Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

ICC U19 WC: Australia Announces Squad Include 2 Indian Origin Players1
వరల్డ్‌కప్‌ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌-2026 ఎడిషన్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో ఆడబోయే తమ యువ జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ టీమ్‌కు ఒలీవర్‌ పీక్‌ సారథ్యం వహించనున్నాడు.ఇక వరల్డ్‌కప్‌ ఆడే ఆసీస్‌ యువ జట్టులో ఇద్దరు భారత సంతతి ఆటగాళ్లకు కూడా చోటు దక్కడం విశేషం. అంతేకాదు ఈ టీమ్‌లో ఇద్దరు శ్రీలంక సంతతి, చైనా సంతతికి ఓ ఆటగాడికి కూడా సెలక్టర్లు చోటివ్వడం గమనార్హం.పాల్గొనే జట్లు ఇవేకాగా వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు అండర్‌-19 మెన్స్‌ వరల్డ్‌కప్‌ (ICC U19 Mens World Cup 2026) నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ ఐసీసీ టోర్నీకి నమీబియా- జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందులో గ్రూప్‌-ఎ నుంచి ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, జపాన్‌, శ్రీలంక పాల్గొంటుండగా.. గ్రూప్‌-బి నుంచి భారత్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, అమెరికా పోటీపడతాయి.కెప్టెన్‌ ఎవరంటే?ఇక గ్రూప్‌-సి నుంచి ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, స్కాట్లాండ్‌, జింబాబ్వే.. అదే విధంగా గ్రూప్‌-డి నుంచి అఫ్గనిస్తాన్‌, సౌతాఫ్రికా, టాంజానియా, వెస్టిండీస్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా తాజాగా తమ జట్టును ప్రకటించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఆసీస్‌కు లెఫ్టాండర్‌ బ్యాటర్‌ ఒలీవర్‌ పీక్‌ సారథిగా వ్యవహరించబోతున్నాడు.భారత్‌తో ఫైనల్లో సత్తా చాటిసౌతాఫ్రికాలో 2024లో జరిగిన వరల్డ్‌కప్‌ టోర్నీలో ఒలీవర్‌ (Oliver Peake) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 120 పరుగులు సాధించాడు. ముఖ్యంగా భారత్‌తో ఫైనల్లో 46 పరుగులతో అజేయంగా నిలిచి.. ఆస్ట్రేలియా టైటిల్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.అంతేకాదు పందొమిదేళ్ల ఈ కుర్ర బ్యాటర్‌ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ప్రైమ్‌ మినిస్టర్‌ ఎలెవన్‌ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఏకంగా ప్రపంచకప్‌ జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్‌ కొట్టేశాడు.అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టుఒలీవర్ పీక్ (కెప్టెన్), కేసీ బార్టన్, నాడెన్ కూరే (శ్రీలంక సంతతి), జేడెన్ డ్రేపర్, స్టీవెన్ హోగన్, థామస్ హోగన్, బెన్ గోర్డాన్, జాన్ జేమ్స్ (భారత సంతతి), చార్లెస్ లాచ్మండ్, అలెక్స్ లీ యంగ్ (చైనా సంతతి), విల్ మలాజ్జుక్, నితేశ్‌ సామ్యూల్ (శ్రీలంక సంతతి), హేడెన్ షీలర్, ఆర్యన్ శర్మ (భారత సంతతి), విలియం టేలర్.చదవండి: జింబాబ్వే జట్టులో మాజీ ప్లేయర్‌ కొడుకులు

Prasar Bharati wants to replace JioStar in ICC media rights deal: Report2
ICC: అనూహ్యం.. రేసులోకి ప్రసార్‌ భారతి!

భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన దేశంలో క్రికెట్‌ ఓ మతం లాంటిది. అందుకే మిగతా ఏ క్రీడలకు లభించని క్రేజ్‌ ఈ ఆటకు మాత్రమే ఉంది. దీనిని క్యాష్‌ చేసుకునేందుకు ప్రసార మాధ్యమాలు ఎల్లప్పుడూ ముందే ఉంటాయి.అనూహ్య రీతిలోముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) నిర్వహించే టోర్నీలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా దండిగా ఆదాయం పొందాలనే యోచనతో ఉంటాయి. అయితే, అనూహ్య రీతిలో కొన్నాళ్ల క్రితం ఐసీసీ మీడియా హక్కులను వదులుకునేందుకు జియో హాట్‌స్టార్‌ సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.భారత్‌లో ఐసీసీ మ్యాచ్‌ల స్ట్రీమింగ్‌ హక్కుల కోసం రెండేళ్ల క్రితం.. నాలుగేళ్ల కాలానికి గానూ జియో హాట్‌స్టార్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీని విలువ దాదాపు మూడు బిలియన్‌ డాలర్లకు పైమాటే. అయితే, టీ20 మెన్స్‌ ప్రపంచకప్‌-2026కు ముందు తాము ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఈ సంస్థ ఐసీసీకి సమాచారం ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.రేసులోకి ప్రసార్‌ భారతి!ఆర్థిక నష్టాల నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో హాట్‌స్టార్‌ తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌తో పాటు.. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌వీడియో వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఐసీసీ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రేసులోకి ఊహించని విధంగా ప్రసార్‌ భారతి (ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్తి గల సంస్థ) దూసుకువచ్చింది. పూర్తి హక్కులు దక్కించుకోలేకపోవచ్చుఈ విషయం గురించి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘మొత్తానికి మొత్తంగా ఐసీసీ మీడియా హక్కులను ప్రసార్‌ భారతి దక్కించుకోలేకపోవచ్చు. అయితే, బ్రేకప్‌ విధానంలో కొన్ని మ్యాచ్‌లను ప్రసారం చేసే వీలు ఉండవచ్చు.ఉదాహరణకు టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు.. లేదంటే ఫార్మాట్లకు అతీతంగా టోర్నమెంట్‌ల వారీగా మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులను పొందవచ్చు. ఏదో ఒక విధంగా ఐసీసీ మీడియా హక్కులలో భాగం కావడమే సంస్థ లక్ష్యం.దూర్‌దర్శన్‌, డీడీ ఫ్రీడిష్‌.. ఓటీటీ ప్లామ్‌ఫామ్‌లు.. ఇలా వివిధ వేదికల ద్వారా మ్యాచ్‌ల ప్రసారానికి ఆసక్తిగా ఉన్నాము. ముందుగా చెప్పినట్లు మొత్తం ప్యాకేజీ మేము దక్కించుకోలేకపోవచ్చు. అయినప్పటికీ బిడ్డింగ్‌ వేసేందుకు సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా టీమిండియా మ్యాచ్‌లనైనా ప్రసారం చేసే హక్కులు పొందాలని భావిస్తున్నాము’’ అని తెలిపినట్లు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌ వెల్లడించింది.చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలం కౌంట్ డౌన్ షురూ.. అతడికి రూ. 20 కోట్లు పైమాటే!

Sachin Fulfilled promise 15 years after teammate selfless act India debut3
15 ఏళ్ల తర్వాత మాట నిలబెట్టుకున్న సచిన్‌

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ఆసక్తికర విషయం వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన అరంగేట్రానికి దోహదపడిన సహచర ఆటగాడికి ఓ మాట ఇచ్చానని.. పదిహేనేళ్ల తర్వాత ప్రామిస్‌ నిలబెట్టుకున్నానని తెలిపాడు. ఇంతకీ ఎవరా ఆటగాడు?.. అతడికి సచిన్‌ ఇచ్చిన మాట ఏంటి?!ఆ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగాటీమిండియా తరఫున 1989 నవంబరులో సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్‌తో టెస్టుల సందర్భంగా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే, అంతకంటే కొద్ది రోజుల ముందు ఇరానీ కప్‌ మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా తరఫున సచిన్‌ సెంచరీ బాదాడు. ఆ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగా సెలక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించి టీమిండియాలో అడుగుపెట్టాడు.అతడి త్యాగంతో సెంచరీఈ విషయాన్ని సచిన్‌ టెండుల్కర్‌ ఇటీవలే స్వయంగా వెల్లడించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా (Rest Of India) తొమ్మిది వికెట్లు కోల్పోయిన వేళ.. సచిన్‌ సెంచరీకి చేరువగా ఉన్నాడు. అలాంటి సమయంలో గురుశరణ్‌ సింగ్‌ (Gursharan Singh) విరిగిన చేతితోనే బ్యాటింగ్‌కు వచ్చి.. సచిన్‌కు సహకారం అందించాడు. ఫలితంగా సచిన్‌ శతకం పూర్తి చేసుకోవడం.. తద్వారా టీమిండియా అరంగేట్రానికి బాటలు వేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గురుశరణ్‌ సింగ్‌ త్యాగానికి ప్రతిగా.. సచిన్‌ అతడికి ఓ మాట ఇచ్చాడు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆ మాటను నిలబెట్టుకున్నాడు. ఏదో ఒకరోజు నువ్వు కూడా రిటైర్‌ అవుతావుఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘రిటైర్‌ అయిన క్రికెటర్ల కోసం అప్పట్లో బెన్‌ఫిట్‌ మ్యాచ్‌లు నిర్వహించేవారు. ఆరోజు (1990) న్యూజిలాండ్‌లో గురుశరణ్‌కు నేను ఓ మాట ఇచ్చాను.‘గుశీ.. జీవితాంతం ఎవరూ ఆడుతూనే ఉండలేరు కదా! ఏదో ఒకరోజు నువ్వు కూడా రిటైర్‌ అవుతావు. అలా నువ్వు రిటైర్‌ అయ్యి బెన్‌ఫిట్‌ మ్యాచ్‌ కోసం ఆటగాళ్లు కావాల్సినపుడు నేను నీకోసం వచ్చి ఆడతాను’ అని చెప్పాను. అన్నట్లుగానే అతడి కోసం బెన్‌ఫిట్‌ మ్యాచ్‌ ఆడాను.పదిహేనేళ్ల తర్వాత‘గుశీ.. న్యూజిలాండ్‌లో నీకు ఓ మాట ఇచ్చాను కదా! పదిహేనేళ్ల తర్వాత (2005) దానిని నిలబెట్టుకుంటున్నా’ అని చెప్పాను. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మదిలో నిల్చిపోతాయి. ‘ఆరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా’ అని ఈరోజు సగర్వంగా నేను చెప్పగలను’’ అని సచిన్‌ టెండుల్కర్‌ పేర్కొన్నాడు. చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలం కౌంట్ డౌన్ షురూ.. అతడికి రూ. 20 కోట్లు పైమాటే!

Lionel Messi in India: Complete schedule of GOAT tour programme details4
ఇండియాలో మెస్సీ.. షెడ్యూల్ ఇదిగో

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గ‌జం లియోన‌ల్‌ మెస్సీ భార‌త్ ప‌ర్య‌ట‌న‌పై క్రీడాభిమానుల్లో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. మూడు రోజుల 'ద గోట్ టూర్'లో భాగంగా డిసెంబ‌ర్ 13న భార‌త గ‌డ్డ‌పై ఆయ‌న అడుగుపెడ‌తారు. కోల్‌క‌తా, హైద‌రాబాద్‌, ముంబై, న్యూఢిల్లీ మ‌హా న‌గ‌రాల్లో మెస్సీ ప‌ర్య‌టిస్తారు. ప‌లు ర‌కాల కార్య‌క్ర‌మాల్లో పాల్గొని, ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కూడా ఆడ‌తారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, సెల‌బ్రిటీల‌ను ఆయ‌న క‌లుస్తారు. కోల్‌క‌తాలో మొదలు పెట్టి ఢిల్లీలో ఆయ‌న ప‌ర్య‌ట‌న ముగుస్తుంది. మెస్సీతో పాటు రొడ్రిగో డి పాల్ (అర్జెంటీనా), ఉరుగ్వే లెజండ‌రీ స్టైక‌ర్ లూయిస్ సువాలెజ్ కూడా ఇండియాకు వ‌స్తున్నారు.త‌మ అభిమాన ఫుట్‌బాల్ క్రీడాకారుల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు ఇండియా ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మెస్సీని దూరం నుంచి చూడ‌డమే త‌ప్పా ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఫొటో తీసుకునే అవ‌కాశం సామాన్యుల‌కు ఉండ‌దు. ఎందుకంటే మెస్సీతో ప్ర‌త్యేకంగా ఫొటో దిగాలంటే దాదాపు 10 ల‌క్ష‌ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా 100 మందికి మాత్ర‌మే. మెస్సీ రాక‌ కోసం తెలుగు అభిమానులు అమితాస‌క్తితో వేచివున్నారు. హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో అత‌డు ఆడే మ్యాచ్ ప్ర‌త్య‌క్షంగా చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ మ్యాచ్ వీక్షించాలంటే టిక్కెట్ త‌ప్ప‌నిస‌రి. వీటి ధ‌ర‌లు రూ.1750 నుంచి రూ.13500 వ‌ర‌కు ఉన్నాయి.మ‌రోవైపు లియోన‌ల్‌ మెస్సీ (Lionel Messi) షెడ్యూల్‌పై ఫ్యాన్స్ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అత‌డు ఎప్పుడు ఎక్క‌డికి వెళ‌తాడ‌నే స‌మాచారం కోసం ఆన్‌లైన్‌లో శోధిస్తున్నారు. వారి కోసం మెస్సీ ఫుల్ షెడ్యూల్‌ను ఇక్క‌డ ఇస్తున్నాం. మెస్సీ షెడ్యూల్ ఇలా...డిసెంబర్ 13, కోల్‌కతాఉదయం 1:30: కోల్‌కతాకు రాకఉదయం 9:30 నుండి 10:30 వరకు: అభిమానులతో ముఖాముఖిఉదయం 10:30 నుండి 11:15 వరకు: మెస్సీ విగ్రహం వర్చువల్‌గా ప్రారంభోత్సవంఉదయం 11:15 నుండి 11:25 వరకు: యువ భారతికి రాక‌ఉదయం 11:30: షారుఖ్ ఖాన్ యువ భారతికి రాక‌మధ్యాహ్నం 12:00: సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ స్టేడియానికి రాక‌మధ్యాహ్నం 12:00 నుండి 12:30 వరకు: ఫ్రెండ్లీ మ్యాచ్, సన్మానం, సంభాషణమధ్యాహ్నం 2:00: హైదరాబాద్‌కు బయలుదేరడండిసెంబర్ 13, హైద‌రాబాద్‌సాయంత్రం 4: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాక‌, తాజ్ ఫ‌ల‌క‌నుమా ప్యాలెస్‌కు ప‌య‌నం, మెస్సీతో మీట్ అండ్ గ్రీట్‌రాత్రి 7: ఉప్ప‌ల్ స్టేడియానికి రాక‌, అభిమానుల‌కు ప‌ల‌క‌రింపు, ఫ్రెండ్లీ మ్యాచ్, చిన్నారుల‌కు మెస్సీ ఫుట్‌బాల్ చిట్నాలు, స‌న్మానం, రాత్రికి ఫ‌ల‌క‌నుమా ప్యాలెస్‌లో బ‌స‌, మ‌ర్నాడు ఉద‌యం ముంబైకు ప‌య‌నం.చ‌ద‌వండి: ర్యాంప్‌పై మెస్సీ న‌డ‌క‌డిసెంబర్ 14, ముంబైమధ్యాహ్నం 3:30: క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో పాడెల్ కప్‌లో పాల్గొనడంసాయంత్రం 4:00: సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్సాయంత్రం 5:00: వాంఖడే స్టేడియంలో కార్యక్రమం, సెల‌బ్రిటీల‌తో ఛారిటీ ఫ్యాషన్ షోడిసెంబర్ 15, న్యూఢిల్లీప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశంమధ్యాహ్నం 1:30 గంటలకు: అరుణ్ జైట్లీ స్టేడియంలో కార్యక్రమం, మినర్వా అకాడమీ ఆటగాళ్లకు సన్మానం

India vs South Africa 2nd T20I Playing 11 Prediction5
ద‌క్షిణాఫ్రికాతో రెండో టీ20.. శాంస‌న్‌కు మ‌రోసారి నో ఛాన్స్‌!

ముల్లాన్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈమ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ ఆధిక్యాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే క‌ట‌క్‌లో ఆడిన జ‌ట్టునే రెండో టీ20కు కూడా భార‌త్ కొన‌సాగించే అవ‌కాశముంది.స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో ఆడిన జితీశ్ శర్మను వికెట్ కీపర్‌గా కొనసాగించాలని టీమ్ మెనెజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. కటక్ టీ20లో ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన జితీశ్‌.. కేవలం 5 బంతుల్లో పది పరుగులు చేశాడు. అతడిని ఫినిషర్‌గా ఉపయోగించుకోవాలని హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఒకవేళ టాపర్డర్‌లో ఎవరికైనా విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే తప్ప సంజూకు తుది జట్టులో చోటు దక్కడం కష్టం. ఇక తొలి టీ20లో విఫలమైన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌.. ఈ మ్యాచ్‌లో రాణించాల్సిన అవసరముంది. సూర్య గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌-2026కు ముందు అతడి ఫామ్ టీమ్ మెనెజ్‌మెం‍ట్‌ను కలవరపెడుతోంది. కనీసం ఈ సిరీస్‌లో నైనా సూర్య తన రిథమ్‌ను తిరిగి అందుకోవాలని ఆశిస్తున్నారు. ఇక తొలి టీ20లో ఘోర ఓటమి చవిచూసిన పలు మార్పులు చేసే అవకాశముంది.తుది జట్లు(అంచనా)భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, ఎన్రిచ్‌ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, కేశవ్ మహారాజ్/జార్జ్ లిండే, లుథో సిపమ్లా.

Cricket predicts most expensive player of IPL 2026 auction6
ఐపీఎల్ వేలం కౌంట్ డౌన్ షురూ.. అతడికి రూ. 20 కోట్లు పైమాటే!

ఐపీఎల్‌-2026 మినీ వేలానికి సమయం అసన్నమవుతోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది. ఈ వేలం కోసం ఆయా ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలను సిద్దం చేసుకున్నాయి. అయితే ఈసారి వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడు ఎవరు అవుతారనే ఆసక్తి అందరిలో నెల‌కొంది. గ‌త ఏడాది జెడ్డాలో జ‌రిగిన వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు రిషబ్ పంత్‌ను భారీ మొత్తం రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదే ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర‌. అయితే ఈసారి కూడా ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఫ్రాంచైజీల వద్ద మొత్తం పర్స్ విలువ రూ. 230 కోట్లకు పైగా ఉంది.పర్స్ బ్యాలెన్స్ అత్యధికం ఏ జట్టుదంటే?ఐపీఎల్‌-2026 మినీ వేలంలో అత్యధిక పర్స్ వాల్యూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌(64.30 కోట్లు) వద్ద ఉంది. ఆ తర్వాత స్ధానాల్లో చెన్నై సూపర్ కింగ్స్ (43.40 కోట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (25.50 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 22.95 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్ (21.80 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(16.40 కోట్లు), రాజస్థాన్ రాయల్స్(16.05 కోట్లు), గుజరాత్ టైటాన్స్(12.90 కోట్లు), పంజాబ్ కింగ్స్ (11.50 కోట్లు), ముంబై ఇండియన్స్(2.75 కోట్లు) ఉన్నాయి. అత్య‌ధికంగా కేకేఆర్ జ‌ట్టులో అత్య‌ధికంగా 13 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అత్య‌ల్పంగా పంజాబ్ కింగ్స్‌లో నాలుగు స్ధానాల్లో ఖాళీలు ఉన్నాయి.గ్రీన్‌పై కాసుల వ‌ర్షం!ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ కామెరూన్ గ్రీన్‌పై కాసుల వ‌ర్షం కురిసే అవ‌కాశ‌ముంది. గాయం కార‌ణంగా గ‌త సీజ‌న్‌కు దూర‌మ‌య్యాడు. అయితే సాధారణంగా ఆల్-రౌండర్ అయిన గ్రీన్, ఈసారి వేలంలో తన పేరును 'బ్యాటర్ల' విభాగంలో నమోదు చేసుకున్నాడు.దీంతో వేలంలో మొదటి సెట్ల‌లోనే అత‌డు పేరు వ‌స్తుంది. మొద‌టిలో ఫ్రాంచైజీల వ‌ద ప‌ర్స్ మొత్తం ఫుల్‌గా ఉండ‌డంతో అత‌డి కోసం పోటీ ప‌డ‌డం ఖాయం. గ్రీన్‌ను సొంతం చేసుకునేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొనే అవ‌కాశ‌ముంద‌ని ఐపీఎల్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.కేకేఆర్ స‌రైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ లేడు. గ‌త సీజ‌న్ వ‌రకు జ‌ట్టులో ఉన్న ఆండ్రీ ర‌స్సెల్‌ను కేకేఆర్ విడుద‌ల చేసింది. ఆ త‌ర్వాత అత‌డు ఏకంగా ఐపీఎల్‌కే రిటైర్మెంట్ ప్ర‌క‌టించి కేకేఆర్ ప‌వ‌ర్ కోచ్‌గా ఎంపిక‌య్యాడు. ఇప్పుడు అత‌డి స్ధానాన్ని గ్రీన్‌తో భ‌ర్తీ చేయాల‌ని కేకేఆర్ భావిస్తోంది.సీఎస్‌కే కూడా సామ్ కుర్రాన్‌ను రాజ‌స్తాన్‌కు ట్రేడ్ చేయ‌డంతో వారికి కూడా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ అవ‌స‌రం. కాబ‌ట్టి చెన్నై కూడా అత‌డిని ఎలాగైనా సొంతం చేసుకోవాల‌ని వ్యూహాలు ర‌చిస్తోంది. ప్ర‌స్తుత రిపోర్ట్‌లు ప్ర‌కారం.. అత‌డు వేలంలో రూ. 20 కోట్లకు పైగా ధర పలకడం ఖాయంగా కనిపిస్తోంది. గ్రీన్ చివ‌ర‌గా ఐపీఎల్ 2024లో ఆర్సీబీ త‌ర‌పున ఆడాడు. ఆ సీజ‌న్‌లో 255 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీశాడు. ప్ర‌స్తుతం అత‌డు అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు.బిష్ణోయ్ కోసం ఎస్ఆర్‌హెచ్ స్కెచ్‌!కామెరూన్ గ్రీన్‌తో పాటు టీమిండియా స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయ్ కూడా భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయే ఛాన్స్ ఉంది. గ‌త సీజ‌న్ వ‌ర‌కు ల‌క్నోలో భాగంగా ఉన్న బిష్ణోయ్‌ను స‌ద‌రు ఫ్రాంచైజీ వేలంలోకి విడిచిపెట్టింది. దీంతో స్పిన్ బౌల‌ర్ల అవ‌స‌రమున్న ఫ్రాంచైజీల అత‌డి కోసం పోటీ ప‌డ‌నున్నాయి.ముఖ్యంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అత‌డిని కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులో నాణ్య‌మైన స్పిన్న‌ర్ ఒక‌రు లేరు. జీష‌న్ అన్సారీ ఉన్న‌ప్ప‌టికి అత‌డికి అంత‌ర్జాతీయ స్దాయిలో అనుభ‌వం లేదు. కాబ‌ట్టి బిష్ణోయ్‌ను త‌మ జ‌ట్టులోకి తీసుకోవాల‌ని కావ్య మార‌న్ వ్యూహాలు రచిస్తోంది. అదేవిధంగా సీఎస్‌కే కూడా పోటీ ప‌డే అవ‌కాశ‌ముంది. ఎందుకంటే సీఎస్‌కేలో లెగ్ స్పిన్న‌ర్ ఒక్క‌రూ కూడా లేదు. జ‌డేజాను సైతం సీఎస్‌కే వ‌దులుకుంది. మతీషా పతిరానా కోసం కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రయత్నించే ఛాన్స్‌ ఉంది. మహ్మద్‌ షమీ స్దానాన్ని అతడితో భర్తీ చేయాలని ఆరెంజ్‌ ఆర్మీ భావిస్తుందంట.పృథ్వీషాపై సీఎస్‌కే క‌న్ను..ఇక గ‌త సీజ‌న్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన పృథ్వీ షా.. ఈసారి మాత్రం ఫ్రాంచైజీలను ఆకర్షించే అవకాశం ఉంది. పృథ్వీషా ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ముంబై నుంచి మహారాష్ట్రకు మకాంను మార్చిన పృథ్వీ.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నాడు. అతడిని సీఎస్‌కే సొంతం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే అతడితో సీఎస్‌కే యాజమాన్యం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. దూకడైన ఆటకు పృథ్వీ పెట్టింది పేరు.వెంకటేశ్ అయ్యర్‌కు షాక్ తప్పదా?ఇక కేకేఆర్ మాజీ ఆల్‌రౌండ‌ర్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఆట‌గాడు వెంక‌టేశ్ అయ్య‌ర్‌కు మ‌రోసారి షాక్ త‌గిలే అవ‌కాశ‌ముంది. గ‌త సీజ‌న్‌లో అయ్య‌ర్‌ను రూ. 23.75 కోట్ల భారీ ధ‌ర‌కు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ అయ్య‌ర్ త‌న ధ‌ర‌కు త‌గ్గ న్యాయం చేయ‌లేక‌పోయాడు. దీంతో అత‌డిని నైట్‌రైడ‌ర్స్ వేలంలోకి విడిచిపెట్టింది. అయితే అయ్య‌ర్ వేలంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికి భారీ ధ‌ర ద‌క్కే అవ‌కాశం లేదు. ఎందుకంటే అత‌డు ప్ర‌స్తుతం గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాడు. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ప్రభావం వేలంపై ఆడే అవకాశముంది.

Ś Maiden journalist premier league title7
సాక్షి టీమ్‌కు మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు

జర్నలిస్ట్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-2 విజేతగా సాక్షి టీవీ నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో టీవీ-9ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన సాక్షి.. తొలి జేపీఎల్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. తుది పోరులో ప్రత్యర్ధి జట్టు నిర్ధేశించిన 92 పరుగుల లక్ష్యాన్ని సాక్షి ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా ఊదిపడేసింది. ఓపెనర్లు చైతన్య(21), రమేశ్‌(35 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీవీ-9.. 19.4 ఓవర్లలో 91 పరుగులకే కుప్పకూలింది. సాక్షి బౌలర్లలో రమేశ్‌ మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. అతడితో పాటు శ్రీనాథ్‌ రెండు, శ్రీను, అగ్ని ఓ వికెట్‌ సాధించారు.ఈ ఏడాది సీజన్‌ను సాక్షి టీవీ అజేయంగా ముగించింది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ విజయ ఢంకా మోగించింది. ఈ సీజన్‌ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన రమేష్‌ (190 పరుగులు) ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఫైనల్లో ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు కూడా అతడికే లభించింది.సాక్షి టీమ్‌కు మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలుజర్నలిస్ట్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-2 విజేత అయిన సాక్షి టీవీ జట్టు కు శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితెలియజేశారు . క్రీడా స్ఫూర్తితో ఈ లీగ్ లో పాల్గొన్న అన్ని మీడియా సంస్థలను మంత్రి అభినందించారు. నిత్యం వార్తల సేకరణలో ఉంటూ బిజీ షెడ్యూల్ గడిపే జర్నలిస్టు లకు ఇలాంటి క్రీడలు ఉల్లాసాన్నిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో మీడియా మిత్రులకు ఇలాంటి క్రీడలపై ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలియజేశారు.

Harry Brook to receive INR 5.26 crore contract from Sunrisers8
ఐపీఎల్‌లో బ్యాన్‌.. కట్‌ చేస్తే! ఆ ఆటగాడికి కోట్లు కుమ్మరించిన కావ్య మారన్‌

ఇంగ్లండ్ వైట్-బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మార‌న్ భారీ మొత్తాన్ని ఆఫ‌ర్ చేసింది. ఐపీఎల్ బ్యాన్ ఎదుర్కొంటున్న బ్రూక్‌కు సన్‌రైజర్స్ ఎలా ఆఫర్ చేసిందా అని ఆలోచిస్తున్నారా? అయితే పూర్తి కథనం చదవాల్సిందే.ఇంగ్లండ్‌కు చెందిన 'ది హండ్రెడ్' (The Hundred) 2026 సీజన్ కోసం సన్‌రైజర్స్ లీడ్స్ (గతంలో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్) తమ రిటెన్షన్ పక్రియను మొదలు పెట్టింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హ్యారీ బ్రూక్‌ను ఏకంగా 4,70,000 పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 5.62 కోట్లు) వెచ్చించి రిటైన్ చేసుకుంది.పేరు మార్పు..ది హాండ్రెడ్ లీగ్ 2025 సీజన్‌కు ముందు నార్తరన్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీలో 49% వాటాను సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమానులైన సన్ గ్రూప్ కొనుగోలు చేసింది. మిగితా 1 శాతం వాటా యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది.కానీ ఆ తర్వాత కావ్య మారన్ యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తో చర్చలు జరిపి మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేసింది. ఈ క్ర‌మంలో గ‌త నెల‌లో నార్తరన్ సూపర్‌చార్జర్స్ పేరును స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్‌గా మార్చారు. ఇక బ్రూక్ విష‌యానికి వ‌స్తే.. 2021 నుంచి స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ ఫ్రాంచైజీలో ఉన్నాడు. ఆ త‌ర్వాత 2024లో కెప్టెన్‌గా అత‌డు ఎంపిక‌య్యాడు. ఫ్రాంచైజీ త‌ర‌పున లీడింగ్ ర‌న్‌స్కోర‌ర్‌గా బ్రూక్ కొన‌సాగుతున్నాడు. రాబోయో సీజ‌న్‌లో కూడా అత‌డు జ‌ట్టును ముందుండి న‌డిపించ‌నున్నాడు. 'ది హండ్రెడ్' లీగ్‌ 2026 వేలం వ‌చ్చే ఏడాది మార్చిలో జ‌ర‌గ‌నుంది.ఐపీఎల్ నిషేధంహ్యార్ బ్రూక్ ప్ర‌స్తుతం ఐపీఎల్ నిషేధం ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్‌-2025 వేలంలో బ్రూక్‌ను రూ. 6.25 కోట్ల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కొనుగోలు చేసింది. ఆ త‌ర్వాత ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజ‌న్ నుంచి త‌ప్పుకొంటున్న‌ట్లు బ్రూక్ తెలిపాడు.అయితే బీసీసీఐ రూల్ ప్ర‌కారం.. సరైన కారణాలు లేకుండా ఆటగాళ్లు టోర్నమెంట్ నుండి వైదొలిగితే వారిపై నిషేధం ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే బ్రూక్‌పై బీసీసీఐ వేటు వేసింది. హ్యారీ బ్రూక్ 2028 వేలం వరకు ఐపీఎల్‌కు దూరంగా ఉండాల్సిందే.చదవండి: BCCI: శుభ్‌మన్‌ గిల్‌కు మరో బిగ్‌ ప్రమోషన్‌..!

Shubman Gill Likely To Get Big Promotion In New BCCI Contract: Reports9
BCCI: శుభ్‌మన్‌ గిల్‌కు మరో బిగ్‌ ప్రమోషన్‌..!

టీమిండియా వ‌న్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు మ‌రో బిగ్ ప్ర‌మోష‌న్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ద‌మైంది. 2025/26 సీజన్‌కు సంబంధించిన‌ కొత్త సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితాలో గిల్‌‘ఏ ప్లస్‌’ కేటగిరీకి ప‌దోన్నతి పొందే అవకాశం ఉంది.డిసెంబర్ 22న జరగనున్న బీసీసీఐ 31వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ఆటగాళ్ల కాంట్రాక్టులపై నిర్ణయం తీసుకోనున్నారు. అనంత‌రం గిల్ ప్ర‌మోష‌న్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే ఛాన్స్ ఉంది. గిల్ ప్ర‌స్తుతం గ్రేడ్‌-ఎలో ఉన్నాడు. అందుకు గాను ప్ర‌తీ ఏటా రూ. 5 కోట్ల‌ను జీతంగా అందుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ‘ఏ ప్లస్‌’ కేటగిరీలో గిల్‌కు చోటు ద‌క్కితే ప్ర‌తీ ఏటా ఇక‌పై రూ.7 కోట్లు వార్షిక వేత‌నం తీసుకోనున్నాడు. ప్రస్తుతం గ్రేడ్ A+ కేటగిరీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ,రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. అయితే రో-కో ద్వయం కేవలం ఒక్క ఫార్మాట్‌లో ఆడుతుండడంతో వారిని గ్రేడ్‌-ఎకు డిమోట్ చేసే అవకాశముంది.శుభ్‌మన్ గిల్ రైజ్‌శుభ్‌మన్ గిల్‌.. అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ ఏడాది జూన్‌లో రోహిత్ శర్మ నుంచి టెస్టు జట్టు పగ్గాలను చేపట్టిన గిల్‌.. ఇంగ్లండ్ గడ్డపై అదరహో అనిపించాడు. అతడి నాయకత్వంలోని భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసింది.ఆ తర్వాత అక్టోబర్‌లో వన్డే కెప్టెన్‌గా కూడా గిల్ బాధ్యతలు చేపట్టాడు. అంతేకాకుండా టీ20ల్లో భారత వైస్ కెప్టెన్‌గా గిల్ ఉన్నాడు. 2026 టీ20 ప్రపంచ కప్ తర్వాత గిల్‌ను టీమిండియాకు ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా బీసీసీఐ నియమించనున్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2026 SRH Plans: కావ్య మార‌న్ మాస్ట‌ర్ ప్లాన్..! యార్కర్ల కింగ్‌పై కన్ను?

Haider Ali suspension lifted, PCB issues NOC to play in the BPL10
పీసీబీ సంచలన నిర్ణయం.. స్టార్‌ క్రికెటర్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

అత్యాచార ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన పాకిస్తాన్‌ బ్యాటర్‌ హైదర్‌ అలీపై విధించిన నిషేధాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఎత్తేసింది. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌)లో ఆడేందుకు అతడికి నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ (ఎన్‌ఓసీ) ఇచ్చింది. హైదర్‌ అలీతో పాటు మొత్తం 9 మంది ఆటగాళ్లకు పీసీబీ బుధవారం ఎన్‌ఓసీలు ఇచ్చింది. పాకిస్తాన్‌ జాతీయ జట్టు తరఫున 35 టి20లు, మూడు వన్డేలు ఆడిన హైదర్‌ అలీ... పాకిస్తాన్‌ షాహీన్స్‌ జట్టు తరఫున ఇంగ్లండ్‌లో పర్యటించిన సమయంలో... ఇంగ్లండ్‌లో పుట్టిన పాకిస్తానీ మహిళ అతడిపై అత్యాచార ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాంచెస్టర్‌ పోలీసులు సరైన ఆధారాలు లేని కారణంగా సెప్టెంబర్‌ 25న ఈ కేసును మూసివేశారు. దీంతో అతడిపై మోపిన ఆరోపణలు అబద్ధం అని తేలిపోయింది. ఈ నేపథ్యంలో హైదర్‌ అలీ బీపీఎల్‌లో ఆడేందుకు అనుమతివ్వాలని పీసీబీని కోరగా... అందుకు బోర్డు అంగీకారం తెలిపింది. హైదర్‌ అలీతో పాటు మొహమ్మద్‌ నవాజ్, అబ్రార్‌ అహ్మద్, సాహబ్‌జాదా ఫర్హాన్, ఫహీమ్‌ అష్రఫ్, హుసేన్‌ తలత్, ఖ్వాజా నఫా, ఎహెసానుల్లాకు పీసీబీ నిరభ్యంతర పత్రాలు ఇచ్చింది. ఇక సీనియర్‌ ప్లేయర్‌ ఉమ్రాన్‌ అక్మల్‌ అభ్యర్థనను మాత్రం బోర్డు తిరస్కరించింది.చదవండి: IPL 2026 SRH Plans: కావ్య మార‌న్ మాస్ట‌ర్ ప్లాన్..! యార్కర్ల కింగ్‌పై కన్ను?

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement