ప్రధాన వార్తలు
సెమీస్లో ఆసీస్ చిత్తు.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
ఐసీసీ అంధుల మహిళల టీ20 ప్రపంచకప్ 2025లో భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం కొలంబో వేదికగా జరిగిన సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో చనకన్ బువాఖావో (34) టాప్ స్కోరర్గా నిలిచింది. ఈ సెమీస్ పోరులో ఆరుగురు ఆస్ట్రేలియా బ్యాటర్లు రనౌట్ అయ్యారు. భారత బౌలర్లలో సిమ్రన్జీత్ కౌర్, జమునా రాణి, అను కుమారి తలా వికెట్ సాధించారు.అనంతరం 110 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో బసంతి హన్సా 45 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. గంగా కదమ్ (41 నాటౌట్), కె. కరుణ (16 నాటౌట్) రాణించారు. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో నేపాల్తో భారత్ తలపడనుంది. రెండో సెమీఫైనలో పాకిస్తాన్ ఓడించి నేపాల్ ఫైనల్కు అర్హత సాధించింది.చదవండి: Bengal squad for SMAT: మహ్మద్ షమీకి చోటిచ్చిన సెలక్టర్లు.. కెప్టెన్ ఎవరంటే?
మహ్మద్ షమీకి చోటిచ్చిన సెలక్టర్లు.. కెప్టెన్ ఎవరంటే?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి తన ఫిట్నెస్ను నిరూపించుకునేందుకు సిద్దమయ్యాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో బెంగాల్ తరపున ఆడనున్నాడు. ఈ టోర్నీ కోసం బెంగాల్ క్రికెట్ అసోయేషిన్ ప్రకటించిన జట్టులో షమీకి చోటు దక్కింది. ఈ జట్టు కెప్టెన్గా వెటరన్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ఎంపికయ్యాడు. షమీతో పాటు టీమిండియా పేసర్ ఆకాష్ దీప్ కూడా బెంగాల్ జట్టులో ఉన్నాడు. ఈ జట్టులో వికెట్ కీపర్గా అభిషేక్ పోరెల్ స్థానం సంపాదించుకున్నాడు. ఇక ఈ టోర్నీ గ్రూప్-సిలో ఉన్న బెంగాల్ జట్టు.. నవంబర్ 26న హైదరాబాద్తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ గ్రూపులో బెంగాల్తో పాటు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, సర్వీసెస్, పుదుచ్చేరి, హర్యానా జట్లు ఉన్నాయి.షమీ రీ ఎంట్రీ ఇస్తాడా?కాగా మహ్మద్ షమీ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. షమీ భారత్ తరపున చివరగా ఈ ఏడాది మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అప్పటి నుంచి అతడు జట్టు బయటే ఉంటున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికి షమీని మాత్రం సెలక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ మొదటి దశలో పూర్తిస్థాయిలో పాల్గొన్న ఈ వెటరన్ పేసర్.. ఏకంగా 20 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం ఫిట్నెస్ సమస్యల కారణంగానే షమీని జట్టులోకి తీసుకోవడం లేదని చెప్పుకొస్తున్నాడు.కానీ ఇటీవల షమీ అయితే తన ఫిట్గా ఉన్నప్పటికి కావాలనే ఎంపిక చేయడం లేదని పరోక్షంగా సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. ఒకవేళ షమీ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే న్యూజిలాండ్తో టీ20లకు రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.బెంగాల్ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సుదీప్ ఘరామి, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), షకీర్ హబీబ్ గాంధీ , యువరాజ్ కేస్వానీ, ప్రియాంషు శ్రీవాస్తవ్, షాబాజ్ అహ్మద్, ప్రదీప్త ప్రమాణిక్, రిటిక్ ఛటర్జీ, కరణ్ లాల్. సాక్షం చౌదరి, మహమ్మద్ షమీ, ఆకాష్ దీప్, సయన్ ఘోష్, కనిష్క్ సేథ్, యుధాజిత్ గుహా, శ్రేయాన్ చక్రవర్తి.చదవండి: అతడిని చూసి భయపడ్డా.. గెలిచే మ్యాచ్లో ఓడిపోయాము: స్టోక్స్
మ్యాచ్ ఫిక్సింగ్కు యత్నం.. యువ క్రికెటర్పై ఐసీసీ బ్యాన్
అంతర్జాతీయ క్రికెట్లో యూఎస్ఏ టీమ్కు ప్రాతినిధ్యం వహించిన ఆఫ్స్పిన్నర్ బొడుగం అఖిలేష్ రెడ్డి అబుదాబి టి10 లీగ్లో ఆడుతూ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అవినీతి నిరోధక నిబంధనలను అతను ఉల్లంఘించినట్లు వెల్లడైంది.25 ఏళ్ల అఖిలేష్ రెడ్డిపై మూడు వేర్వేరు అభియోగాలు నమోదు చేసిన ఐసీసీ... అతడిపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు అఖిలేష్కు 14 రోజుల గడువు ఇచ్చింది. విచారణ ముగిసిన అనంతరం అతనిపై పూర్తి స్థాయిలో చర్యలుంటాయి.అబుదాబి టి10 లీగ్లో అస్పిన్ స్టాలియన్స్ జట్టు తరఫున బుధ, గురువారాల్లో అతను 2 మ్యాచ్లు ఆడాడు. హైదరాబాద్కు చెందిన 25 ఏళ్ల అఖిలేష్ రెడ్డి ఈ ఏడాది ఆరంభంలో నార్త్ అమెరికా టి20 కప్లో యూఎస్ తరఫున అరంగేట్రం చేసి 4 మ్యాచ్లు ఆడాడు.చదవండి: అతడిని చూసి భయపడ్డా.. గెలిచే మ్యాచ్లో ఓడిపోయాము: స్టోక్స్
అతడిని చూసి భయపడ్డాము: స్టోక్స్
యాషెస్ సిరీస్ 202-26ను ఇంగ్లండ్ ఘోర ఓటమితో ఆరంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చిత్తు అయింది. బౌలింగ్ పరంగా ఇంగ్లీష్ జట్టు ఫర్వాలేదన్పించినప్పటికి.. బ్యాటింగ్లో మాత్రం పూర్తిగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకే కుప్పకూలిన స్టోక్స్ సేన.. రెండో ఇన్నింగ్స్లో కూడా అదే తీరును కనబరిచింది. బోలాండ్, స్టార్క్, డాగెట్లు నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ 164 పరుగులకు ఆలౌటైంది. సెకెండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బౌలర్లు కూడా తేలిపోయారు.ట్రావిస్ హెడ్ తుపాన్ను ఇంగ్లీష్ బౌలర్లు ఆపలేకపోయారు. హెడ్ కేవలం 83 బంతుల్లోనే 123 పరుగులు చేసి ఇంగ్లండ్ ఓటమిని శాసించాడు. స్టార్క్ బౌలింగ్, హెడ్ మెరుపు బ్యాటింగ్ ధాటికి తొలి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అందించాడు. హెడ్ తన సంచలన బ్యాటింగ్తో మ్యాచ్ తమ నుంచి దూరం చేశాడని స్టోక్స్ తెలిపాడు."ట్రావిస్ హెడ్ నిజంగా ఒక అద్భుతం. అతడు బ్యాటింగ్ చూసి మేము షాక్కు గురయ్యాము. నాలుగో ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సరికి మ్యాచ్ మా నియంత్రణలోనే ఉందని భావించాం. కానీ హెడ్ తన తుపాన్ బ్యాటింగ్ విజయాన్ని మా నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. పిచ్లో ఎటువంటి మార్పు లేదు. అయితే ఈ వికెట్పై క్రీజులో ఎక్కువ సేపు నిలదొక్కకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. డిఫెన్స్ ఆడటం కంటే, సులువైన బంతులను బౌండరీలకు తరలించిన వారికే ఈ వికెట్ మీద పరుగులు వచ్చాయి. మేము బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యాము.మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను ఈ గేమ్లో కొనసాగించలేకపోయాము. హెడ్ దూకుడును ఆపేందుకు మేము మూడు, నాలుగు రకాల ప్లాన్లు అమలు చేశాం. కానీ అతడు జెట్ స్పీడ్తో దూసుకుపోతుండడంతో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము. రెడ్ బాల్, వైట్ బాల్ క్రికెట్లో అతడు అద్భతమైన ఫామ్లో ఉన్నాడు. అతడు తన రిథమ్ను అందుకుంటే ఆపడం చాలా కష్టం.సిరీస్ ఆరంభ మ్యాచ్లో ఓడిపోవడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాము. కానీ తిరిగి పుంజుకుంటామన్న నమ్మకం మాకు ఉంది. ఇంకా మాకు నాలుగు మ్యాచ్లు ఉన్నాయి. ఈ ఓటమిని పక్కన పెట్టి బ్రిస్బేన్లో జరగబోయే టెస్టు కోసం సిద్ధమవుతాము అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో స్టోక్స్ పేర్కొన్నాడు.
హెడ్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
యాషెస్ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై ఆసీస్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని కంగారూలు 28.2 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి ఛేదించారు.ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. టెస్టు మ్యాచ్లో టీ20 తరహా బ్యాటింగ్ చేశాడు. ఫార్మాట్ ఏదైనా తనకు తెలిసిందే బాదుడు ఒక్కటే అన్నట్లు హెడ్ ఇన్నింగ్స్ కొనసాగింది. తన తుపాన్ బ్యాటింగ్తో ఇంగ్లండ్ బజ్బాల్ను భయపెట్టేశాడు.ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన హెడ్.. ఒంటి చేత్తో తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో కేవలం 69 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 83 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 16 ఫోర్లు, 4 సిక్స్లతో 123 పరుగులు చేశాడు. తద్వారా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన హెడ్..👉టెస్ట్ క్రికెట్ చరిత్రలో 4వ ఇన్నింగ్స్లో(ఛేజింగ్) అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్గా ట్రావిస్ హెడ్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ గిల్బర్ట్ జెస్సోప్ పేరిట ఉండేది. జెస్సో 1902 యాషెస్లో ఆస్ట్రేలియాపై నాల్గవ ఇన్నింగ్స్లో 76 బంతుల్లో శతక్కొట్టాడు. తాజా ఇన్నింగ్స్తో 123 ఏళ్ల గిల్బర్ట్ రికార్డును బ్రేక్ చేశాడు.👉టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన చేసిన ఓపెనర్గా డేవిడ్ వార్నర్(69 బంతులు) రికార్డును హెడ్ సమం చేశాడు.👉యాషెస్ సిరీస్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా హెడ్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో ఆడమ్ గిల్క్రిస్ట్(57) అగ్రస్ధానంలో ఉన్నాడు.👉 ఒక టెస్టు మ్యాచ్లో విజయవంతమైన రన్ ఛేజ్లో అత్యధిక స్ట్రైక్ రేట్ సాధించిన ప్లేయర్గా హెడ్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో(147.82) పేరిట ఉండేది. తాజా మ్యాచ్లో 148.19 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించిన హెడ్.. బెయిర్స్టో రికార్డును బ్రేక్ చేశాడు.చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్.. అర్జున్ స్ధానంలో?
ముగిసిన తొలి రోజు ఆట.. సఫారీలదే పై చేయి
గువహటి వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో సౌతాఫ్రికా పై చేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ముత్తుసామి (25*), వెర్రిన్ (1*) ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్రోటీస్ జట్టుకు ఓపెనర్లు మార్క్రమ్ (38), రికెల్టన్ (35) శుభారంభాన్ని అందించారు. బ్యాటర్లకు అనుకూలంగా ఉండే విధంగా పిచ్ తయారు చేయడంతో తొలి వికెట్ను సాధించేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బంతితో మార్క్రమ్ను ఔట్ చేయడంతో భారత్కు తొలి వికెట్ లభించింది. అనంతరం ట్రిస్టన్ స్టబ్స్ (49), కెప్టెన్ టెంబా బవుమా (41) నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను నడిపించారు. అయితే రెండో సెషన్లో మాత్రం భారత బౌలర్లు పుంజుకున్నారు.ముఖ్యంగా స్పిన్నర్లు కీలక వికెట్లు పడగొట్టారు. రికెల్టన్, స్టబ్స్, ముల్డర్లను కుల్దీప్ యాదవ్ పెవిలియన్కు పంపగా.. బవుమాను జడ్డూ బోల్తా కొట్టించాడు. భారత బౌలర్లలో ఇప్పటివరకు కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్.. అర్జున్ స్ధానంలో?
ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆసీస్
యాషెస్ సిరీస్ 2025-26ను ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఆసీస్ చిత్తు చేసింది. 205 పరుగుల లక్ష్యాన్ని కంగారులు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించారు. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.లక్ష్య చేధనలో ఇంగ్లీష్ జట్టు బౌలర్లను హెడ్ ఉతికారేశాడు. టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన హెడ్.. కేవలం 69 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 83 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 16 ఫోర్లు, 4 సిక్స్లతో 123 పరుగులు చేశాడు.అతడితో పాటు మార్నస్ లబుషేన్(51) అజేయ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో అదరగొట్టిన జోఫ్రా అర్చర్, బెన్ స్టోక్ట్స్ రెండో ఇన్నింగ్స్లో తేలిపోయారు.ఇంగ్లండ్ అట్టర్ ప్లాప్..కాగా రెండు ఇన్నింగ్స్లలోనూ ఇంగ్లండ్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్(7 వికెట్లు) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకే కుప్పకూలిన స్టోక్స్ సేన.. రెండో ఇన్నింగ్స్లో కూడా అదే తీరును కనబరిచింది. బోలాండ్, స్టార్క్, డాగెట్లు నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ 164 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఆసీస్ ముందు 205 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఉంచింది. అయితే తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్లో విఫలమైన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చి ఘన విజయాన్ని అందుకుంది. ఫలితంగా మొదటి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. కాగా తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ కేవలం 132 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఓవరాల్గా రెండు ఇన్నింగ్స్లు కలిపి 10 వికెట్లు పడగొట్టిన స్టార్క్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. రెండో టెస్టు డిసెంబర్ 4 నుంచి గబ్బా వేదికగా ప్రారంభం కానుంది.పెర్త్ టెస్టు సంక్షిప్త సమాచారంఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 172/10టాప్ స్కోరర్ హ్యారీ బ్రూక్ (52)టాప్ బౌలర్ మిచెల్ స్టార్క్ (7/58)ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 132/10టాప్ స్కోరర్ క్యారీ(26)టాప్ బౌలర్ బెన్ స్టోక్స్ (5/23)ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్: 164/10టాప్ స్కోరర్: గస్ అట్కిన్సన్ (37)బెస్ట్ బౌలింగ్: స్కాట్ బోలాండ్ (4 వికెట్లు)ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్: 205/2టాప్ స్కోరర్: ట్రావిస్ హెడ్(123)చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్.. అర్జున్ స్ధానంలో?
ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్.. అర్జున్ స్ధానంలో?
ఐపీఎల్-2026 మినీ వేలం కోసం ముంబై ఇండియన్స్ (MI) తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. ఈ మినీ వేలానికి ముందు జమ్మూ కాశ్మీర్ పేస్ బౌలర్ ఆకిబ్ నబీని ముంబై ఇండియన్స్ ట్రయల్స్కు పిలిచినట్లు తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. నబీ శుక్రవారం ఘన్సోలీలోని ఎంఐ ఫెసిలిటీలో ట్రయల్స్కు హాజరైనట్లు సమాచారం. అబుదాబి డిసెంబర్ 16న జరగనున్న వేలంలో అతడిని కొనుగోలు చేయాలని ముంబై యాజమాన్యం బావిస్తుందంట. కాగా ఈ 29 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ గత కొన్నాళ్లగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. గత రంజీ సీజన్లో రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన నబీ(44).. ప్రస్తత సీజన్లో కూడా అద్బుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు.ఈ జమ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ 29 వికెట్లతో సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. అయితే నబీ రెడ్ బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికి.. టీ20ల్లో మాత్రం అతడి గణాంకాలు అంత గొప్పగా లేవు. అయినప్పటికి తన పేస్, స్వింగ్తో పత్యర్ధి బ్యాటర్లను భయపెట్టే సత్తా అతడి వద్ద ఉంది. 2019 టీ20ల్లో అరంగేట్రం చేసిన నబీ.. 27 మ్యాచ్లలో 26.39 సగటుతో 28 వికెట్లు తీశాడు. అదే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 36 మ్యాచ్లు ఆడి 19.98 సగటుతో 125 వికెట్లు పడగొట్టాడు. కాగా మినీ వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కు ట్రేడ్ అయిన అర్జున్ టెండూల్కర్ స్థానాన్ని నబీతో భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.అర్జున్ ముంబై తరపున రెండు సీజన్లలో కేవలం 5 మ్యాచ్లు మాత్రమే 3 వికెట్లు పడగొట్టాడు. అయితే ముంబై జట్టులో జస్ప్రీత్ బుమ్రా, బౌల్ట్ వంటి అద్భుతమైన బౌలర్లు ఉండడంతో అర్జున్ పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో ముంబై అతడిని రూ.30 లక్షల బేస్ ప్రైస్కు లక్నోకు ట్రేడ్ చేసింది. ప్రస్తుతం ముంబై పర్స్లో కేవలం రూ.2.7 కోట్లు మాత్రమే ఉన్నాయి.చదవండి: ఇంకా ఏం రాస్తున్నాడు?.. వైభవ్ ఏం తప్పు చేశాడు?: కోచ్పై మాజీ క్రికెటర్ ఫైర్
యాషెస్ సిరీస్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన హెడ్
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ట్రవిస్ హెడ్ (Travis Head) అరుదైన ఘనత సాధించాడు. యాషెస్ ఇన్నింగ్స్లో అతి తక్కువ బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు.పెర్త్ స్టేడియంలో ఇంగ్లండ్తో తొలి టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా హెడ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ 2025-26కు శుక్రవారం తెరలేచింది. పెర్త్ స్టేడియంలో మొదలైన తొలి టెస్టులో టాస్ ఓడిన ఆతిథ్య ఆసీస్ తొలుత బౌలింగ్ చేయాల్సి వచ్చింది.హోరాహోరీఈ క్రమంలో ఆకాశమే హద్దుగా చెలరేగి కంగారూ జట్టు పేసర్ మిచెల్ స్టార్క్ ఏడు వికెట్లు తీసి.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకే ఆలౌట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఇందుకు ఇంగ్లండ్ బౌలర్లు కూడా ధీటుగానే బదులిచ్చి ఆసీస్ను 132 పరుగులకే కుప్పకూల్చారు.ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో నలభై పరుగుల ఆధిక్యం సాధించిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్లో 164 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ విజయ లక్ష్యం 205 పరుగులుగా మారగా.. ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతూ గెలుపు దిశగా పయనిస్తోంది.మ్యాచ్ స్వరూపమే మార్చివేసిన హెడ్లక్ష్య ఛేదనలో ఓపెనర్గా వచ్చిన ట్రవిస్ హెడ్ ఆది నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఇంగ్లిష్ జట్టు శైలిలో ‘బజ్ బాల్’ ఆటతొ చెలరేగిన హెడ్.. 36 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా యాషెస్ సిరీస్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఐదో బ్యాటర్గా నిలిచాడు. అంతకు ముందు జాన్ బ్రౌన్ (33 బంతుల్లో), గ్రాహమ్ యాలోప్ (35), డేవిడ్ వార్నర్ (35), కెవిన్ పీటర్సన్ (36) ఈ ఘనత సాధించారు.చరిత్ర సృష్టించిన హెడ్.. యాషెస్ మొనగాడుఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించిన హెడ్.. 69 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా మరో సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. యాషెస్ సిరీస్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన రెండో బ్యాటర్గా నిలిచిన హెడ్.. ఛేదనలో భాగంగా నాలుగో ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.పెర్త్ టెస్టు తుదిజట్లుఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, జేక్ వెదర్రాల్డ్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్),మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్ఇంగ్లండ్బెన్ డకెట్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్. చదవండి: ఇంకా ఏం రాస్తున్నాడు?.. వైభవ్ ఏం తప్పు చేశాడు?: కోచ్పై మాజీ క్రికెటర్ ఫైర్
IND vs SA: లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా స్కోరెంతంటే?
టీమిండియాతో రెండో టెస్టులో ఓపెనర్లు సౌతాఫ్రికాకు శుభారంభం అందించారు. ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram), ర్యాన్ రికెల్టన్ కలిసి ఆచితూచి ఆడుతూ తొలి వికెట్కు 161 బంతుల్లో 82 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఆరంభం నుంచి వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడ్డ భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah).. ఎట్టకేలకు టీ విరామ సమయానికి ముందు మార్క్రమ్ను పెవిలియన్కు పంపాడు.ఇదే జోరులో బ్రేక్కు వెళ్లి వచ్చిన వెంటనే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) మ్యాజిక్ చేశాడు. ర్యాన్ రికెల్టన్ను అవుట్ చేసి భారత్కు రెండో వికెట్ అందించాడు. ఏదేమైనా ఓపెనర్లు మార్క్రమ్- రికెల్టన్ 82 పరుగుల భాగస్వామ్యం కారణంగా సౌతాఫ్రికాకు శుభారంభమే లభించిందని చెప్పవచ్చు.స్టబ్స్, బవుమా నిలకడగా..ఇక ఓపెనర్లు అవుటైన తర్వాత వన్డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ తెంబా బవుమా నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు నడిపించారు. ఫలితంగా భోజన విరామ సమయానికి (మధ్యాహ్నం 1.24 నిమిషాలు) సౌతాఫ్రికా 55 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. స్టబ్స్ 82 బంతుల్లో 32, బవుమా 86 బంతుల్లో 36 పరుగులతో క్రీజులో నిలిచారు.భారత బౌలర్లలో పేసర్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా భారత్- సౌతాఫ్రికా మధ్య గువాహటి వేదికగా శనివారం రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియంలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిలకడగా ముందుకు సాగుతోంది. తొలిసారి ఇలాకాగా టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి డే మ్యాచ్లో ముందుగా టీ విరామం ఇచ్చి.. తర్వాత లంచ్ బ్రేక్ ఇవ్వడం ఇదే తొలిసారి. గువాహటిలో సూర్యోదయం, సూర్యస్తమయానికి అనుగుణంగా టైమింగ్స్ ఇలా సెట్ చేశారు. టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు తుదిజట్లు ఇవేటీమిండియాకేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.సౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, తెంబా బావుమా(కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెన్నె (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, సెనురాన్ ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్.చదవండి: ఇంకా ఏం రాస్తున్నాడు?.. వైభవ్ ఏం తప్పు చేశాడు?: కోచ్పై మాజీ క్రికెటర్ ఫైర్
తరుణ్ శుభారంభం
సిడ్నీ: ఆ్రస్టేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–...
తండ్రీకొడుకులు ‘డబుల్స్’ జంటగా...
సిడ్నీ: మాజీ వరల్డ్ నంబర్వన్, రెండు సింగిల్స్ గ...
ఫైనల్లో నిఖత్
న్యూఢిల్లీ: మాజీ ప్రపంచ చాంపియన్, భారత బాక్సర్ ని...
కురసావ్... కొత్త చరిత్ర
కింగ్స్టన్ (జమైకా): ప్రతికూలతల గురించి పదేపదే ప్...
ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆసీస్
యాషెస్ సిరీస్ 2025-26ను ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించ...
ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్.. అర్జున్ స్ధానంలో?
ఐపీఎల్-2026 మినీ వేలం కోసం ముంబై ఇండియన్స్ (MI) ...
యాషెస్ సిరీస్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన హెడ్
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా...
IND vs SA: లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా స్కోరెంతంటే?
టీమిండియాతో రెండో టెస్టులో ఓపెనర్లు సౌతాఫ్రికాకు శ...
క్రీడలు
లేడీ క్రికెటర్ స్మృతి మంధాన హల్దీ సెలబ్రేషన్ (ఫొటోలు)
నా జీవితంలోని ఆల్రౌండర్కు హ్యాపీ బర్త్ డే: సూర్యకుమార్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి దర్శనానికై మెట్ల మార్గంలో వరల్డ్కప్ విన్నర్ శ్రీచరణి (ఫొటోలు)
అక్షర్ పటేల్ నూతన గృహ ప్రవేశం.. విల్లా పేరు ఇదే! (ఫొటోలు)
కోట్ల విలువైన కారు కొన్న టీమిండియా క్రికెటర్ (ఫొటోలు)
కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)
నా హ్యాపీ బర్త్డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్ (ఫొటోలు)
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)
తిరుమల కొండపై ఏడు అడుగుల మహిళ (ఫోటోలు)
వీడియోలు
Nikhat Zareen: అదరగొట్టిన తెలంగాణ బాక్సర్.. గోల్డ్ మెడల్
గిల్ అనుమానమే..!
తడబడ్డ భారత్.. ఘోర పరాజయం
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 42 బంతుల్లోనే 144 పరుగులు
బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిల
క్రీడా కీర్తి కిరీటం
ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉంది: అరుంధతి
మోదీని కలిసిన భారత మహిళల క్రికెట్ జట్టు
Women's World Cup Final 2025: మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
జీసస్ నన్ను నడిపించాడు బైబిల్ పోరాడేలా చేసింది? జెమిమా ఎమోషనల్
