Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

U19 Asia Cup 2025: Vaihbhav 171 India Beat UAE By 234 Runs1
ఆసియా కప్‌- 2025: భారత్‌ ఘన విజయం

ఆసియా క్రికెట్‌ మండలి మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2025 టోర్నీలో భారత్‌ శుభారంభం చేసింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా 234 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Why Vaibhav Suryavanshi 171 Vs UAE Will Not Counted In U19 Record Books2
ప్చ్‌.. సారీ వైభవ్‌ సూర్యవంశీ!

ఆసియా క్రికెట్‌ మండలి ఆధ్వర్యంలో అండర్‌-19 ఆసియా కప్‌-2025 టోర్నమెంట్‌కు శుక్రవారం తెరలేచింది. గ్రూప్‌-‘ఎ’ మ్యాచ్‌లో భాగంగా యునైటైడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE).. భారత యువ జట్టును ఢీకొట్టింది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది.56 బంతుల్లోనే సెంచరీఓపెనర్లలో కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (4) విఫలం కాగా.. వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. కేవలం 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. ఓ దశలో డబుల్‌ సెంచరీ దిశగా పయనించాడు. అయితే, ఉద్దిశ్‌ సూరి బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో వైభవ్‌ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.మొత్తంగా ఈ మ్యాచ్‌లో 95 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. తొమ్మిది ఫోర్లు, పద్నాలుగు సిక్సర్ల సాయంతో 171 పరుగులు సాధించాడు. అతడికి తోడు ఆరోన్‌ జార్జ్‌ (69), విహాన్‌ మల్హోత్రా (69).. వేదాంత్‌ త్రివేది (38), అభిజ్ఞాన్‌ కుందు (17 బంతుల్లో 32 నాటౌట్‌) రాణించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌ ఆరు వికెట్ల నష్టానికి 433 పరుగుల భారీ స్కోరు సాధించింది.ప్చ్‌.. సారీ వైభవ్‌ సూర్యవంశీ!ఇదిలా ఉంటే.. యూత్‌ వన్డేల్లో వైభవ్‌ సూర్యవంశీ ఇప్పటికే ఓ సెంచరీ బాదాడు. ఇటీవల ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టుపై 52 బంతుల్లోనే శతక్కొట్టి రికార్డు సృష్టించాడు. అయితే, తాజాగా వైభవ్‌ ఆసియా కప్‌ వన్డే ఫార్మాట్‌లో సాధించిన శతకానికి మాత్రం యూత్‌ వన్డేల్లో చోటు దక్కదు.కారణం ఇదేఅండర్‌-19 ఆసియా కప్‌లో అసోసియేట్‌ జట్లతో జరిగే మ్యాచ్‌లకు యూత్‌ వన్డే హోదా లేదు. అందుకే యూఏఈపై వైభవ్‌ సాధించిన సెంచరీకి రికార్డుల్లో స్థానం లేకుండా పోయింది. అయితే, తదుపరి (డిసెంబరు 14)న పాకిస్తాన్‌తో జరిగే ఆసియా కప్‌ మ్యాచ్‌లో గనుక వైభవ్‌ సెంచరీ బాదితే అది రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఆసియా కప్‌ టోర్నీలో టెస్టు హోదా కలిగిన జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు మాత్రమే యూత్‌ వన్డే హోదా ఉంటుంది.ఇప్పటికే మూడు శతకాలుఇదిలా ఉంటే.. ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లలో అసోసియేట్‌ జట్లతో జరిగిన మ్యాచ్‌లకు మాత్రం యూత్‌ వన్డే స్టేటస్‌ ఉంటుంది. అంటే.. ప్రపంచకప్‌ టోర్నీలో యూఏఈతో భారత్‌ ఆడే మ్యాచ్‌ల రికార్డులు పరిగణనలోకి వస్తాయి.ఇక సీనియర్‌ టీ20 క్రికెట్‌లో వైభవ్‌ సూర్యవంశీ ఇప్పటికే మూడు శతకాలు సాధించాడు. ఐపీఎల్‌-2025లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున.. ఏసీసీ రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లో యూఏఈపైనా.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర మీదా వైభవ్‌ శతక్కొట్టాడు.A century in no time...just 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝗼𝗼𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 things! 💯 Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/3N140FhcRV— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025

Ravindra Jadeja wife Rivaba Shocking claim involving India players3
వాళ్లకు చెడు అలవాట్లు.. నా భర్త ఎలాంటివాడంటే: జడేజా భార్య

టీమిండియా ఆల్‌ ఫార్మాట్‌ ఆల్‌రౌండర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు రవీంద్ర జడేజా. టీ20 ప్రపంచకప్‌-2024లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన జడ్డూ.. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు.స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్‌ (IND vs SA)లు ముగించుకున్న జడేజా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. జడ్డూ భార్య, గుజరాత్‌ మంత్రి రివాబా సోలంకి (Rivaba) తన భర్తను ప్రశంసించే క్రమంలో టీమిండియాను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.ఇంటికి దూరంగా ఉన్నా క్రికెటర్‌గా ఉన్న తన భర్త విదేశాలకు వెళ్లడం సహజమని.. అయితే, జట్టులోని మిగతా అందరిలా తన భర్త కాదని తెలిపారు. ఎక్కడున్నా నైతిక విలువలు కోల్పోడంటూ రివాబా వ్యాఖ్యానించారు. ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని.. పన్నెండు ఏళ్లు ఇంటికి దూరంగా ఉన్నా తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదని చెప్పుకొచ్చారు.ద్వారకలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రివాబా తన భర్త రవీంద్ర జడేజా (Ravindra Jadeja) గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నా భర్త.. క్రికెటర్‌ రవీంద్ర జడేజా.. లండన్‌, దుబాయ్‌, ఆస్ట్రేలియా అంటూ ఆట నిమిత్తం వివిధ దేశాలు తిరగాల్సి వస్తుంది. అయినప్పటికీ ఆయన ఎలాంటి చెడు వ్యసనాలకు ఆకర్షితుడు కాలేదు.వాళ్లు ఎన్నో దుర్గుణాలు కలిగి ఉంటారుఆయనకు తన బాధ్యతలు ఏమిటో తెలుసు. కానీ మిగతా జట్టంతా అలా కాదు. వాళ్లు ఎన్నో దుర్గుణాలు కలిగి ఉంటారు. అయినా వారిపై ఎవరూ ఎలాంటి ఆంక్షలు విధించలేరు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అదే విధంగా.. ‘‘నా భర్త పన్నెండు ఏళ్లు ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. కావాలంటే ఆయన ఎలాంటి చెడ్డ పనైనా చేసి ఉండవచ్చు. కానీ నైతిక విలువలు అంటే ఏమిటో ఆయనకు బాగా తెలుసు’’ అంటూ జడ్డూపై రివాబా ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌కాగా.. రివాబా వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.భర్తను మెచ్చుకోవడంలో తప్పు లేదు.. కానీతన భర్తను మెచ్చుకోవడంలో తప్పు లేదని.. అయితే, అందుకోసం మిగతా అందరి ఆటగాళ్ల వ్యక్తిత్వాలను కించపరచడం సరికాదని టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా బాధ్యతాయుత పదవిలో ఉన్న వారు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.కాగా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన జడేజా క్రికెటర్‌గా అత్యుత్తమ స్థాయికి ఎదగడంలో అతడి తల్లి పాత్ర కీలకం. ఈ విషయాన్ని జడ్డూనే స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పాడు. ఇక తన అక్క కూడా తన విజయానికి బాటలు వేసిన వారిలో ఒకరని గతంలో ప్రశంసించాడు.కుటుంబంలో విభేదాలు?ఇదిలా ఉంటే.. జడ్డూ తండ్రి, అక్క కాంగ్రెస్‌ పార్టీలో ఉండగా.. భార్య రివాబా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. రివాబా వచ్చిన తర్వాత జడ్డూ తమను పూర్తిగా దూరం పెట్టాడని అతడి తండ్రి ఆరోపించగా.. జడ్డూ మాత్రం భార్యకు మద్దతు తెలిపాడు.ఒకవైపు మాటలు మాత్రమే విని ఇంటర్వ్యూ చేయడం సరికాదని.. తన భార్యను తప్పుబట్టే విధంగా వ్యవహరిస్తే ఎవరినీ సహించబోనని మీడియాకు వార్నింగ్‌ ఇచ్చాడు జడ్డూ. కాగా జడేజా అక్కకు రివాబా స్నేహితురాలు. ఈ క్రమంలోనే జడ్డూ- రివాబాలకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి బాటలు వేసింది. వీరికి కుమార్తె నిధ్యానా ఉంది.చదవండి: దురభిమానం.. నైతిక విలువలు పాతరేస్తున్నారు"मेरे पति (रवींद्र जडेजा , क्रिकेटर)को लंदन , दुबई, ऑस्ट्रेलिया जैसे अनेकों देशों में खेलने के लिए जाना होता है फिर भी आज दिन तक उन्होंने कभी व्यसन नहीं किया क्योंकि वो अपनी जवाबदारी को समझते हैं @Rivaba4BJP जी , शिक्षा मंत्री गुजरात सरकार #Rivabajadeja #ravindrajadeja pic.twitter.com/OyuiPFPvVa— राणसिंह राजपुरोहित (@ransinghBJP) December 10, 2025

Telangana Cricket Association Press Meet Over HCA U14 Selections4
కోర్టు చెప్పినా మారరా?.. హెచ్‌సీఏపై టీసీఏ ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో అవినీతి జరుగుతూనే ఉందని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆరోపించింది. ప్రీమియర్ లీగ్ పేరుతో మరోసారి మోసం చేయాలని చూస్తే హెచ్‌సీఏ అధికారులను బయట తిరగనివ్వబోమని హెచ్చరించింది. హెచ్‌సీఏలో అక్రమాల గురించి ప్రస్తావిస్తూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించింది.అండర్ -14 టీమ్‌ అనే ప్రస్తావన లేదుఈ సందర్భంగా.. ‘‘ప్రీమియర్ లీగ్ పేరుతో మళ్లీ మోసం చేయాలని చూస్తే హెచ్‌సీఏ అధికారులను బయట తిరగ నివ్వం. ప్రీమియర్ లీగ్ కూడా TCA నిర్వహిస్తుంది. అండర్ 14 సెలక్షన్ పేరుతోనూ అవినీతి కి పాల్పడ్డారు. 3500 మంది క్రీడాకారులను ఇబ్బంది పెట్టారు. BCCIలో అసలు అండర్ -14 టీమ్‌ అనే ప్రస్తావన లేదు.అయినా సెలక్షన్‌కు అని పిలిచి జింఖాన గ్రౌండ్ లో కనీసం సౌకర్యాలు కల్పించలేదు. సొంతం గా అసోసియేషన్‌లు పెట్టుకొని.. 15 మంది ని సెలెక్ట్ చేయడానికి ఐదు వేల మంది ని నిలబెట్టారు. HCA అవకతవకలపై హ్యూమన్ రైట్స్‌​తో పాటు డీజీపి కి ఫిర్యాదు చేస్తాం. ఎన్నిసార్లు కోర్టు మొట్టకాయలు వేసినా HCA తీరులో మార్పు లేదు. మళ్లీ కోర్టును ఆశ్రయిస్తాం’’ అని టీసీఏ పేర్కొంది.BCCI గుర్తింపు కోసంటీసీఏ జనరల్‌ సెక్రటరీ గురువా రెడ్డి మాట్లాడుతూ.. BCCI గుర్తింపు కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి సుమోటోగా HCAపై విచారణ జరపాలి. BCCI నిబంధనలను HCA పాటించడం లేదు’’ అని పేర్కొన్నారు. ఇక అడ్వకేట్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్‌ పేరిట పిల్లల్ని, వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టారు. ఈ విషయంపై జాతీయ, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేస్తున్నాం’’ అని తెలిపారు.చదవండి: IND vs SA: ‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?

U19 Asia Cup 2025: Vaibhav Suryavanshi Ton Powers IND set 434-run target Uae5
Asia Cup 2025:: భారత్‌ 433 పరుగుల భారీ స్కోర్‌

అండ‌ర్‌-19 ఆసియాక‌ప్‌లో భాగంగా దుబాయ్ వేదిక‌గా యూఏఈతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త బ్యాట‌ర్లు జూలు విదిల్చారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భార‌త యువ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 433 ప‌రుగులు చేసిది. యువ‌సంచ‌ల‌నం, టీమిండియా ఓపెనర్‌ వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌రోసారి విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 56 బంతుల్లోనే తన రెండో యూత్ వన్డే సెంచరీ మార్క్‌ను వైభవ్ అందుకున్నాడు. మొత్తంగా 95 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో 171 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ దశలో డబుల్‌ సెంచరీ చేసేలా వైభవ్‌ కన్పించాడు. దూకుడుగా ఆడే క్రమంలో తన వికెట్‌ను కోల్పోయాడు.వైభవ్‌తో పాటు ఆరోన్‌ జార్జ్‌(69), విహాన్‌ మల్హోత్రా(69) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. ఆఖరిలో అభిజ్ఞాన్ కుండు(32), కన్షిక్‌ చౌహన్‌(28) మెరుపులు మెరిపించారు. వైభవ్.. ఆరోన్ జార్జ్ తో కలిసి 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెల‌కొల్పాడు. కెప్టెన్ అయూష్ మాత్రే(4) మాత్రం సింగిల్ డిజిట్ స్కోర్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. యూఏఈ బౌలర్లలో యూగ్‌ శర్మ, సూరి తలా రెండు వికెట్లు సాధించాడు. కాగా యూత్‌ వన్డేల్లో భారత్‌ 400 ప్లస్‌ పైగా పరుగులు సాధించడం ఇదే మూడో సారి. తద్వారా ఈ ఫీట్‌ సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.చదవండి: IND vs SA: ‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?[node:field_tags]A century in no time...just 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝗼𝗼𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 things! 💯 Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/3N140FhcRV— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025

Nitish Kumar Reddy rattles MP with hat-trick in Syed Mushtaq Ali Trophy Super League6
నితీశ్ రెడ్డి హ్యాట్రిక్‌.. అయినా త‌ప్ప‌ని ఓట‌మి

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అద‌ర‌గొట్టాడు. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నితీశ్‌.. శుక్రవారం మధ్యప్రదేశ్‌తో జరిగిన సూపర్ లీగ్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో దుమ్ములేపాడు.తొలుత బ్యాటింగ్‌లో 25 ప‌రుగులతో స‌త్తాచాటిన నితీశ్‌.. అనంత‌రం బౌలింగ్‌లో హ్యాట్రిక్ వికెట్ల‌తో మెరిశాడు. 19.1 ఓవర్లలో కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో శ్రీకర్‌ భరత్‌(39), నితీశ్‌ రెడ్డి(25) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఎంపీ బౌలర్లలో శివమ్‌ శుక్లా నాలుగు వికెట్లు పడగొట్టగా.. త్రిపురేష్‌ మూడు, రాహుల్‌ బాథమ్‌ రెండు వికెట్లు సాధించారు.నితీశ్‌ హ్రాట్రిక్‌ షో..113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌కు నితీశ్‌ ఆరంభంలోనే షాక్‌ ఇచ్చాడు. మూడో ఓవర్‌ వేసిన నితీశ్‌ వరుసగా మూడు వికెట్లు పడగొట్టి ఎంపీని కష్టాల్లో​కి నెట్టాడు. నితీష్‌ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా హర్ష్ గవాలి క్లీన్ బౌల్డ్ కాగా.. ఆ తర్వాత డెలివరీకి హర్‌ప్రీత్ సింగ్ రిక్కీ భుయ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఇక చివరగా నితీశ్‌ ఎంపీ కెప్టెన్ రజత్ పాటిదార్‌ను క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రిషబ్‌ చౌహన్‌(47), రాహుల్‌ బాథమ్‌(35 నాటౌట్‌) ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఆంధ్రపై 4 వికెట్ల తేడాతో ఎంపీ ఘన విజయం సాధించింది.చదవండి: Asia Cup: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో

Vaibhav Suryavanshi misses record 200, scores 95-ball 171 in U19 Asia Cup7
వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో

అండర్‌-19 ఆసియాకప్ 2025ను టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా యూఏఈతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో సూర్యవంశీ భారీ సెంచరీతో చెలరేగాడు. ఆతిథ్య జట్టు బౌలర్లకు వైభవ్ చుక్కలు చూపించాడు.తొలుత కాస్త ఆచితూచి ఆడిన సూర్యవంశీ.. క్రీజులో సెటిల్ అయ్యాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తనదైన స్టైల్లో బౌండరీల వర్షం కురిపించాడు. అతడిని ఆపడం ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. ఈ క్రమం‍లో కేవలం 56 బంతుల్లోనే తన రెండో యూత్ వన్డే సెంచరీ మార్క్‌ను వైభవ్ అందుకున్నాడు.సెంచరీ పూర్తి అయిన తర్వాత కూడా తన జోరును కొనసాగించాడు. అతడి దూకుడు చూస్తే సునాయసంగా డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకుంటాడని అంతాభావించారు. స్పిన్నర్ ఉద్దీష్ సూరి బౌలింగ్‌లో అనవసరంగా రివర్స్ స్కూపు షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు. ఓవరాల్‌గా 95 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో 171 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఏడాది అతడికి అన్ని ఫార్మాట్లలో కలిపి ఇది ఆరో సెంచరీ కావడం విశేషం.ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ దిశ‌గా భార‌త్ సాగుతోంది. 44 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త యువ జ‌ట్టు 4 వికెట్లు కోల్పోయి 353 ప‌రుగులు చేసింది. విధ్వంసంక‌ర సెంచ‌రీతో మెరిసిన వైభవ్.. ఆరోన్ జార్జ్ తో కలిసి 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెల‌కొల్పాడు. కెప్టెన్ అయూష్ మాత్రే(4) సింగిల్ డిజిట్ స్కోర్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు.చదవండి: నాతో పాటు అతడి వల్లే ఈ ఓటమి: సూర్యకుమార్‌A century in no time...just 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝗼𝗼𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 things! 💯 Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/3N140FhcRV— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025

Wrestler Vinesh Phogat makes retirement U-turn8
రిటైర్మెంట్‌ను వెన‌క్కి తీసుకున్న వినేశ్‌ ఫొగాట్‌

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంది. ఒలింపిక్స్‌లో పతకం గెలవాలనే తన కలను నేరవేర్చుకునేందుకు మనసు మార్చుకుంటున్నట్లు ఫొగాట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా 31 ఏళ్ల వినేశ్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్‌లో తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంది. పతకం ఖాయమైన వేళ అనుహ్యంగా ఆమెపై వేటు పడింది. 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో నిర్దేశించిన బరువు కంటే వినేష్ ఫొగాట్ 100 గ్రాములు అధిక బరువు ఉండటంతో ఆమెపై వేటు వేశారు. దీంతో ఆమె తన ఒలింపిక్ కల నేరవేరకుండానే భారత్‌కు తిరిగిచ్చింది. ఆ తర్వాత ఉమ్మడి రజత పతకం ఇవ్వాలని వినేష్ ఫొగాట్.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీల్ చేసింది. అయితే సీఏఎస్ వినేష్ ఫొగాట్‌ అభ్యర్థనను సీఏఎస్ తోసిపుచ్చడంతో ఆమెకు తీవ్ర నిరాశే ఎదురైంది.ఈ క్రమంలో ఆమె రి సోషల్ మీడియా వేదికగా టైర్మెంట్ ప్రకటిస్తూ అందరికి షాకిచ్చింది. ఆ తర్వాత ఫొగాట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీచేసి జులనా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా ఎంపికైంది. ఇప్పుడు లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో ఆడేందుకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది."పారిస్ ఒలింపిక్స్‌తో నా రెజ్లింగ్ జర్నీ ముగిసిందా అని చాలా మంది అడుగుతూనే ఉన్నారు. ఆ ప్రశ్నకు ఇప్పటివరకు నేను సమాధానం చెప్పలేకపోయాను. నేను రెజ్లింగ్ మ్యాట్‌, ఆ ఒత్తిడి, నా ల‌క్ష్యాల నుంచి కొన్నాళ్ల‌పాటు దూరంగా ఉండిపోవాల్సి వ‌చ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ బ‌రిలోకి దిగాల‌ని అనుకుంటున్నారు. నేను ఇప్పటికీ ఈ క్రీడను(రెజ్లింగ్‌) ప్రేమిస్తున్నాను" అని రిటైర్మెంట్ యూట‌ర్న్ ప్ర‌క‌ట‌న‌లో ఫోగాట్ పేర్కొంది.

New Zealand Secure Nine Wicket Win Over West Indies In Wellington Test9
విండీస్‌తో​ రెండో టెస్టు.. న్యూజిలాండ్‌ ఘన విజయం

వెల్లింగ్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సెకెండ్ టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. 56 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని బ్లాక్‌క్యాప్స్ కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి చేధించింది. డెవాన్ కాన్వే(28), కేన్ విలియ‌మ్స‌న్‌(16) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 205 ప‌రుగుల‌కు ఆలౌటైంది. విండీస్ బ్యాట‌ర్ల‌లో షాయ్ హోప్‌(47) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. క్యాంప్‌బెల్‌(44) , కింగ్‌(33) రాణించారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో టిక్న‌ర్ నాలుగు, రే మూడు వికెట్లు సాధించారు.అనంత‌రం కివీస్ త‌మ తొలి ఇన్నింగ్స్‌ను 278/9 వద్ద ముగించింది. ఫీల్డింగ్‌ చేస్తుండగా గాయపడ్డ పేసర్‌ టిక్నర్‌ బ్యాటింగ్‌కు రాలేదు. మిచెల్‌ హే (93 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్‌), డెవాన్‌ కాన్వే (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు.దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కు 73 పరుగుల ఆధిక్యం లభించింది. కరీబియన్‌ బౌలర్లలో అండర్సన్‌ ఫిలిప్‌ 3, రోచ్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో విండీస్‌ కేవలం 128 పరుగులకే కుప్పకూలింది. కివీ పేసర్‌ జాకబ్‌ డఫీ 5 వికెట్లు పడగొట్టి కరేబియన్ల పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మిచెల్ రే మూడు వికెట్లు సాధించాడు. కవీమ్‌ హోడ్జ్‌(35) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో విండీస్‌ ఆతిథ్య జట్టు ముందు కేవలం 56 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మౌంట్ మంగునూయ్ వేదికగా డిసెంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs SA: ‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?

Suryakumar, Shubman Gill hurting India Ahead T20 worldcup 202610
‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?

టీ20 వరల్డ్‌కప్‌-2026కు కౌంట్‌డౌన్ మొద‌లైంది. మ‌రో 55 రోజుల్లో భార‌త్‌, శ్రీలంక వేదిల‌క‌గా ఈ మెగా టోర్న‌మెంట్ షూరూ కానుంది. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియ‌న్ హోదాలో బ‌రిలోకి దిగనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు ఇద్ద‌రు ప్లేయ‌ర్ల పేల‌వ ఫామ్‌ భారత జట్టు మెనెజ్‌మెంట్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. అందులో ఒకరు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాగా.. మరొకరు అతడి డిప్యూటీ శుభ్‌మన్ గిల్‌.టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వీరిద్ద‌రూ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు.సూర్యకు ఏమైంది..?ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్‌గా పేరున్న సూర్యకుమార్.. 2025లో మాత్రం ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. ఐపీఎల్‌-2025లో రాణించిన‌ప్ప‌టికి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో పూర్తిగా తేలిపోయాడు. కెప్టెన్‌గా జ‌ట్టును విజ‌యప‌థంలో న‌డిపిస్తున్న‌ప్ప‌టికి వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌ల ప‌రంగా మాత్రం తీవ్ర నిరాశ‌ప‌రుస్తున్నాడు.ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు 18 అంత‌ర్జాతీయ టీ20లు ఆడిన స్కై.. 15.07 స‌గ‌టుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సంవత్సరం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతడి టాప్ స్కోర్ 38 పరుగులగా ఉంది. కీలకమైన మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తున్న సూర్య తన చెత్త ప్రదర్శనలతో జట్టుకు భారంగా మారుతున్నాడు. తనపై తనకే నమ్మకం లేక ఒక మ్యాచ్‌లో మూడో స్ధానంలో.. మరో మ్యాచ్‌లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఒకప్పుడు సూర్య క్రీజులో ఉంటే బౌలింగ్ చేయాలంటే ప్రత్యర్ధి బౌలర్లు భయపడేవారు. కానీ ఇప్పుడు అతడి వీక్‌నెస్‌ను పసిగట్టిన బౌలర్లు.. అతడిని చాలా ఈజీగా ట్రాప్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఇంకా 8 మ్యాచ్‌లు ఆడనుంది. సౌతాఫ్రికాతో మూడు, న్యూజిలాండ్‌తో ఐదు టీ20లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లలో సూర్య తిరిగి తన ఫామ్‌ను అందుకోవాల్సి ఉంది. లేదంటే భారత్‌కు బ్యాటింగ్‌ కష్టాలు తప్పవు. ఈ సిరీస్‌లో తొలి టీ20లో కేవలం 12 పరుగులు చేసిన సూర్యకుమార్‌.. రెండో టీ20లో 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. మూడో మ్యాచ్‌లోనైనా ఈ ముంబై ఆటగాడు తన బ్యాట్‌కు పనిచెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.గిల్ ఢమాల్‌..ఇక మొన్నటివర​కు టీ20 ప్రపంచకప్ ప్రణాళికలలో అస్సలు శుభ్‌మన్ గిల్ లేడు. టీ20ల్లో భారత జట్టు ఓపెనర్లగా సంజూ శాంసన్‌, అభిషేక్ శర్మ ఉండేవారు. కానీ ఆసియాకప్ 2025కు ముందు గిల్‌ను టీ20ల్లో అనూహ్యంగా తీసుకొచ్చారు. అంతేకాకుండా అప్పటివరకు వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్‌ను తప్పించి ఆ బాధ్యతలను గిల్‌కు బీసీసీఐ అప్పగించింది.అయితే ఆల్‌ఫార్మాట్‌గా గిల్‌కు పేరు ఉన్నప్పటికి.. తన టీ20 రీ ఎంట్రీలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆసియాకప్‌, ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20ల్లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి టీ20లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన గిల్‌.. రెండో టీ20ల కనీసం తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ను తప్పించి మరి అతడికి ఓపెనర్‌గా అవకాశమిచ్చారు. కానీ అతడు మాత్రం చెత్త ప్రదర్శనతో నిరాపరుస్తున్నాడు. ఈ ఏడాది గిల్ 14 ఇన్నింగ్స్‌లలో 23.90 సగటుతో కేవలం 263 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రాబోయో మ్యాచ్‌లలోనైనా కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ ఇద్దరూ తమ ఫామ్‌ను అందుకుంటారో లేదో చూడాలి.చదవండి: IND Vs SA: అర్ష్‌దీప్‌ 13 బంతుల ఓవర్‌.. గంభీర్ రియాక్షన్‌ వైరల్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement