Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Justin Greaves Double Century, West Indies vs New Zealand 1st test ends in draw1
చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసిన వెస్టిండీస్‌

వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసింది. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌‌లో 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అసాధారణ పోరాటపటిమ ప్రదర్శించింది. చేతిలో 4 వికెట్లు ఉండి, గెలుపుకు 74 పరుగుల దూరంలో ఉన్న సమయంలో (457/6), ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో డ్రాతో సరిపెట్టుకుంది.ఆట చివరి రోజు జస్టిన్‌ గ్రీవ్స్‌ అజేయ డబుల్‌ సెంచరీతో (202).. కీమర్‌ రోచ్‌ (233 బంతుల్లో 58 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో వీరిచిత పోరాటాన్ని చేశారు. ముఖ్యంగా గ్రీవ్స్‌ చేసిన పోరాటం టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ పోరాటాల్లో ఒకటిగా మిగిలిపోనుంది. తిమ్మిర్లతో బాధపడుతూ గ్రీవ్స్‌ ఆడిన ఇన్నింగ్స్‌ నభూతో నభవిష్యతి అన్నట్లు ఉంది.37 ఏళ్ల వయసులో రోచ్‌ చేసిన పోరాటాన్ని విస్మరించలేము. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన తర్వాత ఏకంగా 233 బంతుల ఎదుర్కోవడం అంటే ఆషామాషీ విషయం​ కాదు. అంతకుముందు షాయ్‌ హోప్‌ అద్బుతమైన శతకంతో (140) వీరిలో స్పూర్తి నింపాడు.72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గెలుపు అంచులకు వెళ్లిందంటే, ఈ విండీస్‌ యోధుల పోరాటం ఎలా సాగిందో అర్దం చేసుకోవచ్చు. అంత భారీ లక్ష్య ఛేదనలో విండీస్‌ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఏకంగా 163.3 ఓవర్లు ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు.ముఖ్యంగా గ్రీవ్స్‌ ఆటతీరును ఎంత పొగిడినా తక్కువే. ఇతగాడు 565 నిమిషాల పాటు క్రీజ్‌లో ఉండి, తన జట్టు మ్యాచ్‌ను కోల్పోకుండా కాపాడాడు. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా పరోక్షంగా విండీస్‌ గెలిచినట్లే. విండీస్‌ యెధుల పోరాటాన్ని యావత్‌ క్రికెట్‌ ప్రపంచం​ కీర్తిస్తుంది.ఈ యోధులు ఎదుర్కొన్నది సాధారణ బౌలింగ్‌ గణాన్ని కాదు. మ్యాట్‌ హెన్రీ, జేకబ్‌ డఫీ లాంటి పేస్‌ బౌలింగ్‌ దిగ్గజాలను, బ్రేస్‌వెల్‌ లాంటి నాణ్యమైన స్పిన్నర్‌ను. వీరి తట్టుకొని నాలుగో ఇన్నింగ్స్‌లో అంత భారీ లక్ష్యానికి చేరువ కావడం ఊహకందని గొప్ప విషయం.ఉనికి కోసం పోరాడుతున్న క్రమంలో..గత మూడు దశాబ్దాలుగా ప్రభ కోల్పోయి ఉనికి కోసం పోరాడుతున్న విండీస్‌ లాంటి జట్టు నుంచి ఇలాంటి వీరోచిత పోరాటన్ని ఎవరూ ఊహించి ఉండరు. ఈ జట్టు షాయ్‌ హోప్‌ లాంటి ఆటగాడు ఇస్తున్న స్పూర్తితో ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో.. పాకిస్తాన్‌ను పాకిస్తాన్‌లో ఓడించి, పూర్వ వైభవం​ దిశగా సాగుతున్నామన్న సంకేతాలు పంపింది.సరికొత్త చరిత్ర అయ్యేదిఈ మ్యాచ్‌ విండీస్‌ గెలిచి ఉంటే సరికొత్త చరిత్ర సృష్టించి ఉండేది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు 500కు మించి లక్ష్యాన్ని ఛేదించలేదు. గత రికార్డు కూడా విండీస్‌ పేరిటే ఉంది. 2003లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ 418 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.లాథమ్‌, రచిన్‌ శతకాలుఅంతకుముందు టామ్‌ లాథమ్‌ (145), రచిన్‌ రవీంద్ర (176) భారీ శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ (466/8) చేసి విండీస్‌ ముందు 531 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కీమర్‌ రోచ్‌ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.చెలరేగిన డఫీదీనికి ముందు జేకబ్‌ డఫీ ఐదేయడంతో విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లోనూ హోప్‌ (56) రాణించాడు. తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (52) అర్ద సెంచరీతో పర్వాలేదనిపించాడు.కలిసికట్టుగా రాణించిన విండీస్‌ బౌలర్లువిండీస్‌ బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే ఆలౌటైంది. కేన్‌ విలియమ్సన్‌ (52) ఒక్కడే కివీస్‌ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.

Shimron Hetmyer Wins the game for Desert vipers2
హెట్‌మైర్‌ మెరుపులు.. నైట్‌రైడర్స్‌ చిత్తు

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో భాగంగా నిన్న (డిసెంబర్‌ 5) జరిగిన మ్యాచ్‌లో డెసర్ట్‌ వైపర్స్‌, అబుదాబీ నైట్‌రైడర్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో వైపర్స్‌ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అలెక్స్‌ హేల్స్‌ (53) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో రసెల్‌ (36 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.మిగతా ఆటగాళ్లలో ఫిల్‌ సాల్ట్‌ 18, అలీషాన్‌ షరాఫు 25, లివింగ్‌స్టోన్‌ 4, రూథర్‌ఫోర్డ్‌ 3, చంద్‌ 18, నరైన్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. వైపర్స్‌ బౌలర్లలో ఖైస్‌ అహ్మద్‌, నూర్‌ అహ్మద్‌ తలో 2, నసీం షా, డాన్‌ లారెన్స్‌ చెరో వికెట్‌ తీశారు.అనంతరం​ ఓ మెస్తరు లక్ష్య ఛేదనకు దిగిన వైపర్స్‌ మరో 3 బంతులు మిగిలుండగానే (8 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని చేరుకుంది. షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (25 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి వైపర్స్‌ను గెలిపించాడు. అతనికి డాన్‌ లారెన్స్‌ (35), తన్వీర్‌ (31 నాటౌట్‌) సహకరించారు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో అజయ్‌ కుమార్‌ 3, నరైన్‌ 2, స్టోన్‌, పియూశ్‌ చావ్లా, రసెల్‌ తలో వికెట్‌ తీశారు.

Steve Smith now holds the record for the most WTC runs by an Australian batter3
చరిత్ర సృష్టించిన స్టీవ్‌ స్మిత్‌

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith) చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసీస్‌ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. యాషెస్‌ రెండో టెస్ట్‌ సందర్భంగా ఈ ఘనత సాధించాడు. లబూషేన్‌ ఖాతాలో ఉన్న ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రస్తుతం లబూషేన్‌ ఖాతాలో 4350 పరుగులు ఉండగా.. స్టీవ్‌ ఖాతాలో 4358 పరుగులు ఉన్నాయి. ఓవరాల్‌గా డబ్ల్యూటీసీ అత్యధిక పరుగుల రికార్డు ఇంగ్లండ్‌ దిగ్గజం జో రూట్‌ పేరిట ఉంది. ప్రస్తుతం రూట్‌ ఖాతాలో 6226 పరుగులు ఉన్నాయి. రూట్‌కు రెండో స్థానంలో ఉన్న స్టీవ్‌కు మధ్య దాదాపు 2000 పరుగుల వ్యత్యాసం ఉండటం విశేషం.హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్‌బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్న యాషెస్‌ రెండో టెస్ట్‌ హోరాహోరీగా సాగుతోంది. రెండో రోజు ఆటలో ఇంగ్లీష్ జట్టుపై కంగారులు పైచేయి సాధించారు. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 378 పరుగులు చేసి, 44 పరుగుల ఆధిక్యంలో ఉంది.క్రీజులో అలెక్స్ కారీ (46), నీసర్‌ (15) ఉన్నారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో జేక్ వెదరాల్డ్ (72), మార్నస్ లబుషేన్ (65), స్టీవ్ స్మిత్ (61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ట్రావిస్ హెడ్ 33 పరుగులకే పరిమితయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, స్టోక్స్ 2, ఆర్చర్ ఓ వికెట్ తీశారు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగుల వద్ద ఆలౌటైంది. జో రూట్‌(138) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(76),ఆర్చర్‌(38) రాణించారు. మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తా చాటాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆసీస్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.

IND VS SA 3rd ODI: Why Vizag feels like home to Virat Kohli, A love story in numbers4
వైజాగ్‌ అంటే 'కింగ్‌'కు పూనకాలే..!

వైజాగ్‌ వేదికగా భారత్‌, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్‌ 6) నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది. తొలి వన్డేలో భారత్‌, రెండో వన్డేలో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే.వైజాగ్‌ వన్డే ప్రారంభానికి ముందు అందరి కళ్లు టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లిపైనే ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఇప్పటికే వరుసగా రెండు సెంచరీలు చేసి సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి హ్యాట్రిక్‌ సెంచరీ చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.కోహ్లి ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే ఇది సాధ్యమయ్యేలానే కనిపిస్తుంది. వైజాగ్‌ పిచ్‌ కూడా కోహ్లికి అద్భుతంగా సహకరించే అవకాశం ఉంది. ఈ మైదానం అంటే కింగ్‌కు పూనకాలు వస్తాయి. ఇక్కడ అతనాడిన 7 మ్యాచ్‌ల్లో ఏకంగా 97.83 సగటున 587 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 2 అర్ద శతకాలు ఉన్నాయి.స్ట్రయిక్‌రేట్‌ కూడా 100కు పైబడే ఉంది. ఈ గణాంకాలు చూస్తే కోహ్లి హ్యాట్రిక్‌ సెంచరీ లోడింగ్‌ అనక తప్పదు. వైజాగ్‌లో మరిన్ని పరిస్థితులు కూడా కోహ్లి హ్యాట్రిక్‌ సెంచరీకి అనుకూలంగా ఉన్నాయి.పిచ్‌ స్వభాగం కోహ్లి బ్యాటింగ్‌ శైలికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బౌన్స్‌కు అవకాశమున్నా, బంతి బ్యాట్‌ వద్దకు సలువుగా వస్తుంది. ఈ పరిస్థితి కోహ్లిని రెచ్చిపోయేలా చేస్తుంది. బలంగా షాట్లు ఆడటం కంటే, టైమింగ్‌, బ్యాలెన్స్‌, ప్లేస్‌మెంట్‌ను నమ్ముకునే కోహ్లి బంతి బ్యాట్‌ వద్దకు వస్తే చెలరేగిపోతాడు.కోహ్లి హ్యాట్రిక్‌ సెంచరీ లోడింగ్‌ అనడానికి వైజాగ్‌లోని చిన్న బౌండరీలు మరో కారణం. పిచ్‌ ఎలాగూ సహకరిస్తుంది కాబట్టి, కోహ్లి తన సహజశైలిలో పంచ్‌ షాట్లు, డ్రైవ్‌లు ఆడితే సులువుగా బౌండరీలు వస్తాయి. కోహ్లికి పెద్దగా స్ట్రయిక్‌ రొటేట్‌ చేసే పని కూడా ఉండదు. పిచ్‌ స్వభావం, చిన్న బౌండరీలు ఉండటం చేత కోహ్లి వేగంగా పరుగులు చేయడంతో పాటు భారీ సెంచరీ చేసే ఆస్కారముంది.కోహ్లి హ్యాట్రిక్‌ సెంచరీ లోడింగ్‌ అనడానికి వీటన్నిటి కంటే ముఖ్యమైన పాయింట్‌ మరొకటి ఉంది. అదేంటంటే.. బలహీనమైన దక్షిణాఫ్రికా పేస్‌ బౌలింగ్‌. ఈ విభాగంలో దక్షిణాఫ్రికా ఎంత బలహీనంగా ఉందో గత మ్యాచ్‌లో స్పష్టమైంది. ప్రధాన పేసర్లు ఎంగిడి, జన్సెన్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. మరో ప్రధాన పేసర్‌ నండ్రే బర్గర్‌ గాయపడ్డాడు. ఒకవేళ నేటి మ్యాచ్‌లో ఈ ముగ్గురూ బరిలోకి దిగినా పిచ్‌ నుంచి పెద్దగా సహకారం లభించకపోవచ్చు. స్పిన్నర్లను కోహ్లి ఎంత అలవోకగా ఎదుర్కోగలడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ అంశాలన్నిటిని పరిగణలోకి తీసుకుంటే కోహ్లి హ్యాట్రిక్‌ సెంచరీ లోడింగ్‌ అనక తప్పదు.

Ravindra Jadeja, Bumrah, Shreyas Iyer Celebrating their Birthday on December 65
December 6: టీమిండియాకు చాలా ప్రత్యేకమైన రోజు

భారత క్రికెట్‌కు డిసెంబర్‌ 6 (December 6) చాలా ప్రత్యేకమైన రోజు. ఇవాళ ముగ్గురు టీమిండియా స్టార్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దిగ్గజ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా, అత్యుత్తమ మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ వేర్వేరు సంవత్సరాల్లో డిసెంబర్‌ 6న జన్మించారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ప్రస్తుతం టీమిండియాలో కీలక సభ్యులుగా ఉన్నారు.ఈ ముగ్గురిలో సీనియర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja). ఎడమ చేతి స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన జడేజా 1988లో గుజరాత్‌లోని నవ్‌గామ్‌ఘడ్‌లో జన్మించాడు. 2008 అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన జడేజా 2009లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.2008-09 రంజీ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన (42 వికెట్లు, 739 పరుగులు) కారణంగా జడ్డూకు టీమిండియా ఆఫర్‌ వచ్చింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 3 ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడు జడేజా.2024 టీ20 ప్రపంచకప్‌ విజయం తర్వాత జడ్డూ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి, ప్రస్తుతం భారత టెస్ట్‌, వన్డే జట్లలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు.పై ముగ్గురిలో జడ్డూ తర్వాత సీనియర్‌ బుమ్రా (Jasprit Bumrah). ఈ కుడి చేతి వాటం పేసు గుర్రం 1993లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించాడు. విశిష్టమైన బౌలింగ్‌ శైలి కలిగిన బుమ్రా.. తనకు మాత్రమే సాధ్యమైన స్వింగ్‌ మరియు పేస్‌ కలయికతో ప్రపంచ బ్యాటర్లను వణికిస్తున్నాడు.ఐపీఎల్‌లో సత్తా చాటడం ద్వారా 2016 టీమిండియా తలుపులు తట్టిన బుమ్రా అనతికాలంలో సూపర్‌ స్టార్‌ బౌలర్‌ అయ్యాడు. భారత పేసు గుర్రంగా పేరు తెచ్చుకున్నాడు. బుమ్రా యార్కర్లు వేయడంలో దిట్ట. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చివరి ఓవర్లలో వికెట్లు తీయగల సామర్థ్యానికి బుమ్రా ప్రసిద్ది చెందాడు.గతేడాది ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకున్న బుమ్రా, టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. గతేడాది భారత్‌ టీ20 ప్రపంచకప్‌ సాధించడంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడు. విదేశీ పిచ్‌లు.. ముఖ్యంగా SENA దేశాల్లో ఫాస్ట్‌ బౌలింగ్‌ పిచ్‌లపై బుమ్రాకు ఎవరికీ లేని ట్రాక్‌ రికార్డు ఉంది.పై ముగ్గురిలో చిన్నవాడు శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer). శ్రేయస్‌ 1994లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు. కుడి చేతి వాటం మిడిలార్డర్‌ బ్యాటర్‌ అయిన శ్రేయస్‌ 2014 అండర్‌-19 వరల్డ్‌కప్‌ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆతర్వాత దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటి 2017లో టీమిండియా తలుపులు తట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శ్రేయస్‌ మిడిలార్డర్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాను చాలా మ్యాచ్‌ల్లో గెలిపించాడు. జాతీయ జట్టులో పోలిస్తే శ్రేయస్‌కు ఐపీఎల్‌లో ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. 2024లో కేకేఆర్‌కు టైటిల్‌ అందించిన శ్రేయస్‌ 2025 సీజన్‌లో పంజాబ్‌ను.. అంతకుముందు ఢిల్లీని ఫైనల్‌కు చేర్చాడు. 2023 వరల్డ్‌కప్‌లో 500పైగా పరుగులు చేసి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన శ్రేయస్‌.. టీమిండియా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలవడంలోనూ ప్రధానపాత్ర పోషించాడు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా తీవ్రంగా గాయపడిన శ్రేయస్‌.. ప్రస్తుతం కోలుకునే క్రమంలో ఉన్నాడు.పై ముగ్గురితో పాటు డిసెంబర్‌ 6న ఆర్పీ సింగ్‌, కరుణ్‌ నాయర్‌, అన్షుల్‌ కంబోజ్‌, హ్యారీ టెక్టార్‌, గ్లెన్‌ ఫిలిప్‌ లాంటి స్టార్‌ క్రికెటర్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

Shafali in the race for ICC Player of the Month6
ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ రేసులో షఫాలీ

దుబాయ్‌: భారత మహిళల క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ షఫాలీ వర్మ ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ రేసులో నిలిచింది. మహిళల విభాగంలో నవంబర్‌ నెలలో ఆమె ప్రదర్శనకు గాను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తుది జాబితాలో షఫాలీకి చోటు దక్కింది. భారత్‌ తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్‌ గెలుపొందడంలో షఫాలీ కీలకపాత్ర పోషించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో ఆమె 87 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు తీసింది. ప్రతీక రావల్‌ గాయపడటంతో అనూహ్యంగా సెమీస్, ఫైనల్‌ ఆడే అవకాశం దక్కగా ఏకంగా ఆల్‌రౌండ్‌ షోతో భారత వరల్డ్‌కప్‌ స్టార్‌ అయ్యింది. తాజాగా అవార్డు రేసులోనూ ఉంది. ఆమెతో పాటు ఈ అవార్డు కోసం ఈషా ఒజా (యూఏఈ), తిపత్చా పుతవాంగ్‌ (థాయ్‌లాండ్‌)లు కూడా పోటీ పడుతున్నారు. ఐసీసీ ప్రారంభించిన మహిళల ఎమర్జింగ్‌ నేషన్స్‌ ట్రోఫీలో (బ్యాంకాక్‌)లో వీళ్లిద్దరు నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక పురుషుల విభాగంలో నవంబర్‌ నెలకు గాను సఫారీ స్పిన్నర్‌ హార్మర్, బంగ్లాదేశ్‌ బౌలర్‌ తైజుల్‌ ఇస్లామ్, పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ నవాజ్‌లు ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డు రేసులో ఉన్నారు. భారత గడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా నెగ్గడంలో హార్మర్‌ కీలక భూమిక పోషించాడు.

Formula One Drivers Championship has turned into interesting 7
‘అవసరమైతే... అధికారిక ఆదేశాలిస్తాం’

అబుదాబి: ఫార్ములావన్‌ (ఎఫ్‌1) డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ రేసు రసవత్తరంగా మారింది. 24 రేస్‌ల సీజన్‌లో ఇప్పటి వరకు 23 రేసులు ముగియగా... పాయింట్ల పట్టికలో మెక్‌లారెన్‌ డ్రైవర్‌ లాండో నోరిస్‌ 408 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. డిఫెండింగ్‌ చాంపియన్, రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ 396 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో మెక్‌లారెన్‌కే చెందిన ఆస్కార్‌ పియాస్ట్రి (392 పాయింట్లు) ఉన్నాడు.సీజన్‌లో చివరి రేస్‌ అబుదాబి గ్రాండ్‌ప్రి ఈ ఆదివారం జరగనుండగా... నోరిస్‌ పోడియంపై నిలిస్తే అతడికే ఈ ఏడాది టైటిల్‌ దక్కనుంది. ఈ నేపథ్యంలో... మెక్‌లారెన్‌ యాజమాన్యం శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే జట్టు తరఫున ఆదేశాలిస్తామని పేర్కొంది. ‘అవును, తప్పకుండా ప్రయత్నిస్తాం. మేము ఈ డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలవాలని అనుకుంటున్నాం. మా ఇద్దరు డ్రైవర్లు టైటిల్‌ రేసులో ఉన్నా... ఒకరికి మాత్రమే ఎక్కువ అవకాశాలున్నాయనేది సుస్పష్టం. ఇది జట్టు క్రీడ. చాంపియన్‌షిప్‌ సాధించేందుకు చేయగలిగినదంతా చేస్తాం. అలా చేయకపోవడం పిచ్చితనం అవుతుంది’ అని మెక్‌లారెన్‌ సీఈవో జాక్‌ బ్రౌన్‌ అన్నాడు. వెర్‌స్టాపెన్‌ కంటే 12 పాయింట్లు ఆధిక్యంలో ఉన్న నోరిస్‌ సీజన్‌ చివరి రేసులో తొలి మూడు స్థానాల్లో నిలిస్తే చాలు టైటిల్‌ దక్కనుంది. ఈ నేపథ్యంలో సహచర డ్రైవర్‌ పియాస్ట్రిని చాంపియన్‌షిప్‌ గెలిచేందుకు సహకరించమని అడగలేనని నోరిస్‌ ఇప్పటికే పేర్కొనగా... తాజాగా జట్టు మేనేజ్‌మెంట్‌ మాత్రం టైటిల్‌ కోసం ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటామని వెల్లడించింది. మెక్‌లారెన్‌ జట్టు చివరిసారిగా 2008లో డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ నెగ్గింది.

LeBron James scored in single digit after 1297 matches8
లెబ్రాన్‌ జేమ్స్‌బాండ్‌ 008!

టొరంటో: లెబ్రాన్‌ జేమ్స్‌ ఎన్‌బీఏ బాస్కెట్‌బాల్‌ ప్రియులకు చిరపరిచితుడు! హాలీవుడ్‌లోని ‘జేమ్స్‌బాండ్‌ 007’ సిరీస్‌ సినిమాల్లాగే విజయవంతమైన సూపర్‌ బాస్కెట్‌బాలర్‌ లెబ్రాన్‌. అరంగేట్రం మొదలు ఇప్పటివరకు ఆడిన 1297 వరుస మ్యాచ్‌ల్లో అతను ప్రతీసారి కూడా పదుల సంఖ్యని మించే పాయింట్లు సాధించాడు. లెబ్రాన్‌ జేమ్స్‌ ఇన్నేళ్ల తర్వాత, వెయ్యిపైచిలుకు మ్యాచ్‌ల అనంతరం తొలిసారి సింగిల్‌ డిజిట్‌కు పరిమితమయ్యాడు. బాగా ఆడి ఎప్పుడూ వార్తల్లో నిలిచే జేమ్స్‌... ఈసారి బాగా ఆడలేక కూడా నిలవడమే ఈ వార్తకున్న విశేషం!లాస్‌ ఏంజెలిస్‌ లేకర్స్‌కు ఆడే ఈ అమెరికన్‌ ప్రొఫెషనల్‌ బాస్కెట్‌బాలర్‌ టొరంటో రాప్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 8 పాయింట్లే చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో పాయింట్లు చేయడంలో వెనుకబడినప్పటికీ సహచరులకు పదేపదే స్కోరు చేసేందుకు సాయపడ్డాడు. దీంతో లేకర్స్‌ 123–120తో టొరంటో రాప్టర్స్‌పై గెలుపొందింది. 40 ఏళ్ల జేమ్స్‌ నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ)లో అలుపెరగని యోధుడు. 2003లో క్లీవ్‌లాండ్‌ కెవలియర్స్‌ తరఫున ఎన్‌బీఏలో అరంగేట్రం చేసిన ఈ పవర్‌ ఫార్వర్డ్‌ ప్లేయర్‌ తదనంతరం మయామి హీట్‌కు మారాడు. 2018 నుంచి లాస్‌ ఏంజెలిస్‌ లేకర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతని కెరీర్‌ మొత్తం హైలైట్స్‌ అంటే అతిశయోక్తి కాదు. 2005 నుంచి 2025 వరకు ఏకంగా 21 సార్లు ‘ఎన్‌బీఏ ఆల్‌ స్టార్స్‌’లో నిలిచాడు. 2012, 2013, 2016, 2020 ఈ నాలుగేళ్లు ఎన్‌బీఏ చాంపియన్‌గా, ఫైనల్స్‌లో ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌’గా నిలిచిన ఘనత లెబ్రాన్‌ జేమ్స్‌దే! ‘ఫోర్బ్స్‌’ గణాంకాల ప్రకారం అతని నికర సంపద 1.3 బిలియన్‌ డాలర్లు. అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ. 11, 689 కోట్ల రూపాయలు! లెబ్రాన్‌ జేమ్స్‌ కుమారుడు బ్రోనీ జేమ్స్‌ కూడా బాస్కెట్‌బాల్‌ ప్లేయరే. లెబ్రాన్, బ్రోనీ ఇద్దరూ కలిసి గత సీజన్‌లో లాస్‌ఏంజెలిస్‌ లేకర్స్‌ తరఫున బరిలోకి దిగి ఎన్‌బీఏ మ్యాచ్‌ ఆడిన తండ్రీకొడుకులుగా చరిత్ర సృష్టించారు.

Team India enters the semifinals of the Under 21 World Cup for the fourth time in a row9
‘షూటౌట్‌’లో గెలిచి సెమీస్‌లోకి భారత్‌

చెన్నై: సొంతగడ్డపై భారత జూనియర్‌ పురుషుల హాకీ జట్టు తమ సత్తా చాటుకుంది. అండర్‌–21 ప్రపంచకప్‌లో వరుసగా నాలుగోసారి టీమిండియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ ఫైనల్లో రోహిత్‌ సారథ్యంలోని భారత జట్టు ‘షూటౌట్‌’లో 4–3 గోల్స్‌ తేడాతో బెల్జియం జట్టును ఓడించి సెమీఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది. నిర్ణీత సమయంలో రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్‌ తరఫున కెప్టెన్ రోహిత్‌ (45వ నిమిషంలో), శార్దానంద్‌ తివారి (48వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. బెల్జియం జట్టుకు గాస్పర్డ్‌ కార్నెజ్‌ (11వ నిమిషంలో), నాథన్‌ రొగె (59వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. విజేతను నిర్ణయించే ‘షూటౌట్‌’లో భారత గోల్‌కీపర్‌ ప్రిన్స్‌ దీప్‌ సింగ్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బెల్జియం జట్టుకు చెందిన రెండు పెనాల్టీ స్ట్రోక్‌లను నిలువరించి భారత్‌ను గెలిపించాడు. ‘షూటౌట్‌’లో భారత్‌ తొలి మూడు పెనాల్టీ స్ట్రోక్‌లను శార్దానంద్‌ తివారినే తీసుకొని మూడింటిని గోల్స్‌గా మలిచాడు. మరోవైపు బెల్జియం తరఫున తొలి మూడు పెనాల్టీ స్ట్రోక్‌లను హుగో లబుచెరి, గుర్లెయిన్, చార్లెస్‌ గోల్స్‌గా మలిచారు. భారత్‌ తరఫున నాలుగో పెనాల్టీ స్ట్రోక్‌లో మన్‌మీత్‌ సింగ్‌... బెల్జియం తరఫున నాథన్‌ రొగె విఫలమయ్యారు. భారత్‌ తరఫున ఐదో పెనాల్టీ స్ట్రోక్‌ను అంకిత్‌ పాల్‌ లక్ష్యానికి చేర్చగా... బెల్జియం ప్లేయర్‌ నికోలస్‌ పెనాల్టీ స్ట్రోక్‌ను భారత గోల్‌కీపర్‌ ప్రిన్స్‌ దీప్‌ అడ్డుకోవడంతో టీమిండియా విజయం ఖాయమైంది. ఆదివారం జరిగే సెమీఫైనల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జర్మనీతో భారత్‌; అర్జెంటీనాతో స్పెయిన్‌ తలపడతాయి.

Today is the last ODI between India and South Africa in Vizag10
సిరీస్‌ ఎవరి సొంతం!

భారత పర్యటనకు వచ్చిన ఏ విదేశీ జట్టయినా ఒకే టూర్‌లోని రెండు ఫార్మాట్‌ (టెస్టు, వన్డే)లలో మన టీమ్‌పై సిరీస్‌లు గెలుచుకోవడం 1986–87 తర్వాత మళ్లీ జరగలేదు. ఇప్పుడు అలాంటి మరో అవమానకర రికార్డును ప్రస్తుత భారత జట్టు నెలకొల్పే ప్రమాదం ఉంది. సఫారీల చేతుల్లో ఇప్పటికే టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమిండియా... ఇప్పుడు వన్డేల్లోనూ సిరీస్‌ కోల్పోకూడదని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. గత రెండు మ్యాచ్‌లలో ఫలితాన్ని ‘టాస్‌’ శాసించడంతో ఈ సారైనా టాస్‌ గెలవాలని భారత్‌ కోరుకుంటోంది. మ్యాచ్‌ కూడా గెలిచి రాహుల్‌ బృందం సిరీస్‌ను సాధిస్తుందా అనేది చూడాలి. సాక్షి, విశాఖపట్నం: భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి రెండు వన్డేలు హోరాహోరీగా సాగాయి. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచి ప్రస్తుతం 1–1తో సమంగా ఉన్నాయి. నేడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగే మూడో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు చేతికి సిరీస్‌ చిక్కుతుంది. గత రెండు మ్యాచ్‌లలో ప్రదర్శనను బట్టి చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ పర్యటనలో లభిస్తున్న వరుస విజయాలు దక్షిణాఫ్రికా బృందంలో మరింత ఆత్మవిశ్వాసం పెంచగా... స్వదేశంలో వన్డే సిరీస్‌ను కాపాడుకోవాల్సిన ఒత్తిడిలో భారత్‌ బరిలోకి దిగుతోంది. జైస్వాల్‌పై దృష్టి... తొలి రెండు మ్యాచ్‌లలో రెండు సెంచరీలు సాధించి కోహ్లి అద్భుత ఫామ్‌లో ఉండటం భారత్‌కు ప్రధాన సానుకూలాంశం. రోహిత్‌ తొలి మ్యాచ్‌లో చెలరేగగా, రుతురాజ్‌ గత మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటాడు. కెపె్టన్‌ రాహుల్‌ నిలకడైన ఆటతీరు కనబరుస్తున్నాడు. అయితే ఈ టాప్‌–5లో జైస్వాల్‌ ఒక్కడే విఫలమయ్యాడు. చివరి మ్యాచ్‌లోనైనా అతను రాణించాల్సిన అవసరం ఉంది. జడేజా, సుందర్‌ కూడా చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేపోయారు. కుల్దీప్‌ ఫర్వాలేదనిపించగా, పేసర్లు హర్షిత్, అర్‌‡్షదీప్, ప్రసిధ్‌ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రసిధ్‌ గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైనా... టీమ్‌లో మరో ప్రత్యామ్నాయ పేస్‌ బౌలర్‌ అందుబాటులో లేకపోవడంతో అతడినే కొనసాగించక తప్పని పరిస్థితి. బౌలర్ల ప్రదర్శన పేలవంగానే ఉంటుండటంతో భారత్‌ విజయావకాశాలన్నీ బ్యాటర్ల ప్రదర్శనపైనే ఆధారపడి ఉన్నాయి. రెండు మార్పులతో... 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రెండో వన్డే గెలవడం సఫారీల పట్టుదలకు నిదర్శనం. చేయాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోతున్నా సరే... ఏ దశలోనూ జట్టు బ్యాటర్లు ఒత్తిడిని దరి చేరనీయలేదు. ప్రతీ ఒక్కరు పోరాడి సమష్టి ప్రదర్శనతో టీమ్‌ను విజయం వరకు తీసుకెళ్ళారు. మార్క్‌రమ్‌ సెంచరీతో ఫామ్‌లోకి రాగా, బవుమా మిడిలార్డర్‌లో మూలస్థంభం. రెండు వన్డేల్లోనూ విఫలమైన డికాక్‌ తన అనుభవంతో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడాలని టీమ్‌ ఆశిస్తోంది. బ్రీట్‌కే, బ్రెవిస్, యాన్సెన్, బాష్‌ నిలకడగా ఆడుతుండటం జట్టుకు ప్రధాన బలం. గత మ్యాచ్‌లో కండరాల గాయంతో మధ్యలోనే తప్పుకున్న జోర్జి, బర్గర్‌ ఈ మ్యాచ్‌కు దూరం కాగా... వారి స్థానాల్లో బార్ట్‌మన్, రికెల్టన్‌ జట్టులోకి వస్తారు. టాస్‌ గెలిచేనా! సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో మంచు ప్రభావం చాలా కనిపించింది. రాత్రి సమయంలో బౌలింగ్‌ బాగా కష్టంగా మారిపోతోంది. టాస్‌ గెలిస్తే మ్యాచ్‌ గెలిచినట్లే అనే పరిస్థితి వస్తోంది. కాబట్టి టాస్‌ నెగ్గిన జట్టు ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకోవడం ఖాయం. అయితే ఈ విషయంలో చాలా కాలంగా భారత్‌ను దురదృష్టం వెంటాడుతోంది. భారత్‌ వరుసగా గత 20 వన్డేల్లో టాస్‌ ఓడిపోయింది! 2023 వన్డే వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత భారత్‌ మళ్లీ టాస్‌ గెలవలేదు. ఈ సారైనా రాత మారుతుందా అనేది చూడాలి.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement