ప్రధాన వార్తలు
ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా లక్ష్య ఛేదనకు దిగింది. అయితే, ప్రొటిస్ జట్టు విధించిన 124 పరుగుల టార్గెట్ను పూర్తి చేసే క్రమంలో ఆదిలోనే భారత్కు షాకులు తగిలాయి.ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించగా.. కేఎల్ రాహుల్ (KL Rahul) ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్లోనే జైసూను అవుట్ చేసిన ప్రొటిస్ పేసర్ మార్కో యాన్సెన్.. మూడో ఓవర్ ఆరంభంలోనే రాహుల్ను కూడా వెనక్కి పంపి టీమిండియాకు షాకిచ్చాడు.ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar), నాలుగో స్థానంలో వచ్చిన ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. ఆచితూచి, ఓపికగా ఆడుతూ విజయానికి పునాది వేసే పనిలో ఉన్నారు. ఆచితూచి ఆడకపోతే..ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 10 ఓవర్లు ముగిసే సరికి వాషీ 27 బంతుల్లో 12, జురెల్ 23 బంతుల్లో 13 పరుగులతో ఉన్నారు. ఫలితంగా విజయానికి టీమిండియా కేవలం 98 పరుగుల దూరంలో నిలిచింది.అయితే, శుక్రవారం నాటి తొలి రోజు ఆట నుంచే ఈడెన్ గార్డెన్స్ పిచ్ భిన్నంగా ఉంది. మొదటి రోజు పేసర్లు విజృంభించగా.. రెండో రోజు స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. తాజాగా ఆదివారం నాటి మూడో ఆటలో మరోసారి పేసర్లు ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లక్ష్యం చిన్నదిగా కనిపిస్తున్నా.. వికెట్ స్వభావం దృష్ట్యా టీమిండియా ఆచితూచి ఆడకపోతే భారీ మూల్యం చెల్లించకతప్పదు.మరి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఇప్పటి వరకు టెస్టుల్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?భారత్ వర్సెస్ సౌతాఫ్రికా- 2004లో టీమిండియా 117 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఇంగ్లండ్- 1993లో టీమిండియా 79 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఇంగ్లండ్- 2012లో ఇంగ్లండ్ 41 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- 1969లో ఆస్ట్రేలియా 39 పరుగుల లక్ష్య ఛేదనభారత్ వర్సెస్ ఇంగ్లండ్- 1977లో ఇంగ్లండ్ 16 పరుగుల లక్ష్య ఛేదన.చదవండి: సన్రైజర్స్ వ్యూహం.. వాళ్లంతా జట్టుతోనే.. పర్సులో ఇంకెంత?
ఆదిలోనే భారీ షాకులు.. టీమిండియా చెత్త రికార్డు
సౌతాఫ్రికాతో తొలి టెస్టు లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే భారీ షాకులు తలిగాయి. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ (KL Rahul)ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.టార్గెట్ 124ఇందులో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో శుక్రవారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు (IND vs SA 1st Test) మొదలైంది. తొలిరోజు పేసర్లు సత్తా చాటగా.. సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 189 పరుగులకు ఆలౌట్ అయి.. ముప్పై పరుగుల ఆధిక్యం సంపాదించింది.అనంతరం ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా.. 93/7 ఓవర్నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన సౌతాఫ్రికాను.. 153 పరుగులకు టీమిండియా ఆలౌట్ చేసింది. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా.. భారత జట్టు లక్ష్యం 124 పరుగులుగా మారింది. దీంతో టార్గెట్ చిన్నదే కదా అని సంబరపడిన అభిమానులకు సఫారీ పేసర్ మార్కో యాన్సెన్ ఆదిలోనే షాకులు ఇచ్చారు.చెలరేగిన సఫారీ పేసర్మొత్తంగా నాలుగు బంతులు ఎదుర్కొన్న జైస్వాల్.. మార్కో యాన్సెన్ బౌలింగ్లో కైలీ వెరెన్నెకు క్యాచ్ ఇచ్చి.. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో 39 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచిన కేఎల్ రాహుల్.. ఈసారి ఆరు బంతులు ఎదుర్కొని యాన్సెన్ బౌలింగ్లో వెరెన్నెకు క్యాచ్ ఇవ్వడంతో నిష్క్రమించాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి రాహుల్ అవుటయ్యాడు.తొలి ఓవర్లో జైసూను.. మూడో ఓవర్ తొలి బంతికి రాహుల్ను వెనక్కి పంపి యాన్సెన్ టీమిండియాను దెబ్బకొట్టాడు. దీంతో కేవలం ఒకే ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. అయితే, వన్డౌన్లో వాషింగ్టన్ సుందర్ రాగా.. నాలుగో స్థానంలో మరో ప్రయోగానికి టీమిండియా తెరలేపింది. జురెల్ ముందుగానేకెప్టెన్ గిల్ గాయం కారణంగా దూరం కాగా.. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ను టాప్కి ప్రమోట్ చేసింది. నిజానికి ఐదో నంబర్ బ్యాటర్ పంత్ బ్యాటింగ్కు వస్తాడనుకుంటే అనూహ్యంగా జురెల్ ముందుగా వచ్చాడు.ఇక భోజన విరామ సమయానికి ఏడు ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి పది పరుగులే చేసింది. వాషీ 20 బంతుల్లో 5, జురెల్ 12 బంతుల్లో 4 పరుగులతో క్రీజులో నిలిచారు.టీమిండియా చెత్త రికార్డుజైసూ, రాహుల్ పూర్తిగా విఫలం కావడంతో సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియా చెత్త రికార్డును మూటగట్టుకుంది. నాలుగోసారి అత్యల్ప స్కోరుకే రెండు వికెట్లు కోల్పోయింది.సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియా ఓపెనర్లు సంయుక్తంగా సాధించిన అత్యల్ప స్కోర్లు👉1964లో ఆస్ట్రేలియాతో చెన్నై మ్యాచ్లో- 0 (ఎంఎల్ జైసింహ 0, ఇంద్రజిత్సిన్హ్జీ 0)👉1999లో న్యూజిలాండ్తో మొహాలీ మ్యాచ్లో- 0 (దేవాంగ్ గాంధీ 0, సదగోపన్ రమేశ్ 0)👉2010లో న్యూజిలాండ్తో అహ్మదాబాద్ మ్యాచ్లో- 1 (గంభీర్ 0, సెహ్వాగ్ 1)👉2025లో సౌతాఫ్రికాతో కోల్కతాలో మ్యాచ్లో- 1 (జైస్వాల్0, కేఎల్ రాహుల్ 1).చదవండి: ఐసీయూలో శుబ్మన్ గిల్
సౌతాఫ్రికా ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
టీమిండియాతో తొలి టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) అర్ధ శతకంతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్లో పూర్తిగా విఫలమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం నిలకడగా ఆడుతూ యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో తన 26వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA 1st Test) మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ మొదలైంది. కోల్కతాలో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఐదు వికెట్లతో రాణించి.. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు.31, 39.. తొలి ఇన్నింగ్స్లో టాప్ స్కోర్లు ఇవేఇక తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 31 పరుగులతో సఫారీ టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. బవుమా పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి బవుమా పెవిలియన్ చేరాడు.అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 39 పరుగులతో టీమిండియా టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్లు నష్టపోయి 93 పరుగులే చేసింది. కెప్టెన్ బవుమా 29, కార్బిన్ బాష్ ఒక పరుగులో క్రీజులో నిలిచారు.జోడీని విడదీసిన బుమ్రాఈ క్రమంలో 93/7 ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన సౌతాఫ్రికా కాసేపటికే ఎనిమిదో వికెట్ కోల్పోయింది. బవుమాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసిన టెయిలెండర్ బాష్ను బుమ్రా అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. బవుమా- బాష్ (25) జోడీని విడదీసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన సిరాజ్అయితే, బవుమా మాత్రం జిడ్డు బ్యాటింగ్తో క్రీజులో పాతుకుపోయాడు. బుమ్రా బౌలింగ్లో ఫోర్ బాది.. 122 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ప్రొటిస్ ఇన్నింగ్స్ 54వ ఓవర్ మూడో బంతికి సిరాజ్ సైమన్ హార్మర్ (20 బంతుల్లో 7)ను బౌల్డ్ చేయడంతో సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సఫారీ జట్టు ఆలౌట్అదే ఓవర్లో ఆఖరి బంతికి సిరాజ్ మియా కేశవ్ మహరాజ్ (0)ను పదో వికెట్గా వెనక్కి పంపడంతో సఫారీ జట్టు ఆలౌట్ అయింది. మొత్తంగా 54 ఓవర్ల ఆటలో 153 పరుగులు చేసింది. ఈ క్రమంలో 123 పరుగుల ఆధిక్యం సంపాదించిన సౌతాఫ్రికా.. టీమిండియాకు 124 పరుగుల లక్ష్యాన్ని విధించింది. కాగా తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కిన విషయం తెలిసిందే. దీంతో టార్గెట్ 124 (153-30=123) పరుగులుగా మారింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. మూడోరోజు బుమ్రా ఒక వికెట్ పడగొట్టగా.. సిరాజ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించిన జడ్డూ
IPL 2026: వేలానికి సిద్ధం.. ఎవరి పర్సులో ఎంత?.. ఎన్ని ఖాళీలు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2026 వేలానికి ఫ్రాంఛైజీలు సిద్ధమయ్యాయి. తమకు కావాల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న యాజమాన్యాలు.. భారం అనుకున్న ప్లేయర్లను వదిలించుకున్నాయి. ఇందులో ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ వెంకటేశ్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు) వదిలేయడం హైలైట్గా నిలిచింది.వేలంలోకి వదిలేశాయిమరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)ని రూ. 10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్కు ట్రేడ్ చేసింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ రూ. 13 కోట్ల ఆటగాడు శ్రీలంక పేసర్ మతీశ పతిరణను జట్టు నుంచి రిలీజ్ చేయగా.. లక్నో సూపర్ జెయింట్స్ భారత స్పిన్నర్ రవి బిష్ణోయి (రూ. 11 కోట్లు)ని వేలంలోకి వదిలింది.ఇక తాజా సీజన్లో చెత్త ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell- రూ. 4.2 కోట్లు)ను పంజాబ్ కింగ్స్ వదలించుకుంది. కాగా నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంఛైజీ పర్సు వాల్యూ రూ. 110 కోట్లు. మరి తాజాగా అట్టిపెట్టుకున్న, వదిలేసిన ఆటగాళ్ల జాబితా విడుదల చేసిన తర్వాత ఏ జట్టు పర్సులో ఎంత ఉంది? ఆయా జట్లలో ఉన్న ఖాళీలు ఎన్ని? తదితర వివరాలు చూద్దాం.పది ఫ్రాంఛైజీల పర్సులో వేలం కోసం అందుబాటులో ఉన్న డబ్బు💰గుజరాత్ టైటాన్స్- రూ. 12.9 కోట్లు💰సన్రైజర్స్ హైదరాబాద్- రూ. 25.5 కోట్లు💰లక్నో సూపర్ జెయింట్స్- రూ. 22.95 కోట్లు💰పంజాబ్ కింగ్స్- రూ. 22.95 కోట్లు💰రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- రూ. 16.4 కోట్లు💰ఢిల్లీ క్యాపిటల్స్- రూ. 21.8 కోట్లు💰ముంబై ఇండియన్స్- రూ. 2.75 కోట్లు💰కోల్కతా నైట్ రైడర్స్- రూ. 64.3 కోట్లు💰రాజస్తాన్ రాయల్స్- రూ. 16.05 కోట్లు💰చెన్నై సూపర్ కింగ్స్- రూ. 43.4 కోట్లు👉కాగా వెంకటేశ్ అయ్యర్తో పాటు రూ. 12 కోట్ల విలువైన వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ను వదులుకోవడంతో కోల్కతా ఖాతాలో అన్ని ఫ్రాంఛైజీల కంటే ఎక్కువ సొమ్ము ఉంది.ఏ జట్టులో ఎన్ని ఖాళీలు?🏏గుజరాత్ టైటాన్స్- 5 (✈️నలుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏సన్రైజర్స్ హైదరాబాద్- 10 (✈️ఇద్దరు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏లక్నో సూపర్ జెయింట్స్- 6 (✈️నలుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏పంజాబ్ కింగ్స్- 4 (✈️ఇద్దరు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - 8 (✈️ఇద్దరు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏ఢిల్లీ క్యాపిటల్స్- 8 (✈️ఐదుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏ముంబై ఇండియన్స్- 5 (✈️ఒక విదేశీ ప్లేయర్కు చోటు)🏏కోల్కతా నైట్ రైడర్స్- 13 (✈️ఆరుగురు విదేశీ ప్లేయర్లకు చోటు)🏏రాజస్తాన్ రాయల్స్- 9 (✈️ఒక విదేశీ ప్లేయర్కు చోటు)🏏చెన్నై సూపర్ కింగ్స్- 9 (✈️నలుగురు విదేశీ ప్లేయర్లకు చోటు). చదవండి: IPL 2026: పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరేIPL 2026: రిటెన్షన్ జాబితా విడుదల చేసిన ఫ్రాంఛైజీలు
ఐసీయూలో శుబ్మన్ గిల్!.. టీమిండియాకు ఊహించని షాక్!
టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) గాయం తీవ్రతరమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు తొలి టెస్టులో మిగిలిన ఆటకు.. రెండో టెస్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.బిజీబిజీకాగా టెస్టు, వన్డే సారథి గిల్ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. ఆసియా టీ20 కప్ టోర్నీ ముగిసిన వెంటనే.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ (IND vs SA)లో భారత జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.కోల్కతాలో సఫారీ జట్టుతో శుక్రవారం మొదలైన టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా పటిష్టస్థితిలో నిలిచింది. అయితే, శనివారం నాటి ఆట సందర్భంగా కెప్టెన్ గిల్ మెడకు గాయమైంది. నాలుగో నంబర్ బ్యాటర్గా క్రీజులోకి వచ్చిన గిల్ మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ బాది రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.నొప్పి ఎక్కువగా ఉండటంతోప్రొటిస్ స్పిన్నర్ సైమన్ హార్మర్ బౌలింగ్లో స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన గిల్కు మెడపట్టేసింది. వెంటనే ఫిజియో వచ్చి గిల్ను పరిశీలించాడు. నొప్పి ఎక్కువగా ఉండటంతో గిల్ను డ్రెసింగ్రూమ్కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత గాయం తీవ్రత దృష్ట్యా అతడిని కోల్కతాలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.ఐసీయూలో చికిత్సఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. గిల్ ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నట్లు తెలిపాయి. అయితే, ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ముందుజాగ్రత్త చర్యగానే వైద్యుల సమక్షంలో ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నట్లు వెల్లడించాయి.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానేగిల్ కోసం ప్రత్యేకంగా డాక్టర్స్ ప్యానెల్ ఏర్పాటైందని.. క్రిటికల్ కేర్ స్పెషలిస్టు, న్యూరోసర్జన్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అతడిని పరిశీలిస్తున్నారని తెలిపాయి. ప్రస్తుతం గిల్ వుడ్లాండ్స్ ఆస్పత్రిలో ఉన్నాడని.. పెద్దగా సమస్య లేకపోయినా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ మేరకు కేర్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ఏదేమైనా వైద్య పరీక్షలు పూర్తైన తర్వాతే అతడు మళ్లీ మైదానంలో దిగుతాడా? లేదా? అన్నది తేలుతుందని తెలిపాయి.కాగా తొలి ఇన్నింగ్స్లో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన గిల్.. ఆ తర్వాత కూడా మళ్లీ బ్యాటింగ్కు రాలేదు. దీంతో అతడిని రిటైర్డ్ అవుట్గా ప్రకటించారు. ఈ మ్యాచ్లో భారత్ 189 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకు ముందు సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. ఇక రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో కేవలం 93 పరుగులు చేసి ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.బీసీసీఐ అప్డేట్గిల్ తొలి టెస్టుకు దూరమయ్యాడని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికి త్స పొందుతున్నాడని తెలిపింది. వైద్యులు నిరంతరం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది.చదవండి: IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే
IPL 2026: జడేజా జెర్సీ మారింది
ముంబై: ఐపీఎల్ ‘ఫైవ్ స్టార్’ చాంపియన్లలో ఒకటైన చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) పెనుమార్పే చేసింది. గత రెండు సీజన్లుగా చెత్త ప్రదర్శనతో చతికిలబడిన ఈ జట్టు వచ్చే సీజన్కు ముందు పతాక శీర్షికలకెక్కే నిర్ణయం తీసుకుంది. అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను అనూహ్యంగా బదిలీ చేసేసింది. సీఎస్కే దిగ్గజ కెప్టెన్ ధోని స్వయంగా ‘సర్ రవీంద్ర జడేజా’ అంటూ నెత్తిన పెట్టుకున్న సహచరుణ్ని... టాపార్డర్ డాషింగ్ బ్యాటర్ సంజూ సామ్సన్ కోసం రాజస్తాన్ రాయల్స్కు ట్రేడ్ ట్రాన్స్ఫర్ చేసింది. రాయల్స్ జడేజాను తీసుకోగా, సామ్సన్ చెన్నై చెంత చేరాడు. మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) తమ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ను విడుదల చేసింది. రెండుసార్లు రిటెయిన్ చేసుకున్న ఫ్రాంచైజీ ఎట్టకేలకు కరీబియన్ ఆల్రౌండర్తో 11 ఏళ్ల బంధాన్ని తెంచుకుంది. రూ.23.75 కోట్లు వేలంలో పాడి మరీ కొనుక్కొన్న వెంకటేశ్ అయ్యర్ను వెంటనే ఒక సీజన్కే సాగనంపింది. సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) వెటరన్ సీమర్ మొహహ్మద్ షమీని లక్నో సూపర్ జెయంట్స్ ట్రేడ్లో తీసుకుంది. మొత్తం పది ఫ్రాంచైజీల్లో అత్యధిక పర్స్ మొత్తం కోల్కతా వద్దే ఉంది. కేకేఆర్ పర్స్లో రూ. 64.30 కోట్లుండగా, 6 విదేశీ ఆటగాళ్లు సహా 13 మందిని వేలంలో కొనాలి. అత్యల్ప పర్స్ ముంబై జట్టులో ఉంది. ముంబై ఇండియన్స్ వద్ద కనీసం మూడు కోట్లయినా లేవు. చేతిలో ఉన్న రూ.2.75 కోట్లతో ఒక విదేశీ ప్లేయర్ సహా ఐదు మందిని కొనుగోలు చేయాలి. చెప్పుకోదగ్గ మార్పులు చెన్నై ఒక్క జడేజాతో సరిపెట్టలేదు. విదేశీ స్టార్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, స్యామ్ కరన్లాంటి హిట్టర్లతో పాటు ‘యార్కర్ స్పెషలిస్ట్’ పతిరణను వదులుకుంది. కేకేఆర్ రసెల్, అయ్యర్, డికాక్, మొయిన్ అలీలాంటి బ్యాటర్లతో పాటు సఫారీ పేసర్ నోర్జేని సాగనంపింది. పంజాబ్ కింగ్స్ మేటి విదేశీ హిట్టర్లను విడుదల చేసింది. మ్యాక్స్వెల్, ఇన్గ్లిస్లను వదిలేసుకుంది. తొలి సీజన్ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ తమ తురుపుముక్క, నాలుగు సీజన్లు జట్టును నడిపించిన సంజూ సామ్సన్నే కాదు హసరంగ, తీక్షణ, నితీశ్ రాణాలను వద్దనుకుంది. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను వేలంలో ఏ జట్టు కన్నెత్తి చూడకపోయినా ప్రాథమిక ధరకే కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ ఈసారి అర్జున్ను లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడింగ్లో కొనేందుకు సమ్మతించింది.పాత గూటికి... సీఎస్కేతో జడేజా బంధం సుదీర్ఘమైందే కానీ... మొదలైంది మాత్రం రాజస్తాన్ రాయల్స్తోనే! లీగ్ మొదలైన ఏడాదే (2008) తొలి చాంపియన్గా నిలిచిన రాయల్స్ జట్టు సభ్యుడు జడేజా ఆ మరుసటి ఏడాది కూడా రాజస్తాన్తోనే ఉన్నాడు. కానీ కాంట్రాక్టు ఒప్పందం ఉల్లంఘన కారణంతో 2010లో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతనిపై ఏడాది నిషేధం విధించింది. 2011లో కొత్తగా వచ్చిన ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్ కేరళ (ఇప్పుడు లేదు)కు ఆడాడు. 2012 నుంచి ఈ సీజన్ వరకు మధ్యలో రెండేళ్లు (2016, 2017లో సీఎస్కేపై నిషేధం కారణంగా గుజరాత్ లయన్స్) తప్ప సూపర్కింగ్స్లో విజయవంతమైన ఆల్రౌండర్గా ఉన్నాడు.ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాచెన్నై: రవీంద్ర జడేజా, ఆండ్రీ సిద్ధార్్థ, దీపక్ హుడా, కాన్వే, రచిన్ రవీంద్ర, పతిరణ, స్యామ్ కరన్, కమలేశ్ నాగర్కోటి, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, వంశ్ బేడీ, విజయ్ శంకర్. ఢిల్లీ: డొనోవాన్ ఫెరీరా, దర్శన్, డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్, మన్వంత్, మోహిత్ శర్మ, సిద్దీఖుల్లా. గుజరాత్: రూథర్ఫర్డ్, షనక, కొయెట్జీ, కరీమ్, కుల్వంత్, మహిపాల్ లామ్రోర్. కోల్కతా: రసెల్, వెంకటేశ్ అయ్యర్, నోర్జే, చేతన్ సకారియా, సిసోడియా, మొయిన్ అలీ, డికాక్, గుర్బాజ్, జాన్సన్. లక్నో: శార్దుల్ ఠాకూర్, డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్, ఆకాశ్దీప్, షామర్ జోసెఫ్, ఆర్యన్, యువరాజ్, రాజ్యవర్ధన్. ముంబై: అర్జున్ టెండూల్కర్, జాకబ్స్, కరణ్ శర్మ, లిజాద్, ముజీబుర్ రహ్మాన్, టోప్లీ, శ్రీజిత్, సత్యనారాయణ రాజు, విఘ్నేశ్. పంజాబ్: మ్యాక్స్వెల్, ఇన్గ్లిస్, ఆరోన్, జేమీసన్, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దూబే. రాజస్తాన్: సామ్సన్, నితీశ్ రాణా, ఆకాశ్, అశోక్, ఫజల్హక్, కార్తీకేయ, కునాల్ రాథోడ్, తీక్షణ, హసరంగ. బెంగళూరు: లివింగ్స్టోన్, ఇన్గిడి, మయాంక్ అగర్వాల్, మనోజ్, స్వస్తిక్ చికారా, మోహిత్ రాఠి. హైదరాబాద్: షమీ, అథర్వ, సచిన్ బేబీ, అభినవ్ మనోహర్, ముల్డర్, ఆడమ్ జంపా, సిమర్జీత్, రాహుల్ చహర్.
క్రొయేషియా ఏడోసారి...
రిజెకా: పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ ఆరో విజయం సాధించిన క్రొయేషియా జట్టు... వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్కు అర్హత పొందింది. యూరోపియన్ క్వాలిఫయింగ్లో భాగంగా గ్రూప్ ‘ఎల్’లో ఫారో ఐలాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో క్రొయేషియా 3–1 గోల్స్ తేడాతో గెలిచింది. క్రొయేషియా తరఫున గ్వార్డియోల్ (23వ నిమిషంలో), మూసా (57వ నిమిషంలో), వ్లాసిక్ (70వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... ఫారో ఐలాండ్స్ జట్టుకు టూరి (16వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఐదు జట్లన్న గ్రూప్ ‘ఎల్’లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న క్రొయేషియా ఆరు విజయాలు నమోదు చేసి, ఒక మ్యాచ్ను ‘డ్రా’గా ముగించింది. 19 పాయింట్లతో గ్రూప్ విజేతగా అవతరించింది. 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న చెక్ రిపబ్లిక్ జట్టు ప్లే ఆఫ్ మ్యాచ్కు అర్హత సాధించింది. 1998లో తొలిసారి ప్రపంచకప్ టోషిర్నీలో ఆడిన క్రొయేషియా మూడో స్థానం సాధించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2002, 2006 ప్రపంచకప్లలో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. 2010 ప్రపంచకప్ టోషిర్నీకి అర్హత పొందడంలో విఫలమైన క్రొయేషియా 2014లో గ్రూప్ దశలో ని్రష్కమించింది. 2018 ప్రపంచకప్లో తొలిసారి ఫైనల్ చేరి రన్నరప్గా నిలిచిన క్రొయేషియా, 2022 ప్రపంచకప్లో మూడో స్థానాన్ని సంపాదించింది. ఇప్పటికి 30 జట్లు... అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు ఉమ్మడిగా నిర్వహించే 2026 ప్రపంచకప్ టోర్నీలో తొలిసారి 48 దేశాలు పోటీపడతాయి. ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, మెక్సికో, కెనడా జట్లు క్వాలిఫయింగ్ మ్యాచ్లు ఆడకుండానే నేరుగా అర్హత పొందాయి. ఇప్పటి వరకు మొత్తం 30 జట్లు ప్రపంచకప్ టోర్నీ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. ఆఫ్రికా నుంచి అల్జీరియా, కెపె వెర్డె, ఈజిప్్ట, ఘనా, ఐవరీ కోస్ట్, మొరాకో సెనెగల్, దక్షిణాఫ్రికా, ట్యూనిషియా... ఆసియా నుంచి ఆ్రస్టేలియా, ఇరాన్, జపాన్, జోర్డాన్, ఖతర్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్తాన్... యూరోప్ నుంచి ఇంగ్లండ్, ఫ్రాన్స్, క్రొయేషియా... ఓసియానియా నుంచి న్యూజిలాండ్... దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, పరాగ్వే, ఉరుగ్వే దేశాలు అర్హత సాధించాయి.
శుభం కార్డు నేడే?
ఔరా... క్రికెట్! ఇదేం వికెట్! బ్యాటింగ్ ఫ్రెండ్లీ క్రికెట్లో గేమ్ ఛేంజర్లంతా బ్యాటర్లే! మెరుపులైనా, సునామీలైనా బ్యాట్లతోనే చూశాం. కానీ ఈడెన్ గార్డెన్స్ టెస్టు చూస్తే మాత్రం ‘ఇది గతం... బౌలర్లు ఘనం’ అనక తప్పదు! ఎందుకంటే బౌలింగ్ జోరు ఒక సెషన్కే సరిపెట్టుకోలేదు... ఓ రోజుకే పరిమితం కాలేదు. వరుసగా ఆరు సెషన్లు బ్యాట్లు డీలా... బ్యాటర్లు విలవిలలాడేలా బౌలర్లు భళా అనిపించారు. సంప్రదాయ క్రికెట్కే కొత్త ఉత్తేజాన్నిచ్చేలా... మూడు రోజుల్లోనే ఫలితం వచ్చేలా ఇరు జట్ల బౌలర్లు గ్రే‘టెస్టు’ క్రికెట్ ఆడుతున్నారు. కోల్కతా: మార్క్రమ్ 31... కేఎల్ రాహుల్ 39... తొలి రెండు రోజుల్లో దక్షిణాఫ్రికా, భారత్ ఓపెనర్లు చేసిన పరుగులివి! రెండు జట్ల ఇన్నింగ్స్ల్లో టాప్ స్కోర్లు కూడా ఇవే! టెస్టులో రెండు సెషన్లు ఆడితే సెంచరీ... రెండో రోజు నిలబడితే డబుల్ సెంచరీ, ఆ రోజంతా అజేయంగా నిలిస్తే ట్రిపుల్ సెంచరీ... జెంటిల్మెన్ క్రికెట్లో సర్వసాధారణమిది. కానీ రెండు రోజుల్లో మూడో ఇన్నింగ్స్ (ఒక జట్టు రెండో ఇన్నింగ్స్)లైనా కూడా ఫిఫ్టీ కాదు కదా కనీసం 40 పరుగులైనా చేయకపోతే అది ముమ్మాటికీ బౌలింగ్ సత్తానే కాక మరేమిటి! ధనాధన్ షో చూసిన వారికి ఫటాఫట్ వికెట్లు, ఆలౌట్ మీద ఆలౌట్లు కనబడుతున్నాయి. ఎంత పటిష్ట బ్యాటింగ్ లైనప్లతో దిగినా... స్పిన్ బౌలింగ్–బ్యాటింగ్ ఆల్రౌండర్లను మోహరించినా... బంతి శాసిస్తోంది ఈ టెస్టుని! క్రీజులోని బ్యాటర్లకు ప్రతీ బంతికి పెడుతోంది అగ్నిపరీక్షని! రెండో సెషన్లోనే భారత్ కూలింది! భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఈడెన్గార్డెన్స్లో మొదలైన మొదటి టెస్టులో బంతి సవాల్ విసురుతోంది. ఓవర్నైట్ స్కోరు 37/1తో శనివారం రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండో సెషన్ అయినా పూర్తిగా ఆడలేక 62.2 ఓవర్లలోనే తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులకే కుప్పకూలింది. దీంతో మొదటి రోజే టెస్టుపై పట్టుబిగించిందనుకున్న ఆతిథ్య జట్టుకు... పట్టుబిగించింది మన జట్టు కాదు... బౌలర్లు అన్న విషయం రెండో రోజు రెండో సెషన్లోనే అర్థమైంది. రాహుల్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్) ఈ ఓవర్నైట్ బ్యాటింగ్ జోడీ చేసిన 57 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యమే అతి పెద్ద పార్ట్నర్షిప్! రిషభ్ పంత్ (27; 2 ఫోర్లు, 2 సిక్స్లు), జడేజా (27; 3 ఫోర్లు)లు రెండు పదుల స్కోర్లు దాటారు. ఇక పర్యాటక బౌలర్లలో హార్మర్ 4, యాన్సెన్ 3 వికెట్లు తీశారు. జడేజా ఉచ్చులో పడి... భారత్కు తొలి ఇన్నింగ్స్లో 30 పరుగుల ఆధిక్యం లభించగా... రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా మెడకు జడేజా స్పిన్ ఉచ్చు బిగించాడు. తొలిరోజు బుమ్రా, సిరాజ్ల పేస్ అదిరిపోవడంతో వెనుకబడిన జడేజా... స్పిన్, తన విశేషానుభవాన్ని వినియోగించి సఫారీ బ్యాటర్లను క్రీజులో నిలువనీయలేదు. దీంతో ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 93/7 స్కోరు చేసిన దక్షిణాఫ్రికా ఆలౌటయ్యేందుకు సిద్ధమైపోయింది. కెప్టెన్ బవుమా (29 బ్యాటింగ్, 3 ఫోర్లు) తప్ప ఇంకెవరూ 20 పరుగులైనా చేయలేకపోయారు. కెపె్టన్తో పాటు బాష్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జడేజా 4 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్కు 2, అక్షర్కు ఒక వికెట్ దక్కాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది.92 టెస్టుల్లో రిషభ్ పంత్ కొట్టిన సిక్స్లు. ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన భారతీయ బ్యాటర్గా రిషభ్ పంత్ గుర్తింపు పొందాడు. 91 సిక్స్లతో వీరేంద్ర సెహ్వాగ్ (103 టెస్టుల్లో) పేరిట ఉన్న రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. పంత్ 48 టెస్టుల్లోనే సెహ్వాగ్ను దాటేశాడు.2 తొలి ఇన్నింగ్స్లో 27 పరుగులు చేసిన క్రమంలో రవీంద్ర జడేజా టెస్టుల్లో 4000 పరుగుల మైలురాయిని దాటాడు. తద్వారా కపిల్ దేవ్ తర్వాత టెస్టుల్లో 4000 పరుగులు చేయడంతోపాటు 300 వికెట్లు పడగొట్టిన రెండో భారతీయ క్రికెటర్గా, ఓవరాల్గా నాలుగో క్రికెటర్గా జడేజా గుర్తింపు పొందాడు.స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 159; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) యాన్సెన్ 12; రాహుల్ (సి) మార్క్రమ్ (బి) కేశవ్ 39; సుందర్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 29; గిల్ (రిటైర్డ్హర్ట్) 4; పంత్ (సి) వెరీన్ (బి) బాష్ 27; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) హార్మర్ 27; ధ్రువ్ జురేల్ (సి అండ్ బి) హార్మర్ 14; అక్షర్ (సి) యాన్సెన్ (బి) హార్మర్ 16; కుల్దీప్ యాదవ్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 1; సిరాజ్ (బి) యాన్సెన్ 1; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 18; మొత్తం (62.2 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–18, 2–75, 3–109, 4–132, 5–153, 6–171, 7–172, 8–187, 9–189. బౌలింగ్: యాన్సెన్ 15–4–35–3, ముల్డర్ 5–1–15–0, కేశవ్ మహరాజ్ 16–1–66–1, కార్బిన్ బాష్ 11–4–32–1, సైమన్ హార్మర్ 15.2– 4–30–4. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: రికెల్టన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 11; మార్క్రమ్ (సి) జురేల్ (బి) జడేజా 4; ముల్డర్ (సి) పంత్ (బి) జడేజా 11; తెంబా బవుమా (బ్యాటింగ్) 29; డి జోర్జి (సి) జురేల్ (బి) జడేజా 2; స్టబ్స్ (బి) జడేజా 5; కైల్ వెరీన్ (బి) అక్షర్ పటేల్ 9; మార్కో యాన్సెన్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 13; కార్బిన్ బాష్ (బ్యాటింగ్) 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (35 ఓవర్లలో 7 వికెట్లకు) 93. వికెట్ల పతనం: 1–18, 2–25, 3–38, 4–40, 5–60–, 6–75, 7–91. బౌలింగ్: బుమ్రా 6–1–14–0, అక్షర్ 11–0–30–1, కుల్దీప్ 5–1–12–2, రవీంద్ర జడేజా 13–3–29–4.
క్వార్టర్స్లో అర్జున్
పనాజీ: ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత నంబర్వన్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రెండుసార్లు ప్రపంచకప్ విజేత, అమెరికా గ్రాండ్మాస్టర్ లెవోన్ అరోనియన్తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ పోరులో అర్జున్ 1.5–0.5తో గెలుపొందాడు. ప్రపంచ 23వ ర్యాంకర్ అరోనియన్తో శుక్రవారం జరిగిన తొలి గేమ్ను ‘డ్రా’ చేసుకున్న ప్రపంచ ఆరో ర్యాంకర్ అర్జున్... శనివారం జరిగిన ఏడో గేమ్లో నల్లపావులతో ఆడుతూ అర్జున్ 38 ఎత్తుల్లో విజయం సాధించి ముందంజ వేశాడు. మరోవైపు భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ భవితవ్యం టైబ్రేక్లో తేలనుంది. హరికృష్ణ, జోస్ ఎడువార్డో మారి్టనెజ్ అల్కంటారా (రొమేనియా) మధ్య జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ 1–1తో సమంగా ముగిసింది. వీరిద్దరి మధ్య రెండో గేమ్ కూడా 35 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు ఆదివారం టైబ్రేక్ గేమ్లు నిర్వహిస్తారు. సిందరోవ్ జవోఖిర్ (ఉజ్బెకిస్తాన్), నొదిర్బెక్ యాకు»ొయెవ్ (ఉజ్బెకిస్తాన్), వె యి (చైనా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
భారత్ ‘ఎ X పాక్ ‘ఎ’
దోహా: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మరోసారి పోరుకు రంగం సిద్ధమైంది. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా నేడు భారత్ ‘ఎ’, పాకిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. యూఏఈతో జరిగిన మ్యాచ్లో 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్స్లతో 144 పరుగులు చేసిన భారత టీనేజ్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి ఉంది. సెప్టెంబర్ లో యూఏఈలో జరిగిన ఆసియా కప్ టి20 టోర్నీలో పాకిస్తాన్, భారత ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకోలేదు. మరి ఈ మ్యాచ్లో జితేశ్ శర్మ నాయకత్వంలోని భారత ‘ఎ’ జట్టు సభ్యులు కూడా పాకిస్తాన్ ‘ఎ’ ఆటగాళ్లతో కరచాలనం చేసే అవకాశం కనిపించడంలేదు.
ఉత్తుంగ కెరటం.. సంకల్ప శక్తికి నిర్వచనం
ఆమె ఒక ఉత్తుంగ కెరటం.. సంకల్ప శక్తికి నిర్వచనం.. ఆ...
విజయోస్తు!
బెంగళూరు: కొత్త చరిత్ర సృష్టించేందుకు భారత మహిళల ట...
సురేఖ ‘డబుల్ ధమాకా’
ఢాకా: ప్రపంచ రెండో ర్యాంకర్ వెన్నం జ్యోతి సురేఖ మ...
ప్రిక్వార్టర్ ఫైనల్లో అర్జున్, హరికృష్ణ
పనాజీ: తాడో పేడో తేల్చుకోవాల్సిన టైబ్రేక్ గేముల్ల...
శుభం కార్డు నేడే?
ఔరా... క్రికెట్! ఇదేం వికెట్! బ్యాటింగ్ ఫ్రెండ్...
భారత్ ‘ఎ X పాక్ ‘ఎ’
దోహా: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మరోసారి పోరుకు ...
సన్రైజర్స్ వ్యూహం.. అతడు జట్టుతోనే.. పర్సులో ఇంకెంత?
ఐపీఎల్-2026 వేలం నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్...
IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే
ఐపీఎల్-2026 మినీ వేలానికి (IPL 2026 Auction) ముంద...
క్రీడలు
తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి దర్శనానికై మెట్ల మార్గంలో వరల్డ్కప్ విన్నర్ శ్రీచరణి (ఫొటోలు)
అక్షర్ పటేల్ నూతన గృహ ప్రవేశం.. విల్లా పేరు ఇదే! (ఫొటోలు)
కోట్ల విలువైన కారు కొన్న టీమిండియా క్రికెటర్ (ఫొటోలు)
కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)
నా హ్యాపీ బర్త్డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్ (ఫొటోలు)
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)
తిరుమల కొండపై ఏడు అడుగుల మహిళ (ఫోటోలు)
వరల్డ్ కప్ ట్రోఫీతో మంధాన, పలాష్ ముచ్చల్ జంట (ఫోటోలు)
కడప నుంచి వరల్డ్ కప్ దాకా.. శ్రీ చరణి కీలక పాత్ర (ఫొటోలు)
వీడియోలు
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 42 బంతుల్లోనే 144 పరుగులు
బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిల
క్రీడా కీర్తి కిరీటం
ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉంది: అరుంధతి
మోదీని కలిసిన భారత మహిళల క్రికెట్ జట్టు
Women's World Cup Final 2025: మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
జీసస్ నన్ను నడిపించాడు బైబిల్ పోరాడేలా చేసింది? జెమిమా ఎమోషనల్
ఫైనల్ కు చేరిన భారత్
ఆసీస్ తొలి టీ20 మ్యాచ్.. టీమిండియాలో భారీ మార్పు
ఆస్ట్రేలియాతో భారత్ తొలి వన్డే మ్యాచ్
