Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IND vs SA 2nd Test Target 549: Indias highest successful run chases List1
టెస్టుల్లో టీమిండియా అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?

భారత్‌తో రెండో టెస్టులో సౌతాఫ్రికా సమిష్టిగా రాణించింది. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన సఫారీలు.. పర్యాటక జట్టును కేవలం 201 పరుగులకే ఆలౌట్‌ చేసి సత్తా చాటారు.ఫలితంగా టీమిండియా కంటే తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్న సౌతాఫ్రికా.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత్‌ను ఫాలో ఆన్‌ ఆడించకుండా సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి వికెట్‌ నష్టపోకుండా 26 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. ఓవర్‌నైట్‌ స్కోరుకు మంగళవారం మరో 234 పరుగులు జత చేసింది.తద్వారా ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది సౌతాఫ్రికా. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని (288+260) టీమిండియాకు ఏకంగా 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. కాగా ఆసియాలో ఇంత వరకు ఏ జట్టు కూడా టెస్టుల్లో 400కు పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేవు. దీంతో టీమిండియా విజయంపై సందేహాలు నెలకొన్నాయి.మరి టెస్టుల్లో భారత్‌ అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? (టాప్‌-5 జాబితా)1976లో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో టార్గెట్‌ 403.. భారత్‌ విజయం (406/4)2008లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టార్గెట్‌ 387.. భారత్‌ విజయం (387/4)2021లో బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టార్గెట్‌ 328.. భారత్‌ విజయం (329/7)2011లో ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో టార్గెట్‌ 276.. భారత్‌ విజయం (276/5)2001లో కాండీ వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో టార్గెట్‌ 264.. భారత్‌ విజయం (264/5).

Hazlewood likely to be available for Ashes 3rd Test Cummins Trains With2
గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు అదిరిపోయే శుభవార్తలు

స్వదేశంలో ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ (Ashes 2025-26)ను ఆస్ట్రేలియా విజయంతో మొదలుపెట్టింది. పెర్త్‌ వేదికగా తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇరుజట్ల మధ్య డిసెంబరు 4- 8 వరకు రెండో టెస్టుకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే.ఆ ఇద్దరు వచ్చేస్తున్నారా!బ్రిస్బేన్‌లోని గాబా మైదానంలో ఈ డే- నైట్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ పింక్‌ బాల్‌ టెస్టు (Pink Ball Test)కు ముందు ఆస్ట్రేలియాకు అదిరిపోయే శుభవార్తలు అందాయి. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌తో పాటు స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. కాగా తొడ కండరాల గాయంతో హాజిల్‌వుడ్‌ ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.మరోవైపు.. ప్యాట్‌ కమిన్స్‌ ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే, హాజిల్‌వుడ్‌ సిడ్నీలోని క్రికెట్‌ సెంట్రల్‌లో బాల్‌తో ప్రాక్టీస్‌ మొదలుపెట్టినట్లు సమాచారం. కమిన్స్‌ కూడా పింక్‌ బాల్‌తో నెట్స్‌లో శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ఆస్ట్రేలియా హెడ్‌కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ మాట్లాడుతూ..పూర్తి స్థాయిలో కోలుకుంటేనే‘‘యాషెస్‌ సిరీస్‌లో ఏదో ఒక దశలో హాజిల్‌వుడ్‌ అందుబాటులోకి వస్తాడని మాకు తెలుసు. అయితే, ఇంకాస్త ముందుగానే అతడు జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇక కమిన్స్‌ రిహాబిలిటేషన్‌ దాదాపుగా పూర్తై పోయింది.తన బౌలింగ్‌లో వేగం కనిపిస్తోంది. అతడు సానుకూలంగా ముందుకు సాగుతున్నాడు. అయితే, కమిన్స్‌ను మ్యాచ్‌ ఆడే విషయంలో తొందరపెట్టలేము. అతడు పూర్తి స్థాయిలో కోలుకుంటేనే రంగంలోకి దిగుతాడు’’ అని మెక్‌డొనాల్డ్‌ తెలిపాడు. కాగా యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్టులకు జరుగనున్నాయి. కమిన్స్‌ గైర్హాజరీలో స్టీవెన్‌ స్మిత్‌ ఆసీస్‌ సారథిగా వ్యవహరిస్తున్నాడు.చదవండి: IND vs SA: భారీ ఆధిక్యంలో సౌతాఫ్రికా.. టీమిండియాకు కష్టమే!

PM Modi Congratulates Indian Blind womens team for winning T20 WC3
ప్రపంచకప్‌ విజేతలకు ప్రధాని అభినందన

న్యూఢిల్లీ: తొలిసారి నిర్వహించిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం సమష్టితత్వం, అంకితభావానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆదివారం టీమిండియా 7 వికెట్ల తేడాతో నేపాల్‌పై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. ‘మొదటిసారి జరిగిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు. ఓటమి ఎరగకుండా ట్రోఫీ నెగ్గడం మరింత గొప్పవిషయం. ఇది నిజంగా చారిత్రాత్మక విజయం. జట్టు సమష్టి కృషి, పట్టుదలకు ఇది నిదర్శనం. ప్రతీ క్రీడాకారిణీ ఒక చాంపియన్‌. ఈ ఘనత రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది’ అని ప్రధాని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సెమీస్‌లో ఆ్రస్టేలియాపై విజయం సాధించిన భారత్‌ అంతకుముందు లీగ్‌ దశలో శ్రీలంక, ఆ్రస్టేలియా, నేపాల్, అమెరికా, పాకిస్తాన్‌పై నెగ్గింది. అదే విధంగా.. మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ టోర్నీలోనూ భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఫైనల్లో చైనీస్‌ తైపీని ఓడించి వరుసగా రెండోసారి చాంపియన్లుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భారత మహిళా కబడ్డీ జట్టును కూడా అభినందించారు.

He Was Shocked Cried Before Smriti He Take: Palash Muchhal Mother4
స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్‌ ముచ్చల్‌ తల్లి

భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) వివాహం ఊహించని పరిణామంతో వాయిదా పడింది. ప్రియుడు, బాలీవుడ్‌ సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌ (Palash Mucchal)తో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన వేళ.. ఆమె తండ్రి శ్రీనివాస్‌ మంధాన అనారోగ్యం పాలయ్యారు. గుండెపోటు లక్షణాలతో సాంగ్లీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.స్మృతి- పలాష్‌ పెళ్లి నిరవధికంగా వాయిదాఈ నేపథ్యంలో తండ్రి చూడని వేడుక తనకు వద్దంటూ స్మృతి.. పలాష్‌తో పెళ్లిని వాయిదా వేసుకుందని ఆమె మేనేజర్‌ మీడియాకు చెప్పారు. ఓవైపు తండ్రి విషయంలో స్మృతి ఆందోళన చెందుతుండగా.. మరోవైపు.. ఆమెకు కాబోయే భర్త పలాష్‌ ముచ్చల్‌ కూడా ఆస్పత్రిపాలయ్యాడు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, ఎసిడిటీతో అతడు ముంబైలోని గోరేగావ్‌ ఆస్పత్రిలో చేరాడు.వరుస మ్యూజిక్‌ కన్సర్టులు, పెళ్లి పనుల కారణంగానే పలాష్‌ ముచ్చల్‌ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని.. అందుకే అతడి ఆరోగ్యం చెడిపోయిందని ఎన్‌డీటీవీకి అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, స్మృతి- పలాష్‌ పెళ్లి నిరవధికంగా వాయిదా పడటంపై సోషల్‌ మీడియాలో ఊహించని విధంగా వదంతులు పుట్టుకువచ్చాయి. ఇరు కుటుంబాల మధ్య సఖ్యత చెడిందా అనేలా గాసిప్‌రాయుళ్లు పుకార్లు పుట్టిస్తున్నారు.స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడుఈ నేపథ్యంలో పలాష్‌ ముచ్చల్‌ తల్లి అమిత.. ట్రోల్స్‌కు దిమ్మతిగిరేలా కౌంటర్‌ ఇచ్చారు. హిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘స్మృతి తండ్రి అంటే పలాష్‌కు ఎంతో ఇష్టం. స్మృతి కంటే ఆమె తండ్రి దగ్గరే పలాష్‌కు సాన్నిహిత్యం ఎక్కువ.ఆయన అనారోగ్యం బారిన పడ్డారని తెలియగానే.. స్మృతి కంటే ముందు పలాష్‌ స్పందించాడు. తనే పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు. స్మృతి తండ్రి కోలుకునేంత వరకు వివాహ వేడుకను వాయిదా వేయాలని చెప్పాడు. తీవ్రమైన ఒత్తిడిహల్దీ తర్వాత పలాష్‌ను బయటకు ఎక్కడికీ పంపలేదు. స్మృతి తండ్రికి ఛాతీ నొప్పి వచ్చిందని తెలియగానే పలాష్‌ చాలా సేపు ఏడుస్తూనే ఉన్నాడు. దీంతో అతడి ఆరోగ్యం కూడా పాడైంది. ఆస్పత్రిలోనే నాలుగు గంటల సేపు ఉంచారు. ఐవీ డ్రిప్‌ పెట్టారు. ఈసీజీ తీశారు. ఇతరత్రా పరీక్షలు కూడా చేశారు. అన్ని రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయి.అయితే, ఇప్పటికీ ఒత్తిడి నుంచి బయటపడలేకపోతున్నాడు’’ అని పలాష్‌ ముచ్చల్‌ తల్లి అమితా ముచ్చల్‌ తెలిపారు. కాగా పలాష్‌ అక్క, బాలీవుడ్‌ సింగర్‌ పాలక్‌ ముచ్చల్‌ కూడా తన సోదరుడి వివాహం గురించి స్పందించారు. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగానే పెళ్లి వాయిదా పడిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ గోప్యతకు భంగం కలిగించవద్దని కోరారు. చదవండి: పీవీ సింధు ఫిట్‌నెస్‌పై సైనా నెహ్వాల్‌ కీలక వ్యాఖ్యలు

IND vs SA 2nd Test Day 4: South Africa Lead 395 At Tea Break5
IND vs SA: భారీ ఆధిక్యంలో సౌతాఫ్రికా.. టీమిండియాకు కష్టమే!

టీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) మరింతగా పట్టు బిగిస్తోంది. టీ విరామ సమయానికి 395 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. గువాహటి వేదికగా 26/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో మంగళవారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టింది సౌతాఫ్రికా.ఈ క్రమంలో ప్రొటిస్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజా బంతితో రంగంలోకి దిగాడు. జడ్డూ బౌలింగ్‌లో మూడో బంతికి షాట్‌ ఆడబోయి బంతిని గాల్లోకి లేపిన ర్యాన్‌ రికెల్టన్‌ (35) సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో సౌతాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది.ఇక 29వ ఓవర్లో జడ్డూ మార్క్రమ్‌ (29)ను బౌల్డ్‌ చేయగా.. 32వ ఓవర్లో వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar) అద్భుతం చేశాడు. కెప్టెన్‌ తెంబా బవుమా (3) రూపంలో కీలక వికెట్‌ పడగొట్టాడు. వాషీ బౌలింగ్‌లో లెగ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి బవుమా పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలో టీ విరామ సమయానికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని 395 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా భారత్‌ సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌ ఆడుతోంది. 1-0తో ఆధిక్యంలో సౌతాఫ్రికాఇందులో భాగంగా కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య టీమిండియా సఫారీల చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఇరుజట్ల మధ్య గువాహటిలోని బర్సపరా వేదికగా శనివారం రెండో టెస్టు మొదలు కాగా.. టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేసింది.టాపార్డర్‌ మెరుగ్గా రాణించగా.. టెయిలెండర్లు సెనూరన్‌ ముత్తుస్వామి (109), మార్కో యాన్సెన్‌ (91 బంతుల్లో 93) అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో ప్రొటిస్‌ జట్టు 489 పరుగులకు ఆలౌట్‌ అయింది. తేలిపోయిన భారత బ్యాటర్లుఅనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన భారత్‌ కేవలం 201 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో సౌతాఫ్రికాకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్‌ ఆడిస్తారనుకుంటే.. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ ఆడేందుకే మొగ్గుచూపింది. సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. UPDATE: లంచ్‌ బ్రేక్‌ సమయానికి సౌతాఫ్రికా ఆధిక్యం 508 పరుగులుస్కోరు: 220/4 (70)చదవండి: అసలు సెన్స్‌ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్‌

Body Working Against PV Sindhu Will Our current Pllayers need to: Saina Nehwal6
పీవీ సింధు ఫిట్‌నెస్‌పై సైనా నెహ్వాల్‌ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భారత షట్లర్లు బాగానే రాణిస్తున్నారని, అయితే అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ స్థాయికి తగ్గ శారీరక ఫిట్‌నెస్‌ను ఇంకాస్త మెరుగుపరుచుకోవాలని భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం సైనా నెహ్వాల్‌ (Saina Nehwal) సూచించింది. ప్రత్యర్థుల్ని ఓడించే సత్తా మన ఆటగాళ్లకు ఉందని కావాల్సిందల్లా శారీరక దృఢత్వమేనని చెప్పింది. సింగిల్స్‌లో భారత ఆశాకిరణం లక్ష్యసేన్‌ అని చెప్పింది.పాతవారిని మార్చాలిసైనా నెహ్వాల్‌ మాట్లాడుతూ తరచూ గాయాలపాలవడం, అమ్మాయిల్లో దూకుడు లోపించడం, ప్రస్తుత సోషల్‌ మీడియా యుగంలో మరింత సుకుమారంగా మారడంపై తన అభిప్రాయాల్ని వ్యక్తపరిచింది. ‘మునుపటిలా రాణించాలంటే మనం మరింత నిలకడ సాధించాలి. సాత్విక్‌–చిరాగ్‌ జోడీ, లక్ష్యసేన్, సింధు లేదంటే తర్వాతి తరం ఆటగాళ్లెవరైనా సరే ఫిట్‌నెస్‌కు మరింత ప్రాధాన్యమివ్వాలి.అప్పుడే ఆటలో స్థిరమైన ఫలితాలు సాధించగలం. దీనికోసం మన షట్లర్లు ముందుగా నిష్ణాతులైన కోచ్‌లు, సుశిక్షితులైన ఫిజియోల్ని ఎంచుకోవాలి. అనువైన, అవసరమైన కోచ్‌లు దొరికేవరకూ అన్వేషిస్తూనే ఉండాలి. కచ్చితంగా పాతవారిని మార్చాలి. అప్పుడే వరుసగా టోర్నీలు ఆడేందుకు, టైటిల్స్‌ గెలిచేందుకు ఫిట్‌నెస్‌ స్థాయిల్ని అమాంతం పెరిగేందుకు దోహదపడతాయి’ అని పేర్కొంది. అంతర్జాతీయ చాంపియన్లు విక్టర్‌ అక్సెల్సన్, కరోలినా మారిన్‌లు అదే చేశారని, మేటి కోచ్‌లు, ఫిజియోల కోసం పదే పదే ఫిట్‌నెస్, మెంటల్‌ కండీషనింగ్‌ కోచ్‌లను మార్చారని సైనా గుర్తు చేశారు. సింధు గురించి సైనా మాటల్లో..‘‘శరీరం సహకరించినంత వరకు అంతా బాగుంటుంది. కానీ ఒక్కోసారి శరీరం మనసు మాట వినదు. మనమేమీ యంత్రాలం కాదు కదా!.. చాలా ఏళ్లుగా సింధు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటోంది. తను ఎప్పుడూ తీవ్రమైన గాయాలబారిన పడలేదు. అయితే, వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం సహకరించకపోవచ్చు.తనొక అద్భుతమైన ప్లేయర్‌. టోర్నీల్లో ఎలా గెలవాలో తనకు తెలుసు. అయితే, ముందుగా చెప్పినట్లు ఒక్కోసారి ఫిట్‌నెస్‌ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఒకవేళ సింధు గనుక వాటిని అధిగమిస్తే మున్ముందు ఇంకా గొప్పగా ఆడుతుంది’’ అని సైనా నెహ్వాల్‌ చెప్పుకొచ్చింది.

Kane Williamson Returns New Zealand Announced Team For WI Test Series7
విలియమ్సన్‌ రీఎంట్రీ.. విండీస్‌తో టెస్టులకు కివీస్‌ జట్టు ఇదే

వెల్లింగ్టన్‌: సీనియర్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamson) న్యూజిలాండ్‌ టెస్టు జట్టులో పునరాగమనం చేశాడు. విదేశీ లీగ్‌లలో ఆడేందుకు జాతీయ కాంట్రాక్టుకు దూరమైన విలియమ్సన్‌... పరిమిత మ్యాచ్‌ల్లో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో చాలా మ్యాచ్‌లకు దూరమైన కేన్‌... వచ్చే నెల 2 నుంచి వెస్టిండీస్‌ (NZ vs WI Tests)తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడనున్నాడు. దీని కోసం న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు సోమవారం 14 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టామ్‌ లాథమ్‌ సారథ్యంలో..ఇప్పటికే వెస్టిండీస్‌పై టీ20, వన్డే సిరీస్‌లు నెగ్గిన న్యూజిలాండ్‌... సొంతగడ్డపై సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ బలమైన జట్టుతో బరిలోకి దిగనుంది. టామ్‌ లాథమ్‌ జట్టుకు సారథ్యం వహించనుండగా... కాన్వే, విలియమ్సన్, విల్‌ యంగ్, రచిన్‌ రవీంద్ర, డారిల్‌ మిచెల్, టామ్‌ బ్లండెల్‌ బ్యాటింగ్‌ భారం మోయనున్నారు. ఇక విలియమ్సన్‌ వంటి అనుభవం గల ఆటగాడు జట్టులో ఉండటం ఇతర ఆటగాళ్లకు ఎంతగానో ఉపకరిస్తుందని న్యూజిలాండ్‌ హెడ్‌కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ అన్నాడు. పేస్‌ బౌలర్లు జాక్ ఫౌల్క్స్, జాకబ్‌ డఫీ, బ్లెయిర్‌ టిక్నెర్‌ జట్టులో చోటు దక్కించుకోగా... గాయం నుంచి పూర్తిగా కోలుకోని కైల్‌ జెమీసన్‌ను ఈ సిరీస్‌కు పరిగణించలేదు. వెస్టిండీస్‌తో టెస్టులకు న్యూజిలాండ్ జట్టు టామ్ లాథమ్ (కెప్టెన్‌), టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్‌నర్, కేన్‌ విలియమ్సన్‌, విల్‌ యంగ్‌.చదవండి: అసలు సెన్స్‌ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్‌

Shikhar Dhawan, Harbhajan Singh, Dale Steyn set to feature in Legends Pro T208
మళ్లీ మైదానంలోకి ధావన్, హర్భజన్‌

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్లు శిఖర్‌ ధావన్, హర్భజన్‌ సింగ్‌ సహా పలువురు దిగ్గజ ఆటగాళ్లు లెజెండ్స్‌ ప్రొ టి20 లీగ్‌ బరిలోకి దిగనున్నారు. గోవా వేదికగా వచ్చే ఏడాది జనవరి 26 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఈ లీగ్‌ జరగనుంది. భారత మాజీ ఆటగాళ్లతో పాటు పలువురు అంతర్జాతీయ దిగ్గజాలు సైతం ఈ లీగ్‌లో భాగస్వాములు కానున్నారు. దక్షిణాఫ్రికా పేస్‌ గన్‌ డేల్‌ స్టెయిన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ ఈ జాబితాలో ఉన్నారు. ఆ్రస్టేలియా మాజీ కెపె్టన్‌ మైకేల్‌ క్లార్క్‌ లీగ్‌ కమిషనర్‌గా వ్యవహరించనున్నట్లు నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌జీ గ్రూప్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ లీగ్‌లో మొత్తం 6 ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. అన్నీ జట్లలో కలిపి 90 మంది లెజండరీ ప్లేయర్లు పాల్గొననున్నారు. ‘క్రికెట్‌కు అతిపెద్ద నిలయంగా ఉన్న భారతదేశం నాకు ప్రత్యేక స్థానాన్ని ఇచి్చంది. ఈ లీగ్‌లో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా. ఇక్కడి అభిమానులకు ఆటపై అభిరుచి ఎక్కువ. ఈ లీగ్‌ ద్వారా పలువురు పాత మిత్రులతో పాటు, గతంలో హోరాహోరీగా తలపడిన ప్రత్యర్థులను తిరిగి కలిసే అవకాశం లభించనుంది. లెజెండ్స్‌ ప్రొ టి20 లీగ్‌లో కొత్త పాత్రలో భాగం కావడం సంతోషంగా ఉంది’ అని క్లార్క్‌ పేర్కొన్నాడు.

Italy claims historic third straight Davis Cup title9
ఇటలీదే డేవిస్‌ కప్‌

బొలోగ్నా (ఇటలీ): పురుషుల టెన్నిస్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ ‘డేవిస్‌ కప్‌’లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇటలీ జట్టు విజేతగా నిలిచింది. స్టార్‌ ప్లేయర్‌ జానిక్‌ సినెర్‌ బరిలోకి దిగకుండగానే ఇటలీ జట్టు వరుసగా మూడో సారి డేవిస్‌ కప్‌ కైవసం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఇటలీ 2–0 తేడాతో స్పెయిన్‌ను చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో మాటియో బెర్‌టిని, ఫ్రావియో కొబొలి విజయాలు సాధించడంతో డబుల్స్‌ మ్యాచ్‌ ఆడాల్సిన అవసరం లేకుండానే ఇటలీ విజయం సాధించింది. ఇటలీ జట్టు డేవిస్‌ కప్‌ కైవసం చేసుకోవడం ఓవరాల్‌గా ఇది నాలుగోసారి కాగా... వరుసగా మూడోసారి. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ టోర్నమెంట్‌లో చివరగా అమెరికా జట్టు 1968 నుంచి 1972 వరకు వరుసగా ఐదు సార్లు చాంపియన్‌గా నిలవగా... ఆ తర్వాత మరే జట్టు ‘హ్యాట్రిక్‌’ నమోదు చేయలేదు. గత రెండు సంవత్సరాలు ఇటలీ జట్టు డేవిస్‌ కప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ప్రపంచ రెండో ర్యాంకర్‌ సినెర్‌ ఈ సారి బరిలోకి దిగకపోయినా... బెర్‌టిని, కొబొలి చక్కటి ప్రదర్శనతో ఆ జట్టు విజయం సాధించింది. తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో బెర్‌టిని 6–3, 6–4తో పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్‌)పై విజయం సాధించగా... రెండో సింగిల్స్‌ పోరులో కొబొలి 1–6, 7–6 (7/5), 7–5తో జామె మునార్‌ (స్పెయిన్‌)పై గెలిచాడు. అంతకుముందు క్వార్టర్‌ ఫైనల్లో ఆ్రస్టేలియాపై 2–0తో విజయం సాధించిన ఇటలీ... సెమీఫైనల్లో బెల్జియంపై కూడా 2–0తో గెలుపొందింది. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ లేకుండానే స్పెయిన్‌ బరిలోకి దిగింది. 2019 తర్వాత తొలిసారి ఫైనల్‌ ఆడిన ఆరుసార్లు చాంపియన్‌ స్పెయిన్‌ జట్టు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.

Indian Kabaddi team crowned champions of Womens World Cup 202510
కబడ్డీ మహిళల ప్రపంచకప్‌ విజేత భారత్‌ 

ఢాకా: ప్రపంచకప్‌ మహిళల కబడ్డీ టోర్నమెంట్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్‌ వేదికగా జరిగిన మెగా టోర్నిలో రీతూ నేగి సారథ్యంలోని భారత జట్టు అజేయంగా ట్రోఫీ చేజిక్కించుకొని మట్టి ఆటలో మన ఆధిక్యాన్ని చాటింది. సోమవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు 35–28 పాయింట్ల తేడాతో చైనీస్‌ తైపీని చిత్తు చేసింది. మొత్తం 11 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ సెమీఫైనల్లో పటిష్ట ఇరాన్‌ జట్టును మట్టికరిపించిన మన అమ్మాయిలు... ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించారు. మ్యాచ్‌ ఆరంభం నుంచే ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిన భారత జట్టు... అటు రైడింగ్, ఇటు ట్యాక్లింగ్‌లో ఆకట్టుకుంది. 2012లో భారత్‌ వేదికగా జరిగిన తొలి ప్రపంచకప్‌లో ఇరాన్‌పై గెలిచి చాంపియన్‌గా నిలిచిన టీమిండియా... ఇప్పుడు రెండో సారి ట్రోఫీ హస్తగతం చేసుకుంది. టోర్నీ ఆసాంతం రాణించిన భారత జట్టు... ఫైనల్లో చైనీస్‌ తైపీపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. చక్కటి డిఫెన్స్‌తో పాటు... కీలక సమయాల్లో పాయింట్లు సాధిస్తూ పైచేయి కొనసాగించింది. కెపె్టన్‌ రీతూ నేగి అన్నీ తానై జట్టును నడిపించగా... వైస్‌ కెపె్టన్‌ పుష్ప తన రైడింగ్‌తో కట్టిపడేసింది. జట్టుకు అవసరమైనప్పుడల్లా పాయింట్లు సాధించి ట్రోఫీ కైవసం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది. హెడ్‌ కోచ్‌ తేజస్వి ఆధ్వర్యంలో బరిలోకి దిగిన టీమిండియా... చక్కటి సమన్వయం, సమష్టితత్వంతో కట్టిపడేసింది. తుది పోరు ఆరంభంలో చైనీస్‌ తైపీ గట్టి ప్రతిఘటన కనబర్చే ప్రయత్నం చేసింది. అయితే పట్టువదలని టీమిండియా మ్యాచ్‌ 13వ నిమిషంలో ప్రత్యరి్థని ఆలౌట్‌ చేసి 18–15తో ముందంజ వేసింది. ఈ దశలో భారత కెపె్టన్‌ రీతూ నేగి గాయపడటంతో ఉత్కంఠ పెరిగినా... ఎక్కడా ఒత్తిడికి గురికాని టీమిండియా ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ మ్యాచ్‌పై పట్టు సాధించి జగజ్జేతగా నిలిచింది. రీతూ, పుష్పతో పాటు చంపా ఠాకూర్, భావన ఠాకూర్, సాక్షి శర్మ భారత విజయాల్లో కీలకంగా వ్యవహరించారు. వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టుకు అన్నివైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు భారత మహిళల విజయాన్ని శ్లాఘించారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement