ప్రధాన వార్తలు
మెస్సీ ఖాతాలో మరో ట్రోఫీ
ఫ్లోరిడా: అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లయోనెల్ మెస్సీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. మేజర్ లీగ్ సాకర్ (ఎంఎల్ఎస్) కప్లో మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంటర్ మయామి జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన తుదిపోరులో ఇంటర్ మయామి క్లబ్ 3–1 గోల్స్ తేడాతో వాంకోవర్ క్లబ్పై విజయం సాధించింది. ఇంటర్ మయామి జట్టు తరఫున మెస్సీ అన్నీ తానై వ్యవహరించాడు. ఫైనల్లో ఈ స్టార్ ఆటగాడు గోల్ చేయలేకపోయినా... సహచరులు గోల్స్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఎనిమిదో నిమిషంలో వాంకోవర్ జట్టు ఆటగాడు ఎడైర్ ఒకాంపో ‘సెల్ఫ్ గోల్’ చేయడంతో మయామి జట్టు ముందంజ వేయగా... ఆ తర్వాత రోడ్రిగో డె పాల్ (71వ నిమిషంలో), టాడియో అల్లెండె (90+6వ నిమిషంలో) చెరో గోల్ కొట్టారు. వాంకోవర్ జట్టు తరఫున అలీ అహ్మద్ (60వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. ఈ సీజన్లో మెస్సీకిది మూడో మేజర్ లీగ్ టైటిల్ కాగా... ఓవరాల్గా కెరీర్లో 47వది. ‘మూడేళ్ల క్రితం ఎంఎల్ఎస్ టైటిల్ గెవాలని కలగన్నా... అది ఈ రోజు సాధ్యమైంది. సీజన్ ఆసాంతం జట్టు మొత్తం కలిసికట్టుగా ఆడింది. ఇన్నాళ్లు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆటగాళ్లందరూ దీనికి అర్హులు’ అని మెస్సీ పేర్కొన్నాడు. ఇంటర్ మయామి క్లబ్కు ఇదే తొలి ఎంఎల్ఎస్ టైటిల్ కాగా... మెస్సీకి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డు దక్కింది. జర్మనీ దిగ్గజ ఆటగాడు థామస్ ముల్లర్ వాంకోవర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా... చాన్నాళ్ల తర్వాత ముల్లర్పై మెస్సీ ఆధిపత్యం కనబర్చగలిగాడు. గతంలో పలుమార్లు ముల్లర్ కారణంగా అర్జెంటీనా జట్టు ప్రధాన టోర్నీల్లోపరాజయం పాలైంది. 2010 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్, 2014 వరల్డ్కప్ ఫైనల్లో ముల్లర్ సారథ్యంలోని జర్మనీ జట్టు... అర్జెంటీనాపై విజయం సాధించింది. ఇలా ఇప్పటి వరకు పలు కీలక టోర్నీల్లో మెస్సీపై ముల్లర్దే ఆధిపత్యం కాగా... ఎట్టకేలకు ఎంఎల్ఎస్ కప్లో మెస్సీ బదులు తీర్చుకున్నాడు.
‘రోహిత్, కోహ్లి కీలకమే కానీ’...
సాక్షి, విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో విజయం సాధించడంలో సీనియర్లతో పాటు... యువ ఆటగాళ్లూ కీలక పాత్ర పోషించారని భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం విశాఖ వేదికగా జరిగిన చివరి వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టి20, టెస్టు ఫార్మాట్ల నుంచి తప్పుకున్న భారత మాజీ కెప్టెన్ , ‘రన్ మెషీన్’ విరాట్ కోహ్లి ఈ మూడు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 302 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకోగా... రోహిత్ శర్మ రెండు అర్ధశతకాలతో ఆకట్టుకున్నాడు. గంభీర్కు సీనియర్ ఆటగాళ్లకు మధ్య సయోధ్య కుదరడం లేదనే వార్తల నేపథ్యంలో... సిరీస్ విజయం అనంతరం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో రోహిత్, కోహ్లి ప్రాధాన్యత... పేస్ ఆల్రౌండర్గా హర్షిత్ రాణా రాణించడం... వాషింగ్టన్ సుందర్కు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇవ్వడం వంటి వివరాలు అతడి మాటల్లోనే... » కోహ్లి, రోహిత్ నాణ్యమైన ప్లేయర్లు. వాళ్లు ప్రపంచశ్రేణి ఆటగాళ్లు అని ఇప్పటికే చాలాసార్లు చెప్పా. ఇలాంటి అనుభజు్ఞలు డ్రెస్సింగ్ రూమ్లో ఉండటంతో జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. » వాళ్లు చక్కగా ఆడుతున్నారు. సుదీర్ఘకాలంగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఇక ముందు కూడా దాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నా. 50 ఓవర్ల ఫార్మాట్లో వాళ్లిద్దరూ చాలా ముఖ్యం. » పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు అందుబాటులో ఉంటే... జట్టు ఎంపికలో వెసులుబాటు ఉంటుంది. అందుకే హర్షిత్ రాణా వంటి వారిని ప్రోత్సహిస్తున్నాం. ఎనిమిదో స్థానంలో బ్యాట్తో పరుగులు చేయగల ప్లేయర్ ఉంటే ఏ జట్టుకైనా మేలే కదా. అలాంటి ఆటగాడు జట్టులో సమతూకాన్ని తీసుకువస్తాడు. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని ముగ్గురు ప్రధాన పేసర్లు జట్టులో ఉండటం తప్పనిసరి. రాణా పేస్ ఆల్రౌండర్గా మరింత పరిణతి సాధిస్తే అది టీమ్కు బాగా ఉపయోగ పడుతుంది. ఆ దిశగా అతడిని ప్రోత్సహిస్తున్నాం. » బుమ్రా అందుబాటులో లేకున్నా... అర్‡్షదీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా చక్కటి ప్రదర్శన కనబర్చారు. ఈ ముగ్గురికి వన్డే క్రికెట్లో పెద్దగా అనుభవం లేకపోయినా... వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకొని చక్కటి ఫలితాలు రాబట్టారు. » వన్డే క్రికెట్లో స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండాలని నేను అనుకోవడం లేదు. పరిస్థితులకు తగ్గట్లు ఆటగాళ్లంతా సిద్ధంగా ఉండటం మేలు. టెస్టు క్రికెట్లో అయితే ప్రతి స్థానానికి ప్రత్యేకమైన ఆటగాళ్లు ఉండటం మంచిది, కానీ, పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనింగ్ జోడీ మినహా తక్కిన స్థానాలకు ఆ అవసరం లేదు. » వాషింగ్టన్ సుందర్నే తీసుకుంటే అతడు ఏ స్థానంలోనైనా చక్కగా ఒదిగిపోగలడు. విదేశాల్లో చక్కటి ఇన్నింగ్స్లు ఆడాడు. మూడో స్థానంలో, ఐదో స్థానంలో, ఎనిమిదో స్థానంలో ఇలా ఎక్కడ అవసరమైతే అక్కడ బ్యాటింగ్ చేసేందుకు చిరునవ్వుతో సిద్ధంగా ఉంటాడు. ఇలాంటి ఆటగాళ్లు జట్టులో ఉంటే ఎంతో బాగుంటుంది. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. » ఇటీవలి కాలంలో మ్యాచ్ ఫలితాలను నిర్ణయించడంలో టాస్ కీలకం అవుతోంది. మొదట బౌలింగ్ చేయడంలో, ఆ తర్వాత బౌలింగ్ చేయడంలో చాలా తేడా ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో మన బౌలర్లకు బంతిపై సరిగ్గా పట్టు చిక్కలేదు. ఇక రెండో ఇన్నింగ్స్లో మన బ్యాటర్ల ప్రతాపం అందరూ చూశారు. » వన్డే సిరీస్ ఫలితాలపై మంచు ప్రభావం చూపింది కానీ... టి20 సిరీస్కు ఆ ఇబ్బంది ఉండదు. రెండు ఇన్నింగ్స్లు సాయంత్రం తర్వాతే ప్రారంభమవుతాయి కాబట్టి ఇద్దరికీ పరిస్థితులు దాదాపు ఒకేలా ఉంటాయి.
నాకొద్దు... లావైపోతా!
సాక్షి, విశాఖపట్నం: టెస్టుల్లో పోగుట్టుకున్న సిరీస్ తాలూకు ప్రతిష్టను భారత్ వెంటనే విశాఖ తీరంలో వన్డే సిరీస్తో నిలబెట్టుకుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో విన్నర్స్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చిన ఆటగాళ్లంతా హోటల్కు చేరాక కూడా సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ కేక్ కోసి ‘కింగ్’ కోహ్లి నోటిని తీపి చేశాడు. తర్వాత అక్కడే ఉన్న ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మకూ కేక్ ముక్కను తినిపించబోయాడు. వెంటనే ఏమాత్రం మొహమాటం లేకుండా రోహిత్ ‘ప్లీజ్... నాకొద్దు. దీన్ని తింటే తిరిగి లావెక్కిపోతా’నంటూ జైస్వాల్ ప్రయత్నాన్ని వారించాడు. దీంతో అక్కడున్న సహచరులంతా పెద్దగా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. లెక్కలేనన్ని లైక్స్, రీట్వీట్స్తో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. కేక్ చిన్న ముక్కే అయినా రోహిత్ కఠినమైన డైట్కు ఇబ్బంది కలగొచ్చనే బెంగతోనే ‘హిట్మ్యాన్’ సున్నితంగా తిరస్కరించాడు. కోహ్లిలాగే కేవలం వన్డేలకే పరిమితమైన ఈ స్టార్ ఓపెనర్, మాజీ విజయవంతమైన కెప్టెన్ గత కొంతకాలంగా ఫిట్నెస్పైనే ప్రధానంగా దృష్టిపెట్టాడు. వన్డే వరల్డ్కప్ (2027)కు దాదాపు ఏడాదిన్నర ఉండటంతో నోటిని డైట్ క్రమశిక్షణతో కట్టిపడేశాడు. దీనివల్లే అతను ఏకంగా 11 కిలోల బరువుతగ్గాడు. ఇంట్లో నోటిని అదుపులో పెట్టుకున్న ఈ దిగ్గజ బ్యాటర్ క్రీజులో మాత్రం బ్యాట్కు పనిచెబుతున్నాడు. ఏమాత్రం అడ్డు అదుపు లేకుండా భారీషాట్లతో చెలరేగిపోతున్నాడు. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లోనూ రోహిత్ రెండు అర్ధసెంచరీలను సాధించాడు. ఈ రెండు మ్యాచ్ల్లోనూ భారత్ గెలిచింది. సిరీస్ కైవసం చేసుకుంది.
స్వర్ణం కాదు... కాంస్యం కోసమే
చెన్నై: సొంతగడ్డపై భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు నిరాశ ఎదురైంది. స్వదేశంలో జరుగుతున్న జూనియర్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం కోసం పోటీపడనుంది. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ జట్టుతో ఆదివారం జరిగిన రెండో సెమీఫైనల్లో రోహిత్ నాయకత్వంలోని భారత జట్టు 1–5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. తొలి సెమీఫైనల్లో స్పెయిన్ 2–1తో అర్జెంటీనాపై గెలిచింది. బుధవారం జరిగే ఫైనల్లో స్పెయిన్తో జర్మనీ; మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్లో అర్జెంటీనాతో భారత్ తలపడతాయి. క్వార్టర్ ఫైనల్లో బెల్జియంపై ‘షూటౌట్’లో గట్టెక్కిన టీమిండియాను సెమీఫైనల్లో జర్మనీ హడలెత్తించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ భారత రక్షణపంక్తికి పని కల్పించింది. 13 నిమిషాలపాటు జర్మనీని నిలువరించిన టీమిండియా... నిమిషం వ్యవధిలో రెండు గోల్స్ సమర్పించుకుంది. 14వ నిమిషంలో లుకాస్ కోసెల్... 15వ నిమిషంలో టిటుస్ వెక్స్ ఒక్కో గోల్ చేయడంతో తొలి క్వార్టర్ ముగిసేసరికి జర్మనీ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం 30వ నిమిషంలో లుకాస్ కోసెల్ రెండో గోల్ చేయడంతో రెండో క్వార్టర్ ముగిసేసరికి జర్మనీ ఆధిక్యం 3–0కు పెరిగింది. మూడో క్వార్టర్లోనూ జోరు కొనసాగించిన జర్మనీకి 40వ నిమిషంలో జోనస్ వోన్ జెర్సుమ్ గోల్ అందించాడు. చివరి క్వార్టర్లోని 49వ నిమిషంలో బెన్ హస్బాచ్ గోల్తో జర్మనీ ఆధిక్యం 5–0కు పెరిగింది. 51వ నిమిషంలో భారత్కు అన్మోల్ ఎక్కా ఏకైక గోల్ అందించాడు. మ్యాచ్ మొత్తంలో జర్మనీ జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు, ఒక పెనాల్టీ స్ట్రోక్ లభించింది. జర్మనీ ఒక పెనాల్టీ కార్నర్ను, పెనాల్టీ స్ట్రోక్ను సద్వినియోగం చేసుకుంది. భారత్కు దక్కిన ఒక్క పెనాల్టీ కార్నర్ను అన్మోల్ లక్ష్యానికి చేర్చాడు. 12వసారి జూనియర్ ప్రపంచకప్లో ఆడుతున్న భారత జట్టు రెండుసార్లు (2001, 2016) విజేతగా, ఒకసారి రన్నరప్గా (1997) నిలిచింది. మూడుసార్లు (2005, 2021, 2023) కాంస్య పతకం మ్యాచ్లో ఓడిపోయి టీమిండియా నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. క్వార్టర్స్ చేరని భారత జట్టు మరోవైపు చిలీలోని సాంటియాగోలో జరుగుతున్న మహిళల జూనియర్ ప్రపంచకప్ టోర్నీలోనూ భారత జట్టుకు నిరాశే మిగిలింది. లీగ్ దశ ముగిశాక జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు టాప్–8లో చోటు దక్కించుకోకపోవడంతో క్వార్టర్ ఫైనల్ చేరలేకపోయింది. గ్రూప్ ‘సి’లో భారత జట్టు 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆరు గ్రూపుల్లో ‘టాప్’లో నిలిచిన ఆరు జట్లతోపాటు (నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీ, చైనా, ఆ్రస్టేలియా, అమెరికా)... రెండో స్థానంలో నిలిచిన రెండు ఉత్తమ జట్లకు (అర్జెంటీనా, ఇంగ్లండ్) క్వార్టర్ ఫైనల్ బెర్త్లు లభించాయి. రెండో స్థానంలో నిలిచిన ఆరు జట్లలో భారత జట్టు మూడో స్థానంలో ఉండటంతో క్వార్టర్ ఫైనల్కు దూరమైంది.
ఉప్పల్, జింఖానా మైదానాల్లో నేటి మ్యాచ్లకు ప్రేక్షకులకు ‘నో ఎంట్రీ’
హైదరాబాద్లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్లకు ప్రేక్షకులను అనమతించబోమని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. దేశవాళీ టి20 టోర్నమెంట్లో భాగంగా గ్రూప్ ‘సి’ మ్యాచ్లకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. ఈ నెల 2న ఉప్పల్ స్టేడియంలో పంజాబ్, బరోడా జట్ల మధ్య మ్యాచ్ జరగగా... పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. భారత స్టార్ ఆటగాళ్లుహార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ ఆడుతుండటంతో వారిని చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. సరైన సెక్యూరిటీ లేకపోవడంతో... పలువురు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లి స్టార్ ప్లేయర్లతో సెల్ఫీలు సైతం దిగారు. దీనిపై సర్వత్ర విమర్శలు వ్యక్తంకావడంతో... ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని తాజాగా హెచ్సీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఉప్పల్తో పాటు జింఖానా మైదానంలో సోమవారం జరిగే మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించబోమని హెచ్సీఏ తెలిపింది.
చరిత్ర సృష్టించిన లాండో నోరిస్.. 17 ఏళ్ల నిరీక్షణకు తెర
మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ తన 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించాడు. తన కెరీర్లో మొట్టమొదటి ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్షిప్ను గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. ఆదివారం యాస్ మెరీనా సర్క్యూట్లో జరిగిన సీజన్-ముగింపు అబుదాబి గ్రాండ్ ప్రి (Abu Dhabi GP)లో మూడో స్ధానంలో నోరిస్ నిలిచాడు.The moment of glory 🏆#F1 #AbuDhabiGP pic.twitter.com/GJZJQ1oKnZ— Formula 1 (@F1) December 7, 2025అయితే డ్రైవర్స్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో నోరిస్ (423 పాయింట్లు) అగ్రస్ధానంలో నిలిచి తొలి టైటిల్ను సొంతం చేసుకుంది. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్బుల్) కేవలం రెండు పాయింట్ల తేడాతో టైటిల్ను కోల్పోయాడు.LANDO NORRIS IS THE 2025 FORMULA 1 WORLD CHAMPION!!!! 🏆#F1 #AbuDhabiGP pic.twitter.com/Rg4cc4OwlU— Formula 1 (@F1) December 7, 2025దుబాయ్లో జరిగిన చివరి రేసును వెర్స్టాపెన్ గెలుచుకున్నప్పటికి.. ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో(421 పాయింట్లు) రెండవ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాగా 2008లో లూయిస్ హామిల్టన్ (Lewis Hamilton) గెలిచిన తర్వాత మెక్లారెన్కు డ్రైవర్స్ ఛాంపియన్షిప్ దక్కడం ఇదే మొదటిసారి.
స్మిత్-ఆర్చర్ మధ్య మాటల యుద్దం
యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఆస్ట్రేలియా చిత్తు చేసింది. 65 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది.దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0 అధిక్యంలోకి ఆసీస్ దూసుకెళ్లింది. అయితే నాలుగో రోజు ఆట సందర్భంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. హెడ్ ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన స్మిత్ మ్యాచ్ను త్వరగా ముగించేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్ వేసిన ఆర్చర్.. తొలి బంతిని స్మిత్కు 146.6 వేగంతో గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని స్మిత్ బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత బంతిని స్మిత్కు 149.5 కి.మీ వేగంతో వేశాడు. ఆ బంతిని స్టీవ్ అప్పర్ కట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.వెంటనే అర్చర్ స్మిత్ వద్దకు వెళ్లి టార్గెట్ తక్కువగా ఉన్నా అంత దూకుడుగా ఎందుకు ఆడుతున్నావు? "ఓడిపోతాము అని తెలిసినప్పుడు నువ్వెందుకు అంత వేగంగా బౌలింగ్ చేస్తున్నావు ఛాంపియన్ అంటూ స్మిత్ అంటూ బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. యాషెస్ సిరీస్ అంటే ఏ మాత్రం ఫైర్ ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇరు జట్లు మధ్య మూడో టెస్టు అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs SA: కోహ్లి, రోహిత్లకు షాకిచ్చిన గౌతమ్ గంభీర్!"Bowl fast when there's nothing going on champion."Steve Smith v Jofra Archer was seriously spicy 🍿 #Ashes pic.twitter.com/jfa4PiZyb2— cricket.com.au (@cricketcomau) December 7, 2025
కోహ్లి, రోహిత్లకు షాకిచ్చిన గౌతమ్ గంభీర్!
వన్డే ప్రపంచకప్-2027లో టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడుతురా? అంటే అవునానే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సీనియర్ క్రికెటర్లు ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో రో-కో అదరగొట్టారు.కోహ్లి రెండు సెంచరీలతో సత్తాచాటి ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలవగా.. రోహిత్ కూడా పరుగులు వరద పారించాడు. ప్రస్తుతం ఒకే ఫార్మాట్లో ఆడుతున్నప్పటికి మిగితా క్రికెటర్ల కంటే చాలా యాక్టివ్గా, ఫిట్గా ఉన్నారు. వారి వయస్సు వారి జోరుకు అడ్డు కావడం లేదు.భారత క్రికెట్కే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. దీంతో రో-కో వన్డే ప్రపంచకప్లో కచ్చితంగా ఆడుతారని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ప్రపంచకప్ ప్రణాళికలలో రోహిత్-కోహ్లి ఉన్నారా లేదా అన్నది భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు.వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డే అనంతరం రోహిత్, కోహ్లిల భవిష్యత్తుపై గంభీర్ను విలేకరులు ప్రశ్నించారు. "రోహిత్, కోహ్లిలు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. డ్రెస్సింగ్ రూమ్లో వారి అనుభవం చాలా ముఖ్యం. వారిద్దరూ భారత్ తరపున చాలా కాలంగా ఇలాంటి ప్రదర్శనలే చేస్తున్నారు.రాబోయో రోజుల్లో కూడా తమ ఫామ్ను కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఇది 50 ఓవర్ల ఫార్మాట్లో చాలా ముఖ్యం. అయితే వన్డే ప్రపంచకప్కు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. మనం వర్తమానంలో ఉండటం ముఖ్యం. జట్టులోకి వచ్చే యువ ఆటగాళ్లు తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి" అని గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: సూర్యను కెప్టెన్గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ
నితీష్ నిజంగా ఆల్రౌండరేనా..?
నితీశ్ కుమార్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ నుండి మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఏకైక క్రికెటర్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టు అరంగేట్రం చేసిన నితీశ్.. ఆస్ట్రేలియా గడ్డపై సత్తాచాటాడు. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో సెంచరీ చేసి ఆపై భారత జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా మారాడు. గతేడాది టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేసిన నితీశ్ రెడ్డి.. ఈ ఏడాది ఆస్ట్రేలియా టూర్లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే అద్భుతమైన ఆల్రౌండ్ స్కిల్స్ ఉన్న నితీశ్ను టీమ్ మెనెజ్మెంట్ మాత్రం సరిగ్గా ఉపయోగించుకోవడంలో విఫలమైంది.నితీశ్ రోల్ ఏంటి?హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీరును చూస్తుంటే నితీశ్ నిజంగా ఆల్రౌండరేనా సందేహం వ్యక్తమవుతోంది. నితీశ్ ప్రధాన జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికి తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ నితీశ్ తిరిగి స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. అయితే ఈ సిరీస్లో నితీశ్తో కనీసం పది ఓవర్లు కూడా బౌలింగ్ చేయించలేదు.ఆ తర్వాత సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఎంపికైనప్పటికి ఈడెన్ గార్డెన్స్ టెస్టు ముందు అతడిని జట్టు నుంచి రిలీజ్ చేశారు. అయితే కోల్కతా టెస్టులో భారత్ ఘోర ఓటమి పాలవ్వడం, శుభ్మన్ గిల్ గాయపడడంతో అతడికి మళ్లీ పిలుపు నిచ్చారు.అయితే గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టు తుది జట్టులో నితీశ్కు చోటు దక్కింది. కానీ ఈ మ్యాచ్లో కూడా నితీశ్కు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభించలేదు. రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం పది ఓవర్లు మాత్రమే నితీశ్ వేశాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 150 ఓవర్లు పైగా బౌలింగ్ చేస్తే.. నితీశ్కు కేవలం 6 ఓవర్లు దక్కాయి. నితీశ్ తన మీడియం పేస్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు.ఇంతకుముందు ఆసీస్, ఇంగ్లండ్ టూర్లలో బంతితో కూడా నితీశ్ సత్తాచాటాడు. కానీ స్వదేశంలో టీమ్ మేనేజ్మెంట్ ఎందుకు బౌలింగ్ చేయించడం లేదో ఆర్ధం కావడం లేదు. అదేవిధంగా ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లోనూ రెండు మ్యాచ్లు ఆడి కేవలం 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.దీంతో గంభీర్పై అశ్విన్, ఆకాష్ చోప్రా వంటి మాజీలు విమర్శలు వర్షం కురిపించారు. హార్దిక్ పాండ్యా స్ధానంలో అతడిని జట్టులోకి తీసుకున్నప్పుడు ఎందుకు బౌలింగ్ చేయించడం లేదని అశ్విన్ ప్రశ్నించాడు.నితీశ్కు నో ఛాన్స్సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్కు కూడా నితీశ్ ఎంపికయ్యాడు. కానీ ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. ప్రధాన ఆల్రౌండర్గా జట్టులోకి తీసుకుని అతడిని బెంచ్కే పరిమితం చేయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. అదేవిధంగా మొన్నటివరకు టీ20ల్లో భాగంగా ఉన్న నితీశ్ను పాండ్యా రావడంతో జట్టు నుంచి తప్పించారు.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపిక భారత జట్టులో ఈ ఆంధ్ర ఆల్రౌండర్కు చోటు దక్కలేదు. దీనిబట్టి నితీశ్ టీ20 ప్రపంచకప్ ప్రణాళికలలో లేనిట్లు తెలుస్తోంది. ఆ తర్వాత న్యూజిలాండ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్లో కూడా నితీశ్ ఆడే సూచనలు కన్పించడం లేదు. దీంతో ఆరు నెలల తర్వాత శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్కు నితీశ్ తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశముంది. ఈ సిరీస్ శ్రీలంకలో జరగనుందున నితీశ్కు ప్లేయింగ్ ఎలెవన్లో కచ్చితంగా చోటు దక్కుతుందో లేదో తెలియదు. ఉపఖండ పిచ్లు ఎక్కువ స్పిన్కు అనుకూలించనుందన అక్షర్, కుల్దీప్, జడేజాలతో భారత్ ఆడే ఛాన్స్ ఉంది.చదవండి: సూర్యను కెప్టెన్గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ
యాషెస్ రెండో టెస్టు.. ఇంగ్లండ్పై ఆసీస్ గ్రాండ్ విక్టరీ
యాషెస్ సిరీస్ 2025-26లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ను 8 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. 65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కంగారులు రెండు వికెట్లు కోల్పోయి చేధించారు. ట్రావిస్ హెడ్ రెండో ఇన్నింగ్స్లో నిరాశపరిచినప్పటికి.. జెక్ వెదర్ల్డ్ 17, స్టీవ్ స్మిత్ 23 పరుగులతో నాటౌట్గా నిలిచి మ్యాచ్ను ముగించారు.అదరగొట్టిన రూట్..ఈ పింక్బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. వెటరన్ బ్యాటర్ (206 బంతుల్లో 138) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ 76 పరుగులు చేశాడు. ఆఖరిలో జోఫ్రా ఆర్చర్( 38 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మరోసారి 6 వికెట్లతో సత్తాచాటాడు.అనంతరం ఇంగ్లీష్ జట్టుకు ఆసీస్ ధీటైన సమాధానమిచ్చింది. స్మిత్ సేన తమ తొలి ఇన్నింగ్స్లో 511 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. స్టార్ మిచెల్ స్టార్క్ 77 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. జెక్ వెదర్ల్డ్ (72), మార్నస్ లబుషేన్ (65) పరుగులు, స్టీవ్ స్మిత్ (61), (అలెక్స్ క్యారీ 63) హాఫ్ సెంచరీలతో మెరిశారు. దీంతో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్లో 177 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.ఇంగ్లండ్ ఫెయిల్..ఇక రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బ్యాటర్లు తేలిపోయారు. 177 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు కేవలం 241 పరుగులకే ఆలౌటైంది. జాక్ క్రాలీ(44), స్టోక్స్(50) రాణించినప్పటికి.. మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో పర్యాటక జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.ఈ క్రమంలో ఆసీస్ ముందు కేవలం 65 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సెకెండ్ ఇన్నింగ్స్లో ఆసీస్ పేసర్ మైఖల్ నీసర్ ఐదు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, బోలాండ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి ఆసీస్ దూసుకెళ్లింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 17 నుంచి ఆడిలైడ్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: సూర్యను కెప్టెన్గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ
సురుచికి స్వర్ణం
దోహా: భారత యువ షూటర్ సురుచి సింగ్... అంతర్జాతీయ ...
జనవరి 15 నుంచి రెజ్లింగ్ లీగ్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 1 ...
‘అవసరమైతే... అధికారిక ఆదేశాలిస్తాం’
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) డ్రైవర్స్ చాంపియన్...
లెబ్రాన్ జేమ్స్బాండ్ 008!
టొరంటో: లెబ్రాన్ జేమ్స్ ఎన్బీఏ బాస్కెట్బాల్ ప...
యాషెస్ రెండో టెస్టు.. ఇంగ్లండ్పై ఆసీస్ గ్రాండ్ విక్టరీ
యాషెస్ సిరీస్ 2025-26లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతో...
సూర్యను కెప్టెన్గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ
భారత పురుషల క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో ఒకే ...
మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తన వ్యక్...
ముచ్చల్తో వివాహం రద్దైంది.. అధికారిక ప్రకటన విడుదల చేసిన మంధన
భారత మహిళల క్రికెట్ స్టార్ స్మృతి మంధన తన వ్యక్తిగ...
క్రీడలు
రయ్ రయ్ మంటూ.. ఆకట్టుకున్న బైకర్ల విన్యాసాలు.. (ఫోటోలు)
వైజాగ్ వన్డేలో టీమిండియా జయభేరి.. ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
రేపు హైదరాబాద్కు హీరో సల్మాన్ ఖాన్ (ఫోటోలు)
సారా టెండూల్కర్ వారణాసి ట్రిప్ (ఫొటోలు)
విశాఖ చేరుకున్న భారత్, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్ సందడి (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియం: ఇదేం అభిమానం?.. ఉలిక్కిపడ్డ హార్దిక్, అభిషేక్ (చిత్రాలు)
వరల్డ్కప్ గెలిచి నెల రోజులు.. భారత మాజీ క్రికెటర్ భావోద్వేగం (ఫోటోలు)
ఉప్పల్లో హార్దిక్ హంగామా.. పోటెత్తిన అభిమానులు (ఫోటోలు)
మెస్సీతో మ్యాచ్.. ప్రాక్టీస్లో చెమటోడ్చిన సీఎం రేవంత్ (ఫొటోలు)
#INDvsSA : కింగ్ పూర్వవైభవం.. లేటు వయసులోనూ అదిరిపోయే శతకం
వీడియోలు
ఊహించినట్టే జరిగింది.. పెళ్లిపై ఇద్దరూ క్లారిటీ
పెళ్లి క్యాన్సిల్.. క్లారిటీ ఇచ్చేసిన స్మృతి
వైజాగ్ వన్డేలో టీమిండియా ఘన విజయం
విశాఖలో క్రికెట్ ఫీవర్.. టిక్కెట్ల విక్రయాల్లో గందరగోళం
వరుస సెంచరీలతో విరాట్ విధ్వంసం.. 2027 వరల్డ్ కప్ పై ఆశలు
రాయ్ పూర్ వన్డేలో భారత్ పై సౌతాఫ్రికా విజయం
సిరీస్ పై భారత్ గురి
IND Vs SA: రాంచీ వన్డేలో దుమ్ములేపిన భారత్
12 బంతుల్లో 50.. 32 బంతుల్లో 100.. ఇదేం బాదుడురా బాబు
జట్టులో కీలక మార్పులు
