, కైలీ క్లెయిన్‌, వాన్‌ డెర్‌ మెర్వె తలా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ విజయంతో పాక్‌ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి.చదవండి: వైభవ్‌ సూర్యవంశీ అరెస్ట్‌కు డిమాండ్‌!.. మరీ ఆ షాట్లు అలా ఆడితే ఎలా?

BCCI central contracts for 2025-26 season leaked. Rohit Sharma, Virat Kohli demoted6
విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మకు భారీ షాకిచ్చిన బీసీసీఐ

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) టీమిండియా దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మకు భారీ షాకిచ్చినట్లు తెలుస్తుంది. త్వరలో ప్రకటించబోయే సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ల జాబితాలో వీరిద్దరూ డిమోషన్‌కు గురైనట్లు సమాచారం. గతంలో విరాట్‌, రోహిత్‌ ఏ ప్లస్‌ కేటగిరిలో ఉండేవారు. తాజాగా ఆ కేటగిరిని పూర్తిగా రద్దు చేస్తూ.. రో-కోను బి కేటగిరిలోకి తరలించినట్లు ప్రచారం జరుగుతుంది. రో-కో టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించి వన్డేల్లో మాత్ర​మే కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీసీసీఐ నిబంధనల ప్రకారం మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉన్న వారికే అత్యుత్తమ కేటగిరి (ఏ ప్లస్‌) లభిస్తుంది. రో-కో రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకోవడంతో వారు బి కేటగిరిలోకి పడిపోయారు.అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం బయటపడింది. టీ20, టెస్ట్‌ల నుంచి తప్పుకున్న రో-కో ఏ ప్లస్‌ నుంచి బి కేటగిరికి పడిపోగా.. టీ20ల నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా మాత్రం ఏ కేటగిరిలోనే ఉన్నట్లు తెలుస్తుంది. జడ్డూతో పాటు భారత వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, పేసు గుర్రం మరియు ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌ జస్ప్రీత్‌ బుమ్రా మాత్రమే ఏ కేటగిరిలో ఉన్నారు. బుమ్రా, జడ్డూ 2024-25 సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాలో విరాట్‌, రోహిత్‌తో పాటు ఏ ప్లస్‌లో ఉండేవారు. ఇప్పుడు ఏ ప్లస్‌ రద్దు కావడంతో బుమ్రా, జడ్డూ ఏ కేటగిరిలోకి వచ్చారు.ఇకపై సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో మూడు కేటగిరిలు (ఏ, బి, సి) మాత్రమే ఉంటాయని సమచారం. గిల్‌, బుమ్రా, జడ్డూ ఏ కేటగిరిలో ఉండగా.. రో-కోతో పాటు టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, వాషి​ంగ్టన్‌ సుందర్‌, హార్దిక్‌ పాండ్యా, సిరాజ్‌, పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, జైస్వాల్‌, కుల్దీప్‌ యాదవ్‌ కేటగిరి బిలో ఉన్నారు.సి కేటగిరిలో అక్షర్ పటేల్‌, తిలక్ వర్మ, రింకూ సింగ్‌, శివమ్‌ దుబే, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ఆకాష్ దీప్, ధృవ్‌ జురెల్‌, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్‌ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్‌, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్‌ ఉన్నట్లు సమాచారం.

Actor Suriya Co Owned Chennai Singams won the ISPL 20267
సూర్య జట్టు 'చెన్నై సింగమ్స్‌'దే ISPL టైటిల్‌

తమిళ నటుడు సూర్య కో-ఓనర్‌గా ఉన్న చెన్నై సింగమ్స్‌ జట్టు తొలి ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ISPL) టైటిల్‌ను కైవసం చేసుకుంది. నిన్న (ఫిబ్రవరి 6) జరగిన ఫైనల్లో ఆ జట్టు కోల్‌కతా టైగర్స్‌పై 29 పరుగుల తేడాతో గెలుపొందింది. సూరత్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సింగమ్స్‌ ఆటగాళ్లు ఆది నుంచే పట్టు సాధించారు. ఈ మ్యాచ్‌ను సూర్యతో పాటు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కూడా ప్రత్యక్షంగా వీక్షించాడు. టెన్నిస్ బాల్‌తో ఆడే ఈ టీ10 లీగ్‌ దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఈ లీగ్‌కు ఇది మూడో ఎడిషన్‌. ఈ ఎడిషన్‌లో కొత్త ప్రతిభలు వెలుగులోకి వచ్చాయి. వివేక్ షెలార్ అనే బౌలర్‌ రెండు హ్యాట్రిక్‌లు నమోదు చేశాడు. అంకిత్ యాదవ్ (కోల్‌కతా) 16 వికెట్లు, ప్రశాంత్ ఘరాట్ (హైదరాబాద్) 203 పరుగులు, నిజామ్ అలీ (అహ్మదాబాద్) 20 వికెట్లు సాధించారు. అవార్డులు - MVP: జగన్నాథ్ సర్కార్ (చెన్నై సింగమ్స్) – బహుమతిగా పోర్షే 911 కారు అందుకున్నాడు. - Best Batter: సైఫ్ అలీ (కోల్‌కతా టైగర్స్) - Best Bowler: ప్రవీణ్ కుమార్ (హైదరాబాద్ ఫాల్కన్ రైజర్స్) - Best Catch: ప్రతమేష్ ఠాకరే (అహ్మదాబాద్ లయన్స్) మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 10 ఓవర్లలో 103/7 చేసింది. ఓపెనర్లు కేతన్ మ్హాత్రే, జగన్నాథ్ సర్కార్ వేగంగా ఆరంభించారు. కేతన్ రెండో ఓవర్‌లోనే 28 పరుగులు కొట్టి దూకుడు చూపాడు. మధ్యలో సరోజ్ ప్రమాణిక్ రెండు వికెట్లు తీసి చెన్నై వేగాన్ని తగ్గించినా, సర్ఫరాజ్ ఖాన్ దూకుడు కొనసాగించాడు. చివర్లో గణేష్, సంభాజీ దూకుడు ప్రదర్శనతో చెన్నై భారీ స్కోర్‌ చేసింది. అనంతరం 104 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో కోల్‌కతా విఫలమైంది. రాజత్ ముంధే, సరోజ్ ప్రమాణిక్ తొలుత కష్టపడ్డారు. జగన్నాథ్ సర్కార్ కీలక వికెట్‌ తీసి కోల్‌కతాను దెబ్బకొట్టాడు. అరిష్ ఖాన్ 25 పరుగులు చేసి కొంత ప్రతిఘటన చూపినా, కోల్‌కతా స్కోర్‌ 74/9కే పరిమితమైంది. అనురాగ్ సర్షర్ 3 వికెట్లు తీసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. సునీల్ కుమార్, అంకుర్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు.

BCCI announced 7.5 Crores for winning the U19 World Cup for Indian team8
జగజ్జేత భారత్‌కు భారీ నజరానా

అండర్‌ 19 ప్రపంచకప్‌ 2026 విజేత భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆరోసారి జగజ్జేతగా నిలిచిన యువ భారత జట్టుకు రూ. 7.50 కోట్ల భారీ నగదు బహుమతిని అనౌన్స్‌ చేసింది. హరారే వేదికగా నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన ఫైనల్లో భారత్‌ ఇంగ్లండ్‌ను 100 పరుగుల తేడాతో చిత్తు చేసింది. చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌ (80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు) ఆడి భారత్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. జట్టుగానూ భారత్‌ పలు రికార్డులు సొంతం చేసుకుంది.దేశమంతా గర్విస్తుందిజగజ్జేత భారత్‌కు నగదు బహుమతి ప్రకటిస్తున్న సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా మాట్లాడుతూ.. మా అండర్ 19 జట్టు వరల్డ్‌కప్‌ను గెలిచినందుకు దేశమంతా గర్విస్తోంది. ఇంగ్లండ్‌పై ఫైనల్లో చూపిన ప్రదర్శన, టోర్నమెంట్ మొత్తం ఓటమి లేకుండా ఆడిన తీరు అద్భుతం. ఈ విజయానికి గుర్తుగా రూ. 7.50 కోట్ల బహుమతి అందజేస్తున్నామని అన్నారు. ప్రధాని అభినందనలు ఆరోసారి ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందించారు. భారత క్రికెట్ ప్రతిభ మరోసారి వెలుగొందింది. అండర్ 19 జట్టు వరల్డ్‌కప్‌ను గెలిచి దేశానికి గర్వకారణమైంది. ఈ విజయం అనేక యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఆరోసారి తాజా టైటిల్‌తో భారత్‌ ఆరోసారి అండర్ 19 వరల్డ్‌కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది. గతంలో భారత్‌ 2000, 2008, 2012, 2018, 2022 ఎడిషన్లలో విజేతగా నిలిచింది.కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్స్‌ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్‌. భారత ఇన్నింగ్స్‌లో వైభవ్‌ విధ్వంసకర భారీ శతకాన్ని నమోదు చేయగా.. కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (53) అర్ద సెంచరీతో రాణించాడు. అనంతరం కష్టసాధ్యమైన ఛేదనలో ఇంగ్లండ్‌ అద్భుతంగా పోరాడింది. అయితే లక్ష్యం అతి భారిది కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కాలెబ్‌ (115) వీరోచిత శతకంతో ఆకట్టుకున్నాడు. చివరికి ఇంగ్లండ్‌ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటై, 100 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.

T20 WC: Bumrah doubtful for USA clash, Mohammed Siraj likely to step in9
టీమిండియాకు ఊహించని షాక్‌

టీ20 ప్రపంచకప్‌ 2026 ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 7) ప్రారంభం​ కానుంది. ఇవాళే భారత్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్‌ఏ తలపడనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.కాగా, ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్‌ తగిలిందని తెలుస్తుంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. బుమ్రా వైరల్‌ ఫీవర్‌ బారిన పడినట్లు తెలుస్తుంది. ఈ కారణంగా అతను శుక్రవారం నాటి నెట్‌ ప్రాక్టీస్‌కి హాజరుకాలేదు. దీంతో నేటి మ్యాచ్‌కు బుమ్రా దూరమవుతాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే.. ప్రత్యర్ది (యూఎస్‌ఏ) చిన్నదే అయినా, ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. గత ప్రపంచకప్‌లో ఇదే జట్టు పాక్‌కు షాకిచ్చింది. కాబట్టి, బుమ్రా అందుబాటులో లేకపోయినా టీమిండియా మరో పేస్‌ బౌలింగ్‌ ఆప్షన్‌తో సిద్దంగా ఉండక తప్పదు.ఒకవేళ బుమ్రా నిజంగా యూఎస్‌ఏ మ్యాచ్‌కు దూరమైతే కొత్తగా జట్టులోకి వచ్చిన సిరాజ్‌కు తుది జట్టులో అవకాశం ఉండవచ్చు. హార్దిక్ పాండ్యా కొత్త బంతితో బౌలింగ్‌ ప్రారంభించే అవకాశం ఉండగా, సిరాజ్‌ ఫస్ట్‌-చేంజ్‌ బౌలర్‌గా ఉపయోగపడతాడు. యూఎస్‌ఏతో మ్యాచ్‌ తర్వాత భారత్‌ ఫిబ్రవరి 12న నమీబియాతో తలపడనుంది. ఆతర్వాత ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో మ్యాచ్‌ షెడ్యూలైంది. అయితే ఈ మ్యాచ్‌పై అనిశ్చితి ఇంకా కొనసాగుతుంది. పాక్‌ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్‌ ఆడినా ఆడకపోయినా, భారత్‌ అయితే ఈ మ్యాచ్‌ కోసం కొలొలంబోకు వెళ్తుంది. ఒకవేళ పాక్‌ నిజంగా బరిలోకి దిగకపోతే భారత్‌కు మ్యాచ్‌ ఆడకుండానే పాయింట్లు లభిస్తాయి. దీని తర్వాత టీమిండియా ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్‌తో తమ చివరి గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఆడనుంది.యూఎస్‌ఏతో మ్యాచ్‌కు భారత జట్టు (అంచనా)..ఇషాన్‌ కిషన్‌, అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, మొహమ్మద్‌ సిరాజ్‌

Madushan replaces injured Eshan Malinga in Sri Lanka's World Cup squad10
శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ.. కీలక మార్పు

శ్రీలంక టీ20 ప్రపంచకప్‌ 2026 జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఫిబ్రవరి 1న ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో గాయపడిన ఈషాన్‌ మలింగ ప్రపంచకప్‌ మొత్తానికి దూరమయ్యాడు. మలింగ స్థానంలో ప్రమోద్‌ మదుశన్‌ జట్టులోకి వచ్చాడు. తొలుత ప్రకటించిన జట్టులో ప్రమోద్‌ స్థానాన్ని ఆశించి భంగపడ్డాడు. అయితే ఈషాన్‌ గాయపడటంతో ప్రమోద్‌కు బంపరాఫర్‌ దక్కింది. ఈషాన్‌, ప్రమోద్‌ ఇద్దరూ రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్లే. ఈషాన్‌ లంక టీ20 జట్టులో రెగ్యులర్‌ సభ్యుడు కాగా.. ప్రమోద్‌ లంక తరఫున టీ20 ఆడి దాదాపు మూడేళ్లవుతుంది. అతను చివరిగా 2023 ఏప్రిల్‌లో లంక తరఫున టీ20 ఆడాడు. ప్రమోద్‌ అంతర్జాతీయ టీ20 ఆడి చాలాకాలమే అయినా పొట్టి ఫార్మాట్‌తో మాత్రం అనునిత్యం టచ్‌లోనే ఉన్నాడు. 24 ఏళ్ల ప్రమోద్‌ ఇప్పటివరకు 8 అంతర్జాతీయ టీ20లు ఆడి 12 వికెట్లు తీశాడు. ఈ ప్రపంచకప్‌లో ప్రమోద్‌.. మతీష పతిరణ. దుష్మంత చమీరాతో కలిసి కొత్త బంతిని షేర్‌ చేసుకుంటాడు.స్వదేశంతో పాటు భారత్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ ఇవాల్టి నుంచే (ఫిబ్రవరి 7) ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో గ్రూప్‌-బిలో ఉన్న శ్రీలంక.. తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8న ఐర్లాండ్‌తో ఆడనుంది. ఈ గ్రూప్‌లో శ్రీలంక, ఐర్లాండ్‌తో పాటు ఆస్ట్రేలియా, ఒమన్‌, జింబాబ్వే జట్లు ఉన్నాయి.అప్‌డేటెడ్‌ శ్రీలంక జట్టు..- దసున్ షనక (కెప్టెన్) - పథుమ్ నిస్సంక - కమిల్ మిశారా - కుసల్ మెండిస్ - కమిందు మెండిస్ - కుసల్ జానిత్ పెరేరా - చరిత్ అసలంక - జానిత్ లియానగే - పవన్ రత్నాయకే - వనిందు హసరంగ - దునిత్ వెల్లలాగే - మహీష్ తీక్షణ - దుష్మంత చమీరా - మతీషా పథిరానా - ప్రమోద్ మదుశన్

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement