Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Gill Deserved That: Suryakumar on why Sanju Was removed as T20I opener1
సంజూకు సరిపడా ఛాన్సులు.. ఇకపై: సూర్యకుమార్‌

టీ20 ప్రపంచకప్‌-2024 తర్వాత సంజూ శాంసన్‌కు వరుస అవకాశాలు వచ్చాయి. అభిషేక్‌ శర్మతో కలిసి టీమిండియా టీ20 ఓపెనర్‌గా ఈ కేరళ బ్యాటర్‌ అదరగొట్టాడు. వికెట్‌ కీపర్‌గా సేవలు అందిస్తూ.. టాపార్డర్‌లో రాణించాడు. ఈ క్రమంలో మూడు శతకాలు బాది జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు.విఫలమైనా.. అయితే, ఆసియా టీ20 కప్‌-2025 టోర్నీతో వైస్‌ కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) తిరిగి రావడంతో.. సంజూ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. అభిషేక్‌కు జోడీగా వస్తున్న గిల్‌ చాలాసార్లు విఫలమైనా.. యాజమాన్యం మాత్రం అతడికే మద్దతుగా నిలుస్తోంది. భవిష్య కెప్టెన్‌గా అతడికి పెద్ద పీట వేస్తూ ఒక్కోసారి భారీ మూల్యమే చెల్లిస్తోంది.మరోవైపు.. గిల్‌ రాకతో సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు కష్టమైపోయింది. ఒకవేళ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో స్థానం దక్కినా.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎప్పుడు రావాలో తెలియని పరిస్థితి. ఓసారి వన్‌డౌన్‌లో.. మరోసారి ఐదో స్థానంలో మేనేజ్‌మెంట్‌ అతడిని బ్యాటింగ్‌కు పంపిస్తోంది.సంజూపై వేటు వేసి.. జితేశ్‌కు చోటుఇక ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆఖరిగా ఐదో స్థానంలో వచ్చి విఫలమైన సంజూ (4 బంతుల్లో 2)ను.. ఆ తర్వాత మేనేజ్‌మెంట్‌ తప్పించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడిన తర్వాత సంజూపై వేటు వేసి.. వికెట్‌ కీపర్‌ కోటాలో జితేశ్‌ శర్మను ఆడించింది.ఈ క్రమంలో తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌లోనూ సంజూకు మొండిచేయి చూపిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యలు కూడా బలం చేకూరుస్తున్నాయి. సంజూ కంటే తమకు గిల్‌ ఎక్కువని సూర్య చెప్పకనే చెప్పాడు.గిల్‌కే పెద్దపీట వేస్తామన్న సూర్యసౌతాఫ్రికాతో కటక్‌ వేదికగా తొలి టీ20కి ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సంజూ టాపార్డర్‌లో రాణిస్తాడు. అయితే, జట్టులో ఓపెనర్లు కాకుండా మిగిలిన ప్రతి ఒక్క ఆటగాడు ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకైనా సిద్ధంగా ఉండాలి.నిజానికి సంజూ ఓపెనర్‌గా అదరగొట్టాడు. మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. కానీ గతేడాది శ్రీలంక పర్యటనలో గిల్‌ ఓపెనర్‌గా ఉన్నాడు. సంజూ కంటే ముందు అతడే జట్టుతో ఉన్నాడు. కాబట్టి గిల్‌ తన స్థానంలోకి తిరిగి వచ్చేందుకు వందశాతం అర్హుడు.కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చాముసంజూకు మేము కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చాము. అతడు కూడా ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాడు. జట్టుకు అదొక సానుకూలాంశం. మూడు- ఆరు వరకు ఏ స్థానంలో ఆడేందుకైనా మా ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు.టాపార్డర్‌లో ఆడుతూనే.. అవసరం వచ్చినపుడు మిడిల్‌ ఆర్డర్‌లోనూ రాణించగల ఆటగాళ్లు ఉండటం మా జట్టుకు అదృష్టం లాంటిదే. తుదిజట్టులో స్థానం ఇంత మంది ఆటగాళ్లు పోటీపడటం.. సెలక్షన్‌ విషయంలో మాకు ఇలాంటి తలనొప్పి ఉండటం ఎంతో బాగుంటుంది. వరల్డ్‌కప్‌ ఆశలు ఆవిరేనా?మా జట్టుకు ఉన్న వైవిధ్యమైన ఆప్షన్లను ఇది సూచిస్తుంది’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ ప్రయోగాల పేరిట సంజూను పక్కనపెట్టడం చూస్తుంటే.. ఈసారి కూడా అతడికి వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం ఇవ్వరనే అనిపిస్తోంది. చదవండి: వాళ్లిద్దరికి మొండిచేయి!.. తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే!

Billarda: Galicia’s Folk Sport Revives Tradition2
పునర్జన్మ పొందిన 'గిల్లీ దండ'.. ఇప్పుడు లీగ్‌గా..!

