Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Scottish Star Brandon McMullen Achieves Historic ODI Double1
చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్ ప్లేయర్‌.. కపిల్‌ దేవ్‌ రికార్డు బద్దలు

అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో స్కాట్లాండ్ ఆల్ రౌండర్ బ్రాండ‌న్ మెక్‌ముల్లెన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 1000 ప‌రుగుల‌తో పాటు 50 వికెట్లు సాధించిన రెండో ఆట‌గాడిగా మెక్‌ముల్లెన్ చ‌రిత్ర సృష్టించాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023-27 లీగ్ టూలో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రాండన్ ఈ రికార్డు సాధించాడు.ఈ ఫీట్‌ను స్కాటిష్ ఆల్‌రౌండర్ తన 33వ వన్డే ఇన్నింగ్స్‌లోనే అందు​కోవడం విశేషం. ఈ క్రమంలో దిగ్గజ క్రికెటర్లు కపిల్‌దేవ్‌(46 ఇన్నింగ్స్‌లు), లాన్స్ క్లూసెనర్(42 ఇన్నింగ్స్‌లు), స్టీవ్ వా (46 ఇన్నింగ్స్‌లు) షకీబ్ అల్ హసన్‌(50 ఇన్నింగ్స్‌లు)ను మెక్‌ముల్లెన్ అధిగమించాడు. కాగా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో నెదర్లాండ్స్ క్రికెట్ దిగ్గజం ర్యాన్ టెన్ డెష్కాట్ అగ్రస్ధానంలో ఉన్నాడు.డెష్కాట్ కేవలం 25 వన్డే ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. ఇక బ్రాండన్ మెక్‌ముల్లెన్.. తన 33 మ్యాచ్‌ల వన్డే కెరీర్‌లో 4 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలతో సహా 1,149 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 151గా ఉంది. అదేవిధంగా 20.09 సగటుతో 52 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్ కూడా ఉంది.డచ్ జట్టు చిత్తు..కాగా మ్యాచ్ విషయానికి వస్తే.. డచ్ జట్టుపై స్కాట్లాండ్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. స్కాటిష్ బ్యాటర్లలో ఫిన్లే మెక్‌క్రీత్ (106 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్సర్‌తో 81) టాప్ స్కోరర్‌గా నిలవగా..మార్క్ వాట్ (72 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్‌లతో 60) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్య చేధనలో నెదర్లాండ్స్ 45 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది.

India A vs England Lions  2nd Unofficial Test: India-A bundled out for 3482
IND-A vs ENG: 348 ప‌రుగుల‌కు భార‌త్‌-ఎ ఆలౌట్‌

నార్తంప్ట‌న్ వేదిక‌గా ఇంగ్లండ్ ల‌య‌న్స్‌తో జ‌రుగుతున్న రెండో అనాధికారిక భార‌త్‌-ఎ జ‌ట్టు బ్యాట‌ర్లు రాణించారు. టాస్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌-ఎ జ‌ట్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో 348 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 319/7 ఓవ‌ర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన భార‌త జ‌ట్టు.. అద‌నంగా 29 ప‌రుగులు చేసి త‌మ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఇండియా బ్యాట‌ర్ల‌లో కేఎల్ రాహుల్ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. 168 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 116 ప‌రుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాహుల్‌తో పాటు వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురేల్‌ (87 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... గత మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన కరుణ్‌ నాయర్‌ (71 బంతుల్లో 40; 4 ఫోర్లు), ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (57 బంతుల్లో 34; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఇక ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో సీనియర్ పేస‌ర్ క్రిస్ వోక్స్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా..జోష్ టంగ్, జార్జ్ హిల్ త‌లా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన తొలి అనాధికారిక టెస్టు డ్రాగా ముగిసిన సంగ‌తి తెలిసిందే.మ‌రో 13 రోజుల్లో..ఇక భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ఇంగ్లండ్ గ‌డ్డ‌పై అడుగుపెట్టిన భార‌త జ‌ట్టు.. తొలి టెస్టు కోసం తీవ్రంగా శ్ర‌మిస్తోంది. కోహ్లి, రోహిత్ శ‌ర్మ వంటి దిగ్గ‌జాలు లేకుండా ఇంగ్లండ్‌కు వెళ్లిన టీమిండియా.. ప్ర‌త్య‌ర్ధి జట్టును ఎలా ఎదుర్కొంటుందోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా ఈ సిరీస్ జ‌ర‌గ‌నుంది. రోహిత్ శ‌ర్మ స్ధానంలో కొత్త టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన విష‌యం విధిత‌మే.ఇంగ్లండ్‌ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వ‌ర‌న్‌, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్

Magnus Carlsen wins Norway event after Gukesh blunders vs Caruana3
నార్వే చెస్ టోర్నీ విజేత‌గా మాగ్నస్ కార్ల్‌సన్.. గుకేశ్‌కు నిరాశ‌

నార్వే చెస్​ 2025 టోర్నమెంట్ విజేత‌గా ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్ నిలిచాడు. ప్రస్తుత వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌, భార‌త యువ సంచ‌ల‌నం డి. గుకేష్, అమెరికా గ్రాండ్ మాస్ట‌ర్ ఫాబియానో ​​కరువానాను ఓడించి టైటిల్‌ను మాగ్న‌స్‌ గెలుచుకున్నాడు. ఆఖ‌రి రౌండ్‌లోకి వెళ్లేముందు కార్ల్‌సెన్, గుకేష్ మ‌ధ్య కేవలం అర పాయింట్ తేడా మాత్రమే ఉండేది. ఈ క్ర‌మంలో గుకేశ్​ కీల‌కమైన ప‌దో రౌండ్‌లో ఫాబియానో కరువానాతో త‌ల‌ప‌డ్డాడు. నువ్వానేనా జ‌రిగిన చివ‌రి రౌండ్‌లో గుకేశ్ కాస్త ఒత్తిడికి లోన‌య్యి ఓట‌మి చ‌విచూశాడు. దీంతో గుకేశ్ 14.5 పాయింట్లతో మూడో స్థానంలో ప‌రిమియ‌త‌మ‌య్యాడు. మ‌రోవైపు కార్ల్‌స‌న్ చివ‌రి రౌండ్‌లో అద‌ర‌గొట్టాడు. భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసితో గేమ్‌ను డ్రా చేసుకుని టోర్నీలో అగ్రస్థానంలో నిలిచిన కార్లెసెన్‌(16 పాయింట్లు) ఛాంపియ‌న్‌గా అవ‌త‌రించాడు. ఇక మ‌హిళ‌ల విభాగంలోఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ అన్నా ముజిచుక్ 16.5 పాయింట్లతో విజేతగా నిలిచింది. భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి మూడో స్థానంతో టోర్నీని ముగించింది.చదవండి: రోహిత్ శర్మకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌?

Michael Clarke backs Sai Sudharsans Test debut at No 3 for India vs England4
'అత‌డొక సూప‌ర్ స్టార్‌.. గిల్ స్దానంలో బ్యాటింగ్‌కు పంపండి'

త‌మిళ‌నాడు యువ సంచ‌ల‌నం సాయిసుద‌ర్శ‌న్ టీమిండియా త‌ర‌పున టెస్టు అరంగేట్రం చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు. జూన్ 20 నుంచి లీడ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగే తొలి టెస్టులో సుద‌ర్శ‌న్ డెబ్యూ చేయ‌డం దాదాపు ఖాయ‌మైంది. భార‌త జ‌ట్టుతో పాటు లండ‌న్‌కు చేరుకున్న సుద‌ర్శ‌న్ త‌న ప్రాక్టీస్‌ను మొద‌లుపెట్టాడు. వ‌న్డే, టీ20ల్లో త‌నకు వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగ‌ప‌రుచుకున్న సుద‌ర్శ‌న్‌.. ఇప్పుడు వైట్‌బాల్ జెర్సీలో భార‌త త‌ర‌పున స‌త్తాచాటాల‌ని భావిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో సుద‌ర్శ‌న్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖ‌ల్ క్లార్క్‌ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అత‌డొక అద్బుత‌మైన ఆట‌గాడ‌ని, మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు పంపాల‌ని క్లార్క్ సూచించాడు.కాగా విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్ర‌క‌టించడంతో కొత్త కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ నాలుగో స్ధానంలో బ్యాటింగ్ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. దీంతో గిల్ స్ధానంలో సుద‌ర్శ‌న్ బ్యాటింగ్‌కు రావాల‌ని క్లార్క్‌తో పాటు ప‌లు మాజీలు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు."సాయిసుద‌ర్శ‌న్ ఒక సూప‌ర్ స్టార్‌. అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. అత‌డు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా షాట్లు ఆడగ‌ల‌డు. టెస్టు క్రికెట్‌లో అత‌డు నంబ‌ర్ త్రీ స్ధానానికి స‌రిగ్గా స‌రిపోతాడు. అదే వ‌న్డే, టీ20ల్లో అయితే ఓపెన‌ర్‌గా అత‌డు ఇన్నింగ్స్‌ను ప్రారంభించాల‌ని భావిస్తున్నాను. సుద‌ర్శ‌న్ భార‌త టెస్టు సెట‌ప్‌లో భాగంగా ఉన్నాడు. కాబ‌ట్టి అత‌డికి ఇంగ్లండ్‌పై గ‌డ్డ‌పై అరంగేట్రం చేసే అవ‌కాశం లభిస్తుంది" అని క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో క్లార్క్ పేర్కొన్నాడు.

Australian Great Michael Clarke Makes Huge Claim On Virat Kohlis Test Retirement5
అలా జరిగితే కోహ్లి రిటైర్మెంట్ వెనక్కి: మైఖేల్ క్లార్క్

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు విరాట్ త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డిండాడు. అత‌డితో పాటు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా రెడ్‌బాల్ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు.అత‌డి స్ధానంలో కొత్త టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ ఎంపిక‌య్యాడు. కోహ్లి, రోహిత్ శ‌ర్మ వంటి ఇద్ద‌రూ దిగ్గ‌జాల లేకుండానే భార‌త జ‌ట్టు ఇంగ్లండ్‌కు ప‌య‌న‌మైంది. కేఎల్ రాహుల్‌, జ‌డేజా, బుమ్రా మిన‌హా పెద్ద‌గా అనుభ‌వం ఉన్న ఆట‌గాళ్లు ప్ర‌స్తుత భార‌త టెస్టు జ‌ట్టులో లేరు. దీంతో ఇంగ్లండ్‌పై గిల్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు ఎలా రాణిస్తుందో అని అంద‌రూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ నేప‌థ్యంలో విరాట్ కోహ్లి రిటైర్మెంట్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఇంగ్లండ్‌తో జ‌రిగే ఐదు టెస్టు సిరీస్‌లో టీమిండియా ఘోరంగా ఓడిపోతే విరాట్ తిరిగి త‌న రిటైర్మెంట్‌ను వెన‌క్కి తీసుకుంటాడ‌ని క్లార్క్ అభిప్రాయపడ్డాడు."ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత జట్టు 5-0 తేడాతో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొటే, కచ్చితంగా విరాట్ కోహ్లి తిరిగి రావాలని అంతా కోరుకుంటారు. ఆ సమయంలో కెప్టెన్‌, అభిమానులు, సెలక్టర్లు అభ్యర్దిస్తే కోహ్లి కచ్చితంగా తన మనసును మార్చుకుంటాడని అనుకుంటున్నాను. ఎందుకంటే అతడు ఇప్పటికీ టెస్ట్ క్రికెట్‌ను ప్రేమిస్తున్నాడు. ఆ ఫార్మాట్‌పై అతనికి ఎంత మక్కువ ఉందో అందరికీ తెలుసు. విరాట్ ఇప్పటికీ మెరుగైన క్రికెట్ ఆడుతున్నాడు. అయితే విరాట్ రిటైర్మెంట్ గల కారణాలంటో మనకు తెలియదు. కానీ ప్రతీ ఒక్కరూ తమ కెరీర్‌ను ఏదో ఒక చోట ముగించికతప్పదు" అని బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లార్క్ పేర్కొన్నాడు. తన కెరీర్‌లో 123 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి, 30 సెంచరీలు, 31 అర్ధసెంచరీలతో మొత్తం 9,230 పరుగులు చేశాడు. చదవండి: రోహిత్ శర్మకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌?

Yashasvi Stands Ground After Being Given Out, Expresses Displeasure6
అలా ఎలా ఔట్ ఇస్తావు.. అంపైర్‌పై జైశ్వాల్ ఫైర్‌! వీడియో వైర‌ల్‌

నార్తంప్ట‌న్ వేదిక‌గా ఇంగ్లండ్ ల‌య‌న్స్‌తో జ‌రుగుతున్న రెండో అనాధికారిక భార‌త్‌-ఎ జ‌ట్టు స్టార్ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్ నిరాశ‌ప‌రిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 17ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి జైశ్వాల్ ప్యాడ్‌కు తాకింది. వెంట‌నే కీప‌ర్‌తో పాటు బౌల‌ర్ ఎల్బీకి అప్పీల్ చేయ‌గా అంపైర్ వెంట‌నే ఔట్ అని వేలు పైకెత్తాడు. ఈ క్ర‌మంలో అంపైర్ నిర్ణ‌యం ప‌ట్ల జైశ్వాల్ తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. జైస్వాల్ కొన్ని సెకన్ల పాటు క్రీజులోనే నిలబడి అలా షాక్‌లో ఉండిపోయాడు. బంతి స్టంప్స్‌ను మిస్స్ అవుతుంది, ఎలా ఔట్ ఇస్తావు అన్నట్లు అంపైర్ వైపు చూస్తూ జైశ్వాల్ సైగ చేశాడు. అయితే ఈ అనధికారిక టెస్ట్‌లో డీఆర్‌ఎస్ అందుబాటులో లేకపోవడంతో, జైశ్వాల్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.శత​క్కొట్టిన రాహుల్‌..ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు ముందు స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ సత్తా చాటాడు. ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’జట్టు తరఫున బరిలోకి దిగిన రాహుల్‌ (168 బంతుల్లో 116; 15 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో విజృంభించాడు.రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకగా... జట్టులో అందరికంటే సీనియ‌ర్‌ రాహుల్‌కు ఈ మ్యాచ్‌ ద్వారా చక్కటి ప్రాక్టీస్‌ లభించింది. ఫలితంగా శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ‘ఎ’జట్టు 83 ఓవర్లలో 7 వికెట్లకు 319 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రాహుల్‌తో పాటు వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురేల్‌ (87 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... గత మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన కరుణ్‌ నాయర్‌ (71 బంతుల్లో 40; 4 ఫోర్లు), ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (57 బంతుల్లో 34; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.చదవండి: రోహిత్ శర్మకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌?Won’t be the only time Woakes gets Jaiswal this summer.pic.twitter.com/UwT23WycGr— England's Barmy Army 🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿🎺 (@TheBarmyArmy) June 6, 2025

Shreyas Iyer Joins White-Ball Captaincy Race: Reports7
రోహిత్ శర్మకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌?

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ తుది మెట్టుపై బోల్తా ప‌డిన‌ప్ప‌టికి.. ఆ జ‌ట్టు సార‌థి శ్రేయ‌స్ అయ్య‌ర్ త‌న కెప్టెన్సీతో అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు. త‌న అద్బుత‌మైన కెప్టెన్సీతో పంజాబ్ కింగ్స్‌ను ప‌దేళ్ల త‌ర్వాత ఫైన‌ల్‌కు చేర్చాడు. మ‌రోవైపు వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న ప‌రంగా అయ్య‌ర్ దుమ్ములేపాడు.దీంతో అయ్య‌ర్‌కు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రివార్డు ల‌భించిన‌ట్లు తెలుస్తోంది. ఇండియ‌న్స్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. టీమిండియా వైట్‌బాల్ కెప్టెన్సీ రేసులో శ్రేయ‌స్ ఉన్న‌ట్లు స‌మాచారం. అదేవిధంగా గ‌త కొంత‌కాలంగా కేవ‌లం వ‌న్డేల‌కే ప‌రిమితైన అయ్య‌ర్ భార‌త టీ20 జ‌ట్టులోకి పున‌రాగ‌మ‌నం చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.కెప్టెన్సీ రేసులో శ్రేయస్‌..శ్రేయ‌స్ అయ్య‌ర్ ప్ర‌స్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌లో త‌న అద్బుత‌ ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత అయ్య‌ర్ టీ20 సెట‌ప్‌లోకి కూడా వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అంతేకాకుండా అయ్య‌ర్ ఇప్పుడు వైట్‌కెప్టెన్సీ రేసులో కూడా ఉన్నాడు అని ఓ బీసీసీఐ అధికారి ది ఇండియ‌న్స్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు.కాగా ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు టీ20 కెప్టెన్‌గా సూర్య‌కుమార్ యాద‌వ్ ఉండ‌గా.. రోహిత్ శ‌ర్మ వ‌న్డే జ‌ట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ ఇటీవ‌లే నియ‌మితుడ‌య్యాడు. అయితే మూడు ఫార్మాట్ల‌కు వెర్వేరు కెప్టెన్ల‌ను నియ‌మించాల‌ని బీసీసీఐ ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం.ఇప్ప‌టికే టెస్టుల‌కు, టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్ శ‌ర్మ త్వ‌ర‌లోనే వ‌న్డేల‌కు సైతం వీడ్కోలు ప‌లికే ఛాన్స్ ఉంది. ఒక‌వేళ రిటైర్మెంట్ ప్ర‌క‌టించికపోయినా కెప్టెన్సీ నుంచి మాత్రం త‌ప్పుకునే అవ‌కాశ‌ముంది. ఈ క్ర‌మంలో అయ్య‌ర్‌కు వ‌న్డే ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని బీసీసీఐ పెద్ద‌లు యోచిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.చదవండి: ENG vs WI: జోస్ బ‌ట్ల‌ర్ విధ్వంసం.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌

Jos Buttler and Liam Dawson star as England beat West Indies by 21 runs In 1st T20I8
జోస్ బ‌ట్ల‌ర్ విధ్వంసం.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌

వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. చెస్టర్-లె-స్ట్రీట్ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో 21 ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట‌ర్లలో స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు.ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన బ‌ట్ల‌ర్‌.. విండీస్ బౌల‌ర్ల‌ను ఊతికారేశాడు. ఈ మ్యాచ్‌లో కేవ‌లం 59 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న బ‌ట్ల‌ర్‌.. 6 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 96 ప‌రుగులు చేశాడు. అత‌డితో పాటు యువ ఓపెన‌ర్ జేమీ స్మిత్‌(38), జాక‌బ్ బెత‌ల్‌(23) రాణించారు. విండీస్ బౌల‌ర్ల‌లో షెఫ‌ర్డ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. జోష‌ఫ్‌, ర‌స్సెల్‌, ఛేజ్ త‌లా వికెట్ సాధించారు.తిప్పిసేన డాసన్‌..అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 167 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఇంగ్లండ్ స్పిన్న‌ర్ లియాస్ డాస‌న్ ధాటికి క‌రేబియ‌న్ బ్యాట‌ర్లు విల్ల‌విల్లాడారు. డాసన్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టును దెబ్బ‌తీశాడు.అత‌డితో పాటు జాక‌బ్ బెత‌ల్, మాథ్యూ పాట్స్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఇక విండీస్ ఇన్నింగ్స్‌లో ఎవిన్ లూయిస్‌(39) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో టీ20 బ్రిస్టల్ వేదిక‌గా ఆదివారం జ‌ర‌గ‌నుంది.చదవండి: Bengaluru stampede: తొక్కిసలాట ఘటన.. కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌లో ఇద్దరి రాజీనామా

Bengaluru stampede: KSCA secretary & treasurer resign on moral grounds9
తొక్కిసలాట ఘటన.. కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌లో ఇద్దరి రాజీనామా

బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియం వ‌ద్ద జ‌రిగిన తొక్క‌స‌లాట ఘ‌ట‌న‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌కు నైతిక బాథ్య‌త వ‌హిస్తూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) కార్యదర్శి ఎ. శంకర్, కోశాధికారి ఈఎస్. జైరాం త‌మ పదవులకు రాజీనామా చేశారు. వీరిద్ద‌రూ త‌మ రాజీనామాల‌ను శుక్ర‌వారం కేఎస్‌సీఎ అధ్యక్షుడు రఘురామ్ భట్‌కు సమర్పించారు. "గ‌త రెండు రోజుల‌గా ఊహించని, దుర‌దృష్టకర సంఘటనలు జరిగాయి. ఇందులో మా పాత్ర పరిమితమైనప్పటికీ మేము మా పదవులకు రాజీనామా చేస్తున్నామని" శంకర్‌, జైరాం​ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.దూకుడు పెంచిన పోలీసులు..కాగా బుధ‌వారం (జూన్ 4) ఆర్సీబీ విజ‌యోత్స‌వ స‌భ‌లోజరిగిన తొక్కిసలాటలో 11మంది మృతిచెందారు. దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ తొక్కిసలాట కేసు దర్యాప్తును బెంగ‌ళూరు పోలీసులు వేగవంతం చేశారు.ఇప్ప‌టికే ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను అరెస్టు చేశారు. వీరితో పాటు ఈ ఈవెంట్‌ నిర్వాహక సంస్థ డీఎన్ఎ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

India to face Netherlands today in FIH Pro League Hockey10
‘ఆఖరి’ అంచెకు భారత్‌ ‘సై’

అమ్‌స్టెల్వీన్‌ (నెదర్లాండ్స్‌): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ లీగ్‌ హాకీ ఆఖరి అంచె పోటీలకు భారత జట్లు సిద్ధమయ్యాయి. ఈ యూరో అంచె పోటీల్లో అంచనాలకు మించి రాణించాలని, గరిష్ట పాయింట్లతో నేరుగా ప్రపంచకప్‌ బెర్తు సాధించాలని పురుషుల, మహిళల జట్లు పట్టుదలతో ఉన్నాయి. ముందుగా భారత పురుషుల జట్టు నేడు ఆతిథ్య నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. భువనేశ్వర్‌ అంచె పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన భారత్‌ వచ్చే ప్రపంచకప్‌కు వేదికైన నెదర్లాండ్స్‌లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. నేడు, 9వ తేదీన డచ్‌ టీమ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం ద్వారా యూరో అంచెకు శుభారంభం పలకాలని హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలోని భారత్‌ భావిస్తోంది. ప్రస్తుతం 15 పాయింట్లతో ఇంగ్లండ్‌ (16), బెల్జియం (16)ల తర్వాత మూడో స్థానంలో ఉన్న హర్మన్‌ బృందం ఈ ఆఖరి అంచె పోటీలతో మెరుగైన స్థానంలో నిలవాలని ఆశిస్తోంది. డ్రాగ్‌ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్, మిడ్‌ఫీల్డ్‌లో హార్దిక్‌ సింగ్‌లతో పాటు రక్షణ శ్రేణిలో అమిత్‌ రోహిదాస్, హర్మన్, జుగ్‌రాజ్, జర్మన్‌ప్రీత్‌లు స్థాయికి తగిన ఆటతీరును కనబరిస్తే గెలుపు ఏమంత కష్టం కాదు. భారత చీఫ్‌ కోచ్‌ క్రెయిగ్‌ ఫుల్టన్‌ తమ జట్టు అన్ని రంగాల్లోనూ మెరుగైందని, యువ ఆటగాళ్లు సైతం అనుభవం సంపాదించారని తప్పకుండా ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారని అన్నాడు. నెదర్లాండ్స్‌తో పోరు ముగిశాక భారత్‌ 11, 12 తేదీల్లో అర్జెంటీనాతో, 14, 15 తేదీల్లో ఆ్రస్టేలియాతో, 21, 22 తేదీల్లో బెల్జియంతో తలపడుతుంది. మరోవైపు మహిళల జట్టు యూరో అంచె పోటీలను లండన్‌లో ఆడనుంది. ఈ నెల 14 నుంచి భారత మహిళల జట్టు పోరు ప్రారంభం అవుతుంది. భారత జట్టు తొమ్మిది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు రెండింటిలో మాత్రమే గెలిచింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement