Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Big blog to KKR, star pacer Harshit Rana ruled out of IPL 2026 due to injury1
IPL 2026: కేకేఆర్‌కు మరో భారీ షాక్‌

ఐపీఎల్‌-2026కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది సీజ‌న్‌కు ఆ జ‌ట్టు స్టార్ ఫాస్ట్ బౌల‌ర్, యువ సంచ‌ల‌నం హ‌ర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. హర్షిత్ గ‌త నెల‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వార్మాప్ మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డాడు.దీంతో త‌న బౌలింగ్ స్పెల్ మ‌ధ్య‌లోనే అత‌డు మైదానాన్ని వీడాడు. ఆ త‌ర్వాత ప‌లు స్కాన్ల త‌ర్వాత అత‌డికి మోకాలి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో రాణా ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో సర్జరీ చేయించుకున్నాడు. అతడు ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు.అయితే అతడు పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఐపీఎల్‌-19 సీజ‌న్ మొత్తానికి దూరం కానున్న‌ట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా త‌మ క‌థ‌నంలో పేర్కొంది. హ‌ర్షిత్ త‌న ఐపీఎల్(2022) త‌న అరంగేట్రం నుంచి కేకేఆర్‌కే ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.ఐపీఎల్-2024 టైటిల్ కేకేఆర్‌ గెలవడంలో హర్షిత్ కీలక పాత్ర పోషించాడు. గ‌త సీజ‌న్‌లో కూడా హ‌ర్షిత్ 15 వికెట్లతో స‌త్తాచాటాడు. అంతేకాకుండా టీమిండియా త‌ర‌పున కూడా అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌లు క‌న‌బ‌రిచాడు. మ‌రోవైపు ఈ ఏడాది ఐపీఎల్‌కు శ్రీలంక స్పీడ్ స్టార్ మ‌తీషా ప‌తిరాన సైతం గాయం కార‌ణంగా దూర‌మ‌య్యే అవ‌కాశ‌ముంది.గతేడాది డిసెంబ‌ర్‌లో జ‌రిగిన మినీ వేలంలో ప‌తిరానను రూ.18 కోట్ల‌కు కేకేఆర్ సొంతం చేసుకుంది. కానీ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సంద‌ర్భంగా ప‌తిరాన కూడా గాయ‌ప‌డ్డాడు. అత‌డు ఇంకా శ్రీలంక‌లోనే ఉన్నాడు. ఇక ఐపీఎల్ నుంచి ఉద్వాస‌న‌కు గురైన బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ ముస్తాఫిజుర్ రెహ్మ‌న్ స్ధానంలో జింబాబ్వే పేస‌ర్ బ్లెస్సింగ్ ముజరబానీని జట్టులోకి కేకేఆర్ తీసుకుంది.చదవండి: BAN vs PAK: పాకిస్తాన్ ప్లేయర్ వింత రనౌట్‌.. క్రికెట్‌ చరిత్రలోనే!

Was Salman Ali Agha Run-Out Fair In PAK vs BAN 2nd ODI? 2
పాకిస్తాన్ ప్లేయర్ వింత రనౌట్‌.. క్రికెట్‌ చరిత్రలోనే!

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ సల్మాన్ అలీ అఘా వివాదస్పద రీతిలో రనౌటయ్యాడు. అతడు ఔటైన తీరు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు మాజ్ సదాకత్(75), ఫర్హాన్‌(31) మంచి ఆరంభం ఇచ్చారు.ఆ తర్వాత పాక్ వెంటవెంటే మూడు వికెట్లు కోల్పోయి బ్యాక్‌ఫుట్‌లోకి వెళ్లింది. ఈ క్రమంలో సీనియర్ బ్యాటర్లు సల్మాన్ అలీ అఘా(64), మహ్మద్ రిజ్వాన్‌(44) నిలకడగా ఆడి తమ జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించారు. అయితే పాక్ ఇన్నింగ్స్ 39 ఓవర్ వేసిన మోహది హసన్ మిరాజ్ బౌలింగ్‌లో సల్మాన్ అలీ ఊహించని విధంగా ఔటయ్యాడు.ఏమి జరిగిందంటే?ఆ ఓవర్‌లో మెహదీ వేసిన నాలుగో బంతిని మహమ్మద్ రిజ్వాన్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. ఆ బంతి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సల్మాన్ అలీ ఆఘా బ్యాట్‌కు తగిలింది. ఆ సమయంలోనే బౌలర్ మిరాజ్, సల్మాన్ ఒకరినొకరు ఢీకొన్నారు. అయితే బంతి 'డెడ్' అయిందని భావించిన సల్మాన్, దానిని చేత్తో తీసి బౌలర్‌కు ఇవ్వబోయాడు. కానీ అదే సమయంలో బంతిని అందుకున్న మిరాజ్ స్టంప్స్‌ను గిరాటేశాడు.వెంటనే రనౌట్‌కు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్‌లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. స్టంప్స్ కిందపడే సమయానికి సల్మాన్ క్రీజు బయట ఉండడంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. సల్మాన్ అలీ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. గ్రౌండ్‌లోనే తన గ్లౌవ్స్‌, హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు.అంతేకాకుండా బంగ్లా కెప్టెన్ మిరాజ్‌తో పాటు వికెట్ కీపర్ లిట్టన్ దాస్‌తో సల్మాన్ వాగ్వాదానికి దిగాడు. అంపైర్‌లు జోక్యంతో చేసుకోవడంతో సల్మాన్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.రూల్స్ ఏమి చెబుతున్నాయి?బంతి లైవ్‌లో ఉన్న‌ప్పుడు బ్యాట‌ర్ బంతిని బ్యాట్‌తో కానీ చేతితో కానీ ట‌చ్ చేయ‌కూడ‌దు. ఫీల్డర్ అనుమతి లేకుండా బ్యాటర్ కావాలని బంతిని తాకినా లేదా ఫీల్డర్‌ను అడ్డుకున్నా‘అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్’ గా పరిగణిస్తారు. ఒకవేళ మిరాజ్ స్టంప్స్ పడగొట్టకుండా.. ‘అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్’ అప్పీల్‌ చేసినా సల్మాన్‌ ఔటయ్యే వాడు. ఎందుకంటే అప్పటికే సల్మాన్‌ క్రీజుకు సుమారు ఒక అడుగు దూరంలో ఉండి, బంతిని బౌలర్‌కు అందించడానికి ప్రయత్నించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 47.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది.Crucial moment! Mehidy Hasan Miraz removes Salman Agha with a brilliant run-out. ⚡🏏#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/N0inKkZVwz— Bangladesh Cricket (@BCBtigers) March 13, 2026

Ex India captain sympathises with Team India fielding under lights T20 WC3
WC: ఫీల్డింగ్‌లో ‘వరస్ట్‌’!.. భారత మాజీ కెప్టెన్‌ కీలక వ్యాఖ్యలు

సొంతగడ్డపై టీమిండియా టీ20 ప్రపంచకప్‌ గెలిచింది. గతంలో ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి.. స్వదేశంలో తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన ఏకైక జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది.కానీ.. లీగ్‌ దశలో అజేయంగా నిలిచినా టీమిండియా ప్రదర్శన సగటు అభిమానితో పాటు హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌కు కూడా సంతృప్తినివ్వలేదు. ఇక సూపర్‌-8 దశలో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో భారత జట్టు చిత్తుగా ఓడింది.చాంపియన్‌గాఆ తర్వాత వరుస విజయాలతో టైటిల్‌ దిశగా అడుగులు వేసి చాంపియన్‌గా అవతరించింది టీమిండియా. అయితే, ఫీల్డింగ్‌ మాత్రం చెత్తగా ఉందనే విమర్శలు మూటగట్టుకుంది. సెమీస్‌, ఫైనల్లో భారత ఫీల్డర్లు కాస్త ఫర్వాలేదనిపించగా.. అంతకు ముందు మాత్రం దారుణంగా విఫలమయ్యారు.ఫీల్డింగ్‌లో ‘వరస్ట్‌’!ముఖ్యంగా సూపర్‌-8 చేరిన జట్లలో Catching Efficiencyలో ఇంగ్లండ్‌ అత్యుత్తమంగా 87.2 శాతం నమోదు చేయగా.. టీమిండియా 72.7 శాతంతో అత్యంత చెత్త రికార్డుతో అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అంజుమ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.భారత మాజీ కెప్టెన్‌ కీలక వ్యాఖ్యలుఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియా ఇంకాస్త మెరుగ్గా ఫీల్డింగ్‌ చేయాల్సింది. క్యాచ్‌లు పట్టడంలో సఫలమైన విషయంలో మిగతా జట్లతో పోలిస్తే మరీ వెనుకబడి ఉందన్నది బహిరంగ రహస్యమే.ఒత్తిడిలో ఒక్కోసారి ఇలాంటివి జరగవచ్చు. అలాంటపుడు కూర్చుని చర్చించుకుని లోపాలు సరిచేసుకోవాలి. అలా కాకుండా పదే పదే అవే తప్పులు పునరావృతం చేస్తే ముందుకు సాగడం కష్టమవుతుంది. కొన్నిసార్లు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నారు. కొన్నిసార్లు అత్యంత సులువైన క్యాచ్‌లు వదిలేశారు.ఫీల్డింగ్‌ విషయంలో మనం కాస్త వెనుబడి ఉన్నామనే చెప్పవచ్చు. ఏదేమైనా పగటి పూట ఫీల్డింగ్‌ చేయడానికి.. రాత్రి లైట్ల వెలుగులో ఫీల్డింగ్‌ చేయడానికి తేడా ఉంటుంది. అయితే, ఇప్పటికే ప్రొఫెషనల్‌ అనిపించుకున్న ఆటగాళ్లు ఇలాంటి కారణాలతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరు’’ అని అంజుమ్‌ చోప్రా చెప్పుకొచ్చింది.టీ20 ప్రపంచకప్‌-2026లో సూపర్‌-8 జట్ల క్యాచింగ్‌ సామర్థ్యంఇంగ్లండ్‌- 87.2%జింబాబ్వే- 85.4%వెస్టిండీస్‌- 84.6%న్యూజిలాండ్‌- 83.9%పాకిస్తాన్‌- 83.3%సౌతాఫ్రికా- 81.1%శ్రీలంక- 77.8%ఇండియా- 72.7%.చదవండి: T20 WC: రాస్కెల్స్‌.. నిప్పుతో చెలగాటం: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ప్రశంసలు

West Indies spinner pulls out of PSL 2026 after getting stuck in India due to West Asia conflict4
వెస్టిండీస్ స్టార్ సంచలన నిర్ణయం

వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ గుడకేశ్ మోతీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026 నుంచి వైదొలిగాడు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మోతీ విండీస్‌ జట్టుతో పాటు పశ్చిమ ఆసియాలో యుద్దం కారణంగా వారం రోజుల పాటు భారత్‌లో చిక్కుకుపోయాడు. ఇప్పుడు మరోసారి ఆసియాకు ప్రయాణించి రిస్క్‌ తీసుకోడదని అతడు భావించినట్లు సమాచారం. ఈ ఏడాది పీఎస్‌ఎల్‌ సీజన్‌లో మోతీ లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అతడు గైర్హజరీలో శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేను లాహోర్ తమ జట్టులోకి తీసుకుంది.మోతీతో పాటు జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశముంది. కాగా ఈ ఏడాది పీఎస్‌ఎల్‌ సీజన్‌ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. లాహోర్ ఖలందర్స్‌ కెప్టెన్‌గా షాహీన్‌ అఫ్రిది వ్యవహరించనున్నాడు.లాహోర్ ఖలందర్స్ జట్టు ఇదేఫఖార్ జమాన్, అబ్దుల్లా షఫీక్, ఆసిఫ్ అలీ, తయ్యాబ్ తాహిర్, సికందర్ రాజా, దసున్ షనక, హుస్సేన్ తలత్, డేవిడ్ వీస్, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, జమాన్ ఖాన్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఉసామా మీర్, సామ్ బిల్లింగ్స్, హసీబుల్లా ఖాన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, దునిత్ వెల్లలాగే చదవండి: IPL 2026: జింబాబ్వే బౌలర్‌కు బంపరాఫర్‌?

My Baby Brother Now Belongs To Her: Sara Tendulkar Post Goes Viral5
’నా చిన్ని తమ్ముడు.. ఇకపై ఆమెకు మాత్రమే సొంతం’

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కుటుంబం ఆనందంలో మునిగితేలుతోంది. కొత్త కోడలి రాకతో పరివారంలో సందడి నెలకొంది. ఈ క్రమంలో సచిన్‌ కుమార్తె సారా టెండుల్కర్‌ తమ్ముడు అర్జున్‌ టెండుల్కర్‌- మరదలు సానియా చందోక్‌లను ఉద్దేశిస్తూ పెట్టిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.సానియా పాపిట్లో అర్జున్‌ తిలకం దిద్దుతున్న ఫొటోను పంచుకున్న సారా.. ‘‘నా చిన్ని తమ్ముడు.. ఇకపై సానియాకే సొంతం. ఈ విశ్వం మీపై అంతులేని ప్రేమ, ఆశీర్వచనాలు కురిపించాలి. మీ హృదయం కోరుకున్న ప్రతి ఒక్కటి మీకు దక్కాలి.మీకు ఎవరి దిష్టి తగలకూడదు. మీ ఇద్దరిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నా జీవితంలోని అత్యంత సంతోషకరమైన రోజు మీ పెళ్లి రోజే అని చెప్పడంలో సందేహంలేదు’’ అని తమ్ముడు, మరదలిపై ప్రేమను కురిపించింది. తనకు సోదరిలేని లోటు తీర్చేలా సానియాను ఇచ్చినందుకు అర్జున్‌కు ఈ సందర్భంగా సారా ధన్యవాదాలు కూడా తెలిపింది.కాగా సచిన్‌- అంజలి దంపతుల ఏకైక కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ వివాహం మార్చి 5న సానియా చందోక్‌తో జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన ఈ వేడుకకు భారత క్రికెట్‌ దిగ్గజాలు మహేంద్ర సింగ్‌ ధోని, గౌతం గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌ తదితరులు సతీసమేతంగా తరలివచ్చారు. ముకేశ్‌ అంబానీ కుటుంబం కూడా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించింది.ఇదిలా ఉంటే.. తమ్ముడి పెళ్లిలో సారా కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. సంగీత్‌, మెహందీ వేడుకలో సంప్రదాయ దుస్తుల్లో సారా టెండుల్కర్‌ మరింత అందంగా కనిపించింది. ఇక అర్జున్‌- సానియా సంగీత్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ.. వారి పట్ల మరోసారి సారా ప్రేమ చూపగా.. సానియా ఇందుకు.. ‘‘ధన్యవాదాలు.. లవ్‌ యూ సోదరి’’ అంటూ జవాబు ఇచ్చింది. కాగా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్‌ మనుమరాలు సానియా. ఆమె కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తోంది.

IPL 2026: KKR interested in PSL-bound fast bowler as replacement for Mustafizur Rahman6
IPL 2026: జింబాబ్వే బౌలర్‌కు బంపరాఫర్‌?

ఐపీఎల్‌-2026 సీజన్‌ మరో రెండు వారాల్లో షురూ కానుంది. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో పడింది. అతడి స్దానంలో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీని తీసుకోవాలని కేకేఆర్ భావిస్తున్నట్లు సమాచారం.ముజరబానీ ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. జింబాబ్వే సూపర్‌-8 స్టేజ్‌కు చేరుకోవడంలో ఈ రైట్‌ ఆర్మ్ పేసర్‌ది కీలక పాత్ర. ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ముజరబానీ నాలుగు వికెట్లు పడగొట్టి జింబాబ్వేకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.అతడికి పవర్‌ప్లేతో డెత్‌ ఓవర్లలో కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసే సత్తా ఉంది. ఈ క్రమంలోనే అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు కేకేఆర్‌ సిద్దమైనట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ముజరబానీ ఇప్పటివరకు ఐపీఎల్‌లో అరంగేట్రం చేయలేదు. గత సీజన్‌ ఆఖరిలో ఆర్సీబీ జట్టులోకి వచ్చినప్పటికి.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కలేదు.ముస్తాఫిజుర్‌పై వేటు..కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్‌ కొనుగోలు చేసింది. కానీ వేలం అనంతరం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోవడంతో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిని జట్టు నుంచి రిలీజ్‌ చేయాలని కేకేఆర్‌ సూచింది.బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్‌ను కేకేఆర్‌ విడుదల చేసింది. అయితే ఈ ఏడాది సీజన్‌ ఆరంభానికి ముందే కేకేఆర్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రూ.18 కోట్ల భారీ ధర వెచ్చించి మరి కొనుగోలు చేసిన శ్రీలంక పేసర్‌ మతీషా పతిరానా, భారత ఆల్‌రౌండర్‌ హర్షిత్‌ రాణా గాయాలతో పోరాడుతున్నారు. వీరిద్దరి అందుబాటుపై ఇంకా స్పష్టత రాలేదు.కేకేఆర్ పూర్తి జట్టు:అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ (కీపర్), అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కామెరాన్ గ్రీన్, మతీషా పతిరానా, తేజస్వి సింగ్, ఫిన్ అలెన్ (కీపర్), కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, టిమ్ సీఫెర్ట్ (కీపర్), రాహుల్ త్రిపాఠి, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్, సార్థక్ రంజన్.చదవండి: భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్‌ ఆటగాళ్ల లిస్టు

Not Just Abrar: Pak Stars Playing In Indian Owned T20 Franchises List7
భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్‌ ఆటగాళ్ల లిస్టు

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ప్రశాంత పహల్గామ్‌ లోయలో అమాయకులను కాల్చి చంపిన ఉగ్రమూకలపై భారత సైన్యం ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో ఉక్కుపాదం మోపింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌, పాక్‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది.కరచాలనానికి నిరాకరించిఇందుకు ప్రతిగా పాక్‌ సైన్యం రంగంలోకి దిగగా.. భారత ఆర్మీ వారి దాడుల్ని విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌-2025లో భారత క్రికెట్‌ జట్టు పాక్‌ జట్టుతో కరచాలనానికి నిరాకరించి నిరసన తెలియజేసింది. దీంతో పాక్‌ బోర్డు రాద్ధాంతం చేయగా ఐసీసీ రంగంలోకి దిగి చివాట్లు పెట్టింది.మొట్టికాయలు వేసిన ఐసీసీఅదే విధంగా టీమిండియాతో మ్యాచ్‌లో అతి చేసిన పాక్‌ ఆటగాళ్లకు గట్టిగానే మొట్టికాయలు కూడా వేసింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇవ్వగా.. పాక్‌ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు.చెలరేగిన వివాదంఅయినా సరే బంగ్లాదేశ్‌ను అడ్డుపెట్టుకుని పాక్‌ బోర్డు మరోసారి డ్రామాలు ఆడి.. బొక్కబోర్లా పడింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ‘ది హండ్రెడ్‌ లీగ్‌-2026’ వేలంలో సన్‌ గ్రూపునకు చెందిన కావ్యా మారన్‌ నేతృత్వంలో‌ని సన్‌రైజర్స్‌ లీడ్స్‌ పాకిస్తాన్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు చేయడం వివాదానికి దారితీసింది.టీమిండియాతో మ్యాచ్‌లో అతి చేస్తూ.. ఆపరేషన్‌ సిందూర్‌ను కించపరిచే విధంగా వ్యవహరించిన అబ్రార్‌ కోసం సన్‌రైజర్స్‌ రూ. 2.34 కోట్లు వెచ్చించడంతో.. భారతీయ నెటిజన్లు లీడ్స్‌ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) మాత్రం ‘ది హండ్రెడ్‌ (ఇంగ్లండ్‌)’ విదేశీ లీగ్‌ కాబట్టి.. తాము ఈ విషయంలో జోక్యంచేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరమీదకు వచ్చింది. సన్‌రైజర్స్‌ తాజాగా విదేశీ లీగ్‌లో పాక్‌ ఆటగాడిని ఎంచుకోగా.. ఇంతకు ముందే పలు భారత టీ20 ఫ్రాంఛైజీలు పాక్‌ ప్లేయర్లకు తమ జట్టులో చోటు ఇచ్చాయి. అవేమిటంటే..భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్‌ ఆటగాళ్ల లిస్టు👉పాకిస్తాన్‌ మాజీ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ ఆమిర్‌, టీ20 ప్రపంచకప్‌ టోర్నీ-2026లో తన బౌలింగ్‌ యాక్షన్‌తో వార్తల్లోకి ఎక్కిన స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌.. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌కు ఆడారు. ఈ జట్టుకు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ యజమానులైన షారుఖ్‌ ఖాన్‌, జూహీ చావ్లా, జై మెహతానే ఓనర్లు.👉ఇక అమెరికాలో జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (MCL)లో గతేడాది పాక్‌ ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీం సీటెల్‌ ఆర్కాస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ జట్టు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యంలో భాగమైన GMR గ్రూప్‌నకు చెందినది. 👉కాగా ఇమాద్‌ వసీం 2023-24 ILT20 సీజన్లో కేకేఆర్‌కు చెందిన అబు దాబి ఫ్రాంఛైజీకి ఆడాడు. ఇక పాక్‌ మరో క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ ILT20 2025 సీజన్లో.. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ ఎమిరేట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 👉ఇదిలా ఉంటే.. ది హండ్రెడ్‌ వేలంలో అబ్రార్‌ను సన్‌రైజర్స్‌ కొనగా.. మరో పాక్‌ స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌ను బర్మింగ్‌హామ్‌ ఫొనిక్స్‌ కొనుగోలు చేసింది. ఈసారి ఈ వేలంలో పాక్‌ నుంచి వీరిద్దరే అమ్ముడుపోగా.. సయీమ్‌ ఆయుబ్‌, హ్యారిస్‌ రవూఫ్‌, షాదాబ్‌ ఖాన్‌ వంటి వాళ్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. చదవండి: T20 WC: రాస్కెల్స్‌.. నిప్పుతో చెలగాటం: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ప్రశంసలు

Trump Big Statement After Iran Wishes Withdraw-FIFA World Cup8
ఇరాన్‌ ఆడకపోవడమే మంచిది.. ట్రంప్‌ వార్నింగ్‌!

మరో రెండు నెలల్లో ఫుట్‌బాల్‌ సాకర్‌ ఫీవర్‌ మొదలుకానుంది. అమెరికా,మెక్సికో,కెనడా దేశాలు సంయుక్తంగా 2026 ఫిపా వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి.ఈ ఏడాది జూన్‌ 11 నుంచి జూలై 19 వరకు సాకర్‌ మెగాటోర్నీ జరగనుంది. అయితే పశ్చిమాసియాలో ఇరాన్‌తో ఇజ్రాయెల్‌, అమెరికా చేస్తున్న యుద్ధం ప్రస్తుతం భీకరరూపం దాల్చింది. దీంతో ఇరాన్‌ జట్టు ఫిఫా వరల్డ్‌కప్ ఆడలేమని ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఇరాన్‌ జట్టు ఫిపా వరల్డ్‌కప్‌ ఆడేందుకు స్వాగతిస్తామని ఫిఫా చీఫ్‌ జియాని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. తాజాగా జియాని వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ట్రూత్‌సోషల్‌ వేదికగా స్పందించారు. ‘ఇరాన్‌ ఫుట్‌బాల్‌ జట్టు సాకర్‌ ప్రపంచకప్‌లో ఆడడం, ఆడకపోవడమనేది వారిష్టం. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌ ఆటగాళ్లు అమెరికాకు వస్తే మాత్రం వారి ప్రాణాలకు, భద్రతకు మేము ఎంతమాత్రం గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి వీలైనంత వరకు ఇరాన్‌ వరల్డ్‌కప్‌కు దూరంగా ఉండడమే మంచిది’ అని సున్నితంగా హెచ్చరించారు.2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో లియోనెల్‌ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో (4-2) ఫ్రాన్స్‌ను ఓడించింది. తద్వారా 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ కైవసం చేసుకుంది. ఈ ఏడాది జూన్‌ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్‌కప్‌ జూలై 19 వరకు జరగనుంది. మొత్తం 48 జట్లు పాల్గొననుండగా.. నాలుగేసి జట్లు 12గ్రూపులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడనున్నాయి. మొత్తం 104 మ్యాచ్‌లు జరగనుండగా, అందులో 78 మ్యాచ్‌లు అమెరికాలో, కెనడా, మెక్సికోలు చెరో 13మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. గ్రూప్‌-జిలో ఉన్న ఇరాన్‌.. బెల్జియం, ఈజిప్టు, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.చదవండి: మా అన్న పెళ్లికి ధూంధాం చేస్తా!

Aakash Chopra picks SRH’s playing 11 for IPL 20269
ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు ఇదే..! రూ. 8 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్‌

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్‌-2026 సీజన్‌ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. బీసీసీఐ తొలి విడతగా కేవలం 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే రిలీజ్‌ చేసింది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌ కోసం ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్‌ ఆకాష్‌ చోప్రా ఎంపిక చేశాడు. అతడు ఎంపిక చేసిన తుది జట్టు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. గత సీజన్‌ మాదిరిగానే ఓపెనర్లగా అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌లను అతడు ఎంపిక చేశాడు. అదేవిధంగా మూడో స్ధానంలో పాకెట్‌ డైనమెట్‌ ఇషాన్‌ కిషన్‌కు అవకాశమిచ్చాడు.ఆ తర్వాత వరుసగా నాలుగు ఐదు స్దానాల్లో క్లాసెన్,నితీష్ కుమార్ రెడ్డిలకు ఛాన్స్‌ ఇచ్చాడు. అయితే ఐపీఎల్‌ వేలంలో భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌కు ప్రధాన ఆల్‌రౌండర్‌గా చోప్రా చోటు కల్పించాడు. ఏడో స్థానంలో అనికేత్ వర్మను ఫినిషర్‌గా అతడు తీసుకున్నాడు. కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తాడని చోప్రా అంచనా వేశాడు. పేస్‌ బౌలింగ్‌ విభాగంలో కమ్మిన్స్‌తో పాటు జయదేవ్ ఉనద్కత్ ,శివమ్ మావిలకు చోటు దక్కింది. ఇక స్పిన్నర్‌గా జీషన్‌ అన్సారీని అతడు ఎంపిక చేశాడు. అయితే రూ.8 కోట్లతో ఎస్‌ఆర్‌హెచ్‌ రిటైన్‌ చేసుకున్న హర్షల్‌ పటేల్‌ను ఆకాష్‌ చోప్రా పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.ఆకాష్ చోప్రా ఎంపిక చేసిన ఎస్ఆర్‌హెచ్ తుది జ‌ట్టు ఇదేఅభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, శివమ్ మావిచదవండి: IPL 2026: 'ధోని, రుతురాజ్‌ కాదు.. అతడే సీఎస్‌కే బ్యాక్‌ బోన్‌'

S Badrinaths massive claim on new CSK star ahead of IPL 202610
'ధోని, రుతురాజ్‌ కాదు.. అతడే సీఎస్‌కే బ్యాక్‌ బోన్‌'

టీ20 వరల్డ్‌కప్‌-2026లో సంచలన ప్రదర్శన కనబరిచిన టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్.. ఇప్పుడు ఐపీఎల్‌లో సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. తన అరంగేట్రం నుంచి గత సీజన్‌ వరకు రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంజూ, ఈసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఆడనున్నాడు. ఐపీఎల్‌-2026 సీజన్‌కు ముందు సీఎస్‌కే ఫ్రాంచైజీ సంజూను రాజస్తాన్‌ నుంచి ట్రేడ్‌ చేసుకుంది. అందుకోసం చెన్నై ఏకంగా స్టార్‌ ప్లేయర్లు రవీంద్ర జడేజా, సామ్‌ కుర్రాన్‌లను వదులుకుంది. ఈ నేపథ్యంలో శాంసన్‌పై భారత మాజీ క్రికెటర్‌ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శాంసన్‌ రాకతో సీఎస్‌కేలో మరో కొత్త శకం మొదలవుతుందని అతడు అభిప్రాయపడ్డాడు."సీఎస్‌కే ఒక పెద్ద ఫ్రాంచైజీ. ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు రాజస్తాన్‌ నుంచి ట్రేడ్‌ చేసుకున్న సంజూ శాంసన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సీఎస్‌కేలో ఇక శాంసన్ శకం మొదలు కానుంది. అతడు ఆ జట్టుకు వెన్నెముకలా మారబోతున్నాడు. దీర్ఘకాలిక ప్రణాళికలలో భాగంగా సంజూను సీఎస్‌కే జట్టులోకి తీసుకుంది.అతడు భవిష్యత్తులో కెప్టెన్‌ అయ్యే అవకాశముంది. అయితే అందుకు ఇంకా చాలా సమయం ఉందని" బద్రీనాథ్ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. సీఎస్‌కే తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29న గౌహతి వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ వ్యవహరించనున్నాడు.చదవండి: స‌న్‌రైజ‌ర్స్‌లోకి పాక్ ఆట‌గాడు.. బీసీసీఐ స్పంద‌న ఇదే

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement

వీడియోలు