Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

SMAT 2025: Siraj Shines, Hyderabad upsets defending champ Mumbai1
నిప్పులు చెరిగిన సిరాజ్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు చుక్కలు

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ చెలరేగిపోయాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగాడు. 3.5 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.సిరాజ్‌ విజృంభించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై 18.5 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్‌తో పాటు చామా మిలింద్‌ (4-0-36-2), త్యాగరాజన్‌ (4-0-27-2), నితిన్‌ సాయి యాదవ్‌ (3-0-26-1), అర్ఫాజ్‌ అహ్మద్‌ (1-0-7-1) సత్తా చాటారు.స్టార్లతో నిండిన ముంబై ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (29), హార్దిక్‌ తామోర్‌ (29), సూర్యాంశ్‌ షేడ్గే (28), సాయిరాజ్‌ పాటిల్‌ (12 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రహానే (9), సర్ఫరాజ్‌ ఖాన్‌ (5), రఘువంశీ (4), అంకోలేకర్‌ (3), తనుశ్‌ కోటియన్‌ (2), తుషార్‌ దేశ్‌పాండే (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. కెప్టెన్‌ శార్దూల్‌ ఠాకూర్‌ డకౌటయ్యాడు.అనంతరం స్వల్ప ఛేదనలో హైదరాబాద్‌ ఓపెనర్లు అమన్‌ రావ్‌ (29 బంతుల్లో 52 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), తన్మయ్‌ అగర్వాల్‌ (40 బంతుల్లో 75; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగిపోయారు. వీరి ధాటికి హైదరాబాద్‌ 11.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. తద్వారా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ సూపర్‌ లీగ్‌ పోటీల్లో భాగంగా జరిగింది.

Bahrain's Ali Dawood records second best T20I figures with 7 for 192
అంతర్జాతీయ టీ20ల్లో సంచలనం.. ప్రపంచ రికార్డు

అంతర్జాతీయ టీ20ల్లో బహ్రెయిన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అలీ దావూద్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఫార్మాట్‌లో రెండో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసి రికార్డుల్లోకెక్కాడు. తాజాగా నేపాల్‌లో జరిగిన మ్యాచ్‌లో దావూద్‌ 19 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు మలేసియా బౌలర్‌ స్యాజ్రుల్‌ ఇద్రుస్‌ పేరిట ఉన్నాయి. ఓ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఇద్రుస్‌ కేవలం 8 పరుగులే ఇచ్చి దావూద్‌ లాగే 7 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇద్రుస్‌, దావూద్‌ మాత్రమే ఇప్పటివరకు ఓ మ్యాచ్‌లో 7 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.మ్యాచ్‌ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెహ్రెయిన్‌, భూటాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లోనే దావూద్‌ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెహ్రెయిన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన భూటాన్‌.. దావూద్‌ ధాటికి లక్ష్యానికి 36 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ గెలుపుతో బెహ్రెయిన్‌ మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ బెహ్రెయిన్‌ ఘన విజయాలు సాధించింది. తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో గెలుపొందింది.

Venkatesh Iyer back to KKR in Ashwin IPL 2026 mock auction3
భారీగా తగ్గిన ధర!.. మళ్లీ కేకేఆర్‌కే వెంకటేశ్‌ అయ్యర్‌!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 వేలానికి సమయం ఆసన్నమైంది. అబుదాబి వేదికగా డిసెంబరు 16న వేలంపాట నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇక ఈసారి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) అత్యధికంగా రూ. 63.30 కోట్ల పర్సుతో రంగంలోకి దిగనుంది.పదమూడు ఖాళీలువేలానికి ముందు తమ జట్టులోని అత్యంత ఖరీదైన ఆల్‌రౌండర్లు వెంకటేశ్‌ అయ్యర్‌ (27.75 కోట్లు), ఆండ్రీ రసెల్‌ (రూ. 12 కోట్లు)ను వదులుకోవడంతో కేకేఆర్‌ పర్సులో భారీగా సొమ్ము చేరింది. ఇక ఆ జట్టులో పదమూడు ఖాళీలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఆరు విదేశీ ప్లేయర్ల స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.మాక్‌ వేలంఇదిలా ఉంటే.. గతంలో మాదిరే టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈసారి కూడా మాక్‌ వేలం నిర్వహించాడు. ఇందులో పది ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తూ అభిమానులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వెంకటేశ్‌ అయ్యర్‌ పేరు వేలంలోకి రాగానే... చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ అతడి కోసం పోటీపడ్డాయి.భారీగా తగ్గిన ధర!.. ఇంతలో కేకేఆర్‌ కూడా రంగంలోకి దిగింది. చెన్నై, ముంబైలతో పోటీపడి ఎట్టకేలకు వెంకటేశ్‌ అయ్యర్‌ను దక్కించుకుంది. అయితే, గతేడాది పేలవ ప్రదర్శన దృష్ట్యా ఈసారి వెంకీ ధర ఆరు కోట్లు తగ్గిపోయింది. మాక్‌ వేలంలో కేకేఆర్‌ అతడిని రూ. 17.5 కోట్లకు కొనుక్కుంది. కాగా 2025లో పదకొండు మ్యాచ్‌లలో కలిపి కేవలం 142 పరుగులే చేశాడు. సీజన్‌ మొత్తంలో ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్‌ చేయలేదు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ను కేకేఆర్‌ ఏకంగా రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. గతేడాది అతడు ఆర్సీబీ (రూ. 8.75 కోట్లు) తరఫున పేలవంగా ఆడాడు. ఐదు మ్యాచ్‌లలో కలిపి 90 పరుగులే చేశాడు. రెండు వికెట్లు తీశాడు. అయితే, ఆండ్రీ రసెల్‌ రిటైర్మెంట్‌ కారణంగా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు మాక్‌ వేలంలో కేకేఆర్‌ లివింగ్‌స్టోన్‌ను కొనుక్కోవడం గమనార్హం.చదవండి: ఆసియా కప్‌- 2025: భారత్‌ ఘన విజయం

Messi In Hyderabad 2025 Dec 13: Intresting Facts About Personal Life4
వేల కోట్ల సంపాదన.. అతడికి ఆ పేరెలా వచ్చిందంటే?

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీకి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి అతడు ఆరాధ్య ఆటగాడు. భారత్‌లో క్రికెట్‌ మతంలాంటిదే అయినా.. మెస్సీకి కూడా ఇక్కడ చాలా మందే అభిమానులు ఉన్నారు.హైదరాబాద్‌ పర్యటన ఇలా‘ది గోట్‌ టూర్‌’లో భాగంగా మెస్సీ భారత్‌కు రానుండటంతో వారంతా అతడిని నేరుగా చూడాలని ఆశపడుతున్నారు. ఇక ముందుగా ప్రణాళికలో లేకపోయినా.. చివరి నిమిషంలో మెస్సీ హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఈ లెజెండరీ ప్లేయర్‌ స్వయంగా వెల్లడించాడు.ఈ క్రమంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చి.. అక్కడి నుంచి తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు మెస్సీ చేరుకోనున్నాడు. రాత్రి ఏడు గంటలకు ఉప్పల్‌ స్టేడియానికి వచ్చి ఫ్యాన్స్‌ను కలవడంతో పాటు ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ వ్యక్తిగత జీవితంలోని ఆసక్తిర విషయాలు మీకోసం..ఆమె గుర్తుగా ఆకాశంలోకి చూస్తూ..👶అర్జెంటీనాలోని సాంటా ఫేలో గల రొసారియోలో 1987, జూన్‌ 24న మెస్సీ జన్మించాడు.👶నాలుగేళ్ల వయసులోనే తన మొదటి క్లబ్‌ గ్రాండోలిలో జాయిన్‌ అయ్యాడు. అన్నట్లు అక్కడ కోచ్‌ మెస్సీ వాళ్ల నాన్న జోర్జ్‌ మెస్సీ.👶ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా మెస్సీ ఎదగడంలో వాళ్ల నానమ్మ సెలియా ప్రభావం ఎక్కువ. అతడితో పాటు మ్యాచ్‌లకు హాజరవుతూ అతడిని ప్రోత్సహించేవారామె. ఆమె గుర్తుగా గోల్‌ సాధించిన ప్రతిసారి ఆకాశం వైపు చూపిస్తూ మెస్సీ తన ఆనందాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటాడు.👶ఏడేళ్ల వయసులో మెస్సీ వెనెల్స్‌ ఓల్డ్‌ బాయ్స్‌ క్లబ్‌లో చేరాడు.👶పదేళ్ల వయసులో మెస్సీకి హార్మోన్‌ డెఫిషియెన్సీ ఉన్నట్లు తేలగా.. చికిత్సతో దానిని అధిగమించాడు.వారిద్దరు.. వారికి ముగ్గురు 👩‍❤️‍💋‍👨తన చిన్ననాటి స్నేహితురాలు అంటోనెలా రొకజోను మెస్సీ పెళ్లి చేసుకున్నాడు. 👨‍👩‍👦‍👦ఈ జంటకు ముగ్గురు కుమారులు థియాగో, మెటేయో, సీరో సంతానం.🫂అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టులోని సహచరుడు సెర్గియో అగురో మెస్సీకి ప్రాణ స్నేహితుడుఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?🖤మెస్సీ ఒంటిపై పచ్చబొట్లు ఎక్కువే. అయితే, ఇవన్నీ అతడి కుటుంబ సభ్యులకు చెందినవే. భార్య కళ్లు, కుమారుల పేర్లు, వారి హస్త ముద్రలు, తన తల్లి చిత్రాన్ని టాటూలుగా వేయించుకున్నాడు మెస్సీ.💰ప్రపంచంలోని సుసంపన్న అథ్లెట్లలో మెస్సీ ఒకడు. అతడి నెట్‌వర్త్‌ విలువ 2025 నాటికి రూ. ఏడు వేల కోట్ల రూపాయలు అని అంచనా!🎶అన్నట్లు లియోనల్‌ మెస్సీకి ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?.. అతడి తల్లి ఫేవరెట్‌ సింగర్‌ లియోనల్‌ రిచ్చీ పేరు మీదుగా లియోనల్‌గా మెస్సీకి ఆమె నామకరణం చేశారు.చిరస్మరణీయ విజయం🌟మెస్సీ అత్యధికంగా ఎనిమిదిసార్లు బాలన్‌ డిఓర్‌ అవార్డులు గెలుచుకున్నాడు.🥇2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో అర్జెంటీనా తరఫున మెస్సీ గోల్డ్‌ మెడల్‌ గెలిచాడు.⚽🏆మెస్సీ కెరీర్‌లో చిరస్మరణీయ విజయం.. అర్జెంటీనా సారథిగా 2022లో ఫిఫా వరల్డ్‌కప్‌ గెలవడం.

Gambhir Suryakumar Blunder Costs India Steyn Says Major Mistake5
గంభీర్‌, సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే!

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ను ఘనంగా ఆరంభించిన టీమిండియా.. అదే జోరును కొనసాగించలేకపోయింది. ముల్లన్‌పూర్‌ వేదికగా రెండో టీ20లో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగం చేయగా.. అది కాస్తా బెడిసికొట్టింది.ఓపెనర్‌, వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (0) గోల్డెన్‌ డకౌట్‌ కాగా.. వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను పంపించింది మేనేజ్‌మెంట్‌. సఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అక్షర్‌ 21 బంతుల్లో 21 పరుగులు చేసి నిష్క్రమించాడు.మరోవైపు.. విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (17)తో పాటు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (5) దారుణంగా విఫలమయ్యాడు. మిగిలిన వారిలో హార్దిక్‌ పాండ్యా (20), జితేశ్‌ శర్మ (17 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించగా.. తిలక్‌ వర్మ (34 బంతుల్లో 62) ఒంటరి పోరాటం చేశాడు. అయితే, సఫారీ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 162 పరుగులకే టీమిండియా కుప్పకూలడంతో పరాజయం ఖరారైంది.ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పుల గురించి ప్రస్తావిస్తూ సౌతాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌.. టీమిండియా నాయకత్వ బృందాన్ని విమర్శించాడు. ‘‘అక్షర్‌ మీ జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడై ఉండవచ్చు. కానీ ఇలాటి భారీ ఛేదన సమయంలో మీరు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?నా అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్‌లో మీరు చేసిన అతి పెద్ద తప్పు ఇదే. అక్షర్‌ బ్యాటింగ్‌ చేయగలడు. కానీ అతడిని ముందు తోసి చిక్కుల్లో పడేయడం సరికాదు. ఒకవేళ గిల్‌ కంటే ముందు అభిషేక్‌ శర్మ అవుటై ఉంటే.. లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్‌ కోసం అక్షర్‌ను పంపించారనుకోవచ్చు.కానీ ఇక్కడ అలా జరుగలేదు. అభిషేక్‌తో పాటు మరో లెఫ్టాండర్‌ అక్షర్‌ను పంపారు. ఏం చేస్తున్నారో అర్థమే కాలేదు. ప్రయోగాలు చేయడం మంచిదే. అయితే, ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు’’ అని హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, కెప్టెన్‌ సూర్యకుమార్‌ల తీరును స్టెయిన్‌ తప్పుబట్టాడు.కాగా సిరీస్‌ ఆరంభానికి ముందు సూర్య మాట్లాడుతూ.. తమ జట్టులో ఓపెనింగ్‌ జోడీ మాత్రమే ఫిక్స్‌డ్‌గా ఉంటుందని పేర్కొన్నాడు. మిగతా వారంతా ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండాలని.. తమ వ్యూహాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.అయితే, టీ20 ఓపెనర్‌గా గిల్‌ను పంపడం కోసం.. ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌పై వేటు వేశారు. కానీ టీ20 జట్టులో పునరాగమనం చేసిన నాటి నుంచి గిల్‌ పేలవ ప్రదర్శన కనబరుస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే.. కటక్‌ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో టీమిండియా 101 పరుగులతో భారీ విజయం సాధించింది. తాజా మ్యాచ్‌లో సఫారీలు గెలిచి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేశారు.

U19 Asia Cup 2025: Vaihbhav 171 India Beat UAE By 234 Runs6
ఆసియా కప్‌- 2025: భారత్‌ ఘన విజయం

ఆసియా క్రికెట్‌ మండలి మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2025 టోర్నీలో భారత్‌ శుభారంభం చేసింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా 234 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.దుబాయ్‌లో ఐసీసీ అకాడమీ వేదికగా భారత్‌- యూఏఈ (IND vs UAE) మ్యాచ్‌తో ఈ వన్డే ఫార్మాట్‌ టోర్నీకి తెరలేచింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం ఆరు వికెట్లు నష్టపోయి ఏకంగా 433 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.దంచికొట్టిన భారత బ్యాటర్లుఇందులో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ది కీలక పాత్ర. పద్నాలుగేళ్ల ఈ చిచ్చరపిడుగు కేవలం 95 బంతుల్లోనే 171 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, 14 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఆరోన్‌ జార్జ్‌ (69), ఆ తర్వాతి స్థానంలో వచ్చిన విహాన్‌ మల్హోత్రా (69) అర్ధ శతకాలతో సత్తా చాటగా.. వేదాంత్‌ త్రివేది (38) కూడా రాణించాడు.ఆఖర్లో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అభిజ్ఞాన్‌ కుందు (17 బంతుల్లో 32 నాటౌట్‌), కనిష్క్‌ చౌహాన్‌ (12 బంతుల్లో 28) దంచికొట్టారు. అయితే, కెప్టెన్‌, ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రే (4) మాత్రం నిరాశపరిచాడు. ఇక యూఏఈ బౌలర్లలో యుగ్‌ శర్మ, ఉద్దిశ్‌ సూరి చెరో రెండు వికెట్లు తీయగా.. షాలోమ్‌ డిసౌజా, కెప్టెన్‌ యాయిన్‌ రాయ్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.కుదేలైన యూఏఈ బ్యాటింగ్‌ ఆర్డర్‌ఇక భారత్‌ విధించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు కెప్టెన్‌ యాయిన్‌ రాయ్‌ (17), షాలోమ్‌ డిసౌజా (4).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ అయాన్‌ మిస్బా (3) విఫలమయ్యారు. నాలుగో స్థానంలో ఆడిన ముహమూద్‌ రేయాన్‌ ఖాన్‌ (19) కూడా నిరాశపరిచగా.. అహ్మద్‌ హుదాదాద్‌ డకౌట్‌ అయ్యాడు.మిగతా వారిలో నూరుల్లా ఆయోబి 3 పరుగులకే పెవిలియన్‌ చేరగా.. ఐదో నంబర్‌ బ్యాటర్‌ పృథ్వీ మధు (50), ఉద్దిశ్‌ సూరి (106 బంతుల్లో 78 నాటౌట్‌) గట్టి పోరాటం చేశారు. వీరికి తోడుగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సలే అమీన్‌ (20 నాటౌట్‌) తన వంతు ప్రయత్నం చేశాడు.234 పరుగుల తేడాతో జయభేరిఅయితే, భారత బౌలర్ల ధాటికి 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 199 పరుగులకే యూఏఈ పరిమితమైంది. ఫలితంగా యువ భారత్‌ 234 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్‌ రెండు వికెట్లు తీయగా.. కిషన్‌ కుమార్‌ సింగ్‌, హెనిల్‌ పటేల్‌, ఖిలాన్‌ పటేల్‌, విహాన్‌ మల్హోత్రా తలా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. భారత్‌ తదుపరి డిసెంబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది.చదవండి: వాళ్లకు చెడు అలవాట్లు.. నా భర్త ఎలాంటివాడంటే: జడేజా భార్యVaibhav Sooryavanshi moves. The action responds. 😮‍💨A classy grab from our Boss Baby 👏 Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/5w0MUUWzzZ— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025

Why Vaibhav Suryavanshi 171 Vs UAE Will Not Counted In U19 Record Books7
ప్చ్‌.. సారీ వైభవ్‌ సూర్యవంశీ!

ఆసియా క్రికెట్‌ మండలి ఆధ్వర్యంలో అండర్‌-19 ఆసియా కప్‌-2025 టోర్నమెంట్‌కు శుక్రవారం తెరలేచింది. గ్రూప్‌-‘ఎ’ మ్యాచ్‌లో భాగంగా యునైటైడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE).. భారత యువ జట్టును ఢీకొట్టింది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది.56 బంతుల్లోనే సెంచరీఓపెనర్లలో కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (4) విఫలం కాగా.. వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. కేవలం 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. ఓ దశలో డబుల్‌ సెంచరీ దిశగా పయనించాడు. అయితే, ఉద్దిశ్‌ సూరి బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో వైభవ్‌ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.మొత్తంగా ఈ మ్యాచ్‌లో 95 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. తొమ్మిది ఫోర్లు, పద్నాలుగు సిక్సర్ల సాయంతో 171 పరుగులు సాధించాడు. అతడికి తోడు ఆరోన్‌ జార్జ్‌ (69), విహాన్‌ మల్హోత్రా (69).. వేదాంత్‌ త్రివేది (38), అభిజ్ఞాన్‌ కుందు (17 బంతుల్లో 32 నాటౌట్‌) రాణించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌ ఆరు వికెట్ల నష్టానికి 433 పరుగుల భారీ స్కోరు సాధించింది.ప్చ్‌.. సారీ వైభవ్‌ సూర్యవంశీ!ఇదిలా ఉంటే.. యూత్‌ వన్డేల్లో వైభవ్‌ సూర్యవంశీ ఇప్పటికే ఓ సెంచరీ బాదాడు. ఇటీవల ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టుపై 52 బంతుల్లోనే శతక్కొట్టి రికార్డు సృష్టించాడు. అయితే, తాజాగా వైభవ్‌ ఆసియా కప్‌ వన్డే ఫార్మాట్‌లో సాధించిన శతకానికి మాత్రం యూత్‌ వన్డేల్లో చోటు దక్కదు.కారణం ఇదేఅండర్‌-19 ఆసియా కప్‌లో అసోసియేట్‌ జట్లతో జరిగే మ్యాచ్‌లకు యూత్‌ వన్డే హోదా లేదు. అందుకే యూఏఈపై వైభవ్‌ సాధించిన సెంచరీకి రికార్డుల్లో స్థానం లేకుండా పోయింది. అయితే, తదుపరి (డిసెంబరు 14)న పాకిస్తాన్‌తో జరిగే ఆసియా కప్‌ మ్యాచ్‌లో గనుక వైభవ్‌ సెంచరీ బాదితే అది రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఆసియా కప్‌ టోర్నీలో టెస్టు హోదా కలిగిన జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు మాత్రమే యూత్‌ వన్డే హోదా ఉంటుంది.ఇప్పటికే మూడు శతకాలుఇదిలా ఉంటే.. ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లలో అసోసియేట్‌ జట్లతో జరిగిన మ్యాచ్‌లకు మాత్రం యూత్‌ వన్డే స్టేటస్‌ ఉంటుంది. అంటే.. ప్రపంచకప్‌ టోర్నీలో యూఏఈతో భారత్‌ ఆడే మ్యాచ్‌ల రికార్డులు పరిగణనలోకి వస్తాయి.ఇక సీనియర్‌ టీ20 క్రికెట్‌లో వైభవ్‌ సూర్యవంశీ ఇప్పటికే మూడు శతకాలు సాధించాడు. ఐపీఎల్‌-2025లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున.. ఏసీసీ రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లో యూఏఈపైనా.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర మీదా వైభవ్‌ శతక్కొట్టాడు.A century in no time...just 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝗼𝗼𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 things! 💯 Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/3N140FhcRV— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025

Ravindra Jadeja wife Rivaba Shocking claim involving India players8
వాళ్లకు చెడు అలవాట్లు.. నా భర్త ఎలాంటివాడంటే: జడేజా భార్య

టీమిండియా ఆల్‌ ఫార్మాట్‌ ఆల్‌రౌండర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు రవీంద్ర జడేజా. టీ20 ప్రపంచకప్‌-2024లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన జడ్డూ.. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు.స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్‌ (IND vs SA)లు ముగించుకున్న జడేజా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. జడ్డూ భార్య, గుజరాత్‌ మంత్రి రివాబా సోలంకి (Rivaba) తన భర్తను ప్రశంసించే క్రమంలో టీమిండియాను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.ఇంటికి దూరంగా ఉన్నా క్రికెటర్‌గా ఉన్న తన భర్త విదేశాలకు వెళ్లడం సహజమని.. అయితే, జట్టులోని మిగతా అందరిలా తన భర్త కాదని తెలిపారు. ఎక్కడున్నా నైతిక విలువలు కోల్పోడంటూ రివాబా వ్యాఖ్యానించారు. ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని.. పన్నెండు ఏళ్లు ఇంటికి దూరంగా ఉన్నా తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదని చెప్పుకొచ్చారు.ద్వారకలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రివాబా తన భర్త రవీంద్ర జడేజా (Ravindra Jadeja) గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నా భర్త.. క్రికెటర్‌ రవీంద్ర జడేజా.. లండన్‌, దుబాయ్‌, ఆస్ట్రేలియా అంటూ ఆట నిమిత్తం వివిధ దేశాలు తిరగాల్సి వస్తుంది. అయినప్పటికీ ఆయన ఎలాంటి చెడు వ్యసనాలకు ఆకర్షితుడు కాలేదు.వాళ్లు ఎన్నో దుర్గుణాలు కలిగి ఉంటారుఆయనకు తన బాధ్యతలు ఏమిటో తెలుసు. కానీ మిగతా జట్టంతా అలా కాదు. వాళ్లు ఎన్నో దుర్గుణాలు కలిగి ఉంటారు. అయినా వారిపై ఎవరూ ఎలాంటి ఆంక్షలు విధించలేరు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అదే విధంగా.. ‘‘నా భర్త పన్నెండు ఏళ్లు ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. కావాలంటే ఆయన ఎలాంటి చెడ్డ పనైనా చేసి ఉండవచ్చు. కానీ నైతిక విలువలు అంటే ఏమిటో ఆయనకు బాగా తెలుసు’’ అంటూ జడ్డూపై రివాబా ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌కాగా.. రివాబా వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.భర్తను మెచ్చుకోవడంలో తప్పు లేదు.. కానీతన భర్తను మెచ్చుకోవడంలో తప్పు లేదని.. అయితే, అందుకోసం మిగతా అందరి ఆటగాళ్ల వ్యక్తిత్వాలను కించపరచడం సరికాదని టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా బాధ్యతాయుత పదవిలో ఉన్న వారు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.కాగా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన జడేజా క్రికెటర్‌గా అత్యుత్తమ స్థాయికి ఎదగడంలో అతడి తల్లి పాత్ర కీలకం. ఈ విషయాన్ని జడ్డూనే స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పాడు. ఇక తన అక్క కూడా తన విజయానికి బాటలు వేసిన వారిలో ఒకరని గతంలో ప్రశంసించాడు.కుటుంబంలో విభేదాలు?ఇదిలా ఉంటే.. జడ్డూ తండ్రి, అక్క కాంగ్రెస్‌ పార్టీలో ఉండగా.. భార్య రివాబా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. రివాబా వచ్చిన తర్వాత జడ్డూ తమను పూర్తిగా దూరం పెట్టాడని అతడి తండ్రి ఆరోపించగా.. జడ్డూ మాత్రం భార్యకు మద్దతు తెలిపాడు.ఒకవైపు మాటలు మాత్రమే విని ఇంటర్వ్యూ చేయడం సరికాదని.. తన భార్యను తప్పుబట్టే విధంగా వ్యవహరిస్తే ఎవరినీ సహించబోనని మీడియాకు వార్నింగ్‌ ఇచ్చాడు జడ్డూ. కాగా జడేజా అక్కకు రివాబా స్నేహితురాలు. ఈ క్రమంలోనే జడ్డూ- రివాబాలకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి బాటలు వేసింది. వీరికి కుమార్తె నిధ్యానా ఉంది.చదవండి: దురభిమానం.. నైతిక విలువలు పాతరేస్తున్నారు"मेरे पति (रवींद्र जडेजा , क्रिकेटर)को लंदन , दुबई, ऑस्ट्रेलिया जैसे अनेकों देशों में खेलने के लिए जाना होता है फिर भी आज दिन तक उन्होंने कभी व्यसन नहीं किया क्योंकि वो अपनी जवाबदारी को समझते हैं @Rivaba4BJP जी , शिक्षा मंत्री गुजरात सरकार #Rivabajadeja #ravindrajadeja pic.twitter.com/OyuiPFPvVa— राणसिंह राजपुरोहित (@ransinghBJP) December 10, 2025

Telangana Cricket Association Press Meet Over HCA U14 Selections9
కోర్టు చెప్పినా మారరా?.. హెచ్‌సీఏపై టీసీఏ ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో అవినీతి జరుగుతూనే ఉందని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆరోపించింది. ప్రీమియర్ లీగ్ పేరుతో మరోసారి మోసం చేయాలని చూస్తే హెచ్‌సీఏ అధికారులను బయట తిరగనివ్వబోమని హెచ్చరించింది. హెచ్‌సీఏలో అక్రమాల గురించి ప్రస్తావిస్తూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించింది.అండర్ -14 టీమ్‌ అనే ప్రస్తావన లేదుఈ సందర్భంగా.. ‘‘ప్రీమియర్ లీగ్ పేరుతో మళ్లీ మోసం చేయాలని చూస్తే హెచ్‌సీఏ అధికారులను బయట తిరగ నివ్వం. ప్రీమియర్ లీగ్ కూడా TCA నిర్వహిస్తుంది. అండర్ 14 సెలక్షన్ పేరుతోనూ అవినీతి కి పాల్పడ్డారు. 3500 మంది క్రీడాకారులను ఇబ్బంది పెట్టారు. BCCIలో అసలు అండర్ -14 టీమ్‌ అనే ప్రస్తావన లేదు.అయినా సెలక్షన్‌కు అని పిలిచి జింఖాన గ్రౌండ్ లో కనీసం సౌకర్యాలు కల్పించలేదు. సొంతం గా అసోసియేషన్‌లు పెట్టుకొని.. 15 మంది ని సెలెక్ట్ చేయడానికి ఐదు వేల మంది ని నిలబెట్టారు. HCA అవకతవకలపై హ్యూమన్ రైట్స్‌​తో పాటు డీజీపి కి ఫిర్యాదు చేస్తాం. ఎన్నిసార్లు కోర్టు మొట్టకాయలు వేసినా HCA తీరులో మార్పు లేదు. మళ్లీ కోర్టును ఆశ్రయిస్తాం’’ అని టీసీఏ పేర్కొంది.BCCI గుర్తింపు కోసంటీసీఏ జనరల్‌ సెక్రటరీ గురువా రెడ్డి మాట్లాడుతూ.. BCCI గుర్తింపు కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి సుమోటోగా HCAపై విచారణ జరపాలి. BCCI నిబంధనలను HCA పాటించడం లేదు’’ అని పేర్కొన్నారు. ఇక అడ్వకేట్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్‌ పేరిట పిల్లల్ని, వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టారు. ఈ విషయంపై జాతీయ, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేస్తున్నాం’’ అని తెలిపారు.చదవండి: IND vs SA: ‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?

U19 Asia Cup 2025: Vaibhav Suryavanshi Ton Powers IND set 434-run target Uae10
Asia Cup 2025:: భారత్‌ 433 పరుగుల భారీ స్కోర్‌

అండ‌ర్‌-19 ఆసియాక‌ప్‌లో భాగంగా దుబాయ్ వేదిక‌గా యూఏఈతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త బ్యాట‌ర్లు జూలు విదిల్చారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భార‌త యువ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 433 ప‌రుగులు చేసిది. యువ‌సంచ‌ల‌నం, టీమిండియా ఓపెనర్‌ వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌రోసారి విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 56 బంతుల్లోనే తన రెండో యూత్ వన్డే సెంచరీ మార్క్‌ను వైభవ్ అందుకున్నాడు. మొత్తంగా 95 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో 171 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ దశలో డబుల్‌ సెంచరీ చేసేలా వైభవ్‌ కన్పించాడు. దూకుడుగా ఆడే క్రమంలో తన వికెట్‌ను కోల్పోయాడు.వైభవ్‌తో పాటు ఆరోన్‌ జార్జ్‌(69), విహాన్‌ మల్హోత్రా(69) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. ఆఖరిలో అభిజ్ఞాన్ కుండు(32), కన్షిక్‌ చౌహన్‌(28) మెరుపులు మెరిపించారు. వైభవ్.. ఆరోన్ జార్జ్ తో కలిసి 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెల‌కొల్పాడు. కెప్టెన్ అయూష్ మాత్రే(4) మాత్రం సింగిల్ డిజిట్ స్కోర్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. యూఏఈ బౌలర్లలో యూగ్‌ శర్మ, సూరి తలా రెండు వికెట్లు సాధించాడు. కాగా యూత్‌ వన్డేల్లో భారత్‌ 400 ప్లస్‌ పైగా పరుగులు సాధించడం ఇదే మూడో సారి. తద్వారా ఈ ఫీట్‌ సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.చదవండి: IND vs SA: ‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?[node:field_tags]A century in no time...just 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝗼𝗼𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 things! 💯 Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/3N140FhcRV— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement