Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Afghanistan Set 294 Runs Target For Bangladesh In 3rd ODI1
నబీ విధ్వంసం.. ఆఫ్ఘనిస్తాన్‌ భారీ స్కోర్‌

మూడు మ్యాచ్‌ సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో (Bangladesh) ఇవాళ (అక్టోబర్‌ 14) జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌ (Afghanistan) భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది.ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ (Ibrahim Zadran) (111 బంతుల్లో 95; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్హమైన సెంచరీని రనౌటై, చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ (44 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్‌) కూడా రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించారు. ఆతర్వాత జద్రాన్‌ సెదిఖుల్లా అటల్‌ (29) సాయంతో ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించారు.అయితే సెదిఖుల్లా ఔటయ్యాక ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. 76 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వెటరన్‌ మొహమ్మద్‌ నబీ (Mohammad Nabi) జూలు విదిల్చాడు. బంగ్లా బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. చివరి రెండు ఓవర్లలో 44 పరుగులు పిండుకున్నాడు. నబీ ధాటికి ఆఫ్ఘన్‌ స్కోర్‌ రాకెట్‌లా పైకెళ్లి పోయింది. 249 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ పడ్డ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌ ముగియడం లాంఛనమే అనుకున్నారు.అయితే నబీ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో నబీ 37 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నబీ ఇటీవల షార్జాలో కూడా ఇలాంటి సునామీ ఇన్నింగ్సే ఆడాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు తొలుత పట్టు కోల్పోయినా, ఆతర్వాత పుంజుకున్నారు. సైఫ్‌ హసన్‌ 3, హసన్‌ మహమూద్‌, తన్వీర్‌ ఇస్లాం తలో 2, రిషద్‌ హొసేన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది.చదవండి: టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?

WTC 2025 Updated Points Table After Team India’s Win Over West Indies2
టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?

స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ 2-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇవాళ (అక్టోబర్‌ 15) ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ 140 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ సిరీస్‌ గెలుపుతో టీమిండియా వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ 2025-27కు (WTC) సంబంధించి పాయింట్ల శాతాన్ని భారీగా పెంచుకుంది. ఈ సిరీస్‌కు ముందు భారత డబ్ల్యూటీసీ పాయింట్ల శాతం 43.56 శాతంగా ఉండింది. ఈ సిరీస్‌ గెలుపుతో భారత్‌ ఖాతాలో 18.34 పాయింట్ల శాతం చేరి ఈ సంఖ్యను 61.90కి పెంచింది.విండీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన తర్వాత భారత్‌ పాయింట్ల శాతాన్ని భారీగా పెంచుకున్నా, పట్టికలో మాత్రం మూడో స్థానంలోనే ఉంది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్‌ 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 2 పరాజయాలు, ఓ డ్రాతో 52 పాయింట్లు సాధించింది.ఆస్ట్రేలియా, శ్రీలంక టాప్‌-2లో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 100 శాతం పాయింట్లు సాధించగా.. శ్రీలంక 2 మ్యాచ్‌ల్లో ఓ విజయం, ఓ డ్రాతో 66.67 పాయింట్ల శాతాన్ని కలిగి ఉంది.ఈ జాబితాలో ఆస్ట్రేలియా, శ్రీలంక, భారత్‌ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్‌ (43.33), బంగ్లాదేశ్‌ (16.67), వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా ఉన్నాయి.కాగా, ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో టీమిండియా తదుపరి టాస్క్‌ నవంబర్‌లో ఎదుర్కొంటుంది. నవంబర్‌ 14 నుంచి సౌతాఫ్రికా భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ జరుగుతుంది. అనంతరం మూడు వన్డేలు, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగుతుంది.చదవండి: సిగ్గుచేటు అంటూ గంభీర్‌ ఫైర్‌.. బీసీసీఐ స్పందన ఇదే

BCCI vice president Rajeev Shukla backs Gambhir Over Harshit Selection3
BCCI: గంభీర్‌ వ్యాఖ్యలపై స్పందించిన బీసీసీఐ

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) చేసిన ‘సిగ్గుచేటు’ వ్యాఖ్యలపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా (Rajeev Shukla) స్పందించాడు. గంభీర్‌ సరిగ్గానే మాట్లాడానని సమర్థించిన అతడు.. యువ ఆటగాడి పట్ల సీనియర్ల ప్రవర్తన సరికాదని పేర్కొన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..గంభీర్‌ హెడ్‌కోచ్‌ కాగానే..ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టైటిల్‌ గెలవడంలో యువ పేసర్‌ హర్షిత్‌ రాణా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటి కేకేఆర్‌ మెంటార్‌ గంభీర్‌.. టీమిండియా హెడ్‌కోచ్‌ కాగానే హర్షిత్‌ జాతీయ జట్టులోకి వచ్చేశాడు. వరుస వైఫల్యాలు చెందినా.. టీమిండియాలో అతడి స్థానానికి ఢోకా లేకుండా పోయింది.ముఖ్యంగా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ ఫిట్‌గానే ఉన్నానని మొత్తుకుంటున్నా.. సెలక్టర్లు అతడిని పట్టించుకోవడం లేదు. ఇలాంటి తరుణంలో ఆస్ట్రేలియాతో వన్డే, టీ20లకు హర్షిత్‌ రాణా ఎంపిక కావడం విమర్శలకు దారితీసింది. గంభీర్‌ ప్రియ శిష్యుడు కాబట్టే అతడికి ఛాన్సులు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.చిక్కా, అశూ విమర్శలుఈ విషయంలో మాజీ చీఫ్‌ సెలక్టర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌, టీమిండియా స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ ఘాటుగానే స్పందించారు. హర్షిత్‌ను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో అర్థం కావడం లేదని పరోక్షంగా గంభీర్‌ను విమర్శించారు.గంభీర్‌ ఆగ్రహంఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో రెండో టెస్టులో విజయానంతరం మీడియాతో మాట్లాడిన గంభీర్‌.. చిక్కా, అశూలను టార్గెట్‌ చేశాడు. ‘‘యూట్యూబ్‌లో వ్యూస్‌ కోసం యువ ఆటగాడి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.మీ స్వార్థం కోసం 23 ఏళ్ల క్రికెటర్‌ను టార్గెట్‌ చేస్తారా? ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా కష్టపడి పైకి వచ్చిన ఆటగాడి గురించి ఇలా మాట్లాడకండి’’ అంటూ ఫైర్‌ అయ్యాడు. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా కూడా స్పందించాడు.బీసీసీఐ స్పందన ఇదే‘‘గౌతం గంభీర్‌ సరిగ్గానే చెప్పాడు. ఓ ఆటగాడి ఎంపిక గురించి ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే.. బాధ్యతాయుతంగా విమర్శించాలి. అంతేకానీ.. సదరు ప్లేయర్‌ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా మాట్లాడకూడదు.ఎవరిని ఎంపిక చేయాలో యాజమాన్యం చూసుకుంటుంది. ఇతర ఆటగాళ్ల గురించి మాట్లాడేటపుడు.. మీరెంత బాధ్యతాయుతంగా ఉన్నారో ఆలోచించుకోండి’’ అంటూ రాజీవ్‌ శుక్లా గంభీర్‌కు మద్దతు పలికాడు. ANIతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా గంభీర్‌, హర్షిత్‌ ఇద్దరూ ఢిల్లీకి చెందిన వారే కావడం గమనార్హం.చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్‌ జురెల్‌.. భారత తొలి క్రికెటర్‌గా ఫీట్‌#WATCH | Delhi: On Indian Men’s Cricket Team Head Coach Gautam Gambhir's statement on the selection process and bowler Harshit Rana, BCCI Vice President Rajeev Shukla says, "What Gautam Gambhir said is absolutely right. Comments should be made about players with responsibility;… pic.twitter.com/yOrJXFKanF— ANI (@ANI) October 14, 2025

Women's CWC 2025: Sri lanka Set 259 runs Target To New Zealand4
CWC 2025: శ్రీలంకతో మ్యాచ్‌.. న్యూజిలాండ్‌ టార్గెట్‌ ఎంతంటే..?

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్‌ 14) శ్రీలంక, న్యూజిలాండ్‌ జట్లు (Sri Lanka vs New Zealand) తలపడుతున్నాయి. కొలొంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిలాక్షి డిసిల్వ (55 నాటౌట్‌), కెప్టెన్‌ చమారీ ఆటపట్టు (53), హసిని పెరీరా (44), విష్మి గౌతమ్‌ (42) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. మిగతా లంక బ్యాటర్లలో హర్షిత 26, కవిష దిల్హరి 4, పియుమి వత్సల బడల్జే 7 పరుగులకు ఔటయ్యారు. అనుష్క సంజీవని 6 పరుగులతో అజేయంగా నిలిచింది.లంక స్కోర్‌కు ఎక్స్‌ట్రాల రూపంలో అదనంగా 21 పరుగులు యాడ్‌ అయ్యాయి. న్యూజిలాండ్‌ బౌలర్లలో కెప్టెన్‌ సోఫీ డివైన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. బ్రీ ఇల్లింగ్‌ 2, రోస్‌మేరి మైర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.కాగా, భారత్‌తో కలిసి ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న శ్రీలంక ఈ టోర్నీ ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ వర్షం​ కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకోవడంతో ఆ జట్టు ఖాతాలో ఓ పాయింట్‌ చేరింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఓడిన శ్రీలంక.. ఆతర్వాత ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం పాలైంది. ప్రస్తుతం ఆ జట్టు 3 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో కేవలం ఒకే ఒక పాయింట్‌ ఖాతాలో కలిగి ఉండి పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.న్యూజిలాండ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రదర్శన కూడా ఇప్పటివరకు ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ జట్టు 3 మ్యాచ్‌ల్లో రెండు పరాజయాలు, ఓ విజయంతో రెండు పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి, పట్టికలో ఐదో స్థానంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడిన న్యూజిలాండ్‌.. మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది.ఇతర జట్ల విషయానికొస్తే.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, భారత్‌ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్‌ ఆరో స్థానంలో ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన పాకిస్తాన్‌ చిట్టచివరి స్థానంలో ఉంది.చదవండి: పాక్‌పై 11 వికెట్లు.. సౌతాఫ్రికా బౌలర్‌ అరుదైన ఘనత

Eager to see Ro Ko back Action hope Kohli scores 2 hundreds: Harbhajan5
‘ఆస్ట్రేలియాలో కోహ్లి రెండు సెంచరీలు చేస్తాడు’

వెస్టిండీస్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్‌ చేసిన టీమిండియా.. తదుపరి ఆస్ట్రేలియా (India Tour Of Australia 2025)లో పర్యటించనుంది. కంగారూ జట్టుతో భారత్‌ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. అక్టోబరు 19 నుంచి టీమిండియా ఆసీస్‌ టూర్‌ ప్రారంభం కానుండగా... దిగ్గజ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి (Virat Kohli), రోహిత్‌ శర్మ (Rohit Sharma) చాన్నాళ్ల తర్వాత పునరాగమనం చేయనున్నారు.అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్‌చివరగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియాకు ఆడిన రో- కో.. ఆ తర్వాత అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఇక గతేడాదే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు మేటి బ్యాటర్లు.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు.ఆస్ట్రేలియాలో గిల్‌ సారథ్యంలోఇలాంటి తరుణంలో రోహిత్‌ శర్మ విషయంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి.. అతడి స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌కు పగ్గాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో గిల్‌ సారథ్యంలో మాజీ కెప్టెన్లు రోహిత్‌- కోహ్లి కలిసి ఆడనున్నారు.కాగా రోహిత్‌పై వేటు వేసిన సమయంలో చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడుతూ.. రోహిత్‌, కోహ్లి వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడటం గురించి తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ రో-కో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరో నాలుగైదేళ్లు ఢోకా లేదు‘‘దయచేసి విరాట్‌ ఫిట్‌నెస్‌ గురించి ఎవరూ ఏమీ అడగకండి. ఫిట్‌నెస్‌ విషయంలో అతడొక గురు. అతడు ఏం చేసినా మిగతా వాళ్లు ఫాలో అయిపోతారు. కాబట్టి విరాట్‌ కోహ్లి ఫిట్‌నెస్‌ గురించి మనమేమీ ఆందోళన పడాల్సిన పనిలేదు.అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం అతడి కంటే ఫిట్‌గా ఉన్న మరొక ప్లేయర్‌ ఎవరూ లేరు. అయితే, కోహ్లి బ్యాట్‌చేతపట్టి ఎప్పుడెప్పుడు మైదానంలో దిగుతాడా అని నేను ఎదురుచూస్తున్నా.చాలా రోజులుగా అభిమానులతో పాటు నేనూ అతడి ఆటను మిస్సవుతున్నాను. వన్డేల్లో కోహ్లి ఇంకా ఎంతో సాధించగలడు. ఇంకొన్నేళ్లు ఆడగల సత్తా అతడికి ఉంది. కనీసం మరో నాలుగైదేళ్లు కోహ్లి వన్డేలు ఆడతాడని నేను నమ్ముతున్నా.కేవలం ఆడటమే కాదు.. తనదైన శైలిలో ఆధిపత్యం కూడా చూపిస్తాడని విశ్వసిస్తున్నా. ఆస్ట్రేలియాలో అతడి ఆట కోసం ఎదురుచూస్తున్నా. ఇక రోహిత్‌ విషయంలోనూ నేను ఇదే చెప్తా.కోహ్లి రెండు సెంచరీలు చేస్తాడుఆస్ట్రేలియాలో ఈ ఇద్దరు దిగ్గజాలు భారీ స్కోర్లు సాధించి టీమిండియాను గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఆస్ట్రేలియా కోహ్లికి ఇష్టమైన ప్రత్యర్థి. మూడు వన్డేల్లో కలిపి అతడు కనీసం రెండు శతకాలైనా బాదుతాడని అనుకుంటున్నా’’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య వన్డే, టీ20 సిరీస్‌లు జరుగనున్నాయి.చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్‌ జురెల్‌.. భారత తొలి క్రికెటర్‌గా ఫీట్‌

Senuran Muthusamy joins elite SA spinners table after 11 wicket match haul in Lahore6
పాక్‌పై 11 వికెట్లు.. సౌతాఫ్రికా బౌలర్‌ అరుదైన ఘనత

లాహోర్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్‌ సెనురన్‌ ముత్తుసామి (Senuran Muthusamy) చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల సహా మ్యాచ్‌ మొత్తంలో 11 వికెట్లు తీసి ఓ అరుదైన ఘనత సాధించాడు.ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన నాలుగో సౌతాఫ్రికన్‌ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ముత్తుసామికి ముందు హగ్‌ టేఫీల్డ్‌ (1952లో ఆస్ట్రేలియాపై 13/165), హగ్‌ టేఫీల్డ్‌ (1957లో ఇంగ్లండ్‌పై 13/192), కేశవ్‌ మహారాజ్‌ (2018లో శ్రీలంకపై 12/283), పాల్‌ ఆడమ్స్‌ (2003లో బంగ్లాదేశ్‌పై 10/106) మాత్రమే ఈ ఘనత సాధించారు.ముత్తుసామి ప్రదర్శనల కారణంగా ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా నిలబడగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ను 378 పరుగులకు పరిమితం చేసిన ముత్తు.. రెండో ఇన్నింగ్స్‌లో మరింతగా చెలరేగి ప్రత్యర్దిని 167 పరుగులకే మట్టుబెట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ముత్తుసామితో పాటు సైమన్‌ హార్మర్‌ (14.1-3-51-4) కూడా సత్తా చాటాడు.పాక్‌ ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసిన బాబర్‌ ఆజమ్‌ టాప్‌ స్కోరర్‌ కాగా.. అబ్దుల్లా షఫీక్‌ (41), సౌద్‌ షకీల్‌ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మరో ఇద్దరు (రిజ్వాన్‌ (14), నౌమన్‌ అలీ (11)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులు ఆధిక్యం సాధించిన పాక్‌.. రెండో ఇన్నింగ్స్‌ స్కోర్‌ కలుపుకుని సౌతాఫ్రికా ముందు 277 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలోనే తడబడింది. 18 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ 3, వియాన్‌ ముల్దర్‌ డకౌటయ్యారు. వీరిద్దరు ఔటయ్యాక సౌతాఫ్రికా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. ర్యాన్‌ రికెల్టన్‌ (29), టోనీ డి జోర్జీ (16) ఆచితూచి ఆడుతూ నిదానంగా లక్ష్యాన్ని కరిగిస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోర్‌ 2 వికెట్ల నష్టానికి 51 పరుగులుగా ఉంది. గెలుపుకు 226 పరుగుల దూరంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగిన నౌమన్‌ అలీ రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రభావం చూపుతున్నాడు. సౌతాఫ్రికా కోల్పోయిన రెండు వికెట్లు నౌమన్‌ ఖాతాలోనే పడ్డాయి.శతక్కొట్టిన జోర్జిఅంతకుముందు టోనీ డి జోర్జి బాధ్యతాయుతమైన శతకంతో (104) మెరవడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేయగలిగింది. ఓ పక్క సహచరులంతా విఫలమైన జోర్జి మాత్రం పట్టుదలతో ఆడి తన జట్టును ఆదుకున్నాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో జోర్జితో పాటు ర్యాన్‌ రికెల్టన్‌ (71) ఒక్కడే రాణించారు. పాక్‌ వెటరన్‌ స్పిన్నర్‌ నౌమన్‌ అలీ ఆరు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. నౌమన్‌కు సాజిద్‌ ఖాన్‌ (3/98) సహకరించాడు. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు సౌతాఫ్రికా 109 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో నలుగురు అర్ద సెంచరీలతో రాణించారు. ఇమామ్‌ ఉల్‌ హక్‌ (93), సల్మాన్‌ అఘా (93) తృటిలో సెంచరీలు మిస్‌ కాగా.. కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (76), మహ్మద్‌ రిజ్వాన్‌ (75) భారీ అర్ద సెంచరీలు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్‌ ముత్తుసామి 6 వికెట్లు తీయగా.. ప్రెనెలన్‌ సుబ్రాయన్‌ 2, రబాడ, హార్మర్‌ తలో వికెట్‌ తీశారు.చదవండి: రేపటి నుంచి దేశీయ క్రికెట్‌ మహా సంగ్రామం ప్రారంభం

Deserves Every Bit: Gambhir Blunt Take On Gill Replacing Captain Rohit7
కెప్టెన్‌ అంటే ఇలాగే ఉండాలి.. అందరూ అతడిని గౌరవిస్తారు: గంభీర్‌

టీమిండియా టెస్టు సారథి శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)పై హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. టెస్టు కెప్టెన్‌గా అతడు తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణుడయ్యాడని.. అతడికి వంక పెట్టేందుకు ఏమీ లేదని కొనియాడాడు. తనకు ఉన్న నైపుణ్యాలతోనే గిల్‌ టెస్టు సారథి అయ్యాడని.. అలాగే వన్డే కెప్టెన్సీ బాధ్యతలు కూడా దక్కించుకున్నాడని పేర్కొన్నాడు.సారథిగా తొలి ప్రయత్నంలోనేకాగా ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించగా.. గిల్‌ అతడి స్థానాన్ని భర్తీ చేసిన విషయం తెలిసిందే. సారథిగా తొలి ప్రయత్నంలోనే ఇంగ్లండ్‌ వంటి పటిష్టమైన జట్టుతో తలపడ్డాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించి ఇంగ్లండ్‌ గడ్డ మీద ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేశాడు.విండీస్‌ను వైట్‌వాష్‌ చేసి తొలి విజయంఇక తాజాగా వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్‌ చేసి.. కెప్టెన్‌గా గిల్‌ తొలి సిరీస్‌ విజయాన్ని రుచిచూశాడు. ఇదిలా ఉంటే.. ఇటీవలే వన్డే కెప్టెన్సీ నుంచి దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను తప్పించిన భారత క్రికెట్‌ యాజమాన్యం.. గిల్‌కు పగ్గాలు అప్పగించింది.ఫేవటెరిజం లేదుఈ నేపథ్యంలో విమర్శలు రాగా.. విండీస్‌పై విజయానంతరం గంభీర్‌ స్పందించాడు. ‘‘అతడిని అచ్చంగా అతడిలా ఉండనివ్వడమే మేము చేసిన మంచిపని. టెస్టు లేదంటే వన్డే కెప్టెన్‌గా అతడిని ఎంపిక చేయడంలో ఎలాంటి ఫేవటెరిజం లేదు. ఇందుకు వందశాతం గిల్‌ అర్హుడు.ఎన్నో ఏళ్లుగా అతడు కఠినంగా శ్రమిస్తున్నాడు. ఇంగ్లండ్‌ గడ్డ మీద టెస్టు కెప్టెన్‌ ఇప్పటికే కఠిన సవాలు ఎదుర్కొని.. అతడు సారథిగా పాసయ్యాడు. నాణ్యమైన జట్టుపై బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించాడు. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 2027 గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం సరికాదు.అందరూ అతడిని గౌరవిస్తారుప్రతి మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లడం ముఖ్యం. సొంతగడ్డపై మాకిది కీలకమైన సిరీస్‌. ఇదే స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తాం. నిజానికి ఇంగ్లండ్‌లో టెస్టులు ఇంతకంటే కష్టంగా ఉండేవి. ఇదే విషయాన్ని గిల్‌తో నేను చాలాసార్లు చెప్పాను.రెండున్నర నెలల పాటు అక్కడ గిల్‌ అత్యంత కఠినమైన సవాలును ఎదుర్కొన్నాడు. ఇంతకంటే అతడు ఇంకేం చేయాలి? డ్రెసింగ్‌రూమ్‌లో అందరూ అతడిని గౌరవిస్తారు. సరైన పనులు చేసినందుకు అతడికి ఇవన్నీ దక్కాయి. మాటల కంటే చేతలు ముఖ్యం’’ అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు.నాకు ఆ అవసరం ఉందిఇక ఒత్తిడిని తట్టుకునేందుకు గిల్‌ కోసం మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌ను నియమిస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ముందైతే నాకు అతడి అవసరం ఉంది’’ అంటూ నవ్వులు చిందించాడు. గెలిచినప్పుడు జట్టుకు ప్రశంసలు దక్కుతాయన్న గౌతీ.. ఓడినప్పుడు మాత్రం ఆటగాళ్లు కుంగిపోకుండా చూసుకోవడం తన బాధ్యత అని చెప్పుకొచ్చాడు.చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్‌ జురెల్‌.. భారత తొలి క్రికెటర్‌గా ఫీట్‌

Pakistan Set 277 Runs Target To South Africa In First Test8
పాక్‌ను మడతపెట్టిన ముత్తుసామి.. సౌతాఫ్రికా టార్గెట్‌ ఎంతంటే..?

లాహోర్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో (Pakistan vs South Africa) సౌతాఫ్రికా స్పిన్నర్‌ సెనురన్‌ ముత్తుసామి (Senuran Muthusamy) చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 5 సహా మ్యాచ్‌ మొత్తంలో 11 వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టాడు. ముత్తుసామి (17-1-57-5) ధాటికి పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. అతనికి సైమన్‌ హార్మర్‌ (14.1-3-51-4), రబాడ (10-0-33-1) సహకరించారు.పాక్‌ ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసిన బాబర్‌ ఆజమ్‌ టాప్‌ స్కోరర్‌ కాగా.. అబ్దుల్లా షఫీక్‌ (41), సౌద్‌ షకీల్‌ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మరో ఇద్దరు (రిజ్వాన్‌ (14), నౌమన్‌ అలీ (11)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం (109 పరుగులు) కలుపుకుని పాక్‌ సౌతాఫ్రికా ముందు 277 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.శతక్కొట్టిన జోర్జిఅంతకుముందు టోనీ డి జోర్జి (Tony de Zorzi) బాధ్యతాయుతమైన శతకంతో (104) మెరవడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేయగలిగింది. ఓ పక్క సహచరులంతా విఫలమైన జోర్జి మాత్రం పట్టుదలతో ఆడి తన జట్టును ఆదుకున్నాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో జోర్జితో పాటు ర్యాన్‌ రికెల్టన్‌ (71) ఒక్కడే రాణించారు. పాక్‌ వెటరన్‌ స్పిన్నర్‌ నౌమన్‌ అలీ ఆరు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. నౌమన్‌కు సాజిద్‌ ఖాన్‌ (3/98) సహకరించాడు. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు సౌతాఫ్రికా 109 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో నలుగురు అర్ద సెంచరీలతో రాణించారు. ఇమామ్‌ ఉల్‌ హక్‌ (93), సల్మాన్‌ అఘా (93) తృటిలో సెంచరీలు మిస్‌ కాగా.. కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (76), మహ్మద్‌ రిజ్వాన్‌ (75) భారీ అర్ద సెంచరీలు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్‌ ముత్తుసామి 6 వికెట్లు తీయగా.. ప్రెనెలన్‌ సుబ్రాయన్‌ 2, రబాడ, హార్మర్‌ తలో వికెట్‌ తీశారు.చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్‌ జురెల్‌.. భారత తొలి క్రికెటర్‌గా ఫీట్‌

HCA Announce Open Selection Trials for Under 19 Women Players Details9
యువ క్రికెటర్లకు HCA బంపరాఫర్‌.. ఆలస్యం చేయకండి

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) యువ మహిళా క్రికెటర్లకు బంపరాఫర్‌ ఇచ్చింది. భారత అండర్‌-19 వుమెన్‌ జట్టులో చోటు కోసం పోటీపడే సువర్హావకాశం కల్పించింది. ఇందుకోసం అక్టోబరు 15, 16 తేదీల్లో ఓపెన్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది.ఇందులో సత్తా చాటిన మహిళా క్రికెటర్లు 2025-26 సీజన్‌కు గానూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) నిర్వహించే టోర్నీల్లో భాగం కావొచ్చని హెచ్‌సీఏ ఈ సందర్భంగా తెలిపింది. ఇక పోటీల్లో పాల్గొనాలనుకునే మహిళా క్రికెటర్లకు ఉండాల్సిన అర్హతలను కూడా మంగళవారం వెల్లడించింది. ప్రతి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఈ నోటిఫికేషన్‌ గురించి స్థానిక ప్లేయర్లకు సమాచారం అందించాలని ఆదేశించింది.రిజిస్ట్రేషన్‌ వివరాలు👉అక్టోబరు 15 2025న ఉదయం తొమ్మిది గంటల నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆరంభం👉మధ్యాహ్నం 12- సాయంత్రం 5 గంటలకు వరకు ట్రయల్స్‌👉అక్టోబరు 16న కూడా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రిజిస్ట్రేషన్‌, ట్రయల్స్‌ ప్రక్రియవేదిక👉ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌, రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం (RGICS), ఉప్పల్‌, హైదరాబాద్‌.నోట్‌: జిల్లాల నుంచి వచ్చే క్రికెటర్లు అక్టోబరు 15న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోనట్లయితే.. అక్టోబరు 16న ఉప్పల్‌లో ఉదయం 9- సాయంత్రం ఐదు గంటల వరకు రిపోర్టు చేయవచ్చు.అర్హత👉01.09.2006న లేదంటే ఆ తర్వాత జన్మించిన మహిళా క్రికెటర్లకు మాత్రమే ఈ అవకాశంప్లేయర్లు పాటించాల్సిన నిబంధనలు👉ఉప్పల్‌లోని RGICSలో గేట్‌ 1 వద్ద ప్లేయర్లంతా రిపోర్టు చేయాలి.👉ప్రతీ ప్లేయర్‌ తమ క్రికెట్‌ కిట్‌, తెలుపు రంగు దుస్తులు వెంట తెచ్చుకోవాలి.👉 గుర్తింపు పత్రాలను తప్పక తీసుకురావాలి.1. పుట్టినరోజును ధ్రువీకరించే బర్త్‌ సర్టిఫికెట్‌ ఒరిజినల్‌ డిజిటల్‌ కాపీ, దానితో పాటు జిరాక్స్‌ ఫొటోకాపీని తీసుకురావాలి.2. ఒరిజినల్‌ ఫుల్‌ సైజ్‌ ఆధార్‌ కార్డుతో పాటు.. దాని జిరాక్స్‌ ఫొటోకాపీ కూడా తెచ్చుకోవాలి.3. ఒక పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో తీసుకురావాలి.చదవండి: సిగ్గు చేటు: అశ్విన్‌, మాజీ చీఫ్‌ సెలక్టర్‌పై గంభీర్‌ ఫైర్‌

IND vs WI: Dhruv Jurel Creates History Become First Indian Player To10
చరిత్ర సృష్టించిన ధ్రువ్‌ జురెల్‌.. భారత తొలి క్రికెటర్‌గా ఫీట్‌

టీమిండియా యువ క్రికెటర్‌ ధ్రువ్‌ జురెల్‌ (Dhruv Jurel) అరుదైన ఘనత సాధించాడు. అరంగేట్రం నుంచి ఇప్పటికి వరుసగా అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు స్వింగ్‌ సుల్తాన్‌ భువనేశ్వర్ కుమార్‌ (Bhuvneshwar Kumar) పేరిట ఉండేది. వెస్టిండీస్‌తో రెండో టెస్టు (IND vs WI 2nd Test) సందర్భంగా ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు. ఏడు వికెట్ల తేడాతో జయభేరిప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా టీమిండియా స్వదేశంలో విండీస్‌తో రెండు మ్యాచ్‌లు ఆడింది. తొలుత అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్‌ 140 పరుగుల తేడాతో చిత్తు చేసిన గిల్‌ సేన.. ఢిల్లీలో మంగళవారం ముగిసిన రెండో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.కేఎల్‌ రాహుల్‌తో కలిసితద్వారా విండీస్‌తో టెస్టు సిరీస్‌ను భారత్‌ 2-0తో వైట్‌వాష్‌ చేసింది. ఇక వెస్టిండీస్‌తో రెండో టెస్టులో జురెల్‌ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 79 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులతో అజేయంగా నిలిచి.. కేఎల్‌ రాహుల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.సరికొత్త చరిత్రకాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధ్రువ్‌ జురెల్‌ గతేడాది ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రధాన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ కారణంగా కొన్నిసార్లు బెంచ్‌కే పరిమితమైన జురెల్‌.. ఇప్పటికి ఏడు టెస్టులు పూర్తి చేసుకున్నాడు. ఓ సెంచరీ, ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 761 పరుగులు సాధించాడు.ఈ క్రమంలోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం నుంచి భారత్‌ తరఫున ఆడిన ఏడు టెస్టుల్లోనూ విజయం సాధించిన జట్లలో భాగమైన తొలి ఆటగాడిగా జురెల్‌ నిలిచాడు. అంతకు ముందు ఫాస్ట్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తన అరంగేట్రం (2013) నుంచి వరుసగా ఆరు టెస్టుల్లో గెలిచిన భారత జట్టులో భాగమయ్యాడు.భారత్‌ తరఫున వరుసగా అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన క్రికెటర్లు👉ధ్రువ్‌ జురెల్‌- 7👉భువనేశ్వర్‌ కుమార్‌- 6👉కరుణ్‌ నాయర్‌- 4👉వినోద్‌ కాంబ్లీ- 4👉రాజేశ్‌ చౌహాన్‌- 4. చదవండి: IND vs WI: టీమిండియా వ‌ర‌ల్డ్ రికార్డు

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement