ప్రధాన వార్తలు
రుతు, విరాట్ అద్భుతం.. ఆ రెండే కొంపముంచాయి: కేఎల్ రాహుల్
రాయ్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 3) జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి అద్భుత సెంచరీలతో చెలరేగి భారీ స్కోర్ అందించినా, టీమిండియా దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. సౌతాఫ్రికా బ్యాటర్లు అసమాన పోరాటపటిమ కనబర్చి 359 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పెద్దగా కష్టపడకుండానే ఛేదించారు. మార్క్రమ్ బాధ్యతాయుతమైన సెంచరీ, బ్రెవిస్ మెరుపులు, భారత బౌలర్లు, ఫీలర్ల తప్పిదాలు సౌతాఫ్రికా గెలుపుకు కారణమయ్యాయి.గెలుస్తామనుకున్న మ్యాచ్లో ఓడటంపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) స్పందిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు. అతడి మాటల్లోనే.."ఇలాంటి ఓటమిని జీర్జించుకోవడం కష్టం. వరుసగా రెండు టాస్లు కోల్పోవడం దురదృష్టకరం. ఈ విషయంలో నన్ను నేను నిందించుకుంటా. రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం ఎంత కష్టమో, తడి బంతితో బౌలర్లకు ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయో మరోసారి బయటపడ్డాయి.అంపైర్లు బంతి మార్చినా, డ్యూ ప్రభావం తగ్గలేదు. మరో 20–25 పరుగులు చేసుంటే బౌలర్లకు కాస్త కుషన్ దొరికేది. వారు శక్తి మేరకు పోరాడినా, ఫీల్డింగ్లో కొన్ని తప్పిదాలు జరిగాయి. మొత్తంగా టాస్, డ్యూ కొంపముంచాయి. రుతురాజ్ ఆడిన ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది. అతడు స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొన్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత టెంపో పెంచి జట్టుకు అదనపు పరుగులు అందించాడు. విరాట్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. 53వ సారి తన పని తాను చేసుకుపోయాడు. లోయరార్డర్ బ్యాటర్లు ఇంకొంచెం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి, రెండు మూడు బౌండరీలు కొట్టుంటే ఆ 20 పరుగులు కూడా వచ్చేవి. నేను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు (ఐదో స్థానం) రావడం సందర్భానుసారంగా తీసుకున్న నిర్ణయం.
నరైన్@600.. లివింగ్స్టోన్ ధన్ ధనాధన్
విండీస్ టీ20 స్పెషలిస్ట్, స్పిన్ మాంత్రికుడు సునీల్ నరైన్ (Sunil Narine) పొట్టి క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో భాగంగా అబుదాబీ నైట్రైడర్స్కు సారథ్యం వహిస్తున్న అతను.. నిన్న (డిసెంబర్ 3) షార్జా వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఓ వికెట్ (టామ్ ఏబెల్) తీశాడు. ఇదేం మైలురాయి అనుకుంటున్నారా..? ఆగండి. ఈ వికెట్ నరైన్కు టీ20 క్రికెట్లో 600వది. ఈ ఫార్మాట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు (నరైన్తో కలుపుకొని) మాత్రమే ఈ ఘనత సాధించారు. నరైన్కు ముందు డ్వేన్ బ్రావో (631), రషీద్ ఖాన్ (681) 600 వికెట్ల క్లబ్లో చేరారు.లివింగ్స్టోన్ ఊచకోతషార్జా వారియర్స్తో జరిగిన మ్యాచ్లో నైట్రైడర్స్ ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్ (Liam Livingstone) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 38 బంతుల్లో 8 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 82 పరుగులు చేశాడు. అతనితో పాటు అలెక్స్ హేల్స్ (32), షరాఫు (34), రూథర్ఫోర్డ్ (45) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వారియర్స్ చేతులెత్తేసింది. టిమ్ డేవిడ్ (24 బంతుల్లో 60; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) ఒక్కడే పోరాడినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 194 పరుగులకే పరిమితమై 39 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. సునీల్ నరైన్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ఓ వికెట్ తీసి 600 వికెట్ల క్లబ్లో చేరాడు.
ఈసారి ఎన్ని రోజుల్లో!
బ్రిస్బేన్: ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్లో రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి బ్రిస్బేన్లోని ‘గాబా’ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో గెలిచిన ఆ్రస్టేలియా ఐదు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ఆధిక్యంలో ఉంది. అదే జోరు కొనసాగిస్తూ ‘డే అండ్ నైట్’ టెస్టులోనూ విజయం సాధించాలని స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఆసీస్ జట్టు భావిస్తోంది. మరోవైపు 2010–11 నుంచి ఆసీస్ గడ్డపై ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేకపోయిన ఇంగ్లండ్ జట్టు ‘ఫ్లడ్ లైట్’ల వెలుతురులో జరగనున్న పోరులో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం. ‘పింక్ బాల్’ టెస్టుల్లో ఘనమైన రికార్డు ఉన్న ఆసీస్... ఇప్పటి వరకు ఆడిన 14 ‘గులాబీ’ టెస్టుల్లో 13 గెలిచి, ఒక్కటి మాత్రమే ఓడింది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో అతిగా స్వింగ్ అయ్యే ఆసీస్ పేసర్ల బంతులను ఎదుర్కోవడం ఇంగ్లండ్ ఆటగాళ్లకు శక్తికి మించిన పనే. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఉస్మాన్ ఖ్వాజా స్థానంలో జోష్ ఇన్గ్లిస్కు ఆ్రస్టేలియా తుది జట్టులో అవకాశం దక్కడం ఖాయమే. గత మ్యాచ్లో సూపర్ సెంచరీతో జట్టును గెలిపించిన ట్రావిస్ హెడ్ మరోసారి ఇన్నింగ్స్ ఆరంభించనుండగా... లబుషేన్, స్మిత్, గ్రీన్, కేరీ కీలకం కానున్నారు. బౌలింగ్లో స్టార్క్కు బొలాండ్, డగెట్ నుంచి చక్కటి సహకారం లభిస్తోంది. మరోవైపు ‘బాజ్బాల్’నే నమ్ముకున్న ఇంగ్లండ్ ఏమాత్రం పోరాడుతుందో చూడాలి. క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, జేమీ స్మిత్తో బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉన్నా... వీరంతా సమష్టిగా సత్తాచాటాల్సిన అవసరముంది. బౌలింగ్లో ఆర్చర్, అట్కిన్సన్, కార్స్ కీలకం కానున్నారు.
భారత్కు తొలి పరాజయం
సాంటియాగో (చిలీ): జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. జర్మనీ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున హీనా బానో 58వ నిమిషంలో ఏకైక గోల్ చేసింది. జర్మనీ జట్టుకు లీనా ఫ్రెరిచ్స్ (5వ నిమిషంలో), అనిక షానాఫ్ (52వ నిమిషంలో), మార్టినా రీసెంగర్ (59వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. మ్యాచ్ మొత్తంలో భారత్కు ఏడు పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే భారత్ ఒక్క దానిని మాత్రమే సది్వనియోగం చేసుకుంది. మరోవైపు జర్మనీ జట్టుకు తొమ్మిది పెనాల్టీ కార్నర్లు, ఒక పెనాల్టీ స్ట్రోక్ లభించాయి. ఇందులో జర్మనీ ఒక పెనాల్టీ కార్నర్ను, పెనాల్టీ స్ట్రోక్ను గోల్స్గా మలిచింది. మరోటి ఫీల్డ్ గోల్గా వచ్చింది. చివరి పది నిమిషాల్లో భారత్ పట్టుకోల్పోయి రెండు గోల్స్ సమర్పించుకోవడం గమనార్హం. నాలుగు జట్లున్న గ్రూప్ ‘సి’లో జర్మనీ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.భారత్, ఐర్లాండ్ మూడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. రేపు జరిగే చివరి లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్తో భారత్ తలపడుతుంది. క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్లో భారత్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. తొలిసారి 24 జట్లు పోటీపడుతున్న ఈ మెగా టోర్నీలో ఆరు గ్రూప్లు చేశారు. ఒక్కో గ్రూప్లో నాలుగేసి జట్లకు చోటు కల్పించారు. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక ఆరు గ్రూప్ల్లో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లతోపాటు రెండో స్థానంలో నిలిచిన రెండు ఉత్తమ జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి.
ఆశిష్ అద్భుతం
న్యూఢిల్లీ: కేంద్రం నుంచి ఆర్థికంగా చేయూత లభించడంతో... ఆసియా ఈక్వె్రస్టియన్ (అశ్విక క్రీడలు) చాంపియన్షిప్లో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. థాయ్లాండ్లోని పటాయా నగరంలో జరిగిన ఈ చాంపియన్షిప్లో భారత్ ఒక స్వర్ణం, నాలుగు రజతాలతో కలిపి మొత్తం ఐదు పతకాలతో మెరిసింది. ఈవెంటింగ్ కేటగిరీలో టార్గెట్ ఏషియన్ గేమ్స్ గ్రూప్ (టీఏజీజీ) సభ్యుడైన ఆశిష్ లిమాయే స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో ఆసియా ఈక్వె్రస్టియన్ పోటీల చరిత్రలో వ్యక్తిగత స్వర్ణం సాధించిన తొలి భారతీయ ప్లేయర్గా గుర్తింపు పొందాడు. ఆశిష్ లిమాయే, శశాంక్ సింగ్ కటారియా, శశాంక్ కనుమూరిలతో కూడిన భారత జట్టు ఈవెంటింగ్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించింది. డ్రెసాజ్ ఈవెంట్, ఇంటర్మీడియట్ ఫ్రీస్టయిల్–1 వ్యక్తిగత విభాగాల్లో శ్రుతి వోరా రజత పతకాలు నెగ్గింది. డ్రెసాజ్ టీమ్ విభాగంలో శ్రుతి వోరా, దివ్యకీర్తి సింగ్, గౌరవ్ పుందిర్లతో కూడిన భారత జట్టు రజత పతకం హస్తగతం చేసుకుంది. ఆసియా చాంపియన్షిప్లో పోటీపడ్డ 16 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఖర్చులన్నీ కేంద్ర ప్రభుత్వం భరించింది. జాతీయ క్రీడా సమాఖ్యలకు చేయూత పథకంలో భాగంగా భారత బృందంపై రూ. 2 కోట్ల 73 లక్షలు వెచ్చించారు.
358 సరిపోలేదు
విరాట్ కోహ్లి తన అసాధారణ ఫామ్ను కొనసాగిస్తూ వన్డేల్లో 53వ సెంచరీతో చెలరేగాడు. అండగా రుతురాజ్ గైక్వాడ్ వన్డే కెరీర్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. జట్టు గత మ్యాచ్లోకంటే మరో 9 పరుగులు ఎక్కువే చేసింది. అయినా సరే, రెండో వన్డేలో భారత్కు ఓటమి తప్పలేదు. రాంచీలో విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయిన సఫారీలు ఈసారి రాయ్పూర్లో పట్టు వదల్లేదు. ఏకంగా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ను సమం చేశారు. మార్క్రమ్, బ్రెవిస్, బ్రెట్కీ బ్యాటింగ్ జోరుతో పాటు బౌలర్ల వైఫల్యం, అతి పేలవ ఫీల్డింగ్తో భారత్ నుంచి మ్యాచ్ చేజారింది. రాయ్పూర్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ 1–1తో సమమైంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (93 బంతుల్లో 102; 7 ఫోర్లు, 2 సిక్స్లు) వరుసగా రెండో శతకంతో చెలరేగగా... రుతురాజ్ గైక్వాడ్ (83 బంతుల్లో 105; 12 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడి కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. కోహ్లి, రుతురాజ్ మూడో వికెట్కు 26 ఓవర్లలో 156 పరుగులు జోడించగా, చివర్లో కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిని ప్రదర్శించాడు. అనంతరం దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగులు సాధించింది. మార్క్రమ్ (98 బంతుల్లో 110; 10 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీ నమోదు చేయగా... మాథ్యూ బ్రీట్కే (64 బంతుల్లో 68; 5 ఫోర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (34 బంతుల్లో 54; 1 ఫోర్, 5 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే శనివారం విశాఖపట్నంలో జరుగుతుంది. భారీ భాగస్వామ్యం... ఓపెనర్ యశస్వి జైస్వాల్ (22) జాగ్రత్తగా ఇన్నింగ్స్ మొదలు పెట్టగా... బర్గర్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన రోహిత్ శర్మ (14) అదే ఓవర్లో వెనుదిరిగాడు. కొద్ది సేపటికే జైస్వాల్ కూడా అవుటయ్యాడు. అయితే కోహ్లి, రుతురాజ్ భారీ భాగస్వామ్యంతో జట్టును నడిపించారు. సిక్స్తో ఖాతా తెరిచిన కోహ్లి ఆ తర్వాత తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. తొలి 10 ఓవర్లలో భారత్ 66 పరుగులు చేసింది. గత మ్యాచ్లో అవకాశం వృథా చేసుకున్న రుతురాజ్ ఈసారి పట్టుదలగా నిలబడి పరుగులు సాధించాడు. ఇద్దరిలో ముందుగా రుతురాజ్ 52 బంతుల్లో, ఆ తర్వాత కోహ్లి 47 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్ను అందుకున్నారు. అనంతరం మరింత జోరు పెంచిన రుతురాజ్... మహరాజ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. యాన్సెన్ బౌలింగ్లో లాంగాన్ మీదుగా కొట్టిన సిక్స్ అతని ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. మరోవైపు బాష్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన రుతురాజ్ 77 బంతుల్లోనే తన తొలి శతకాన్ని అందుకొని సంబరాలు చేసుకున్నాడు. 50 నుంచి 100కు చేరేందుకు అతను 25 బంతులే తీసుకున్నాడు. సెంచరీ తర్వాత రుతురాజ్ అవుట్ కాగా... యాన్సెన్ ఓవర్లో సింగిల్తో కోహ్లి సెంచరీ (90 బంతుల్లో) పూర్తయింది. ఆవెంటనే కోహ్లి వెనుదిరిగాడు. సుందర్ (1) విఫలం కాగా, రాహుల్, రవీంద్ర జడేజా (24 నాటౌట్) కలిసి స్కోరును 350 పరుగులు దాటించారు. ఈ క్రమంలో రాహుల్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకోగా, ఆఖరి 10 ఓవర్లలో భారత్ 76 పరుగులు రాబట్టగలిగింది. బ్రెవిస్ దూకుడు... దక్షిణాఫ్రికా టాప్–5లో డికాక్ (8) మినహా మిగతా వారంతా లక్ష్య ఛేదనలో తమవంతు పాత్ర పోషించారు. జట్టు ఇన్నింగ్స్లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. తొలి వికెట్ కోల్పోయిన తర్వాత మార్క్రమ్, బవుమా కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ముఖ్యంగా చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడిన మార్క్రమ్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 88 బంతుల్లోనే అతని సెంచరీ పూర్తయింది. అతను అవుటయ్యే సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు 30 ఓవర్లలో 197/3. మిగిలిన 20 ఓవర్లలో 8.10 రన్రేట్తో 162 పరుగులు అసాధ్యంగా కనిపించింది! అయితే ఇక్కడే బ్రెవిస్ ఆట స్వరూపాన్ని మార్చాడు. కుల్దీప్, హర్షిత్ బౌలింగ్లో చెరో రెండు చొప్పున మొత్తం ఐదు సిక్సర్లు బాదడంతో చేయాల్సిన రన్రేట్ ఒక్కసారిగా తగ్గిపోయింది. బ్రెవిస్, బ్రీట్కే నాలుగో వికెట్కు 64 బంతుల్లోనే 92 పరుగులు జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు కాస్త కట్టడి చేయగలిగినా... కార్బిన్ బాష్ (15 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) నిలిచి మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బాష్ (బి) యాన్సెన్ 22; రోహిత్ (సి) డికాక్ (బి) బర్గర్ 14; కోహ్లి (సి) మార్క్రమ్ (బి) ఎన్గిడి 102; రుతురాజ్ (సి) జోర్జి (బి) యాన్సెన్ 105; రాహుల్ (నాటౌట్) 66; సుందర్ (రనౌట్) 1; జడేజా (నాటౌట్) 24; ఎక్స్ట్రాలు 24; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 358. వికెట్ల పతనం: 1–40, 2–62, 3–257, 4–284, 5–289. బౌలింగ్: బర్గర్ 6.1–0–43–1, ఎన్గిడి 10–1–51–1, యాన్సెన్ 10–0–63–2, మహరాజ్ 10–0–70–0, బాష్ 8–0–79–0, మార్క్రమ్ 5.5–0–48–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రుతురాజ్ (బి) హర్షిత్ 110; డికాక్ (సి) సుందర్ (బి) అర్‡్షదీప్ 8; బవుమా (సి) హర్షిత్ (బి) ప్రసిధ్ 46; బ్రీట్కే (ఎల్బీ) (బి) ప్రసిధ్ 68; బ్రెవిస్ (సి) జైస్వాల్ (బి) కుల్దీప్ 54; జోర్జి (రిటైర్డ్హర్ట్) 17; యాన్సెన్ (సి) రుతురాజ్ (బి) అర్‡్షదీప్ 2; బాష్ (నాటౌట్) 29; మహరాజ్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 18; మొత్తం (49.2 ఓవర్లలో 6 వికెట్లకు) 362. వికెట్ల పతనం: 1–26, 2–127, 3–197, 4–289, 5–317, 6–322. బౌలింగ్: అర్ష్ దీప్ 10–0–54–2, హర్షిత్ 10–0–70–1, ప్రసిధ్ 8.2–0–85–2, సుందర్ 4–0–28–0, జడేజా 7–0–41–, కుల్దీప్ 10–0–78–1. 11 కోహ్లి వరుసగా రెండు వన్డేల్లో సెంచరీలు సాధించడం ఇది 11వ సారి.34 కోహ్లి తన వన్డే కెరీర్లో 34 వేర్వేరు వేదికల్లో సెంచరీ సాధించాడు. సచిన్ కూడా 34 వేదికల్లో శతకాలు బాదాడు.44 ఒకే వన్డే ఇన్నింగ్స్లో ఇద్దరు భారత ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది 44వ సారి.3 దక్షిణాఫ్రికాపై మూడుసార్లు వన్డేల్లో ఇద్దరు భారత ఆటగాళ్లు సెంచరీలు చేయగా.. మూడుసార్లూ భారత్ ఓడిపోవడం గమనార్హం. 1991 నవంబర్ 14న న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్లో రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్... 2001 అక్టోబర్ 5న జొహనెస్బర్గ్లో జరిగిన మ్యాచ్లో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ సెంచరీలు చేశారు. ఈ రెండింటిలోనూ భారత్ ఓటమి పాలైంది.2 రుతురాజ్ గైక్వాడ్ టి20 (2023 నవంబర్ 28న ఆ్రస్టేలియాపై గువాహటిలో 123 నాటౌట్), వన్డే (2025 డిసెంబర్ 3న రాయ్పూర్లో దక్షిణాఫ్రికాపై 105) ఫార్మాట్లలో తన తొలి సెంచరీ చేసిన రెండు సందర్భాల్లోనూ భారత్ ఓడిపోయింది.2 వన్డేల్లో భారత్పై అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రెండో జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. 2019లో మొహాలీలో జరిగిన వన్డేలోనూ ఆ్రస్టేలియా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది.
IND vs SA: టీమిండియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా
రాయ్పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 1-1తో దక్షిణాఫ్రికా సమం చేసింది. 359 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 49.2 ఓవర్లలో చేధించింది.ప్రోటీస్ ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్(98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 110) సూపర్ సెంచరీతో చెలరేగగా.. మాథ్యూ బ్రీట్జ్కే(64 బంతుల్లో 68), బ్రెవిస్(34 బంతుల్లో 54) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ఆఖరిలో కార్బిన్ బాష్(14 బంతుల్లో 25) మరోసారి కీలక నాక్ ఆడాడు.ఈ మ్యాచ్లో భారత బౌలర్లు తేలిపోయారు. భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. ఒక్క అర్ష్దీప్ మినహా మిగితా బౌలర్లందరూ దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. అంతకు తోడు చెత్త ఫీల్డింగ్ కూడా భారత్ కొంపముంచింది. మిస్ ఫీల్డ్ల రూపంలో టీమిండియా దాదాపు 30 పరుగులు సమర్పించుకుంది. అర్ష్దీప్, ప్రసిద్ద్ కృష్ణ తలా రెండు వికెట్లు సాధించారు.కోహ్లి, రుతు సెంచరీలు వృథా..అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి((93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 102), రుతురాజ్ గైక్వాడ్(83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 105) సెంచరీలతో చెలరేగగా.. రాహుల్(66) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, ఎంగిడీ, బర్గర్ తలా వికెట్ సాధించారు. అయితే భారత్ ఓటమి పాలవ్వడంతో కోహ్లి, రుతురాజ్ సెంచరీలు వృథా అయిపోయాయి. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే శనివారం వైజాగ్ వేదికగా జరగనుంది.
భారత జట్టు నుంచి ఫినిషర్ అవుట్.. కారణమెవరు?
టీమిండియా స్టార్ ప్లేయర్ రింకూ సింగ్ను టీ20 వరల్డ్కప్-2026కు పక్కన పెట్టనున్నారా? అంటే అవునానే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోనే సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టులో రింకూ సింగ్ పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.రింకూ ఔట్.. హార్దిక్ ఇన్అతడి స్ధానంలో జట్టులోకి స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగొచ్చాడు. ఈ జట్టు సెలక్షన్ను బట్టి రింకూ పొట్టి ప్రపంచకప్ ప్రణాళికలలో లేనిట్లు తెలుస్తోంది. రింకూ చివరగా భారత్ తరపన ఆసియాకప్-2025లో ఆడాడు.పాక్తో జరిగిన ఫైనల్లో విన్నింగ్ రన్స్ అతడే కొట్టాడు.అయితే వాస్తవానికి హార్దిక్ పాండ్యాకు గాయం కాకపోయి ఉంటే రింకూకు తుది జట్టులో దక్కకపోయేది. ఇప్పుడు పాండ్యా గాయం నుంచి కోలుకోని తిరిగి రావడంతో రింకూను పూర్తిగా ప్రధాన జట్టు నుంచే తప్పించారు. బహుశా రింకూ తరుచుగా చెప్పే విధంగా దేవుని ప్లాన్ అయి వుంటుంంది.గంభీర్ కారణమా?రింకూ గత కొన్ని టీ20 సిరీస్లగా జట్టుతో పాటు ఉన్నప్పటికి తుది జట్టులో మాత్రం పెద్దగా చోటు దక్కలేదు. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్కువగా ఆల్రౌండర్ల మొగ్గు చూపడంతో రింకూ చాలా మ్యాచ్లలో బెంచ్కే పరిమితమయ్యాడు. అతడికి బదులుగా వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబేలకు ప్లేయింగ్ ఎలెవన్లో టీమ్ మెనెజ్మెంట్ చోటు కల్పిస్తోంది.అతడు ఆస్ట్రేలియా పర్యటనలో జట్టులో ఉన్నప్పటికీ, ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయలేదు. మొన్నటివరకు ముఖ్యమైన 'ఫినిషర్'గా పరిగణించబడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఇప్పుడు ఏకంగా జట్టులోనే లేకుండా పోయాడు. అయితే టీ20 వరల్డ్కప్-2026 భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఉపఖండంలో మంచి స్పిన్నర్లు, స్పిన్ను ధీటుగా ఎదుర్కొనే బ్యాటర్లు కావాలి. వాషింగ్టన్, దూబేలు స్పినర్లకు బాగా ఆడగలరు. అంతేకాకుండా వాషింగ్టన్ బంతితో కూడా మ్యాజిక్ చేయగలడు. సుందర్, దూబే ప్రధాన జట్టులో ఉన్నప్పటికి ప్లేయింగ్ ఎలెవన్లో మాత్రం ఇద్దరిలో ఒకరికి చోటు దక్కే అవకాశముంది. ఎందుకంటే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రూపంలో ఇద్దరూ స్పిన్నర్లు ఎలాగానూ తుది జట్టులో ఉంటారు. బహుశా అందుకే రింకూను టీ20 ప్రపంచకప్ సెటాప్ నుంచి తప్పించండొచ్చు. అంతే తప్ప రింకూపై వేటు వెనక మరే ఏ ఇతర కారణం లేకపోవచ్చని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు ఇదేసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్- ఫిట్నెస్కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్🏏తొలి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశా🏏రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్పూర్, చండీగఢ్🏏మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్🏏నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్🏏ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
టీమిండియా వెటరన్ పేసర్ మోహిత్ శర్మ అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మోహిత్ తన నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా బుధవారం వెల్లడించాడు. భారత్ తరపున 34 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన మోహిత్.. ఐపీఎల్లో పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు."హర్యానాకు ప్రాతినిధ్యం వహించడం మొదలు భారత్ జట్టు, ఆపై ఐపీఎల్లో ఆడటం వరకు నా ప్రయాణం ఒక అద్భుతం. ఈ రోజు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన హర్యానా క్రికెట్ అసోసియేషన్కు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నన్ను సరైన మార్గంలో నడిపించిన అనిరుధ్ సర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. బీసీసీఐ, కోచ్లు, సహచరులు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, సపోర్ట్ సిబ్బంది, అభిమానులందరికి ధన్యవాదాలు ఉంటూ తన రిటైర్మెంట్ నోట్లో మోహిత్ రాసుకొచ్చాడు. ఈ హర్యానా పేసర్ చివరగా భారత తరపున 2015లో ఆడాడు. అప్పటి నుంచి జాతీయ దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్లో మాత్రం రెగ్యూలర్గా ఆడుతూ వస్తున్నాడు. ఐపీఎల్-2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు. అయితే మినీ వేలానికి ముందు అతడిని గుజరాత్ విడిచిపెట్టింది. అంతలోనే అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు.భారత్ తరుపున అతడు 26 వన్డేలు, 8 టీ20లు ఆడాడు. వన్డేల్లో 31 వికెట్లు, టీ20ల్లో ఆరు వికెట్లు సాధించాడు. అతడు 2013లో ఎంఎస్ ధోని సారథ్యంలో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 120 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన మోహిత్ 134 వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by Mohitmahipal Sharma (@mohitsharma18)
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డు
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన రుతురాజ్ గైక్వాడ్కు తొలి ప్రయత్నంలో చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ మహారాష్ట్ర ఆటగాడు.. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేసి నిష్క్రమించాడు.సంచలన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్..సఫారీ పేసర్ ఒట్నీల్ బార్ట్మన్ బౌలింగ్లో రుతురాజ్ (Ruturaj Gaikwad) గాల్లోకి లేపిన బంతిని.. యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) అద్భుతంగా ఒడిసిపట్టాడు. సంచలన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకుని.. రుతురాజ్కు నిద్రలేని రాత్రిని మిగిల్చాడు. అసలే రాక రాక వచ్చిన అవకాశం.. కానీ ఇలా స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో రుతుతో పాటు అతడి అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో రెండో వన్డేలో యాజమాన్యం రుతురాజ్పై వేటు వేసి.. రిషభ్ పంత్ (Rishabh Pant)ను తుదిజట్టులోకి తీసుకుంటుందనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, మేనేజ్మెంట్ రుతుకు మరో అవకాశం ఇచ్చింది. రాయ్పూర్ వేదికగా రెండో వన్డేలో అతడిని ప్లేయింగ్ ఎలెవన్కు ఎంపిక చేసింది.77 బంతుల్లోనే సెంచరీఈసారి తనకు వచ్చిన అవకాశాన్ని రుతురాజ్ గైక్వాడ్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. శతక్కొట్టిన తర్వాత కూడా జోరు కొనసాగించిన రుతురాజ్... మొత్తంగా 83 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 105 పరుగులు సాధించాడు.మరికొన్నాళ్లపాటు..సఫారీ పేసర్ మార్కో యాన్సెన్ బౌలింగ్లో టోనీ డి జోర్జికి క్యాచ్ ఇవ్వడంతో రుతురాజ్ ఇన్నింగ్స్కు తెరపడింది. నిజానికి ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్కు వచ్చే రుతురాజ్ను మేనేజ్మెంట్.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దింపింది. తొలి ప్రయత్నంలో దురదృష్టవశాత్తూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగిన రుతు.. తాజా వన్డేలో శతకం సాధించి తనను తాను నిరూపించుకున్నాడు. మరికొన్నాళ్లపాటు జట్టులో కొనసాగే అర్హత సంపాదించాడు.Firsts are always special! 💪#RuturajGaikwad lights up Raipur with an epic knock to bring up his first ODI ton. 👏🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/uDZZ6h8ulN— Star Sports (@StarSportsIndia) December 3, 2025చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డుఇక వన్డేల్లో తన తొలి సెంచరీతోనే రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాయ్పూర్లో మొట్టమొదటి అంతర్జాతీయ శతకం నమోదు చేసిన క్రికెటర్గా తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడు. కాగా ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో గల షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇప్పటి వరకు రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది.ఆస్ట్రేలియాతో టీ20, న్యూజిలాండ్తో వన్డే మ్యాచ్లు జరుగగా.. కివీస్తో వన్డేలో నాటి కెప్టెన్ రోహిత్ శర్మ 51 పరుగులు సాధించాడు. ఈ వేదికపై ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండగా.. తాజాగా సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా రుతురాజ్ శతకం సాధించి.. రోహిత్ పేరును చెరిపేశాడు.మరో రెండు రికార్డులుఇక ఈ మ్యాచ్లో రుతురాజ్తో పాటు విరాట్ కోహ్లి కూడా శతకం (93 బంతుల్లో 102) సాధించాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదిలా ఉంటే.. 77 బంతుల్లోనే శతక్కొట్టిన రుతురాజ్.. సౌతాఫ్రికాపై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. అంతకు ముందు యూసఫ్ పఠాన్ 2011లో ప్రొటిస్ జట్టుతో 68 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇక సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది.చదవండి: BCCI: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటన
టెన్నిస్ దిగ్గజం కన్నుమూత
ఇటాలియన్ టెన్నిస్ దిగ్గజం, రెండు సార్లు ఫ్రెంచ్ ఓప...
గాయత్రి–ట్రెసా జాలీ జోడీదే డబుల్స్ టైటిల్
లక్నో: సొంతగడ్డపై సత్తా చాటుకున్న పుల్లెల గాయత్రి–...
హైదరాబాద్లో సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్
ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ (ఐఎస్ఆర్ఎ...
భారత్ 14–3 కెనడా
ఇపో (మలేసియా): టోర్నీ ఆసాంతం సంపూర్ణ ఆధిపత్యం కనబర...
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
టీమిండియా వెటరన్ పేసర్ మోహిత్ శర్మ అన్ని ఫార్మ...
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డు
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలో పునరాగమన...
భారత జెర్సీ అదిరిపోయిందిగా..
టీ20 వరల్డ్కప్-2026 కోసం టీమిండియా జెర్సీని భ...
BCCI: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటన
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత క్రికెట్ నియంత్ర...
క్రీడలు
ఉప్పల్ స్టేడియం: ఇదేం అభిమానం?.. ఉలిక్కిపడ్డ హార్దిక్, అభిషేక్ (చిత్రాలు)
వరల్డ్కప్ గెలిచి నెల రోజులు.. భారత మాజీ క్రికెటర్ భావోద్వేగం (ఫోటోలు)
ఉప్పల్లో హార్దిక్ హంగామా.. పోటెత్తిన అభిమానులు (ఫోటోలు)
మెస్సీతో మ్యాచ్.. ప్రాక్టీస్లో చెమటోడ్చిన సీఎం రేవంత్ (ఫొటోలు)
#INDvsSA : కింగ్ పూర్వవైభవం.. లేటు వయసులోనూ అదిరిపోయే శతకం
ఉత్సాహంగా వైజాగ్ మారథాన్ ర్యాలీ (ఫొటోలు)
హైదరాబాద్కు మెస్సీ..ఫోటో దిగాలంటే రూ. 10 లక్షలు! (ఫొటోలు)
ధోనీ కేరళ వస్తే? ఇది ఏఐ అని చెబితే తప్ప తెలియదు (ఫొటోలు)
ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో మెరిసిన గీతా బస్రా, హర్భజన్ దంపతులు (ఫొటోలు)
ప్రీ మెచ్యూర్డ్ చిల్డ్రన్స్ కు ‘ప్రీమిథాన్’ (ఫొటోలు)
వీడియోలు
వరుస సెంచరీలతో విరాట్ విధ్వంసం.. 2027 వరల్డ్ కప్ పై ఆశలు
రాయ్ పూర్ వన్డేలో భారత్ పై సౌతాఫ్రికా విజయం
సిరీస్ పై భారత్ గురి
IND Vs SA: రాంచీ వన్డేలో దుమ్ములేపిన భారత్
12 బంతుల్లో 50.. 32 బంతుల్లో 100.. ఇదేం బాదుడురా బాబు
జట్టులో కీలక మార్పులు
టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే..!
స్మృతి మందాన పెళ్లి రద్దు? వేరే అమ్మాయితో పలాస్ డేటింగ్!
మహిళా క్రికెటర్ స్మృతి మందాన వివాహం వాయిదా
Nikhat Zareen: అదరగొట్టిన తెలంగాణ బాక్సర్.. గోల్డ్ మెడల్