స్పెయిన్‌లోని గలీషియా గ్రామాలు, పట్టణాల్లో శతాబ్దాల నాటి ప్రాచీణ ఆట మళ్లీ ప్రాచుర్యం పొందుతోంది. బిల్లార్డా (గిల్లీ దండ) అనే ఈ ఆట ఇప్పుడు 'లీగా గలేగా డి బిల్లార్డా' అనే లీగ్ రూపంలో అక్కడి ప్రజల ముందుకు రానుంది. ఈ ఆట సాంప్రదాయ వారసత్వాన్ని ఆధునిక క్రీడాస్ఫూర్తితో కలిపి ముందుకు తీసుకెళ్తోంది. బిల్లార్డా అంటే ఏమిటి..?ఈ ఆటలో రెండు కర్రలు ఉపయోగిస్తారు. చిన్న కర్ర (బిల్లార్డా) నేలపై ఉంచుతారు. పెద్ద కర్రతో దానిని కొట్టి గాల్లోకి ఎగరేస్తారు. లక్ష్యం.. బిల్లార్డాను దూరంగా కొట్టి, దశలవారీగా గోల్ లైన్ దాటించడం. ఈ ఆటను భారత దేశంలో గిల్లీ దండ అని పిలుస్తారు. ఈ ఆటలో నైపుణ్యం, ఖచ్చితత్వం, వ్యూహం అవసరం. గ్రామీణ వాతావరణంలో జరిగే ఈ పోటీలు ఉత్సాహభరితంగా, సామూహికంగా సాగుతాయి. సంప్రదాయ ఆటలు 21వ శతాబ్దంలో కూడా ఎలా నిలదొక్కుకుంటాయో బిల్లార్డా చూపిస్తోంది. ఇది కేవలం ఆట మాత్రమే కాదు, గ్రామీణ గుర్తింపును తిరిగి పొందే ఉద్యమని ఔత్సాహికులు అంటున్నారు. 'లీగా గలేగా డి బిల్లార్డా' ఇప్పుడు పోటీ లీగ్‌గా మారి, జానపద క్రీడలు కూడా కాలానుగుణంగా మార్పులు స్వీకరించి కొత్త తరాలను ప్రేరేపించగలవని నిరూపిస్తోంది.

Cheap: Hardik Pandya Lambasts Paparazzi For Mahieka Video3
ఛీ.. ఇదేం బుద్ధి?: హార్దిక్‌ పాండ్యా ఆగ్రహం

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు కోపమొచ్చింది. ‘‘మీకసలు బుద్ధి ఉందా?’’ అంటూ పాపరాజీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త యాంగిల్స్‌లో ఫొటోలు తీసి.. దిగజారుడుతనాన్ని చాటుకున్నారంటూ మండిపడ్డాడు. అసలేం జరిగిందంటే..భార్య నటాషా స్టాంకోవిక్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) మళ్లీ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. మోడల్‌ మహీక శర్మతో అతడు కొన్నాళ్లుగా డేటింగ్‌ చేస్తున్నాడు. తన పుట్టినరోజు (అక్టోబరు 11) సందర్భంగా మహీక (Mahieka Sharma)తో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ తమ బంధాన్ని ధ్రువీకరించాడు. ఇక అప్పటి నుంచి జిమ్‌ మొదలు బీచ్‌ వరకు ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని విహరిస్తున్నారు.కాగా పాపరాజీల వల్ల మహీక శర్మ ఇటీవల అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె రెస్టారెంట్‌ నుంచి మెట్లు దిగి వస్తున్న క్రమంలో కింద ఉన్న పాపరాజీలు కెమెరాలు క్లిక్‌మనిపించినట్లు సమాచారం. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా వెల్లడిస్తూ హార్దిక్‌ పాండ్యా తీవ్ర స్థాయిలో పాపరాజీల తీరుపై మండిపడ్డాడు.తీయకూడని యాంగిల్‌లో ఫొటో..‘‘ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే జీవితాన్ని నేను ఎంచుకున్నాను. అందువల్ల అందరూ నన్ను గమనిస్తూ ఉంటారని తెలుసు. కానీ రోజు కొంతమంది హద్దులు దాటేశారు. మహీక బాంద్రా రెస్టారెంట్‌లో మెట్లు దిగి వస్తున్నపుడు తీయకూడని యాంగిల్‌లో ఫొటో తీశారు. అసలు ఇలాంటి వాటికి ఏ మహిళా అర్హురాలు కాదు.ప్రైవేట్‌ మూమెంట్‌అంత ఘోరంగా తనను ఫొటో తీశారు. ప్రైవేట్‌ మూమెంట్‌ను ఫొటో తీసి.. దిగజారుడుతనాన్ని చాటుకున్నారు. మీ చెత్త సంచనాల కోసం తనని ఇబ్బంది పెట్టారు. మీ హెడ్‌లైన్స్‌ కోసం ఇతరుల గౌరవ, మర్యాదలు పణంగా పెడతారా? ప్రతి మహిళ తనదైన శైలిలో జీవించేందుకు అర్హురాలు.అలాగే ప్రతి ఒక్కరికి తాము చేసే పనుల్లో కొన్ని హద్దులు, పరిమితులు ఉంటాయి. మీడియా సోదరులకు నా విజ్ఞప్తి. మీ వృత్తిని నేను గౌరవిస్తాను. మీకు ఎల్లవేళలా సహకారం అందిస్తాను. కానీ మీరు కొంచెం పద్ధతైన పనులు చేయండి.కాస్త మానవత్వం చూపండిప్రతీ విషయాన్ని క్యాప్చర్‌ చేయాల్సిన పనిలేదు. ప్రతీ యాంగిల్లోనూ ఫొటో తీయాల్సిన అవసరం లేదు. ఈ ఆటలో కాస్త మానవత్వం చూపండి. థాంక్యూ’’ అంటూ పాపరాజీల తీరును హార్దిక్‌ పాండ్యా ఏకిపారేశాడు. ఇకనైనా బుద్ధిగా వ్యవహరించాలంటూ చురకలు అంటించాడు.కాగా గాయం నుంచి కోలుకున్న హార్దిక్‌ పాండ్యా... ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌తో బిజీ అయ్యాడు. ఇదిలా ఉంటే.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరిస్తూ.. ఒక్కోసారి వారి అనుమతి లేకుండానే ఫొటోలు తీసి వివిధ మాధ్యమాలకు అమ్ముకునే ఫొటోగ్రాఫర్లను పాపరాజీలు అంటారు.చదవండి: చరిత్ర సృష్టించిన బరోడా క్రికెటర్‌

Odisha Nuagarh village Cricket is taboo after Mahanadi Tragedy4
'మ‌హా' విషాదం.. క్రికెట్ బంద్‌..!

ఒడిశాలోని క‌ట‌క్ న‌గ‌రంలో భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య మొద‌టి టి20 మ్యాచ్ మంగ‌ళ‌వారం రాత్రి జ‌ర‌గ‌నుంది. స్థానిక బారామ‌తి స్టేడియంలో జ‌రిగే ఈ మ్యాచ్ టికెట్ల కోసం నాలుగు రోజుల క్రితం అభిమానులు పోటెత్తారు. టికెట్లు ద‌క్కించుకునేందుకు త‌మ‌ ప్రాణాలను సైతం ఫ‌ణంగా పెట్టేందుకు అభిమానులు వెనుకాడ‌లేద‌ని స్థానిక మీడియా వెల్ల‌డించింది. క్రికెట్ అంటే పిచ్చా అనేంత‌గా ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగ‌బ‌డ్డారు. క‌ట‌క్‌కు 40 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న నువాగ‌ర్ గ్రామంలో ఇందుకు భిన్నమైన ప‌రిస్థితి ఉంది. కార‌ణం 21 ఏళ్ల క్రితం జ‌రిగిన ఓ విషాదం.ఏం జ‌రిగింది?జ‌గ‌త్‌సింగ్‌పూర్ జిల్లాలోని నువాగ‌ర్ గ్రామం (Nuagarh village) ఒక‌ప్పుడు క్రికెట్‌కు ప్ర‌సిద్ధి. ఆ ఊరి ప్ర‌జ‌ల‌కు క్రికెట్ అంటే ఇష్టం. 2004 ముందు వ‌ర‌కు గ్రామ‌స్తులు నిరంత‌రం క్రికెట్ మ్యాచ్‌లు నిర్వ‌హిస్తూ ఉండేవారు. దీంతో ఆ ఊరిలో ఎప్పుడు చూసినా క్రికెట్ సంద‌డి క‌నిపించేది. అంతేకాదు నువాగ‌ర్ గ్రామానికి ప్ర‌త్యేకంగా ఉత్క‌ల్‌మ‌ణి క్రికెట్ క్ల‌బ్ పేరుతో ఒక జ‌ట్టు కూడా ఉండేది. చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌తో పాటు జిల్లా, రాష్ట్ర‌స్థాయి పోటీల్లో ఈ జ‌ట్టు పాల్గొంది. 2004, మార్చి 1 ముందు వ‌ర‌కు అంతా బాగానే ఉంది. కానీ ఆ రోజు నువాగ‌ర్ గ్రామం చ‌రిత్ర‌లో దుర్దినంగా మిగిలిపోయింది.కేంద్రపార జిల్లా మహాకలపాడలో స్థానిక టోర్న‌మెంట్‌లో ఫైన‌ల్ మ్యాచ్ ఆడేందుకు 2004, మార్చి 1న ఉత్క‌ల్‌మ‌ణి క్రికెట్ క్ల‌బ్ (Utkalmani youth club) జ‌ట్టు ప‌డ‌వలో బ‌య‌లుదేరింది. 15 మంది ఆట‌గాళ్లు, మ‌రో ఏడుగురు క‌లిసి పయ‌న‌మ‌య్యారు. బ‌హాకుడా ఘాట్ స‌మీపంలో దురదృష్టవ‌శాత్తు ప‌డ‌వ ప్ర‌మాదానికి గుర‌వ‌డంతో 13 మంది క్రికెట‌ర్లు మ‌హాన‌దిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఊహించ‌ని విషాదంతో నువాగ‌ర్ గ్రామం దిగ్బ్రాంతికి గురైంది. అప్ప‌టివ‌ర‌కు స్థానికంగా క్రికెట్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉన్న ఆ ఊరిలో ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి. క్రికెట్‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది. ఆ దుర్ఘ‌ట‌న‌ త‌ర్వాత త‌మ‌ ఊరిలో క్రికెట్ ఆడ‌రాద‌ని గ్రాస్తులంతా నిర్ణ‌యం తీసుకున్నారని నువాగ‌ర్ మాజీ స‌ర్పంచ్ సుధాల్ స్వాన్‌ మీడియాకు తెలిపారు.పెళ్లైన 6 నెల‌ల‌కే..ప‌డ‌వ ప్ర‌మాదంలో చ‌నిపోయిన 13 మంది ఆట‌గాళ్ల పేరుతో 2007లో స్మార‌క స్థూపం (memorial pillar) ఏర్పాటు చేశారు. ఈ దుర్ఘ‌ట‌న రోజాలిని జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె భ‌ర్త బిశ్వ‌జిత్ రే ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయాడు. వారిద్ద‌రికీ పెళ్ల‌యి అప్ప‌టికే ఆరు నెల‌లు మాత్ర‌మే అయింది. ''నా భ‌ర్త కుడిచేతి వాటం బ్యాట‌ర్‌, మీడియం పేస్‌బౌల‌ర్‌. అప్పుడ‌ప్పుడు వికెట్ కీప‌ర్‌గానూ ఉండేవాడు. క్రికెట్‌పై ఉన్న మ‌క్కువే అత‌డి ప్రాణాలు తీసింది. చ‌నిపోయిన 13 మంది క్రీడాకారుల కుటుంబాల‌కు జిల్లా అధికార యంత్రాంగం రూ. 25 వేలు చొప్పున స‌హాయం అందించింద‌''ని రోజాలిని గుర్తు చేసుకున్నారు.క్రికెట్ చూడ‌కూడ‌ద‌నుకున్నాంఇదే దుర్ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన‌ ప్ర‌దీప్ ప‌రిడా కుటుంబానికి దాదాపు ఇదే ప‌రిస్థితి. ఏడాది ముందే అత‌డికి పెళ్లైంది. ''న‌దిలో మునిగి చ‌నిపోయిన 13 మందిలో నా భ‌ర్త కూడా ఉన్నాడు. నాతో పాటు, ఆరు నెల‌ల కూతురిని వ‌దిలేసి శాశ్వ‌తంగా వెళ్లిపోయాడు. మా ఊరిలోని మైదానంలో క్రికెట్ ఆడుతుండేవాడు. ఆయ‌న చ‌నిపోయిన త‌ర్వాత క్రికెట్ చూడ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నామ‌''ని ప్ర‌దీప్ భార్య టికీ చెప్పారు. చ‌ద‌వండి: హెచ్‌సీఏ తీరుపై త‌ల్లిదండ్రుల ఆగ్ర‌హం

From considering retirement to smacking record century, Baroda Amit Pasi finally gets his day in the sun5
చరిత్ర సృష్టించిన బరోడా క్రికెటర్‌

సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం దక్కింది. ఓ క్రికెటర్‌ దేశవాలీ అరంగేట్రం కోసం తొమ్మిదేళ్లు ఎదురుచూసి ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలం పొందాడు. ఇంతకీ ఎవరా క్రికెటర్‌.. ఏమిటా స్టోరీ..?బరోడాకు చెందిన 26 ఏళ్ల వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ అమిత్‌ పాసి తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం నిన్ననే తన దేశవాలీ అరంగేట్రం (టీ20) చేశాడు. తొమ్మిదేళ్లు నిరీక్షించినందుకు అతనికి మంచి ప్రతిఫలమే దక్కింది. తొలి మ్యాచ్‌లోనే (SMATలో సర్వీసెస్‌పై) వరల్డ్‌ రికార్డు సెంచరీ చేశాడు.టీ20 అరంగేట్రంలో అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగా పాకిస్తాన్‌ ఆటగాడు బిలాల్‌ ఆసిఫ్‌ (2015) ప్రపంచ రికార్డును సమం చేశాడు. పాసి, బిలాల్‌ ఇద్దరూ టీ20 అరంగేట్రాల్లో 114 పరుగులు చేశారు. టీ20 అరంగేట్రంలో ఓ ఆటగాడు చేసిన అత్యధిక స్కోర్‌ ఇదే.ఏళ్ల తరబడి అవకాశం కోసం ఎదురుచూసినా ఫలితం దక్కకపోవడంతో పాసి ఓ దశలో ఆటకు వీడ్కోలు పలికి కోచింగ్‌ వైపు మళ్లాలని అనుకున్నాడు. కొద్ది రోజులు ఆ ప్రయత్నం కూడా చేశాడు. జితేశ్‌ శర్మ జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో ఎట్టకేలకు పాసి కల నెరవేరింది.అరంగేట్రం మ్యాచ్‌తోనే హీరో అయిపోయాడు. 24 బంతుల్లో అర్ద సెంచరీ చేసి కేవలం 44 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా అరంగేట్రంలో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు.పాసి ఉదంతం క్రీడలో అయినా జీవితంలో అయినా నిరీక్షణ అవసరమన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. ఆశ కోల్పోకుండా పట్టుదలతో ఎదురుచూసే వారికి పాసికి వచ్చినట్లే అవకాశాలు వస్తాయి. పాసికి 2016–17 సీజన్‌లో బరోడా అండర్–19 జట్టులో చోటు దక్కినా, ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ప్రతి సీజన్‌లో జట్టుకు ఎంపికైనా, తుది పదకొండులో అవకాశాలు రాలేదు. స్థానిక స్థాయిలో నిరంతరం రాణించినా, సీనియర్‌ స్థాయి అరంగేట్రం కోసం తొమ్మిదేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. పాండ్యా సోదరులు హార్దిక్‌, కృనాల్‌ ప్రోత్సాహంతో పాసి ఆశ కోల్పోకుండా నిరంతర ప్రయత్నం చేశాడు. పాండ్యా సోదరులు పాసి గురించి తెలిసి ఎదురుపడిన ప్రతిసారి ధైర్యం చెప్పేవారు. అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ సిద్ధంగా ఉండాలని హార్దిక్ ఇచ్చిన సలహా అతనికి ప్రేరణగా నిలిచింది.ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు ప్రతిఫలం దక్కింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన పాసి రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ధోనిని ఆరాధించే పాసి, అతనిలాగే దూకుడైన ఆటతీరుతో బ్యాటింగ్‌ చేస్తాడు. పాసి కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయబరేలీ నుంచి నాలుగు దశాబ్దాల క్రితం వడోదరాకు వలస వెళ్లింది. అతని కుటుంబానిది గుజరాత్‌లో నీటి సరఫరా చేసే వ్యాపారం. ఆర్థికంగా పాసికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అతడి అన్నయ్య కూడా స్థానిక స్థాయిలో క్రికెట్ ఆడేవాడు. ప్రస్తుతం అతను కూడా కుటుంబ వ్యాపారంలో భాగంగా ఉన్నాడు. మొత్తంగా చూస్తే పాసి ఉదంతం అవకాశాల కోసం​ సుదీర్ఘంగా ఎదురుచూసే వారికి ఓ ప్రేరణగా నిలుస్తుంది. అవకాశాలు ఆలస్యంగా వచ్చినా, పట్టుదల, క్రమశిక్షణ, సానుకూల దృక్పథం ఉంటే ఒకే ఇన్నింగ్స్ జీవితాన్ని మార్చేస్తుందని పాసి కథ సూచిస్తుంది.

Where are the fast bowling all-rounders in Teamindia?6
టీమిండియాకు ఆల్‌రౌండర్లు కావలెను!

ముఖ్యమైన ప్రకటన.. టీమిండియాకు ఆల్‌రౌండర్లు కావలెను. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో నాణ్యమైన ఆల్‌రౌండర్ల లోటు కన్పిస్తోంది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌, సుందర్ వంటి వారు ఉన్నప్పటికి.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల విభాగంలో భారత్ చాలా వెనకబడి ఉంది. ఒక్క హార్ధిక్ పాండ్యా తప్ప చెప్పుకోదగ్గ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ భారత లేరు. అయితే హార్దిక్ ఫిట్‌నెస్ సమస్యల వల్ల ఎప్పుడు జట్టులో ఉంటాడో.. ఎప్పుడు బయట ఉంటాడో తనకే తెలియదు. నితీశ్ కుమార్ రెడ్డిని మూడు ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నప్పటికి.. ఆశించినంతమేర ఫలితాలు మాత్రం రావడం లేదు. మొదటిలో అతడిపై నమ్మకం ఉంచిన గంభీర్ అండ్ కో.. ఇప్పుడు ఎక్కువగా స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే పరిగణిస్తోంది. టీ20 సెటాప్‌లో భాగంగా ఉన్న శివమ్ దూబే పరిస్థితి కూడా అంతంతమాత్రమే. SENA దేశాలతో పోలిస్తే మనం చాలా వెనకబడి ఉన్నాము. గతంలో కపిల్ దేవ్‌, సౌరవ్ గంగూలీ వం‍టి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ప్రపంచ క్రికెట్‌నే శాసించారు. కచ్చితంగా అటువంటి ఆల్‌రౌండర్లు భారత జట్టుకు అవసరం.ఆల్‌రౌండర్ల ఉపయోగాలు ఏంటి?జట్టు సమతుల్యంగా ఉండాలంటే కచ్చితంగా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు కావాలి. సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి సేనా దేశాల విజయాలలో ఆల్‌రౌండర్లదే కీలక పాత్ర. ఒ​‍క్క ఆస్ట్రేలియాలోనే మిచెల్ మార్ష్‌, గ్రీన్‌, అబాట్‌, స్టోయినిష్ వంటి అద్బుతమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. నిజమైన ఫాస్ట్-బౌలింగ్ ఆల్‌రౌండర్ లేకపోతే, జట్టు కూర్పు ఒక పెద్ద సమస్యగా మారుతుంది. టీమిండియా ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటుంది. ప్రతీ మ్యాచ్‌కు ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక ఒక సమస్యగా మారింది. అదనపు బ్యాటర్‌ను ఆడిస్తే బౌలింగ్ బలహీనపడుతుంది. ఐదుగురు బౌలర్లతో ఆడితే బ్యాటింగ్ లైనప్ బలహీనంగా మారుతుంది. ఈ అసమతుల్యత కారణంగానే భారత్ విదేశాల్లో కీలక మ్యాచ్‌లు, టెస్ట్ సిరీస్‌లలో ఓడిపోయింది. భార‌త జ‌ట్టులో స్పిన్ ఆల్‌రౌండ‌ర్లు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఎవ‌రికి అవ‌కాశ‌మివ్వాలో తెలియ‌క టీమ్ మెనెజ్‌మెంట్ త‌ల‌లు ప‌ట్టుకుంటుంది. జ‌డేజా, అక్ష‌ర్ వంటి వారు ఉప‌ఖండ పిచ్‌లోపై రాణిస్తున్న‌ప్ప‌టికి విదేశీ గ‌డ్డ‌పై బంతితో సత్తాచాటలేకపోతున్నారు. దీంతో విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల లోటు స్పష్టంగా కన్పిస్తోంది.శార్ధూల్ రీ ఎంట్రీ ఇస్తాడా?బీసీసీఐ సెలక్టర్లు మరోసారి శార్ధూల్ ఠాకూర్ వంటి వెటరన్ ఆల్‌రౌండర్లను పరిగణలోకి తీసుకోవాల్సిన అసవరముంది. శార్ధూల్ జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికి దేశవాళీ క్రికెట్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఫార్మాట్లకు అతీతంగా ఠాకూర్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో అతడు రీ ఎంట్రీ ఇచ్చినప్పటికి ఓ మోస్తారు ప్రదర్శన చేశాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. అయితే లార్డ్ ఠాకూర్ మరోసారి సత్తా చాటుతున్నప్పటికీ.. ఇప్పట్లో తిరిగి పునరాగమనం చేసే సూచనలు కన్పించడం లేదు.అయితే, ఠాకూర్ మాత్రం కూడా వన్డే ప్రపంచకప్‌-2027లో ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. అతడితో పాటు రాజ్ అంగద్ బవా, సూర్యాంశ్ షెడ్గే వంటివారిపై కూడా సెలక్టర్లు దృష్టిసారించాల్సి ఉంది. అండర్‌-19 ప్రపంచకప్‌లో రాజ్ అంగద్ బవా బంతితో పాటు బ్యాట్‌తో కూడా అద్భుతంగా రాణించాడు. సూర్యాంశ్‌కు కూడా సీమ్-బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా రాణించే సత్తా ఉంది. చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌..!

Why R Ashwin Shares Sunny Leone Picture On X Epic Reactions Follow7
విధ్వంసకర ఇన్నింగ్స్‌!.. సన్నీ లియోన్‌ ఫొటో షేర్‌ చేసిన అశ్విన్‌

దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025లో తమిళనాడు జట్టుకు చెందిన ఓ ఆటగాడు విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఏకంగా 333కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సోషల్‌ మీడియాలో సన్నీ లియోన్‌ (Sunny Leone) ఫొటో షేర్‌ చేశాడు.అసలు.. ఆ ఆటగాడికి.. అశూ ఈ పోస్ట్‌ పెట్టడానికి సంబంధం ఏమిటి అంటారా?!... సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ(SMAT)లో భాగంగా తమిళనాడు జట్టు సోమవారం సౌరాష్ట్రతో తలపడింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా.. టాస్‌ గెలిచిన ఆతిథ్య సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్‌ విశ్వరాజ్‌ జడేజా మెరుపు అర్ధ శతకం (39 బంతుల్లో 70)తో చెలరేగగా.. సమ్మార్‌ గజ్జార్‌ (42 బంతుల్లో 66) ధనాధన్‌ దంచికొట్టాడు. తమిళనాడు బౌలర్లలో సీలం బరాసన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇసక్కిముత్తు రెండు వికెట్లు తీశాడు. ఆర్‌. రాజ్‌కుమార్‌, సన్నీ సంధు చెరో వికెట్‌ దక్కించుకున్నారు. సాయి సుదర్శన్‌ మెరుపు శతకంఇక సౌరాష్ట్ర విధించిన 184 లక్ష్య ఛేదనకు దిగిన తమిళనాడు 18.4 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్‌, టీమిండియా స్టార్‌ సాయి సుదర్శన్‌ మెరుపు శతకం (55 బంతుల్లో 101 నాటౌట్‌, 10 ఫోర్లు, 4 సిక్సర్లు)తో దుమ్ములేపాడు.తొమ్మిది బంతుల్లోనే 30 పరుగులుమరోవైపు.. ఎనిమిదో స్థానంలో వచ్చిన బౌలర్‌ సన్నీ సంధు (Sunny Sandhu) కేవలం తొమ్మిది బంతుల్లోనే 30 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగానే తమిళనాడు... సౌరాష్ట్రపై మూడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.అసలు విషయం ఇదీ!ఈ నేపథ్యంలో తమిళనాడు క్రికెట్‌ దిగ్గజం, టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ తనదైన శైలిలో ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టాడు. నటి సన్నీ లియోన్‌ ఫోటోకు.. చెన్నైలోని సంధు స్ట్రీట్‌ ఫోటోను జతచేసి షేర్‌ చేశాడు. దీంతో నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. అశూ ఇలాంటి పోస్ట్‌ చేశాడని ఎందుకు చర్చించుకున్నారు. అయితే, అంతలోనే మరికొంత మంది అశూ పోస్ట్‌ వెనుక ఉన్న అర్థాన్ని పసిగట్టారు. సౌరాష్ట్రతో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన సన్నీ సంధును ప్రశంసించే క్రమంలోనే అశూ ఈ మేరకు పోస్ట్‌ పెట్టాడని, దీనిని తాము సులభంగానే డీకోడ్‌ చేశామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా అశూ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: మంధానతో పెళ్లి క్యాన్సిల్‌.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే? 👀 👀 pic.twitter.com/BgevYfPyPJ— Ashwin 🇮🇳 (@ashwinravi99) December 9, 2025

Mark Wood ruled out of entire Ashes series as England name a replacement8
ఇంగ్లండ్ జ‌ట్టులోకి ఎవ‌రూ ఊహించ‌ని ప్లేయ‌ర్‌

యాషెస్ సిరీస్ 2025-26లో వరుస ఓటములతో సతమవుతున్న ఇంగ్లండ్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఈ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఎడమ మోకాలి గాయం కారణంగా యాషెస్ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో వుడ్ మోకాలి గాయం బారిన పడ్డాడు. దీంతో ఆ టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స (knee surgery) చేయించుకుని దాదాపు ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు.పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో అతడిని ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేసింది. అయితే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అతడికి మళ్లీ ఎడమ మోకాలి గాయం తిరగబెట్టింది. అతడు కోలుకోవడానికి నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి తప్పించారు.మూడేళ్ల తర్వాత.. ఇక​ వుడ్ స్థానంలో యార్క్‌షైర్ పేసర్ మ్యాథ్యూ ఫిషర్ ను జట్టులోకి తీసుకున్నారు. మ్యాథ్యూ ఫిషర్ ఇంగ్లండ్ జట్టుకు ఎంపిక కావడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఫిషర్ 2022లో ఇంగ్లండ్ తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఒకే మ్యాచ్ ఆడి ఒక్క వికెట్ సాధించాడు.ఆ తర్వాత అతడిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. అయితే అతడికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే అని చెప్పాలి. ఎందకంటే ఇప్పటికే బ్యాకప్ పేసర్లగా మ్యాథ్యూ పాట్స్ (Matthew Potts), జోష్ టంగ్ (Josh Tongue) వంటి ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హాజిల్ వుడ్ కూడా గాయం కారణంగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 17 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ ప్రస్తుతం 0-2 తేడాతో వెనకంజలో ఉంది.చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌..!

Irfan Pathan picks his India playing XI for IND vs SA 2025 1st T20I9
వాళ్లిద్దరికి మొండిచేయి!.. తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే!

భారత్‌- సౌతాఫ్రికా మధ్య మంగళవారం కటక్‌ వేదికగా తొలి టీ20 నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా స్టార్లు శుబ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా పునరాగమనం చేయనున్నారు.టెస్టు సారథి గిల్‌ (Shubman Gill) మెడ నొప్పి కారణంగా సఫారీలతో రెండో టెస్టు, వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోలుకుని పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించిన గిల్‌.. నేరుగా తుదిజట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.మరోవైపు.. ఆసియా కప్‌-2025 టోర్నీ సందర్భంగా గాయపడిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya)చాన్నాళ్ల తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. జితేశ్‌ శర్మకే ప్రాధాన్యంఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ (Irfan Pathan) తన అభిప్రాయాలు పంచుకున్నాడు. గిల్‌ రాకతో సంజూ శాంసన్‌పై వేటు తప్పదన్న పఠాన్‌.. వికెట్‌ కీపర్‌గా జితేశ్‌ శర్మకే తొలి ప్రాధాన్యం దక్కుతుందని పేర్కొన్నాడు.శివం దూబేకు నో ఛాన్స్‌అదే విధంగా.. హార్దిక్‌ వల్ల ఓ ఆల్‌రౌండర్‌కు మొండిచేయి తప్పదని ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. ఇక ఓపెనింగ్‌ జోడీగా అభిషేక్‌ శర్మ- శుబ్‌మన్‌ గిల్‌ ఉంటారన్న అతడు.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్‌ యాదవ్‌తో పాటు.. వరుణ్‌ చక్రవర్తి ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఉంటాడని పేర్కొన్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్‌ పాండ్యాతో పాటు అక్షర్‌ పటేల్‌ తుదిజట్టులో ఉంటాడన్న ఇర్ఫాన్‌ పఠాన్‌.. శివం దూబేకు ఛాన్స్‌ ఉండదని అభిప్రాయపడ్డాడు.ఇర్ఫాన్‌ ఓటు అర్ష్‌కేఇక పేసర్ల కోటాలో నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్‌ సింగ్‌కు చోటు దక్కుతుందని ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు. అయితే, గత కొంతకాలంగా యువ పేసర్‌ హర్షిత్‌ రాణా కూడా మెరుగ్గా రాణిస్తున్నాడని.. అతడికి గనుక మేనేజ్‌మెంట్‌ అవకాశం ఇవ్వాలని భావిస్తే అర్ష్‌పైనే వేటు పడుతుందని అంచనా వేశాడు.ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ చేయగలనని హర్షిత్‌ ఆస్ట్రేలియా గడ్డ మీద నిరూపించుకున్నాడని.. కాబట్టి యాజమాన్యం అతడి వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు. ఏదేమైనా తాను మాత్రం అర్ష్‌దీప్‌కే ఓటు వేస్తానని ఇర్ఫాన్‌ పఠాన్‌ ఈ సందర్భంగా వెల్లడించాడు.సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌కు ఇర్ఫాన్‌ పఠాన్‌ ఎంచుకున్న భారత తుదిజట్టుఅభిషేక్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్యా, జితేశ్‌ శర్మ, కుల్దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా.చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌..!

Andre Russell Creates History, Becomes First Cricketer to Achieve Rare Feat10
చరిత్ర సృష్టించిన రస్సెల్‌.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు

వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ (Andre Russell) ఎవరీకి సాధ్యం కాని రికార్డును సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 5000 ప్లస్ రన్స్‌, 500 ప్లస్ వికెట్లు, 500 ప్లస్ సిక్సర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా రస్సెల్ రికార్డులెక్కాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌-2025లో భాగంగా దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రస్సెస్ ఈ ఫీట్ సాధించాడు. ఈ టోర్నీలో రస్సెల్ అబుదాబి నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో 6 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే లీగ్‌లో 500 టీ20 వికెట్ల మైలు రాయిని కూడా ర‌స్సెల్ అందుకున్నాడు. ఇప్పుడు కేవ‌లం రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే సిక్స‌ర్ల ఘ‌న‌త‌ను అందుకున్నాడు.ఇక ఈ ఏడాది జూలైలో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన ర‌స్సెల్‌.. ప్ర‌స్తుతం ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో మాత్ర‌మే ఆడుతున్నాడు. అయితే ర‌స్సెల్ అనూహ్యంగా ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. మినీ వేలానికి ముందు కేకేఆర్ అత‌డిని రిటైన్ చేసుకోలేదు.దీంతో ఈ క‌రేబియ‌న్ యోదుడు వేలంలోకి వ‌స్తాడ‌ని భావించారు. కానీ అంత‌లోనే ర‌స్సెల్‌ క్యాష్ రిచ్ లీగ్ నుంచి తప్పుకొని అంద‌రికి షాకిచ్చాడు. అత‌డిని కేకేఆర్ యాజ‌మాన్యం ప‌వ‌ర్ కోచ్‌గా నియ‌మించింది. ఐపీఎల్‌-2026లో కేకేఆర్ బ్యాక్‌రూమ్ స్టాప్‌లో ర‌స్సెల్ భాగం కానున్నాడు.టీ20ల్లో 500 వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..రషీద్ ఖాన్ – 500 మ్యాచ్‌లు, 681 వికెట్లుడ్వేన్ బ్రావో – 582 మ్యాచ్‌లు, 631 వికెట్లుసునీల్ నరైన్ – 569 మ్యాచ్‌లు, 602 వికెట్లుఇమ్రాన్ తాహిర్ – 446 మ్యాచ్‌లు, 570 వికెట్లుషకీబ్ అల్ హసన్ – 462 మ్యాచ్‌లు, 504 వికెట్లుఆండ్రీ రస్సెల్ – 576 మ్యాచ్‌లు, 500 వికెట్లుచదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌..!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement