Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

How Did  Mohammed Siraj Vanish From ODI Cricket?1
'ఒకప్పుడు వరల్డ్‌ నంబర్‌ వన్‌.. ఇప్పుడు జట్టులో నో ఛాన్స్‌'

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత బౌలర్లు పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన రెండో వన్డేల్లోనూ మన బౌలర్లు తేలిపోయారు. ముఖ్యంగా పేసర్లు అయితే గల్లీ బౌలర్ల కంటే దారుణంగా బౌలింగ్ చేస్తున్నారు.సీనియర్ ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ఈ సిరీస్‌కు వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వగా.. మహ్మద్ షమీని ఫిట్‌నెస్ లోపం పేరిట జట్టులోకి తీసుకోవడం లేదు. మరి సిరాజ్‌ను ఎందుకు తీసుకోలేదో సెలక్టర్లు స్పష్టత ఇవ్వలేదు.ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడిన సిరాజ్.. సఫారీలతో వన్డేలకు మాత్రం దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది సిరాజ్ ఇప్పటివరకు ఒకే వన్డే సిరీస్ ఆడాడు. అతడిని ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సెలక్టర్లపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశ్నల వర్షం కురిపించాడు. సిరాజ్ కేవలం ఒక-ఫార్మాట్ ఆటగాడిగా మార్చడంపై నిరాశ వ్యక్తం చేశాడు. హైదరాబాదీ కేవలం టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కావడానికి గల కారణం తనకు అర్థం కావడం లేదని చోప్రా తెలిపాడు."మహ్మద్ సిరాజ్‌ను వన్డే జట్టు నుంచి ఎందుకు తప్పించారు? సెల‌క్ట‌ర్ల వ్యూహాలు ఏంటో ఆర్ధం కావ‌డం లేదు. సిరాజ్ ఎప్పుడూ ఫిట్‌గా ఉంటాడు. అత‌డు ప్ర‌స్తుతం స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్న సిరాజ్‌.. వ‌న్డేల్లో ఆడ‌లేడా? ఇంత‌కుముందు ఛాంపియ‌న్స్ ట్రోఫీకి కూడా అత‌డిని ఎంపిక చేయకపోవడం మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. ఎందుకంటే అతడు కొన్నాళ్ల పాటు వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగాడు. అటువంటి బౌల‌ర్ ఇప్పుడు జ‌ట్టులోనే లేకుండా పోయాడు. హ‌ర్షిత్ రాణా, ప్ర‌సిద్ద్ కృష్ణ లాంటి బౌలర్లకు తరుచూ జట్టులో చోటు దక్కుతుంది. కానీ సిరాజ్ మాత్రం వన్డే, టీ20 జట్టులో కన్పించడం లేదు. అలా ఎందుకు జరుగుతుందో నాకైతే తెలిదు. కానీ సిరాజ్ మాత్రం ఇప్పుడు సింగిల్ ఫార్మాట్ ప్లేయరయ్యాడు. కాగా దక్షిణాఫ్రికాతో టీ20లకు ప్రకటించిన భారత జట్టులోనూ సిరాజ్‌కు చోటు దక్కలేదు.చదవండి: RO-KO హవా!.. ఈ హీరోని మర్చిపోతే ఎలా? కెప్టెన్‌గానూ సరైనోడు!

Cried in the bathroom, Riyan Parag reveals reason behind India setup absence2
"బాత్రూంలో కూర్చొని ఏడ్చాను..": రియాన్‌ పరాగ్‌

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో యువ ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌కు (Riyan Parag) చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ అంశంపై రియాన్‌ తాజాగా స్పందించాడు. భారత జట్టులో స్థానం దక్కనందుకు నిరాశ చెందానని చెప్పుకొచ్చాడు.గతేడాది అక్టోబర్‌లో చివరిగా టీమిండియా తరఫున ఆడిన రియాన్‌ భుజం గాయం తనను జట్టుకు దూరం చేసిందని వాపోయాడు. ఫిట్‌గా ఉన్నప్పుడు తాను రెండు వైట్‌ బాల్‌ ఫార్మాట్లు ఆడగల సమర్దుడినని తెలిపాడు. త్వరలోనే భారత జట్టులో కనిపిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.రియాన్‌ మాటల్లో.. "నాకు నేను టీమిండియాకు ఆడగల అర్హుడినని అనుకుంటాను. ఇది నాపై నాకున్న నమ్మకమనుకోండి లేక ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అనుకోండి. భుజం గాయం వల్ల ప్రస్తుతం నేను టీమిండియాలో లేను. నేను టీమిండియాకు రెండు వైట్‌బాల్‌ ఫార్మాట్లలో ఆడగలను"ఫామ్‌ పెద్ద సమస్య కాదుప్రస్తుతం సయ్యద్‌ ముస్తాక్‌ అలీ దేశవాలీ టీ20 టోర్నీ ఆడుతున్న రియాన్‌ ఫామ్‌ లేమితో సతమతమవుతున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా చేయలేకపోయాడు. ఈ అంశంపై కూడా రియాన్‌ స్పందించాడు.ఫామ్‌ అనేది తన దృష్టిలో పెద్ద సమస్య కాదని, పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తే అదంతటదే వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.బాత్రూంలో కూర్చొని ఏడ్చానుఇదే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో రెండు సీజన్లు 45-50 సగటులో పరుగులు చేశాను. అయితే ఆ వెంటనే జరిగిన ఐపీఎల్‌ సీజన్‌లో 14 మ్యా​చ్‌ల్లో కలిపి 70 పరుగులు చేయలేకపోయాను. ఆ సమయంలో నేను బాత్రూంలో కూర్చొని ఏడ్చాను. ఎందుకు పరుగులు చేయలేకపోతున్నానని చాలా బాధపడ్డాను.ఈ ఫామ్‌తో ఐపీఎల్‌కు సంబంధం లేదుసయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ ఫామ్‌తో ఐపీఎల్‌ ఫామ్‌కు సంబంధం లేదు. ఇక్కడ పరుగులు సాధిస్తే సంతోషమే. పరుగులు చేయలేకపోతే ఐపీఎల్‌లో పరుగులు చేయలేనని కాదు. ఈ విషయంలో నాకు అనుభవం ఉందని రియాన్‌ అభిప్రాయపడ్డాడు.కాగా, 24 ఏళ్ల రియాన్‌ చివరిగా 2024 అక్టోబర్ 12న బంగ్లాదేశ్‌తో జరిగిన T20 సిరీస్‌లో భారత్ తరఫున ఆడాడు. ఆ సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్‌ అంతటిలో కేవలం 49 పరుగులే చేశాడు.సంజూ శాంసన్‌ ట్రేడింగ్‌ ద్వారా సీఎస్‌కేకు వెళ్లిపోయిన తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్సీ రేసులో రియాన్‌ పరాగ్‌ కూడా ఉన్నాడు. గత సీజన్‌లో అతను కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్సీ కూడా చేశాడు. టీమిండియా నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత కూడా రియాన్‌ ఐపీఎల్‌ 2025లో పర్వాలేదనిపించాడు. 32 సగటున 393 పరుగులు చేశాడు.

IND vs SA: Fans Hails KL Rahul Innings His Captaincy Record in all formats3
IND vs SA: ఈ హీరోని మర్చిపోతే ఎలా?.. కెప్టెన్‌గానూ సరైనోడు!

జట్టులో తమకంటూ ప్రత్యేక బ్యాటింగ్‌ స్థానం లేకపోయినా టీమిండియాకు నిస్వార్థమైన సేవలు అందిస్తున్న క్రికెటర్లలో కేఎల్‌ రాహుల్‌ ముందు వరుసలో ఉంటాడు. 2014లో ఓపెనర్‌గా భారత జట్టు తరఫున ప్రస్థానం మొదలుపెట్టిన ఈ కర్ణాటక ఆటగాడు.. వికెట్‌ కీపర్‌గానూ సేవలు అందించాడు.తరచూ మార్పులుఅయితే, తర్వాతి కాలంలో రాహుల్‌ (KL Rahul) తన ఓపెనింగ్‌ స్థానాన్ని కోల్పోయాడు. ముఖ్యంగా టెస్టుల్లో ఓసారి ఐదో నంబర్‌ బ్యాటర్‌గా.. మరోసారి నాలుగో స్థానంలో.. ఆ తర్వాత మళ్లీ ఓపెనర్‌గా ఇలా వివిధ స్థానాల్లో రాహుల్‌ బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ నిలకడైన ఆటతో రాణిస్తూ తనను తాను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు రాహుల్‌. దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్‌ తర్వాత రాహుల్‌కు టెస్టుల్లో ఓపెనర్‌గా వరుస అవకాశాలు వస్తున్నాయి.కీపింగ్‌ బాధ్యతలు కూడా.. ఇదిలా ఉంటే.. వన్డేల్లోనూ రాహుల్‌ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. టీ20 జట్టులో స్థానం కోల్పోయిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. వన్డేల్లో మాత్రం మిడిలార్డర్‌ బ్యాటర్‌గా తన సేవలు అందిస్తున్నాడు. కీపింగ్‌ బాధ్యతలు కూడా తానే నిర్వర్తిస్తున్న రాహుల్‌.. తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్‌కు తాత్కాలిక కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్నాడు.సఫారీ జట్టుతో తొలి వన్డేలో ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్‌. కేవలం 56 బంతుల్లోనే 60 పరుగులు (రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) సాధించాడు. లెజెండరీ బ్యాటర్లు రోహిత్‌ శర్మ (57), విరాట్‌ కోహ్లి (135)తో రాహుల్‌ మెరుపు అర్ధ శతకంతో రాణించడంతో టీమిండియా 349 పరుగుల భారీ స్కోరు చేయగలిగిందిరాహుల్‌ విలువైన ఇన్నింగ్స్‌ఇక ఈ మ్యాచ్‌లో బౌలర్లు ఆరంభంలో తడబడినా ఆఖరి నిమిషంలో సత్తా చాటడంతో 17 పరుగుల తేడాతో భారత జట్టు గట్టెక్కింది. అదే విధంగా రెండో వన్డేలోనూ కోహ్లి శతక్కొట్టగా (102).. రుతురాజ్‌ గైక్వాడ్‌ (105) కూడా సెంచరీతో అలరించాడు. వీరిద్దరికి తోడుగా రాహుల్‌ విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈసారి ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. 43 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 66 పరుగులతో అజేయంగా నిలిచాడు.అయితే, ఈ మ్యాచ్‌లో 358 పరుగుల మేర భారీ స్కోరు సాధించినా టీమిండియా గెలవలేకపోయింది. బౌలర్ల వైఫల్యం కారణంగా నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లోనూ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాహుల్‌ తనదైన ముద్ర వేయగలిగాడు. అయితే, రో-కోల హవాలో అతడి ఆటకు దక్కాల్సిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.కెప్టెన్‌గానూ రాహుల్‌కు మంచి రికార్డు నిజానికి టీమిండియా కెప్టెన్‌గానూ రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు మొత్తంగా అతడు పద్దెనిమిదిసార్లు భారత జట్టును సారథిగా ముందుకు నడిపించాడు. ఇందులో ఏకంగా పన్నెండుసార్లు టీమిండియా గెలిచింది. రాహుల్‌ కెప్టెన్సీలో 14 వన్డేలకు గానూ తొమ్మిదింట విజయం సాధించిన టీమిండియా.. టెస్టుల్లో మూడింటికి రెండు, టీ20లలో ఒకటికి ఒకటి గెలిచింది.మరో విశేషం ఏమిటంటే.. రాహుల్‌ కెప్టెన్సీలో విరాట్‌ కోహ్లి ఇప్పటికి ఏకంగా నాలుగు శతకాలు బాదడం విశేషం. ఓవరాల్‌గా రాహుల్‌ సారథ్యంలో కోహ్లి సాధించిన స్కోర్లు వరుసగా... 122,51,0,65,113,135,102. ఇందులో చివరి రెండు సెంచరీలు సౌతాఫ్రికాతో వన్డేల్లో బాదినవే.ఏదేమైనా.. టీమిండియా విజయాల్లో అనేకసార్లు కీలక పాత్ర పోషించిన రాహుల్‌.. తెరవెనుకే ఉండిపోతున్నాడనే అభిప్రాయం అతడి అభిమానుల్లో ఉంది. అంతేకాదు.. కెప్టెన్‌గానూ రాణించగల సత్తా ఉన్నా ఈ 33 ఏళ్ల ఆటగాడికి అదృష్టం కలిసి రావడం లేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో వన్డే సారథిగా రాహులే సరైనోడు అన్న విషయాన్ని యాజమాన్యం గుర్తిస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: 5 ఏళ్లలో 23 సెంచరీలు.. టెస్ట్‌ క్రికెట్‌పై రూట్‌ పంజా

Special Story on Shai Hope4
ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్న కరీబియన్‌ యోధుడు

1970, 80 దశకాల్లో ప్రపంచ క్రికెట్‌ను శాశించిన వెస్టిండీస్‌ జట్టు ప్రస్తుతం ఉనికి కోసం పోరాడుతుంది. స్టార్‌ ఆటగాళ్ల రిటైర్మెంట్‌, బోర్డు ఆర్థిక సమస్యలు, ఆటగాళ్ల మధ్య విభేదాలు, మౌలిక సదుపాయాల లోపం కారణంగా ఆ జట్టు కనీసం చిన్న జట్లకు కూడా పోటీ ఇవ్వలేని స్థితిలో ఉంది. రెండు సార్లు వన్డే ప్రపంచకప్‌ (1975, 1979), రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ (2012, 2016) ఛాంపియన్‌ అయిన ఆ జట్టు ప్రస్తుతం ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటేనే ఇబ్బంది పడుతుందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.ఇలాంటి పరిస్థితుల్లో ఆ జట్టును ఓ 'హోప్‌' నిలబెడుతుంది. ఆ హోప్‌ పేరే 'షాయ్‌ హోప్‌' (Shai Hope). ఈ బార్బడోస్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ప్రస్తుతం విండీస్‌ క్రికెట్‌కు ఆశాకిరణంలా మారాడు. విండీస్‌ జట్టు అడపాదడపా విజయాలు సాధిస్తుందంటే ఈ హోప్‌ పుణ్యమే. ఈ హోపే లేకుంటే విండీస్‌ క్రికెట్‌కు నామరూపాలు కూడా లేవు.ఈ ఒక్కడే నిలకడగా రాణిస్తూ ప్రపంచ క్రికెట్‌ పటంలో విండీస్‌ పేరు తుడిచిపెట్టుకుపోకుండా కాపాడుతున్నాడు. ఫార్మాట్‌లో ఏదైనా ఇతనికి అండగా నిలబడే ఒక్క ప్లేయర్‌ కూడా ప్రస్తుత విండీస్‌ జట్టులో లేడు. ఎవరైనా ఉన్నా వారు వన్‌ మ్యాచ్‌ వండర్‌లానే మిగిలిపోతున్నారు.హోప్‌ ఒక్కడే బ్యాటర్‌గా, వికెట్‌కీపర్‌గా, కెప్టెన్‌గా (పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో) త్రిపాత్రాభినయం చేస్తూ విండీస్‌ క్రికెట్‌ను బ్రతికిస్తున్నాడు. గడిచిన ఐదేళ్లలో ఈ హోప్‌ మరింత రాటుదేలాడు. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో సత్తా చాటుతూ ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లకు పోటీగా మారాడు. ఫార్మాట్‌ ఏదైనా హోప్‌ తన తడాఖా చూపుతున్నాడు.తొలుత టెస్ట్‌ల్లో కాస్త వీక్‌గా కనిపిం​చినా, క్రమంగా ఈ ఫార్మాట్‌పై కూడా తన ముద్ర వేశాడు. ఈ ఏడాది ఇప్పటికే ఇంగ్లండ్‌ గడ్డపై 2, భారత్‌లో ఒకటి, తాజాగా న్యూజిలాండ్‌ గడ్డపై సెంచరీ చేశాడు. వాస్తవానికి హోప్‌ అత్యుత్తమంగా ఆడే ఫార్మాట్‌ వన్డే క్రికెట్‌. ఈ ఫార్మాట్‌లో హోప్‌ను మించినోడు లేడు. అతని గణాంకాలే ఇందుకు నిదర్శనం. 148 మ్యాచ్‌ల్లో అతను 50కి పైగా సగటుతో 19 సెంచరీల సాయంతో 6000 పైచిలుకు పరుగులు చేశాడు. ఈ గణాంకాలు టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి గణాంకాలతో పోటీపడతాయి. ముఖ్యంగా ఈ ఏడాది హోప్‌ ఫార్మాట్లకతీంగా అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టీ20 శతకంతో మొదలుకొని భారత్‌లో టెస్ట్‌ శతకం, పాకిస్తాన్‌లో వన్డే శతకం, న్యూజిలాండ్‌లో మరో వన్డే శతకం, తాజాగా న్యూజిలాండ్‌లో టెస్ట్‌ శతకం సాధించి ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు రేసులో ముందువరుసలో ఉన్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ (1732) ఒక్కడే హోప్‌ (1677) కంటే ఎక్కువ పరుగులు చేశాడు.తాజాగా హోప్‌ న్యూజిలాండ్‌పై చేసిన టెస్ట్‌ సెంచరీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. కంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూనే హోప్‌ ఈ సెంచరీ చేశాడు. 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను (116) కొనసాగిస్తున్నాడు. 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వీరోచిత పోరాటాన్ని ప్రదర్శిస్తున్నాడు.జస్టిన్‌ గ్రీవ్స్‌తో (55) కలిసి ఐదో వికెట్‌కు అజేయమైన 140 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో విండీస్‌ గెలవాంటే చివరి రోజు 319 పరుగులు చేయాలి. హోప్‌ కసి చూస్తే విండీస్‌కు సంచలన విజయం అందించేలా కనిపిస్తున్నాడు. ఇదే జరిగితే విండీస్‌ క్రికెట్‌ పునర్జన్మకు బీజం​ పడినట్లే.

I Want To Hold 2027 WC: Rohit Sharma Eyelash Wish With Pant Decoded5
రిషభ్‌ పంత్‌ చేసిన పనికి.. రోహిత్‌ శర్మ రియాక్షన్‌ వైరల్‌

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో బ్యాట్‌తో పరుగుల వరద పారించే హిట్‌మ్యాన్‌.. సారథిగా గంభీరంగా కనిపిస్తూనే.. పరిస్థితులకు తగ్గట్లు నవ్వులు పూయించడంలోనూ ముందే ఉంటాడు. ఇక మైదానం వెలుపల సహచర ఆటగాళ్లతో రోహిత్‌ ఫ్రెండ్లీగా ఉంటాడనే విషయం అతడి అభిమానులకు బాగా తెలుసు.తానొక లెజెండరీ బ్యాటర్‌, కెప్టెన్‌ని అనే గర్వం రోహిత్‌ శర్మ (Rohit Sharma)లో అస్సలు కనిపించదు. తోటి ఆటగాళ్లను ఆటపట్టించడంలో ముందుండే హిట్‌మ్యాన్‌.. తన పట్ల వారు కూడా అదే విధంగా ప్రవర్తించినా సరదాగానే ఉంటాడు. ఈ విషయాన్ని రుజువు చేసే ఘటన ఇటీవల చోటు చేసుకుంది.మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా..టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికా (IND vs SA)తో వరుస సిరీస్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టెస్టుల్లో సఫారీల చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది. ఆఖరి ఓవర్‌ ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో గట్టెక్కిన టీమిండియా.. రెండో వన్డేలో మాత్రం 358 పరుగులు చేసినా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.రాలిపడ్డ కనురెప్పఈ రెండు వన్డేల్లో రోహిత్‌ శర్మ వరుసగా 57, 14 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. రాయ్‌పూర్‌ వేదికగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో సహచర ఆటగాడు, బెంచ్‌కే పరిమితమైన రిషభ్‌ పంత్‌ (Rishabh Pant).. రోహిత్‌ను ఆటపట్టించాడు. రోహిత్‌ కంటి నుంచి రాలిపడిన రెప్పను పట్టుకున్న పంత్‌.. అతడి చెయ్యిపై ఉంచి.. ఓ కోరిక కోరుకోమన్నాడు.ఇంతకీ రోహిత్‌ ఏం కోరుకున్నాడు?ఇందుకు నవ్వులు చిందించిన రోహిత్‌ అలాగే చేశాడు. వీరిద్దరు ఇలా సరదాగా సంభాషిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ నేపథ్యంలో.. ‘ఇంతకీ రోహిత్‌ ఏం కోరుకున్నాడు?’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై రోహిత్‌ శర్మ సన్నిహితుడు అభిషేక్‌ నాయర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ వేదికగా స్పందించాడు.రెండే రెండు కోరికలు‘‘నాకు తెలిసి ప్రస్తుతం రోహిత్‌కు రెండే రెండు కోరికలు ఉండి ఉంటాయి. ఒకటేమో.. ‘నేను 2027 వన్డే వరల్డ్‌కప్‌ను నా చేతుల్లో పట్టుకోవాలి’ అని.. మరొకటి.. సౌతాఫ్రికాతో మూడో వన్డేలో సెంచరీ చేయాలని’’ అంటూ అభిషేక్‌ నాయర్‌.. రోహిత్‌ శర్మ మాటలను డీకోడ్‌ చేశాడు. ఇదిలా ఉంటే.. భారత్‌-సౌతాఫ్రికా మధ్య శనివారం విశాఖపట్నం వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. కాగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్‌-2024, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 అందించిన రోహిత్‌ శర్మను.. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బీసీసీఐ వన్డే కెప్టెన్సీ తొలగించిన విషయం తెలిసిందే. ఇక అంతకు ముందు రోహిత్‌.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌తో పాటు.. టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.చదవండి: 5 ఏళ్లలో 23 సెంచరీలు.. టెస్ట్‌ క్రికెట్‌పై రూట్‌ పంజా

Travis Head and Jake Weatherald surpass Rohit-Gill to break massive Test feat vs ENG6
గిల్‌-రోహిత్‌ రికార్డు బద్దలు

యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ ఓపెనింగ్‌ జోడీ జేక్‌ వెదరాల్డ్‌-ట్రవిస్‌ హెడ్‌ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించారు. తద్వారా ఇంగ్లండ్‌పై డే అండ్‌ నైట్‌ టెస్ట్‌లో తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా సరికొత్త రికార్డు నెలకొల్పారు. గతంలో ఈ రికార్డు టీమిండియా ఓపెనింగ్‌ జోడీ రోహిత్‌ శర్మ-శుభ్‌మన్‌ గిల్‌ పేరిట ఉండేది. ఈ జోడీ 2021 అహ్మదాబాద్‌ టెస్ట్‌లో తొలి వికెట్‌కు అజేయమైన 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.మ్యాచ్‌ విషయానికొస్తే.. ఓవర్‌నైట్‌ స్కోర్‌కు (325/9) మరో తొమ్మిది పరుగులు జోడించిన అనంతరం ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌కు 334 పరుగుల వద్ద తెరపడింది. లబూషేన్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టడంతో జోఫ్రా ఆర్చర్‌ (38) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆసీస్‌ గడ్డపై తొలి శతకం బాదిన రూట్‌ (138) అజేయ బ్యాటర్‌గా నిలిచాడు. ఆర్చర్‌ వికెట్‌ బ్రెండన్‌ డాగెట్‌కు దక్కింది. తొలి రోజు ఆటలో నిప్పులు చెరిగిన స్టార్క్‌ 6 వికెట్లతో ఇన్నింగ్స్‌ను ముగించాడు. మైఖేల్‌ నెసర్‌, స్కాట్‌ బోలాండ్‌కు తలో వికెట్‌ దక్కింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే 76, బ్రూక్‌ 31, స్టోక్స్‌ 19, విల్‌ జాక్స్‌ 19, అట్కిన్సన్‌ 4 పరుగులు చేయగా.. డకెట్‌, పోప్‌, జేమీ స్మిత్‌, కార్స్‌ డకౌట్లయ్యారు.అనంతరం బరిలోకి దిగిన ఆసీస్‌ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అరంగేట్రం టెస్ట్‌లో విఫలమైన ఓపెనర్‌ జేక్‌ వెదరాల్డ్‌ చెలరేగి ఆడాడు. శైలికి భిన్నంగా హెడ్‌ నిదానంగా ఆడాడు. వీరి జోడి తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించిన తర్వాత బ్రైడన్‌ కార్స్‌ బౌలింగ్‌లో హెడ్‌ (33) ఔటయ్యాడు. అనంతరం లబూషేన్‌ వెదరాల్డ్‌తో జత కలిశాడు. హెడ్‌ ఔటయ్యాక వెదరాల్డ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లబూషేన్‌తో కలిసి రెండో వికెట్‌కు అజేయమైన 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండో రోజు టీ విరామం సమయానికి వెదరాల్డ్‌ 59, లబూషేన్‌ 27 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 21 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 130/1గా ఉంది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 204 పరుగులు వెనుకపడి ఉంది.

Root Remains 138 Not Out, England 1st Innings ends at 3347
అజేయ రూట్‌.. ముగిసిన ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌

బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌కు (325/9) మరో 9 పరుగులు మాత్రమే జోడించి చివరి వికెట్‌ కోల్పోయింది. లబూషేన్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టడంతో జోఫ్రా ఆర్చర్‌ (38) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆసీస్‌ గడ్డపై తొలి శతకం బాదిన రూట్‌ (138) అజేయ బ్యాటర్‌గా నిలిచాడు. ఆర్చర్‌ వికెట్‌ బ్రెండన్‌ డాగెట్‌కు దక్కింది. తొలి రోజు ఆటలో నిప్పులు చెరిగిన స్టార్క్‌ 6 వికెట్లతో ఇన్నింగ్స్‌ను ముగించాడు. మైఖేల్‌ నెసర్‌, స్కాట్‌ బోలాండ్‌కు తలో వికెట్‌ దక్కింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే 76, బ్రూక్‌ 31, స్టోక్స్‌ 19, విల్‌ జాక్స్‌ 19, అట్కిన్సన్‌ 4 పరుగులు చేయగా.. డకెట్‌, పోప్‌, జేమీ స్మిత్‌, కార్స్‌ డకౌట్లయ్యారు.ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. వారి ఈ సంతోషాన్ని స్టార్క్‌ ఎంతో సేపు మిగిల్చలేదు. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌, అదే స్కోర్‌ వద్ద వన్‌ డౌన్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ను డకౌట్‌ చేశాడు. స్టార్క్‌ నిప్పులు చెరగడంతో 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ ఆతర్వాత కుదురుకుంది.రూట్‌, క్రాలే అద్బుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి మూడో వికెట్‌కు 117 పరుగులు జోడించారు. అనంతరం రూట్‌తో జత కలిసిన బ్రూక్‌ కాసేపు పోరాడాడు. నాలుగో వికెట్‌కు వీరిద్దరు 54 పరుగులు జోడించారు. బ్రూక్‌ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన స్టోక్స్‌ ఇంగ్లిస్‌ అద్భుతమైన డైరెక్ట్‌ త్రో కారణంగా రనౌటయ్యాడు.ఆతర్వాత జేమీ డకౌట్‌ కాగా.. జాక్స్‌ పోరాడే ప్రయత్నంలో వికెట్‌ సమర్పించుకున్నాడు. ఆతర్వాత వచ్చిన అట్కిన్సన్‌, కార్స్‌ ఇలా వచ్చి అలా వెళ్లారు. రూట్‌ ఆర్చర్‌తో కలిసి చివరి వికెట్‌కు 70 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ 7.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. వెదరాల్డ్‌ 15, ట్రవిస్‌ హెడ్‌ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఆసీస్‌ ఇంకా 312 పరుగులు వెనుకపడి ఉంది.

NZ VS WI 1st Test: HUNDRED FOR SHAI HOPE IN THE 4th INNINGS8
హోప్‌ వీరోచిత శతకం.. కంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూనే..!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో విండీస్‌ స్టార్‌ బ్యాటర్‌ షాయ్‌ హోప్‌ (Shai Hope) అద్భుత శతకంతో మెరిశాడు. కంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూనే ఈ సెంచరీ నమోదు చేశాడు. 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను (103) కొనసాగిస్తున్నాడు. 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వీరోచిత పోరాటాన్ని ప్రదర్శిస్తున్నాడు.జస్టిన్‌ గ్రీవ్స్‌తో (42) కలిసి ఐదో వికెట్‌కు అజేయమైన 110 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో విండీస్‌ గెలవాలంటే ఇంకా 349 పరుగులు చేయాలి. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్‌ 182/4గా ఉంది. నాలుగో రోజు మూడో సెషన్‌ ఆట కొనసాగుతుంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో విండీస్‌ గెలవలేదు.అంతకుముందు టామ్‌ లాథమ్‌ (145), రచిన్‌ రవీంద్ర (176) భారీ శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ (466/8) చేసింది. కీమర్‌ రోచ్‌ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. దీనికి ముందు.. జేకబ్‌ డఫీ ఐదేయడంతో విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లోనూ హోప్‌ (56) రాణించాడు. తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (52) అర్ద సెంచరీతో పర్వాలేదనిపించాడు.అంతకుముందు న్యూజిలాండ్‌ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. విండీస్‌ బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో 231 పరుగులకే ఆలౌటైంది. కేన్‌ విలియమ్సన్‌ (52) ఒక్కడే కివీస్‌ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఇది.

Special story on Joe root test cricket journey in last 5 years9
5 ఏళ్లలో 23 సెంచరీలు.. టెస్ట్‌ క్రికెట్‌పై రూట్‌ పంజా

బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో (పింక్‌ బాల్‌) ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ (Joe Root) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. అప్పటికే 39 సెంచరీలు చేసినా, రూట్‌కు ఆసీస్‌ గడ్డపై ఇదే తొలి శతకం. కాబట్టి ఈ సెంచరీ రూట్‌కు చాలా ప్రత్యేకం. ఈ సెంచరీ ఆసీస్‌ దిగ్గజ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌కు కూడా చాలా ప్రత్యేకమే.ఎందుకంటే, ఈ యాషెస్‌ సిరీస్‌లో రూట్‌ సెంచరీ చేయకపోతే మెల్‌బోర్న్‌ గ్రౌండ్‌లో నగ్నంగా తిరుగుతానని హేడెన్‌ సవాల్‌ చేశాడు. బ్రిస్బేన్‌ టెస్ట్‌లో సెంచరీ చేసి రూట్‌ తన ప్రతిష్ట పెంచుకోవడంతో పాటు హేడెన్‌ పరువు కూడా కాపాడాడు. తాజా సెంచరీ నేపథ్యంలో రూట్‌ టెస్ట్‌ కెరీర్‌పై ఓ ప్రత్యేక కథనం.2012లో మొదలైన రూట్‌ టెస్ట్‌ కెరీర్‌ 2020 వరకు ఓ మోస్తరుగా సాగింది. అరంగేట్రం ఇయర్‌లో కేవలం రెండు ఇన్నింగ్స్‌లకే పరిమితమైన అతను.. ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 93 పరుగులు చేశాడు. ఆతర్వాతి ఏడాది నుంచి రూట్‌ కెరీర్‌ క్రమక్రమంగా మెరుగుపడుతూ వచ్చింది. 2013లో 2 సెంచరీలు.. ఆతర్వాత వరుసగా మూడేళ్లు మూడుమూడు సెంచరీలు, ఆతర్వాత వరుసగా మూడేళ్లు రెండ్రెండు సెంచరీలు చేశాడు.2020 తర్వాత రూట్‌ కెరీర్‌ ఊహించని మలుపు తిరిగింది. అప్పటివరకు సాధారణ బ్యాటర్‌గా కొనసాగిన అతను ఒక్కసారిగా బీస్ట్‌ మోడ్‌లోకి వచ్చాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకోవడంతో పాటు తన జట్టుకు అపురూప విజయాలనందించాడు. రూట్‌ అత్యుత్తమ ఫామ్‌ను అందుకునే సమయానికి టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి కూడా అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. వీరికి స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌ కూడా తోడయ్యారు.ఈ నలుగురు కలిసి 2020 దశకం ప్రారంభంలో టెస్ట్‌ క్రికెట్‌ను ఓ ఊపు ఊపారు. వీరి పుణ్యమా అని పోయిన టెస్ట్‌ క్రికెట్‌ క్రేజ్‌ తిరిగి వచ్చింది. టీ20లకు అలవాటు పడిపోయిన అభిమానులు వీరి బ్యాటింగ్‌ విన్యాసాల కారణంగా టెస్ట్‌లను కూడా ఫాలో అవడం​ మొదలుపెట్టారు. ఫాబ్‌-4గా కీర్తించబడే ఈ నలుగురు దిగ్గజాలు ఘన చరిత్ర కలిగిన సుదీర్ఘ ఫార్మాట్‌కు పునర్జన్మ కల్పించారు.ఇక్కడ రూట్‌ ప్రస్తావన ఉంది కాబట్టి, మనం గమనించాల్సిన ఓ హైలైట్‌ అంశం ఉంది. ముందుగా చెప్పుకున్నట్లు రూట్‌ 2.0 సమయానికి ఫాబ్‌-4లో మిగతా ముగ్గురు (విరాట్‌, స్మిత్‌, కేన్‌) అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నారు. రూట్‌ అప్పుడప్పుడే వారితో పోటీపడటం​ మొదలుపెట్టాడు. 2021కి ముందు రూట్‌ 177 ఇన్నింగ్స్‌ల్లో 17 సెంచరీలు చేయగా.. అప్పటికే విరాట్‌ ఖాతాలో 27 (147 ఇన్నింగ్స్‌లు), స్మిత్‌ ఖాతాలో 26 (135), కేన్‌ మామ ఖాతాలో 23 టెస్ట్‌ శతకాలు (143) ఉన్నాయి.ఐదేళ్లు తిరిగే సరికి ఫాబ్‌-4 ఆటగాళ్ల సెంచరీల క్రమం తిరిగబడిపోయింది. 2020 తర్వాత రూట్‌ ఏకంగా 23 సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అవతరించగా.. 2021 నాటికి టాప్‌ ప్లేస్‌లో ఉండిన విరాట్‌ గడిచిన ఐదేళ్లలో కేవలం 3 సెంచరీలకు మాత్రమే పరిమితమై ఆఖరి స్థానానికి చేరాడు. ఈ ఐదేళ్లలో స్మిత్‌, కేన్‌ మామ తలో 10 సెంచరీలు చేసి కెరీర్‌లు నిలకడగా కొనసాగించారు.2021లో 6, 2022లో 5, 2023లో 2, 2024లో 6, తాజా సెంచరీతో కలుపుకొని రూట్‌ ఈ ఏడాది ఇప్పటికే 4 సెంచరీలు చేశాడు. ఫాబ్‌-4లో ప్రస్తుతం రూట్‌ 40 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. స్మిత్‌ 36, కేన్‌ 33, విరాట్‌ 30 సెంచరీలతో వరుస స్థానాల్లో ఉన్నారు.అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో రూట్‌ (59) విరాట్‌ (84) తర్వాతి స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత రోహిత్‌ శర్మ (50), కేన్‌ (48), స్మిత్‌ (48) టాప్‌-5లో ఉన్నారు.రూట్‌ టెస్ట్‌ల్లో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే త్వరలో దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డులు బద్దలవడం​ ఖాయం. పరుగుల విషయంలో సచిన్‌కు మరో 2300 దూరంలో ఉన్న రూట్‌.. మరో 12 సెంచరీలు చేస్తే సచిన్‌ను అధిగమిస్తాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. రూట్‌ అజేయ సెంచరీతో (135) ఆదుకోవడంతో ఇంగ్లండ్‌ తొలి రోజు గౌరవప్రదమైన స్థానంలో ఉంది. రూట్‌కు జాక్‌ క్రాలే (76) సహకరించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 325/9గా ఉంది. 264 పరుగుల వద్దే తొమ్మిదో వికెట్‌ కోల్పోయినా, రూట్‌ జోఫ్రా ఆర్చర్‌ (32 నాటౌట్‌) సాయంతో 300 పరుగుల మార్కును దాటించాడు. స్టార్క్‌ 6 వికెట్లతో సత్తా చాటాడు.

ILT20 2025: Though Pollard Shine, MIE Lost the match to Gulf Giants10
పోలార్డ్‌ మెరిసినా, ముంబై ఓడెన్‌..!

దుబాయ్‌ వేదికగా జరిగే ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. నిన్న (డిసెంబర్‌ 4) గల్ఫ్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐఎ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.కెప్టెన్‌ పోలార్డ్‌ (33 బంతుల్లో 50; 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో, నికోలస్‌ పూరన్‌ (39 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించారు. ఆఖర్లో షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (6 బంతుల్లో 18 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించాడు. మిగతా బ్యాటర్లలో ముహమ్మద్‌ వసీం 1, బెయిర్‌స్టో 11, బాంటన్‌ 6, తేజిందర్‌ దిల్లాన్‌ 15, రషీద్‌ ఖాన్‌ 6 (నాటౌట్‌) పరుగులు చేశారు. జెయింట్స్‌ బౌలర్లలో నువాన్‌ తుషార, అజ్మతుల్లా తలో 2, హైదర్‌ రజ్జాక్‌, మొయిన్‌ అలీ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.అనంతరం సాధారణ లక్ష్య ఛేదనకు దిగిన జెయింట్స్‌ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పథుమ్‌ నిస్సంక (42 బంతుల్లో 81; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో 14.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నిస్సంకకు మొయిన్‌ అలీ (26), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (39 నాటౌట్‌) సహకరించారు. ఎంఐ బౌలర్లలో వోక్స్‌కు 2, ఘజనఫర్‌కు ఓ వికెట్‌ దక్కింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement