ప్రధాన వార్తలు

అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే ఔట్
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది.సీఎస్కే బ్యాటర్లలో సామ్ కుర్రాన్(88) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు బ్రెవిస్(32) పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో చాహల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. చాహల్తో పాటు అర్ష్దీప్, జాన్సెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్..అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 72 పరుగులు చేశాడు. అతడితో పాటు ప్రభ్సిమ్రాన్ సింగ్(54) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సీఎస్కే బౌలర్లలో పతిరానా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్,ఖాలీల్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన చాహల్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్గా

చరిత్ర సృష్టించిన చాహల్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్గా
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. తన బౌలింగ్ కోటాలో తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న చాహల్ను పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి 19వ ఓవర్ వేసేందుకు ఎటాక్లో తీసుకొచ్చాడు. ఓ ఓవర్లో చాహల్ అద్బుతం చేశాడు. తొలి బంతిని సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని సిక్సర్గా మలచగా.. అనంతరం రెండో బంతికి భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హుడా మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక్కడ నుంచి చాహల్ మ్యాజిక్ మొదలైంది. నాలుగో బంతికి దీపక్ హుడా ఔట్ కాగా.. ఐదో బంతికి కాంబోజ్, ఆరో బంతికి నూర్ ఆహ్మద్ ఔటయ్యాడు. దీంతో చాహల్ ఖాతాలో రెండో ఐపీఎల్ హ్యాట్రిక్ వచ్చి చేరింది. ఓవరాల్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన చాహల్..32 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో చాహల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చాహల్ సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ తరపున హ్యాట్రిక్ వికెట్లు తీసిన నాలుగో బౌలర్గా చాహల్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, అక్షర్ పటేల్, సామ్ కుర్రాన్ ఉన్నారు.👉ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్పై హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా చాహల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ బౌలర్గా కూడా ఈ ఫీట్ సాధించలేకపోయాడు.👉ఐపీఎల్లో అత్యధిక సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్గా యువరాజ్ సింగ్ రికార్డును చాహల్ సమం చేశాడు. యువీ, చాహల్ రెండు సార్లు హ్యాట్రిక్ సాధించాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో అమిత్ మిశ్రా(3) తొలి స్ధానంలో ఉన్నాడు.👉అదేవిధంగా ఐపీఎల్లో అత్యధిక సార్లు 4 వికెట్ల హాల్ సాధించిన బౌలర్గా చాహల్ నిలిచాడు. చాహల్ ఇప్పటివరకు 9 సార్లు నాలుగుకు పైగా వికెట్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు సునీల్ నరైన్(8) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో నరైన్ రికార్డును చాహల్ బ్రేక్ చేశాడు.చదవండి: #Glenn Maxwell: ఐపీఎల్-2025 నుంచి మాక్స్వెల్ ఔట్..

ఐపీఎల్-2025 నుంచి మాక్స్వెల్ ఔట్..
ఐపీఎల్-2025లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్, పంజాబ్ కింగ్స్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ ప్రయాణం ముగిసింది. చేతి వేలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మధ్యలోనే మాక్స్వెల్ వైదొలిగాడు. ప్రాక్టీస్ సెషన్లో మాక్స్వెల్ చేతి వేలికి ఫ్రాక్చర్ అయింది.ఈ విషయాన్ని సీఎస్కేతో మ్యాచ్ సందర్బంగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ధ్రువీకరించాడు. టాస్ సమయంలో అయ్యర్ మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తూ మాక్స్వెల్ చేతి వేలికి ఫ్రాక్చర్ అయింది. నిజంగా మాకు ఇది గట్టి ఎదురుదెబ్బ. అతడి స్ధానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదు అని పేర్కొన్నాడు. మాక్స్వెల్ ప్రస్తుతం జట్టుతో పాటు ఉన్నప్పటికి త్వరలోనే తన స్వదేశానికి పయనం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది సీజన్లో మాక్స్వెల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. బౌలింగ్లో ఒకట్రెండు వికెట్లు పడగొట్టినప్పటికి, బ్యాటింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. మాక్స్వెల్ 6 ఇన్నింగ్స్లలో 8.00 సగటు కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: ZIM vs BAN: మమ్మల్నే ఓడిస్తారా? ప్రతీకారం తీర్చుకున్న బంగ్లాదేశ్

మమ్మల్నే ఓడిస్తారా? ప్రతీకారం తీర్చుకున్న బంగ్లాదేశ్
జింబాబ్వేతో తొలి టెస్టులో ఎదురైన ఓటమికి బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకుంది. చటోగ్రామ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జింబాబ్వేను ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో బంగ్లా జట్టు చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. తమ మొదటి ఇన్నింగ్స్లో 227 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో సీన్ విలియమ్స్(67), నిక్ వెల్చ్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో స్పిన్నర్ తైజుల్ ఇస్లాం 6 వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. అతడితో పాటు నయీమ్ హసన్ రెండు, తాంజిమ్ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 444 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బంగ్లా బ్యాటర్లలో షాద్మాన్ ఇస్లాం(120), మెహిదీ హసన్ మీరాజ్(104) అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. వారిద్దరితో పాటు ముష్ఫికర్ రహీం(40), మోనిమల్(33), షకీబ్(41) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో విన్సెంట్ మసెకేసా 5 వికెట్లు పడగొట్టగా.. ముజారబానీ, వెల్లింగ్టన్ మసకడ్జా బెన్నట్ తలా వికెట్ సాధించారు. ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్లో కూడా జింబాబ్వే ఆట తీరు ఏ మాత్రం మారలేదు. బంగ్లా బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్లో జింబాబ్వే 111 పరుగులకే కుప్పకూలింది.బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ 5 వికెట్లతో చెలరేగగా.. తైజుల్ ఇస్లాం మూడు వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే బ్యాటర్లలో బెన్ కుర్రాన్(46) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ను 1-1తో బంగ్లా సమం చేసింది.

సీఎస్కే పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
Chennai Super Kings vs Punjab Kings Live Updates: సీఎస్కే పై పంజాబ్ కింగ్స్ ఘన విజయంఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. సీఎస్కే బ్యాటర్లలో సామ్ కుర్రాన్(88) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు బ్రెవిస్(32) పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో చాహల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. చాహల్తో పాటు అర్ష్దీప్, జాన్సెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్..అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 72 పరుగులు చేశాడు. అతడితో పాటు ప్రభ్సిమ్రాన్ సింగ్(54) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సీఎస్కే బౌలర్లలో పతిరానా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్,ఖాలీల్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.ప్రభ్సిమ్రాన్ ఫిప్టీ..పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 11 ఓవర్లకు పంజాబ్ వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది.8 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 102/18 ఓవర్లకు పంజాబ్ వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. క్రీజులో ప్రభ్సిమ్రాన్ సింగ్(28), శ్రేయస్ అయ్యర్(15) ఉన్నారు.పంజాబ్ రెండో వికెట్ డౌన్..ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ఆర్య.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు.నిలకడగా ఆడుతున్న పంజాబ్.. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో ఆర్య(15), ప్రభుసిమ్రాన్ సింగ్(8) ఉన్నారు.చాహల్ హ్యాట్రిక్.. 190 పరుగులకు సీఎస్కే ఆలౌట్చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. 19 ఓవర్ వేసిన చాహల్ నాలుగో బంతికి దీపక్ హుడా ఔట్ కాగా.. ఐదో బంతికి కాంబోజ్, ఆరో బంతికి నూర్ ఆహ్మద్ ఔటయ్యాడు. దీంతో చాహల్ ఖాతాలో రెండో ఐపీఎల్ హ్యాట్రిక్ చేరింది. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సీఎస్కే 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. సీఎస్కే బ్యాటర్లలో సామ్ కుర్రాన్(88) టాప్ స్కోరర్గా నిలవగా.. బ్రెవిస్(32) పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో చాహల్తో పాటు అర్ష్దీప్, జాన్సెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.పంజాబ్ ఐదో వికెట్ డౌన్..సామ్ కుర్రాన్ రూపంలో పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. 88 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన కుర్రాన్.. జాన్సెన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. క్రీజులో ధోని(5), శివమ్ దూబే(2) ఉన్నారు.15 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 134/415 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. సామ్ కుర్రాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 56 పరుగులతో కుర్రాన్ తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు.10 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 89/310 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే మూడు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో బ్రెవిస్(20), సామ్ కుర్రాన్(29) ఉన్నారు.సీఎస్కే మూడో వికెట్ డౌన్..రవీంద్ర జడేజా రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన జడేజా.. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో ఔటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే మూడు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.సీఎస్కే రెండో వికెట్ డౌన్..ఆయూష్ మాత్రే రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన మాత్రే.. మార్కో జాన్సెన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. క్రీజులో కుర్రాన్(8), రవీంద్ర జడేజా(5) ఉన్నారు.సీఎస్కే తొలి వికెట్షేక్ రషీద్ రూపంలో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రషీద్.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది.ఆచితూచి ఆడుతున్న సీఎస్కే..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సీఎస్కే రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. క్రీజులో షేక్ రషీద్(1), ఆయూష్ మాత్రే(6) ఉన్నారు.ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు గ్లెన్ మాక్స్వెల్ దూరమయ్యాడు. అతడి స్దానంలో సూర్యాంష్ షెగ్దే పంజాబ్ జట్టులోకి వచ్చాడు. తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, ఎంఎస్ ధోని(కెప్టెన్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానాపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సూర్యాంష్ షెగ్దే, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్

చెంప దెబ్బ వివాదం.. వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్: కేకేఆర్
ఐపీఎల్-2025లో మంగళవారం అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 14 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. కేకేఆర్ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ను చెంపదెబ్బ కొట్టడం వివాదస్పదమైంది. అప్పటివరకూ సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్న రింకూ.. కుల్దీప్ చర్యతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కుల్దీప్ ప్రవర్తనను చాలా మంది తప్పుబట్టారు. కుల్దీప్పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.అయితే ఈ వివాదానికి కోల్కతా ఫ్రాంచైజీ ఫుల్స్టాప్ పెట్టింది. మీడియాలో వస్తున్న వార్తలను కేకేఆర్ ఖండించింది. యూపీకి చెందిన వీరిద్దరూ మంచి స్నేహితులంటూ.. గతంలో కుల్దీప్, రింకూ కలిసి ఉన్న ఫోటోలను వీడియో రూపంలో కేకేఆర్ షేర్ చేసింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ వివాదంపై స్పందించింది. కుల్దీప్ యాదవ్, రింకు సింగ్ ఇద్దరూ హార్ట్ సింబల్స్తో ఫోజ్ ఇస్తున్న వారి వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోకు ‘ఓన్లీ ప్యార్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ చెంప వివాదానికి తెరపడినట్లే. కాగా ఈ మ్యాచ్లో రింకూ సింగ్ 36 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. కుల్దీప్ మాత్రం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు.Only pyaar 🫰🫂 pic.twitter.com/bePBy6Y54E— Delhi Capitals (@DelhiCapitals) April 30, 2025

'ఈసారైనా కప్ వచ్చేలా చూడు స్వామి'.. తిరుమలలో ఆర్సీబీ కెప్టెన్ పూజలు
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ.. 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్లో మే 3న చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ఇంకా మూడు రోజుల సమయం ఉండడంతో ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో పాటిదార్ తన సహచర ఆటగాడు జితేష్ శర్మ, టీమిండియా మహిళా క్రికెటర్ శ్రేయంకా పాటిల్తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఈ క్రికెటర్లను ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఆర్సీబీ కెప్టెన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన పాటిదార్ జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడు.బ్యాటింగ్, కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు పాటిదార్. అతడితో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం అదరగొడుతున్నాడు. వరుస హాఫ్ సెంచరీలతో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బెంగళూరు మరో రెండు మ్యాచ్ల్లో గెలిస్తే తమ ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకుంటుంది.సీఎస్కేతో మ్యాచ్కు ఆర్సీబీ తుది జట్టు(అంచనా)విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్వుడ్, యశ్ దయాల్ Rajat Patidar, Jitesh Sharma & Shreyanka Patil offered prayers at the Tirumala temple. ♥️ 🙏 pic.twitter.com/UQNFWpsMcq— Johns. (@CricCrazyJohns) April 30, 2025

క్రికెట్ నీకు రెండో ఛాన్స్ ఇచ్చింది.. కానీ..
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కరుణ్ నాయర్ ఆట తీరును భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ఐపీఎల్-2025 (IPL 2025) రూపంలో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో కరుణ్ విఫలమవుతున్నాడని పేర్కొన్నాడు. ఇలాగే కొనసాగితే వచ్చే సీజన్లో ఆడటం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.కాగా 2013 నుంచి ఐపీఎల్లో ఆడుతున్న కరుణ్ నాయర్ (Karun Nair).. ఇటీవలి కాలంలో దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపాడు. విదర్భ తరఫున రంజీల్లో, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వరుస శతకాలతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో కరుణ్కు మళ్లీ జాతీయ జట్టులో చోటు ఇవ్వాలనే డిమాండ్లు పెరిగాయి.రూ. 30 లక్షల కనీస ధరతోఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ ఆడించాలని హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు కరుణ్కు మద్దతు పలికారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే.. రూ. 30 లక్షల కనీస ధరతో కరుణ్ నాయర్ ఐపీఎల్-2025 మెగా వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు.ఈ క్రమంలో రూ. 50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కొనుగోలు చేసింది. అయితే, ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్లలో కలిపి కరుణ్ నాయర్ కేవలం 154 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 87. ఇక తాజాగా మంగళవారం నాటి మ్యాచ్లోనూ కరుణ్ విఫలమయ్యాడు.వన్డౌన్లో అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో.. లక్ష్య ఛేదనలో భాగంగా కరుణ్ వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చాడు. మొత్తంగా పదమూడు బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వైభవ్ అరోరా బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా వెనుదిరిగాడు.ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ విధించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఢిల్లీ ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడినా పద్నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ చేతిలో ఢిల్లీ ఓటమి అనంతరం కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కరుణ్ నాయర్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.క్రికెట్ నీకు రెండో అవకాశం ఇచ్చింది.. కానీ‘‘క్రికెట్ నీకు రెండో అవకాశం ఇచ్చింది. కానీ దానిని నువ్వు సద్వినియోగం చేసుకోవడం లేదు. ఇప్పటి వరకు కేవలం ఒక్కే మంచి ఇన్నింగ్స్ ఆడావు. రెండు, మూడు రనౌట్లలో భాగమయ్యావు.కానీ నీ స్థాయికి తగ్గట్లుగా ఆడలేకపోతున్నావు. నీ నుంచి భారీ ఇన్నింగ్స్ రావడం లేదు. ముఖ్యంగా టాపార్డర్లో అదీ వన్డౌన్లో ఆడుతున్నా బ్యాట్ ఝులిపించలేకపోతున్నావు. ఇలా అయితే కష్టమే’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా కరుణ్ నాయర్ ఐపీఎల్లో ఇప్పటి వరకు మొత్తంగా 82 మ్యాచ్లు ఆడి 1650 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధ శతకాలు ఉన్నాయి. గతంలో అతడు పంజాబ్ కింగ్స్ (రూ. 5.6 కోట్లు), రాజస్తాన్ రాయల్స్, కోల్కతా, లక్నో సూపర్ జెయింట్స్ తదితర ఫ్రాంఛైజీలకు ఆడాడు.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ కోల్కతా👉టాస్: ఢిల్లీ.. తొలుత బౌలింగ్👉కోల్కతా స్కోరు: 204/9 (20)👉ఢిల్లీ స్కోరు: 190/9 (20)👉ఫలితం: పద్నాలుగు పరుగుల తేడాతో ఢిల్లీపై కోల్కతా విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సునిల్ నరైన్ (3/29).చదవండి: అతడు వచ్చే ఏడాది ఆడకూడదు.. ఇప్పటికైనా చెన్నైని వదిలేయాలి: గిల్క్రిస్ట్

భారత్తో టెస్టులకు ముందు.. ఇంగ్లండ్ బోర్డు కీలక నిర్ణయం!
సొంతగడ్డపై సమ్మర్ సీజన్ షెడ్యూల్ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ మాజీ పేసర్ టిమ్ సౌథీ (Tim Southee)ని కోచింగ్ సిబ్బందిలో చేర్చుకునే దిశగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.కాగా గతేడాది అంతర్జాతీయ క్రికెట్కుఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ (James Anderson) వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడు ఇంగ్లిష్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్గా అతడు పనిచేశాడు. అయితే, దేశవాళీ క్రికెట్లో లంకాషైర్ తరఫున ఆడేందుకు ఆండర్సన్ సిద్ధం కావడంతో ఆ పోస్టు ఖాళీ అయింది.ఈ నేపథ్యంలోనే కివీస్ మాజీ ఆటగాడు టిమ్ సౌథీకి ఇంగ్లండ్ బోర్డు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. కాగా ఇంగ్లండ్ టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్ హెడ్కోచ్గా న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. రెడ్బాల్ క్రికెట్లో మెకల్లమ్ ‘బజ్బాల్’తో సరికొత్త ప్రయోగాలు చేసి సఫలమైనా.. వైట్ బాల్ క్రికెట్లో మాత్రం అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు.ఇప్పటికే న్యూజిలాండ్ నుంచి జీతన్ పటేల్ కూడాఇదిలా ఉంటే.. సౌథీతో మెకల్లమ్కు మంచి అనుబంధం ఉంది. అతడి చొరవతోనే ఇంగ్లిష్ జట్టు బోర్డు ఈ కివీస్ పేసర్ను కోచింగ్ సిబ్బందిలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు బీబీసీ తన కథనంలో పేర్కొంది.కాగా మెకల్లమ్ జట్టులో ఇప్పటికే న్యూజిలాండ్ నుంచి జీతన్ పటేల్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇంగ్లండ్ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్గా అతడు సేవలు అందిస్తున్నాడు. ఇక సౌథీ కూడా చేరితే హెడ్కోచ్తో కలిపి ఈ సంఖ్య మూడుకు చేరుతుంది.టీమిండియాతో ఐదు టెస్టులుఇక 36 ఏళ్ల టిమ్ సౌథీ గతేడాది డిసెంబరులో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ తరఫున 107 టెస్టులు, 161 వన్డేలు, 125 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్... ఆయా ఫార్మాట్లలో 391, 221, 164 వికెట్లు తీశాడు.కాగా ఇంగ్లండ్ జింబాబ్వేతో ఏకైక టెస్టుతో తమ వేసవి సీజన్ను మొదలుపెట్టనుంది. ఆ తర్వాత వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. అనంతరం జూన్ 20 నుంచి టీమిండియాతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. చదవండి: ఇంగ్లండ్ టూర్కు ఆర్సీబీ కెప్టెన్.. కరుణ్, సాయి సుదర్శన్కు కూడా పిలుపు..?

Rohit Sharma: ఆ 'మూడు రికార్డులు' ఎవ్వరూ బద్దలు కొట్టలేరు..!
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఇవాళ (ఏప్రిల్ 30) 38వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సహచర క్రికెటర్లతో పాటు అభిమానులు సోషల్మీడియా వేదికగా రోహిత్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.BIRTHDAY CELEBRATION OF INDIAN CAPTAIN ROHIT SHARMA ♥️ pic.twitter.com/cQQRzoRpCd— Johns. (@CricCrazyJohns) April 30, 2025ప్రస్తుతం ఐపీఎల్ 2025 ఆడుతున్న రోహిత్.. తన జట్టు సభ్యులు మరియు భార్య రితక సజ్దేతో కలిసి కేక్ కట్ చేశాడు. హిట్మ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా అతను సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం.THE BIRTHDAY CELEBRATIONS OF HITMAN ROHIT SHARMA. 🥹- Moments of the Day. ❤️ pic.twitter.com/ZncZTNEVB6— Tanuj (@ImTanujSingh) April 30, 20252007లో టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ తన కెరీర్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆటగాడిగా, కెప్టెన్గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. టీమిండియా తరఫున 67 టెస్ట్లు, 273 వన్డేలు, 159 టీ20లు ఆడిన హిట్మ్యాన్ మూడు ఫార్మాట్లలో కలిపి 19700 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన రోహిత్ మొత్తం 266 మ్యాచ్లు ఆడి 2 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీల సాయంతో 6868 పరుగులు చేశాడు.రోహిత్ తన సుదీర్ఘ కెరీర్లో భారత జట్టు, తన ఐపీఎల్ జట్లైన డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో రికార్డులు సాధించాడు. వీటిలో మూడు రికార్డులు మాత్రం ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. అవేంటంటే..వన్డేల్లో అత్యధిక స్కోర్ (264)2014, నవంబర్ 13న రోహిత్ శర్మ శ్రీలంకపై 264 పరుగులు (173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లు) చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ ఇదే అత్యుత్తమ స్కోర్గా చలామణి అవుతుంది. బహుశా మున్ముందు కూడా ఈ రికార్డు పదిలంగానే ఉండే అవకాశం ఉంది. వన్డేల్లో ఇంత భారీ ఇన్నింగ్స్లు ఆడాలంటే చాలా సహనం కావాలి. నేటి తరం క్రికెటర్లలో ఇది కొరవడింది. కాబట్టి ఈ రికార్డు వన్డే క్రికెట్ చరిత్రలో చిరకాలం పదిలంగా ఉండే అవకాశం ఉంది.సింగిల్ వరల్డ్కప్లో అత్యధిక సెంచరీలు (5)2019 వన్డే వరల్డ్కప్లో రోహిత్ సెంచరీల సునామీ సృష్టించాడు. ఆ టోర్నీలో ఏకంగా ఐదు సెంచరీలు (సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక) సాధించి చరిత్ర సృష్టించాడు. ఓ వరల్డ్కప్ ఎడిషన్లో ఓ ఆటగాడు చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. ఈ టోర్నీలో హిట్మ్యాన్ ఉగ్రరూపం దాల్చి 9 మ్యాచ్ల్లో 648 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు బద్దలు కొట్టడం కూడా దాదాపుగా అసాధ్యమే.వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు (3)వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ చేస్తేనే అత్యద్భుతం అనుకునే రోజుల్లో హిట్మ్యాన్ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు బాది చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఇప్పటివరకు 10 డబుల్ సెంచరీలు నమోదు కాగా.. అందులో రోహిత్ ఒక్కడే మూడు సాధించడమంటే మామూలు విషయం కాదు. 2013లో ఆస్ట్రేలియాపై తన తొలి డబుల్ సెంచరీ (208 నాటౌట్) సాధించిన హిట్మ్యాన్ ఆతర్వాతి ఏడాదే (2014) శ్రీలంకపై వరల్డ్ రికార్డు డబుల్ సెంచరీ (264) సాధించాడు. 2017లో రోహిత్ మరోసారి శ్రీలంకపై డబుల్ సెంచరీ (208 నాటౌట్) చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ చాలా రికార్డులు నమోదు చేసినప్పటికీ ఈ రికార్డులను మాత్రం ఎవరూ బద్దలు కొట్టలేదు.ప్లేయర్గా, కెప్టెన్గా రోహిత్ సాధించిన పలు ఘనతలు/రికార్డులు..వరల్డ్కప్ సెంచరీలు- 7 కెప్టెన్గా 2 ఐసీసీ టైటిళ్లు (2024 టీ20 వరల్డ్కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ)ఆటగాడిగా 4 ఐసీసీ టైటిళ్లువన్డేల్లో మూడు డబుల్ సెంచరీలుసింగిల్ వరల్డ్కప్లో అత్యధిక సెంచరీలువన్డేల్లో అత్యధిక స్కోర్కెప్టెన్గా అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ (కనీసం 100 అంతర్జాతీయ మ్యాచ్లు)కెప్టెన్గా 5 ఐపీఎల్ టైటిళ్లుఆటగాడిగా 6 ఐపీఎల్ టైటిళ్లు

పరాజయంతో ప్రారంభం
జియామెన్ (చైనా): స్టార్ జోడీలు లేకుండానే ప్రతిష్...

కోచింగ్లో కొత్త ‘కీర్తి’
క్రీడల్లో అటు పురుషుల, ఇటు మహిళల విభాగాల్లో గొప్ప ...

కోబీ బ్రయాంట్ జెర్సీకి రూ. 59 కోట్లు
న్యూయార్క్: అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం, దివంగ...

పాకిస్తాన్కు భారీ షాక్!.. ఈసారి ఆహ్వానం లేదు!
కరాచీ: సుప్రసిద్ధ హాకీ టోర్నమెంట్ ‘అజ్లాన్ షా కప...

క్రికెట్ నీకు రెండో ఛాన్స్ ఇచ్చింది.. కానీ..
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కరుణ్ నాయర్ ఆట తీరున...

భారత్తో టెస్టులకు ముందు.. ఇంగ్లండ్ బోర్డు కీలక నిర్ణయం!
సొంతగడ్డపై సమ్మర్ సీజన్ షెడ్యూల్ నేపథ్యంలో ఇంగ్...

Rohit Sharma: ఆ 'మూడు రికార్డులు' ఎవ్వరూ బద్దలు కొట్టలేరు..!
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగా...

2026 ఏషియన్ గేమ్స్లో క్రికెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఒలింపిక్ కమిటీ
వచ్చే ఏడాది జపాన్లో జరుగనున్న 20వ ఆసియా క్రీడల్లో...
క్రీడలు


శ్రేయాంకతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ (ఫొటోలు)


హ్యాపీ బర్త్డే హిట్మ్యాన్... రోహిత్ శర్మ అరుదైన ఫొటోలు


KKR Vs DC: కీలక విజయం సాధించిన కోలకతా నైట్ రైడర్స్, మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)


సతీసమేతంగా తిరుమల శ్రీవారి సేవలో టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ (ఫోటోలు)


సెంచరీతో కుమ్మేసిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (ఫోటోలు)
LSG Vs MI: లక్నోపై ముంబై ఇండియన్స్ ఘన విజయం


సన్రైజర్స్ vs చెన్నై మ్యాచ్లో సందడి చేసిన హీరో అజిత్, శివ కార్తికేయన్ (ఫొటోలు)


క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముచ్చట్లు (ఫొటోలు)


సచిన్ టెండుల్కర్ బర్త్డే.. అరుదైన ఫొటోలు చూశారా? (ఫోటోలు)


హార్దిక్ పాండ్యాతో ఫొటో..SRHvsMI మ్యాచ్లో నటి కుషిత కల్లపు (ఫొటోలు)
వీడియోలు


Vaibhav Suryavanshi: అమ్మా నాన్నల త్యాగం సూర్యవంశీ ఎమోషనల్


బుమ్రా కొడుకుపై ట్రోలింగ్ ఇచ్చిపడేసిన భార్య సంజన


IPLలో గుజరాత్ పై రాజస్థాన్ ఘన విజయం


టీమిండియా స్టార్లతో ? కోహ్లి తన్నులాట విరాట్ కు ఏమైంది


ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం


చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో నెగ్గిన SRH


IPL: MATCH FIX అడ్డంగా దొరికిపోయిన ముంబై


రోహిత్ పై పాండ్యా విషం.. నువ్వు మారవా బ్రో?


భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు


IPLలో వరుసగా 4 విజయం సొంతం చేసుకున్న ముంబై