Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Its A YES: Palash Proposes To Smriti Mandhana At WC Final Venue Video1
స్మృతి మంధానకు కాబోయే భర్త సర్‌ప్రైజ్‌.. వీడియో వైరల్‌

భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. చిరకాల స్నేహితుడు, సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌ (Palash Muchhal)తో ఏడడుగులు వేయనుంది. చాన్నాళ్ల క్రితమే తమ బంధాన్ని బయటి ప్రపంచానికి తెలిపిన స్మృతి- పలాష్‌ జంట.. తమ ప్రేమను వైవాహిక బంధంతో నవంబరు 23న పదిలం చేసుకోనున్నారు.జగజ్జేతగా భారత్‌ఈ నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు పెళ్లి వేడుకలు మొదలుకాగా.. పలాష్‌ తన రొమాంటిక్‌ ప్రపోజల్‌తో స్మృతిని సర్‌ప్రైజ్‌ చేశాడు. కాగా భారత మహిళా క్రికెట్‌ జట్టు ఇటీవలే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2025 టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత్‌ ప్రపంచకప్‌ గెలవాలన్న మిథాలీ రాజ్‌, ఝులన్‌ గోస్వామి వంటి దిగ్గజ ఆటగాళ్ల కలను హర్మన్‌ సేన సొంతగడ్డపై నెరవేర్చింది.ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. మహిళల వన్డే క్రికెట్‌లో తొలిసారి భారత్‌ జగజ్జేతగా నిలిచింది. నాలుగున్నర దశాబ్దాల కలను నెరవేరుస్తూ ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంలో ఓపెనర్‌గా, వైస్‌ కెప్టెన్‌గా స్మృతి మంధాన తన వంతు పాత్ర పోషించింది. ఇంతటి ప్రత్యేకమైన ఈ మైదానంలోనే స్మృతికి పలాష్‌ అదిరిపోయే బహుమతి ఇచ్చాడు.నన్ను పెళ్లి చేసుకుంటావా?కళ్లకు గంతలు కట్టి మరీ స్మృతిని డీవై పాటిల్‌ స్టేడియానికి తీసుకువెళ్లిన పలాష్‌.. మోకాళ్లపై కూర్చుని.. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ ప్రతిపాదన తెచ్చాడు. ఇందుకు ఆమె నవ్వుతూ అంగీకరించింది. పలాష్‌ తన వేలికి ఉంగరం తొడగడంతో సిగ్గులమొగ్గయిన స్మృతి.. ఆ తర్వాత తాను కూడా పలాష్‌ వేలికి ఉంగరం తొడిగింది.ఇందుకు సంబంధించిన వీడియోను పలాష్‌ ముచ్చల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘‘ఆమె సరేనంది’’ అంటూ తమ జీవితంలోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. కాగా తమ్ముడు పలాష్‌తో పాటు బాలీవుడ్‌ సింగర్‌ పాలక్‌ ముచ్చల్‌ కూడా స్టేడియానికి వచ్చి మరదల్ని సర్‌ప్రైజ్‌ చేసింది. ఆ తర్వాత అంతా కలిసి నవ్వులు చిందిస్తూ స్టెప్పులు వేశారు. కాగా మహారాష్ట్రకు చెందిన 29 ఏళ్ల స్మృతి మంధాన క్రికెటర్‌గా సత్తా చాటుతుండగా.. ఇండోర్‌కు చెందిన 30 ఏళ్ల పలాష్‌ ముచ్చల్‌ బాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఇరుకుటుంబాల సమ్మతితో స్మృతి- పలాష్‌ ఆదివారం (నవంబరు 23) పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నారు.చదవండి: ఐపీఎల్‌ ఆడటం మానెయ్‌: గిల్‌కు గంభీర్‌ సలహా ఇదే View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal)

19 Wickets On Opening Day Of 1st Ashes Test2
యాషెస్‌ సిరీస్‌కు అదిరిపోయే ఆరంభం

2025-26 యాషెస్‌ సిరీస్‌కు (Ashes Series) అదిరిపోయే ఆరంభం లభించింది. పెర్త్‌ వేదికగా ఇవాళ (నవంబర్‌ 21) మొదలైన తొలి మ్యాచ్‌లో (Australia vs England) ఏకంగా 19 వికెట్లు పడ్డాయి. యాషెస్‌ సిరీస్‌ చరిత్రలో గడిచిన వందేళ్లలో ఇలా ఎప్పుడూ జరగలేదు. 2001 ట్రెంట్‌బ్రిడ్జ్‌ టెస్ట్‌లో అత్యధికంగా 17 వికెట్లు పడ్డాయి.యాషెస్‌ టెస్ట్‌ తొలి రోజు 18 అంతకంటే ఎక్కువ వికెట్లు పడిన ఏకైక ఉదంతం 1909 ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ టెస్ట్‌లో చోటు చేసుకుంది. ఆ మ్యాచ్‌ తొలి రోజు రికార్డు స్థాయిలో 20 వికెట్లు పడ్డాయి. తొలుత ఆస్ట్రేలియా 147, ఆర్వాత ఇంగ్లండ్‌ 119 పరుగులకు ఆలౌటయ్యాయి.ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఇవాళ మొదలైన యాషెస్‌ టెస్ట్‌లోనూ పునరావృతమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 172 పరుగులకు ఆలౌట్‌ కాగా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌పై మిచెల్‌ స్టార్క్‌ నిప్పులు చెరిగాడు. ఏకంగా 7 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టాడు. అరంగేట్రం పేసర్‌ బ్రెండన్‌ డాగ్గెట్‌ 2, గ్రీన్‌ ఓ వికెట్‌ తీశారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్‌ (52) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ఓలీ పోప్‌ (46), జేమీ స్మిత్‌ (33), డకెట్‌ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జాక్‌ క్రాలే, రూట్‌, మార్క్‌ వుడ్‌ డకౌట్లు కాగా.. స్టోక్స్‌ 6, అట్కిన్సన్‌ 1, కార్స్‌ 6 పరుగులకు ఔటయ్యారు.అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ బౌలర్లు సైతం విరుచుకుపడ్డారు. కెప్టెన్‌ స్టోక్స్‌ 5, ఆర్చర్‌, కార్స్‌ తలో 2 వికెట్లు తీసి ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను పతనం అంచుకు తీసుకెళ్లారు. ఇప్పటివరకు ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో అలెక్స్‌ క్యారీ (26) టాప్‌ స్కోరర్‌ కాగా.. హెడ్‌ (21), గ్రీన్‌ (24), స్టీవ్‌ స్మిత్‌ (17), స్టార్క్‌ (12) రెండంకెల స్కోర్లు చేశారు. అరంగేట్రం బ్యాటర్‌ వెదరాల్డ్‌, బోలాండ్‌ డకౌట్లు కాగా.. లబూషేన్‌ 9, ఖ్వాజా 2 పరుగులకు ఔటయ్యారు. లియోన్‌ (3), డగ్గెట్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండగా భూకంపం.. ఉలిక్కిపడ్డ ప్లేయర్లు

Maharashtra squad for the Syed Mushtaq Ali Trophy 2025-26 Announced. Ruturaj Gaikwad will lead3
కెప్టెన్‌గా రుతురాజ్‌

త్వరలో ప్రారంభం కానున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ (SMAT 2025-26) కోసం 16 మంది సభ్యుల మహారాష్ట్ర జట్టును (Maharashtra) ఇవాళ (నవంబర్‌ 21) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad) ఎంపికయ్యాడు. ఇటీవలే ముంబై నుంచి వలస వచ్చిన పృథ్వీ షాకు (Prithvi Shaw) ఈ జట్టులో చోటు దక్కింది. రుతురాజ్‌, షా ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.ఈ టోర్నీ ఈ నెల 26 నుంచి ప్రారంభం​ కానుండగా, అదే రోజు మహారాష్ట్ర తమ తొలి మ్యాచ్‌లో జమ్మూ అండ్‌ కశ్మీర్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో మహారాష్ట్ర ఎలైట్‌ గ్రూప్‌-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో హైదరాబాద్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఛండీఘడ్‌, బిహార్‌, గోవా జట్లు ఉన్నాయి. గ్రూప్‌ దశలో మహారాష్ట్ర మొత్తం 7 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ కోల్‌కతా వేదికగా జరుగనున్నాయి.SMAT 2025-26 కోసం మహారాష్ట్ర జట్టు..రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, అర్శిన్‌ కులకర్ణి, రాహుల్‌ త్రిపాఠి, నిఖిల్‌ నాయక్‌ (వికెట్‌కీపర్‌), రామకృష్ణ ఘోష్‌, విక్కీ ఓస్త్వాల్‌, తనయ్‌ సంఘ్వీ, ముకేశ్‌ చౌదరీ, ప్రశాంత్‌ సోలంకి, మందర్‌ బండారీ (వికెట్‌కీపర్‌), జలజ్‌ సక్సేనా, రాజవర్దన్‌ హంగార్గేకర్‌, యోగేశ్‌ డోంగరే, రంజిత్‌ నికమ్‌చదవండి: క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండగా భూకంపం.. ఉలిక్కిపడ్డ ప్లేయర్లు

BAN VS IRE 2nd Test Day 3: Earthquake stops play briefly in Mirpur4
క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండగా భూకంపం.. ఉలిక్కిపడ్డ ప్లేయర్లు

ఢాకా (Dhaka) వేదిక‌గా బంగ్లాదేశ్‌ (Bangladesh)-ఐర్లాండ్ (Bangladesh vs Ireland) మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్‌ మూడో రోజు (నవంబర్‌ 21) ఆట‌లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ్యాచ్‌ జరుగుతుండగా భూకంపం (Earth Quake) సంభవించ‌డంతో మైదానంలో ఉన్న ఆట‌గాళ్లంతా ఉలిక్కిపడ్డారు. మ్యాచ్‌ ఉన్నపళంగా ఆగిపోయింది. ఆటగాళ్లు, అంపైర్లు బౌండరీ లైన్‌ వైపు పరుగులు పెట్టారు. కొందరేమో మైదానంలోనే కింద పడుకుండిపోయారు.ప్రేక్షకులు ఏం జరుగుతుందో అర్దం కాక స్టేడియం బయటికి లగెత్తారు. దీంతో కాసేపు గందరగోళ వాతావరణం​ నెలకొంది. మూడు, నాలుగు నిమిషాల భూకంపం ధాటి తగ్గడంతో సాధారణ పరిస్థితి నెలకొంది. మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైంది. ఈ షాకింగ్‌ ఘటన ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ 56వ ఓవర్‌ రెండో బంతి బౌల్‌ చేస్తుండగా చోటు చేసుకుంది.కాగా, ఇవాళ ఉదయం 10:08 గంటల సమయంలో బంగ్లాదేశ్‌లోని ఢాకా నగరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (US Geological Survey) తెలిపింది. భూప్రకంపనల కారణంగా ఢాకాలోని పలు భవనాలు కూలిపోయాయి. ఇందులో ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం.మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ పట్టు సాధించింది. మూడో రోజు మూడో సెషన్‌ సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 70 పరుగులు చేసి, 281 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగుల భారీ స్కోర్‌ చేసిన బంగ్లాదేశ్‌.. ఆతర్వాత ఐర్లాండ్‌ను 265 పరుగులకే పరిమితం చేసి 211 పరుగుల కీలక ఆధిక్యం​ సాధించింది. రెండు మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో తొలి టెస్ట్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ 1-0 ఆధిక్యంలో ఉంది. చదవండి: టీమిండియా కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌.. బీసీసీఐ అధికారిక ప్రకటన

Ashes 2025-26: Why didnt Usman Khawaja open for Australia in Perth?5
టాయిలెట్ బ్రేక్‌.. కట్ చేస్తే! ఆసీస్ ఓపెన‌ర్‌కు ఊహించ‌ని షాక్‌

పెర్త్ వేదిక‌గా జ‌రుగుతున్న యాషెస్‌ తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాట‌ర్లు తేలిపోయారు. ఆస్ట్రేలియా పేస‌ర్ మిచెల్ స్టార్ ధాటికి ఇంగ్లండ్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 172 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. స్టార్ 7 వికెట్ల‌తో ఇంగ్లీష్ జ‌ట్టు ప‌త‌నాన్ని శాసించాడు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్‌(52) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఓలీ పోప్‌(46), జేమీ స్మిత్‌(33) ఫర్వాలేదన్పించారు. అనంత‌రం ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు రెగ్యూల‌ర్ ఓపెన‌ర్‌ ఉస్మాన్ ఖవాజా బదులుగా మార్నస్ లబుషేన్ రావ‌డాన్ని చూసి మైదానంలో ఉన్న ప్రేక్షకులంతా ఆశ్చ‌ర్య‌పోయారు.వాస్తవానికి తొలి టెస్టుకు అరంగేట్ర ఆట‌గాడు జేక్ వెదరాల్డ్, ఖవాజా ఓపెనర్‌లుగా ఉన్నారు. కానీ ఉస్మాన్ మాత్రం బ్యాటింగ్‌కు రాలేదు. దీం‍తో అతడికి ఏమైనా గాయమైందా? అని అభిమానులు తెగ టెన్ష‌న్ ప‌డ్డారు. అయితే ఖావాజా బ్యాటింగ్‌కు రాక‌పోవడానికి అసలు కారణం ఏంటో తెలుసుకుందాం. ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఆఫ్‌ది ఫీల్డ్ టైమ్ పూర్తి కాకపోవడం వల్లే ఉస్మాన్ ఆసీస్‌ ఇన్నింగ్స్ ప్రారంభించలేకపోయాడు.రూల్స్‌ ఏమి చెబుతున్నాయి?ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు ఖవాజా ఎక్కువ సమయం పాటు మైదానం వెలుపల (Off the field) ఉన్నాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం.. ఒక ప్లేయర్ బ్రేక్ పేరిట ఎనిమిది నిమిషాల కంటే ఎక్కువ సమయం మైదానం బయట ఉంటే సదరు ఆటగాడికి కొన్ని ఆంక్షలు వర్తిస్తాయి. ఎంత సమయం పాటు బయట ఉన్నాడో.. ఆ నిర్ధిష్ట సమయం పూర్తి అయ్యే వరకు బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుమతించరు. ఇప్పుడు ఖవాజా విషయంలో అదే జరిగింది. ఇంగ్లండ్ వికెట్లు వెంటవెంటనే పడడంతో ఖవాజా ఆఫ్‌ది ఫీల్డ్ సమయాన్ని పూర్తి చేయలేకపోయాడు. దీంతో అతడు తన బ్రేక్‌ సమయానికి అనుగుణంగా డ్రెసింగ్‌రూమ్‌లోని ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే ఓపెనర్‌గా కాకుండా నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.అయితే టాయిలెట్ బ్రేక్స్ పేరిట అతడు దాదాపుగా 20 నిమిషాల పాటు ఆఫ్‌ది ఫీల్డ్ పేరిట ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈమ్యాచ్‌లో ఖవాజా తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. కాగా ఆసీస్‌ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. ఆస్ట్రేలియా 23 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది.చదవండి: టీమిండియా కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌.. బీసీసీఐ అధికారిక ప్రకటన

We have taken decision: Pant Huge statement on Gill Replacement6
ఎవరిని ఆడించాలో తెలుసు.. నిర్ణయం తీసుకున్నాం: రిషభ్‌ పంత్‌

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా సారథిగా రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) ఎంపికయ్యాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మెడ నొప్పి కారణంగా జట్టుకు దూరం కావడంతో పగ్గాలు పంత్‌ చేతికి వచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన పంత్‌.. తనకు కెప్టెన్‌గా అవకాశం ఇచ్చినందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)కి ధన్యవాదాలు తెలిపాడు.నా కెప్టెన్సీ అలాగే ఉంటుందిటీమిండియాకు సారథ్యం వహించడం సంతోషంగా ఉందన్న పంత్‌.. గువాహటి టెస్టులో తమ తుదిజట్టు కూర్పు గురించి స్పందించాడు. ‘‘మా బ్యాటింగ్‌ లైనప్‌లో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లే ఉన్నారు. కోల్‌కతాలో మేము స్పిన్నర్ల సేవలను సమర్థంగా ఉపయోగించుకోవాలని భావించాం.పరిస్థితులు కూడా అందుకు అనుకూలించాయి. కానీ సానుకూల ఫలితం రాలేదు. ఏదేమైనా మేము సానుకూల దృక్పథంతోనే ముందుకు సాగుతాం. ఒత్తిడి దరిచేరనీయము. నా కెప్టెన్సీ సంప్రదాయబద్దంగానే ఉంటుంది. అదే సమయంలో సహజ శైలికి భిన్నంగా అవుట్‌-ఆఫ్‌-ది- బాక్స్‌ కూడా ఆలోచిస్తా.ఆడాలని ఉన్నా..నిజానికి రెండో టెస్టులో ఆడాలని శుబ్‌మన్‌ ఎంతగానో పరితపించాడు. కానీ అతడి ఆరోగ్యం అందుకు సహకరించలేదు. గువాహటిలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ ఇది. అందుకే మాతో పాటు ప్రేక్షకులకూ ఇది ప్రత్యేకం.పిచ్‌ తొలుత బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండవచ్చు. ఆతర్వాత స్పిన్నర్లు ప్రభావం చూపగలరు’’ అని పంత్‌ పేర్కొన్నాడు. ఇక గంభీర్‌ మార్గదర్శనంలో ఆల్‌రౌండర్లకు ఎక్కువగా ప్రాధాన్యం దక్కుతోందన్న విలేకరుల మాటలకు స్పందిస్తూ..‘‘జట్టు కూర్పు సమతూకంగా ఉండాలి. కొన్నిసార్లు స్పెషలిస్టు ప్లేయర్ల కంటే కూడా ఆల్‌రౌండర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. పిచ్‌ పరిస్థితులకు తగ్గట్లు వారు తమ పాత్రకు న్యాయం చేయగలరు. టీమ్‌ బ్యాలెన్స్‌ దృష్ట్యానే ఆల్‌రౌండర్లను ఎంపిక చేస్తామే తప్ప.. టెస్టు స్పెషలిస్టులను పక్కనపెట్టాలని కాదు’’ అని పంత్‌ స్పష్టం చేశాడు.ఎవరిని ఆడించాలో తెలుసు.. నిర్ణయం తీసుకున్నాంఅదే విధంగా.. గిల్‌ స్థానంలో తుదిజట్టులోకి ఎవరు వస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఈ విషయంలో మేము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. గిల్‌ ప్లేస్‌లో ఎవరు ఆడతారో.. ఆ ప్లేయర్‌కు తెలుసు’’ అంటూ తాత్కాలిక కెప్టెన్‌ పంత్‌ మాట దాటవేశాడు. కాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలో తొలి టెస్టు జరిగింది. ఇందులో భారత జట్టు సఫారీల చేతిలో ముప్పై పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గువాహటిలో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో గెలిస్తేనే టీమిండియా పరువు నిలుస్తుంది.ఇక కోల్‌కతా టెస్టులో టీమిండియా ఏకంగా ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లతో బరిలోకి దిగింది. యశస్వి జైస్వాల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌లను ఆడించింది. వీరితో పాటు కేఎల్‌ రాహుల్‌, ధ్రువ్‌ జురెల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్‌, శుబ్‌మన్‌ గిల్‌ సఫారీలతో తొలి టెస్టులో భాగమయ్యారు.చదవండి: Ashes: చరిత్ర సృష్టించిన మిచెల్‌ స్టార్క్‌

BCCI Says Gill ruled out of 2nd Test Guwahati Pant To Lead Check His Record7
టీమిండియా కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌.. బీసీసీఐ అధికారిక ప్రకటన

గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సెకెం‍డ్‌ టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించింది. అతడి స్ధానంలో భారత జట్టు సారథిగా రిషబ్‌ పంత్‌ వ్యవహరించనున్నాడు. జట్టుతో పాటు గిల్ గువహటికి వెళ్లినప్పటికి ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరింత సమయం పట్టనుంది. గిల్ త‌న‌ గాయం నుంచి కోలుకోనేంందుకు తిరిగి ముంబైకి వెళ్ల‌నున్న‌ట్లు బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. భార‌త కెప్టెన్ ముంబైలోని డాక్టర్ దిన్షా పార్దివాలా వ‌ద్ద చికిత్స పొంద‌నున్నాడు. దీంతో గిల్ నవంబర్‌ 30 నుంచి సఫారీలతో జరిగే వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశముంది.గిల్‌కు ఏమైందంటే?ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టె‍స్టు రెండో రోజు ఆటలో స్వీప్ షాట్ ఆడే క్రమంలో గిల్‌కు మెడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అతడిని కోల్‌కతాలోని వుడ్స్‌ల్యాండ్ అస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ తర్వాత అతడిని అస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం నెక్ బ్యాండ్ లేకుండా గిల్ కన్పించడంతో రెండో టెస్టులో ఆడుతాడని చాలా భావించారు. అతడు జట్టుతో పాటు గువహటికి వెళ్లడంతో భారత శిబిరంలో ఆశలు రేకెత్తాయి. కానీ అతడికి ఇంకా పూర్తి స్ధాయిలో నొప్పి తగ్గలేదు. అందుకే అతడిని రెండో టెస్టు నుంచి బీసీసీఐ తప్పించింది.38వ టెస్టు కెప్టెన్‌గా..టీమిండియా టెస్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లు తొలిసారి చేప‌ట్టేందుకు పంత్ సిద్ద‌మ‌య్యాడు. టీ20 క్రికెట్‌లో సార‌థిగా అపారమైన అనుభవం కలిగి ఉన్న పంత్‌.. సంప్రాదాయ క్రికెట్‌లో ఎలా జట్టును నడిపిస్తాడని అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా కెప్టెన్‌గా పంత్ వ్య‌వ‌హ‌రించాడు. 2017-18 రంజీ ట్రోఫీ సీజ‌న్‌లో ఇషాంత్ శర్మ గైర్హ‌జ‌రీలో ఢిల్లీ జ‌ట్టును పంత్ న‌డిపించాడు. ఆ సీజ‌న్‌లో పంత్ వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న ప‌రంగా నిరాశ‌ప‌రిచిన‌ప్ప‌టికి.. అత‌డి నాయ‌క‌త్వంలో ఢిల్లీ ఫైన‌ల్‌కు చేరింది. పంత్ ఇప్ప‌టివ‌ర‌కు ఐదు ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌ల‌లో కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా.. రెండు విజ‌యాలు, ఒక ఓట‌మిని ఎదుర్కొన్నాడు.రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిసింది. అదేవిధంగా గ‌తంలో భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా కూడా పంత్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. సీనియర్ ఆటగాళ్లు గైర్హ‌జ‌రీలో ఐదు టీ20 మ్యాచ్‌ల్లో భార‌త జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఐదు మ్యాచ్‌ల‌లో భార‌త్ రెండింట విజ‌యం సాధించ‌గా.. రెండో మ్యాచ్‌ల‌లో ఓట‌మి చ‌విచూసింది.ఓ మ్యాచ్‌లో ఫ‌లితం తేల‌లేదు. ఐపీఎల్‌లో పంత్ ప్ర‌స్తుతం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇంత‌కుముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్‌గా కూడా పంత్ ప‌నిచేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో పంత్ 57 మ్యాచ్‌ల‌లో నాయ‌క‌త్వం వ‌హించాడు.ఇందులో 30 విజ‌యాలు, 27 ఓట‌ములు ఉన్నాయి. అత‌డి విన్నింగ్ శాతం 52.63గా ఉంది. టీ20ల్లో కెప్టెన్‌గా సాహసోపేతమైన నిర్ణ‌యాలు, ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌లు సెట్ చేయ‌డంలో పంత్‌ది దిట్ట‌. మ‌రి టెస్టుల్లో అదే మైండ్ సెట్‌తో వెళ్తాడా లేదా? త‌న శైలికి భిన్నంగా జ‌ట్టును న‌డిపిస్తాడో వేచి చూడాలి. కాగా భార‌త టెస్టు జ‌ట్టుకు 38వ కెప్టెన్‌గా పంత్ రికార్డుల‌కెక్కాడు.

If Gill Needs Workload Management Then Skip IPL: Gambhir told Aakash Chopra8
ఐపీఎల్‌ ఆడటం మానెయ్‌: గిల్‌కు గంభీర్‌ సలహా ఇదే

టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill). భారత జట్టు టెస్టు సారథిగా అరంగేట్రంలోనే ఇంగ్లండ్‌ గడ్డపై అదరగొట్టిన ఈ పంజాబీ బ్యాటర్‌.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వన్డే కెప్టెన్‌గానూ పగ్గాలు చేపట్టాడు. ఇక అంతకంటే ముందే ఆసియా కప్‌-2025 సందర్భంగా టీమిండియా టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు.విరామం లేని షెడ్యూల్‌ఇలా వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో విరామం లేకుండా ఆడుతున్న గిల్‌.. స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా గాయపడ్డాడు. మెడ నొప్పి కారణంగా ఆట మధ్యలోనే నిష్క్రమించి.. మళ్లీ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేకపోయాడు. ఐసీయూలో చికిత్స పొందిన ఈ కెప్టెన్‌ సాబ్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఫలితంగా గువాహటిలో సఫారీలతో జరిగే రెండో టెస్టుకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు.కాగా నిద్రలేమి, అవిశ్రాంతంగా ఆడటం వల్లే గిల్‌ మెడ నొప్పి తీవ్రమైందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. బీసీసీఐ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే.. పేస్‌దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) సైతం పనిభారం తగ్గించుకునే క్రమంలో ఇంగ్లండ్‌లో ఐదింటికి కేవలం రెండే టెస్టులు ఆడిన విషయం తెలిసిందే.వారికి విశ్రాంతిఅంతేకాదు.. సౌతాఫ్రికాతో టీ20లకు కూడా బుమ్రా దూరంగా ఉండనున్నాడని.. అతడితో పాటు హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya)కు కూడా సెలక్టర్లు విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి మరోసారి చర్చ మొదలైంది.ఈ విషయంలో టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) వైఖరి ఏమిటన్న ప్రశ్నలు మొదలుకాగా.. భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. తాను ఈ విషయం గురించి గంభీర్‌తో చర్చించినపుడు ఆటగాళ్లను ఉద్దేశించి అతడు ఓ కీలక సూచన చేశాడని తాజాగా వెల్లడించాడు.ఐపీఎల్‌ ఆడకపోతే సరిజియోస్టార్‌తో మాట్లాడిన ఆకాశ్‌ చోప్రా.. ‘‘వెస్టిండీస్‌తో టీమిండియా టెస్టు మ్యాచ్‌ సందర్భంగా నేను గౌతమ్‌ను ఓ ప్రశ్న అడిగాను. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌కు ఏం చేయాలంటారు? అని అడిగాను. అందుకు అతడు.. ‘ఐపీఎల్‌ ఆడకపోతే సరి’ అని సమాధానం ఇచ్చాడు.‘ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఉంటే.. అదనపు ఒత్తిడిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటపుడు సారథిగా ఉండకుండా పగ్గాలు వదిలేయడం ఇంకా మంచిది. ఒకవేళ టీమిండియా కోసం ఆడాలనుకుంటే.. ఫిట్‌గా ఉండటంతో పాటు మానసికంగా కూడా సంసిద్ధంగా ఉండాలి.అలా జరగాలంటే ఐపీఎల్‌ వంటి టోర్నీలను వదిలేస్తే సరి’ అని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు’’ అని తెలిపాడు. ఏదేమైనా టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కీలకంగా ఉన్న ఆటగాళ్లు అదనపు ఒత్తిడిని తగ్గించుకుంటే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా వరుస సిరీస్‌లు ఆడగలరని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. మానసికంగా బలంగా ఉంటే.. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు విరామం ఇవ్వాల్సిన అవసరం రాదని అభిప్రాయపడ్డాడు.చదవండి: Ashes: చరిత్ర సృష్టించిన మిచెల్‌ స్టార్క్‌

Gill released from India Test squad for do or die Match VS SA report9
శుబ్‌మన్‌ గిల్‌ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం!

సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించలేదని తెలుస్తోంది. అంతేకాదు అతడు జట్టును వీడి తిరిగి ముంబైకి పయనమైనట్లు సమాచారం. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియాతో రెండు టెస్టులు (IND vs SA) ఆడేందుకు సౌతాఫ్రికా ఇక్కడకు వచ్చింది.ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినా.. కోల్‌కతా వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగగా సౌతాఫ్రికా టీమిండియాపై ముప్పై పరుగుల తేడాతో గెలిచింది. కోల్‌కతాలో జరిగిన ఈ మ్యాచ్‌ రెండో రోజు ఆట సందర్భంగా గిల్‌ మెడ నొప్పితో మైదానం వీడాడు. ఆ తర్వాత వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించినట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తెలిపింది.ఆ మరుసటి రోజు గిల్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు బోర్డు వెల్లడించింది. అయితే, మెడ నొప్పి ఇంకా తీవ్రంగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో చావోరేవో తేల్చుకోవాల్సిన రెండో టెస్టుకు గిల్ దూరమవుతాడనే అంచనాలు రాగా.. అనూహ్యంగా అతడు జట్టుతో పాటు గువాహటికి ప్రయాణం చేశాడు. తద్వారా మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉంటాననే సంకేతాలు ఇచ్చాడు.అయితే, గిల్‌ ఇంకా మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించినట్లు ఫిజియోలు, వైద్యులు నిర్ణయించలేదని భారత బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ గురువారం మీడియా సమావేశంలో తెలిపాడు. శుక్రవారం సాయంత్రానికి గిల్‌ పరిస్థితిని బట్టి మ్యాచ్‌ ఆడించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాడు. తాజా సమాచారం ప్రకారం గిల్‌ ఈ మ్యాచ్‌ నుంచి వైదొలిగినట్లు సమాచారం.జట్టు నుంచి రిలీజ్‌!టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం.. బీసీసీఐ గిల్‌ను జట్టు నుంచి రిలీజ్‌ చేసింది. కోలుకునే దశలో భాగంగా అతడిని మళ్లీ ముంబైకి పంపించినట్లు తెలుస్తోంది. బోర్డు సూచన మేరకు కొన్నాళ్ల పాటు గిల్‌ ముంబైలో డాక్టర్‌ దిన్షా పార్థీవాలా పర్యవేక్షణలో ఉండనున్నట్లు సమాచారం. రికవరీని బట్టి గిల్‌ సౌతాఫ్రికాతో వన్డేలు ఆడతాడా? లేదా? అన్న విషయాన్ని బోర్డు నిర్ణయిస్తుంది. కాగా భారత్‌- సౌతాఫ్రికా మధ్య శనివారం మొదలయ్యే రెండో టెస్టుకు గువాహటిలోని బర్సపరా స్టేడియం వేదిక. ఇందులో గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను 1-1తో సమం చేయగలదు. లేదంటే సొంతగడ్డపై టెస్టులలో మరో ఘోర పరాభవం తప్పదు.చదవండి: IND vs SA: 'నీ ఈగోను ప‌క్క‌న పెట్టు'.. టీమిండియా ఓపెన‌ర్‌కు వార్నింగ్‌

Mitchel Starc takes 7 wickets as England bowled out for 17210
ఏడేసిన మిచెల్‌ స్టార్క్‌.. కుప్పకూలిన ఇంగ్లండ్‌

పెర్త్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌల‌ర్‌ మిచెల్ స్టార్క్‌ నిప్పులు చెరిగాడు. త‌న పేస్ బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌ను బెంబేలెత్తించాడు. మొత్తంగా 7 వికెట్లు ప‌డగొట్టి ఇంగ్లండ్ జ‌ట్టు ప‌త‌నాన్ని స్టార్క్‌ శాసించాడు.స్టార్క్ జోరు ముగింట‌ జోష్ హాజిల్‌వుడ్‌, క‌మ్మిన్స్ లేని లోటు అస్స‌లు కన్పించ‌లేదు. అత‌డి విజృంభణ ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 172 ప‌రుగులకే ఆలౌటైంది. అతడితో పాటు అరంగేట్ర పేసర్ బ్రెండన్ డాగెట్ 2 వికెట్లు, గ్రీన్ ఓ వికెట్ సాధించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్‌(52) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఓలీ పోప్‌(46), జేమీ స్మిత్‌(33) ఫర్వాలేదన్పించారు. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌(6)తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.తుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, జేక్ వెదరాల్డ్, మార్నస్ లాబుషేన్‌, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ , మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్ఇంగ్లండ్‌: బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ , గస్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్చదవండి: Ashes: చరిత్ర సృష్టించిన మిచెల్‌ స్టార్క్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement