Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

ACC Men's Asia Cup Rising Stars 2025, Semi Final 1: Bangladesh A Beat India A In Super Over and Enter Final1
వైభవ్‌ మెరుపులు వృధా.. ఆసియా కప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి

ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో (ACC Men's Asia Cup Rising Stars 2025) భాగంగా భారత్‌-ఏ-బంగ్లాదేశ్‌-ఏ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 21) జరిగిన తొలి సెమీఫైనల్‌ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. దోహా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లు సమానమైన స్కోర్లు చేయగా మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. ఇందులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఖాతా తెరవకుండానే 2 వికెట్లూ కోల్పోగా.. సుయాశ్‌ శర్మ వైడ్‌ వేసి బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. పాకిస్తాన్‌-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఇవాళ రాత్రే జరిగే రెండో సెమీఫైనల్‌ విజేతతో బంగ్లాదేశ్‌-ఏ నవంబర్‌ 23న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.బంగ్లాదేశ్‌ భారీ స్కోర్‌టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. ఓపెనర్‌ హబిబుర​్‌ రెహ్మాన్‌ సోహన్‌ (46 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), మెహ్రబ్‌ (18 బంతుల్లో 48 నాటౌట్‌; ఫోర్‌, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.భారత బౌలర్లలో గుర్‌జప్నీత్‌ సింగ్‌ (4-0-39-2), హర్ష​్‌ దూబే (4-0-22-1), సుయాశ్‌ శర్మ (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా.. రమన్‌దీప్‌ సింగ్‌ (2-0-29-1), నమన్‌ ధిర్‌ (2-0-33-1) పర్వాలేదనిపించారు.వైభవ్‌ మెరుపులు వృధాభారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు మెరుపు ఆరంభం లభించినప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోయింది. ఓపెనర్లు వైభవ్‌ సూర్యవంశీ (15 బంతుల్లో 38; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), ప్రియాంశ్‌ ఆర్య (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు వృధా అయ్యాయి. జితేశ్‌ శర్మ (33), నేహల్‌ వధేరా (32 నాటౌట్‌), ఆఖర్లో రమన్‌దీప్‌ (17), అశుతోష్‌ శర్మ (13) సత్తా చాటడంతో అతి కష్టం మీద నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమమయ్యాయి.అయితే సూపర్‌ ఓవర్‌లో భారత్‌ బొక్క బోర్లా పడింది. తొలి రెండు బంతులకు వికెట్లు జితేశ్‌, అశుతోష్‌ ఔట్‌ కావడంతో ఖాతా కూడా తెరవలేకయింది. అనంతరం బంగ్లాదేశ్‌ సైతం తొలి బంతికే వికెట్‌ కోల్పోగా.. రెండో బంతిని సుయాశ్‌ శర్మ వైడ్‌గా వేయడంతో బంగ్లాదేశ్‌ గెలుపొందింది. చదవండి: భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్ల ప్రకటన

South Africa Squads Announced For India Limited Overs Series2
భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్ల ప్రకటన

త్వరలో భారత్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల (India vs South Africa) కోసం వేర్వేరు సౌతాఫ్రికా జట్లను (South Africa) ఇవాళ (నవంబర్‌ 21) ప్రకటించారు. వన్డే జట్టు కెప్టెన్‌గా టెంబా బవుమా (Temba Bavuma), టీ20 జట్టు కెప్టెన్‌గా ఎయిడెన్‌ మార్క్రమ్‌ (Aiden Markram) ఎంపికయ్యారు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్‌ పేసర్‌ అన్రిచ్‌ నోర్జే టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా పాకిస్తాన్‌పై అరంగేట్రం చేసిన రూబిన్‌ హెర్మన్‌ వన్డే జట్టులో కొనసాగాడు. క్వింటన్‌ డికాక్‌, ఎయిడెన్ మార్క్రమ్, ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నవంబర్‌ 30, డిసెంబర్‌ 3, 6 తేదీల్లో రాంచీ, రాయ్‌పూర్‌, విశాఖ వేదికలుగా జరుగనుంది. అనంతరం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ డిసెంబర్‌ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్‌, ముల్లాన్‌పూర్‌, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్‌ వేదికగా జరుగనుంది.భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు:టెంబా బవుమా (కెప్టెన్‌), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మన్, కేశవ్ మహారాజ్, మార్కో జన్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, ప్రెనెలన్‌ సుబ్రాయన్‌.భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు:ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్‌), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, ట్రిస్టన్‌ స్టబ్స్‌.చదవండి: టీమిండియాతో సెమీఫైనల్‌.. బంగ్లాదేశ్‌ భారీ స్కోర్‌

IND vs SA Sai Padikkal getting into the XI: Former stumper predicts changes3
IND vs SA: అతడిపై వేటు.. భారత తుదిజట్టులోకి ఆ ఇద్దరు!

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో చావోరేవో తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. గువాహటి వేదికగా శనివారం మొదలయ్యే రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) మెడ నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావడం ఆందోళనకరంగా పరిణమించింది.గిల్‌ స్థానంలో రిషభ్‌ పంత్‌ (Rishabh Pant)ను బీసీసీఐ తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. అయితే, తుదిజట్టులో గిల్‌ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై పంత్‌ స్పందిస్తూ.. తాము ఇప్పటికే గిల్‌ రీప్లేస్‌మెంట్‌ గురించి నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. కానీ ఆ ఆటగాడి పేరు మాత్రం వెల్లడించలేదు.ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సబా కరీం (Saba Karim) కీలక వ్యాఖ్యలు చేశాడు. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో తొలిసారిగా టెస్టు మ్యాచ్‌ జరుగుతున్న తరుణంలో.. భారత జట్టు ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లను ఆడించాలని సూచించాడు. అదే విధంగా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు ఇవ్వాలని పేర్కొన్నాడు.ఇందులో భాగంగా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌పై వేటు వేయక తప్పదని సబా కరీం అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘శుబ్‌మన్‌ గిల్‌ లేకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బ. అయితే, ఇలాంటి సమయంలో తుది జట్టులోకి సాయి సుదర్శన్‌తో పాటు దేవ్‌దత్‌ పడిక్కల్‌ను కూడా తీసుకుంటే మంచిది.అతడిపై వేటు వేయాల్సి వస్తుందిఆరు స్పెషలిస్టు బ్యాటర్లు.. ఇద్దరు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగాలి. గువాహటిలో గెలవాలంటే ఇదే సరైన కాంబినేషన్‌. కాబట్టి ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను తప్పించకతప్పదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో వైవిధ్యం కోసం అతడిపై వేటు వేయాల్సి వస్తుంది.కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ స్పిన్నర్ల కోటాలో తుదిజట్టులో ఉంటారు. ఇక పేస్‌ విభాగంలో బుమ్రా, సిరాజ్‌ ఉండనే ఉన్నారు’’ అని సబా కరీం పేర్కొన్నాడు. సాయి, పడిక్కల్‌ రాకతో జట్టులో ఎడమచేతి వాటం ఆటగాళ్ల సంఖ్య పెరుగుతుందని.. అందుకే ధ్రువ్‌ జురెల్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. అప్పుడు లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్‌ సెట్‌ అవుతుందని పేర్కొన్నాడు.తొలి టెస్టులో ఆరుగురుకాగా కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు తీయడంతో పాటు వరుసగా 26, 17 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌.. సౌతాఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక తొలి టెస్టులో భారత్‌ ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. యశస్వి జైస్వాల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌లకు తుదిజట్టులో చోటు ఇచ్చింది.సౌతాఫ్రికాతో తొలి టెస్టు ఆడిన భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్.చదవండి: గంభీర్‌పై విమర్శల వర్షం.. స్పందించిన బీసీసీఐ

ACC Men's Asia Cup Rising Stars 2025: BAN-A Scored Huge Score In 1st Semis Against IND-A4
టీమిండియాతో సెమీఫైనల్‌.. బంగ్లాదేశ్‌ భారీ స్కోర్‌

ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో (ACC Men's Asia Cup Rising Stars 2025) ఇవాళ (నవంబర్‌ 21) తొలి సెమీ ఫైనల్‌ జరుగుతుంది. దోహా వేదికగా భారత్‌-ఏ-బంగ్లాదేశ్‌-ఏ (India A vs Bangladesh A) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్‌ హబిబుర్‌ రెహ్మాన్‌ సోహన్‌ (46 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆఖర్లో మెహ్రబ్‌ (18 బంతుల్లో 48 నాటౌట్‌; ఫోర్‌, 6 సిక్సర్లు) చెలరేగడంతో బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో జిషన్‌ ఆలమ్‌ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జవాద్‌ అబ్రార్‌ (13), యాసిర్‌ అలీ (9 బంతుల్లో 17 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆ జట్టు కెప్టెన్‌ అక్బర్‌ అలీ 9, మహిదుల్‌ ఇస్లాం 1 పరుగు చేయగా.. అబూ హైదర్‌ డకౌటయ్యాడు.భారత బౌలర్లలో విజయ్‌కుమార్‌ వైశాక్‌ (4-0-51-0) భారీ పరుగులు సమర్పించుకోగా.. గుర్‌జప్నీత్‌ సింగ్‌ (4-0-39-2), హర్ష​్‌ దూబే (4-0-22-1), సుయాశ్‌ శర్మ (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. రమన్‌దీప్‌ సింగ్‌ (2-0-29-1), నమన్‌ ధిర్‌ (2-0-33-1) పర్వాలేదనిపించారు.వైభవ్‌ మెరుపులు కూడా మొదలయ్యాయి..!అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (12 బంతుల్లో 38 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసాన్ని ప్రారంభించాడు. మరో ఓపెనర్‌ ప్రియాంశ్‌ ఆర్య (7 బంతుల్లో 15 నాటౌట్‌; 2 ఫోర్లు) కూడా భారీ షాట్లు ఆడుతున్నాడు. ఫలితంగా భారత్‌ 3.3 ఓవరల్లో వికెట్‌ నష్టపోకుండా 53 పరుగులు చేసింది.

Shreyas Iyer's comeback set to be delayed, Report reveals recovery timeline5
శ్రేయస్‌ అయ్యర్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడిన భారత వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు (Shreyas Iyer) సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ అందుతుంది. టీమిండియాలోకి శ్రేయస్‌ రీఎంట్రీ ఇప్పట్లో కష్టమేనని సమాచారం. ఇండియాటుడే నివేదిక ప్రకారం.. శ్రేయస్‌కు తాజాగా అల్రాసోనోగ్రఫీ (USG) స్కాన్‌ తీశారు. ఇందులో అతడి గాయం పూర్తిగా నయం కాలేదని తేలింది.ప్రస్తుతం​ అతను సాధారణ పనులు, తేలికపాటి ఎక్సర్‌సైజ్‌లు మాత్రమే చేసుకోవచ్చు. హార్డ్‌ ట్రైనింగ్‌ మరో నెల పాటు నిషేధం. రెండు నెలల తర్వాత మరో స్కాన్‌ ఆధారంగా BCCI CoEలో అతడి రీహాబ్‌ ప్లాన్‌ అమలు కానుంది. ఈ సమాచారం నిజమైతే శ్రేయస్‌ మరో మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటాడు.ఈ మధ్యలో అతను సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లకు దూరమవుతాడు. మార్చిలో జరిగే ఐపీఎల్‌ 2026లోనే శ్రేయస్‌ పునఃదర్శనం ఉంటుంది. ఈ వార్త తెలిసి శ్రేయస్‌ అభిమానులు నిరాశ చెందుతున్నారు. తొలుత శ్రేయస్‌ వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌ సమయానికంతా సిద్దంగా ఉంటాడని అంతా అనుకున్నారు.తాజా అప్‌డేట్‌ని బట్టి చూస్తే ఇప్పట్లో శ్రేయస్‌ను టీమిండియా జెర్సీలో చూడటం కష్టమేనని స్పష్టమవుతుంది.కాగా, అక్టోబర్‌ 25న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సందర్భంగా అలెక్స్‌ క్యారీ క్యాచ్‌ పట్టే ప్రయత్నంలో శ్రేయస్‌ ప్రమాదకరంగా కిందపడ్డాడు. క్యాచ్‌ అయితే పట్టగలిగాడు ​కాని, ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. కిందపడ్డాక నొప్పితో విలవిలలాడిపోయిన శ్రేయస్‌ను హుటాహుటిన సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్సనందించారు. తొలుత గాయం చిన్నదే అని అంతా అనుకున్నారు.అయితే డాక్టర్లు నెమ్మదిగా విషయాన్ని చెప్పారు. శ్రేయస్‌ స్ప్లీన్‌లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావమైందని తెలిపారు. ఒకటి, రెండు రోజుల వరకు ఏమీ చెప్పలేమని అన్నారు.అయితే దైవానుగ్రహం, డాక్టర్లు కృషి వల్ల శ్రేయస్‌ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని సాధారణ స్థితికి చేరాడు. ప్రస్తుతం అతను మునుపటిలా యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. క్రికెట్‌కు మాత్రం ఇంకొంతకాలం దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. చదవండి: యాషెస్‌ సిరీస్‌కు అదిరిపోయే ఆరంభం

We Don't: BCCI Secretary Breaks Silence On Gambhir Criticism Kolkata Defeat6
గంభీర్‌పై విమర్శల వర్షం.. స్పందించిన బీసీసీఐ

హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ (Gautam Gambhir) వచ్చిన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విజయ పరంపర కొనసాగిస్తున్న టీమిండియా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతోంది. ముఖ్యంగా స్వదేశంలోనూ వరుస మ్యాచ్‌లలో ఓటమి పాలుకావడం విమర్శలకు దారితీస్తోంది.గంభీర్‌ మార్గదర్శనంలో సొంతగడ్డపై న్యూజిలాండ్‌ చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో టెస్టుల్లో టీమిండియా 3-0తో వైట్‌వాష్‌ అయింది. బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ వంటి ఫామ్‌లోలేని జట్లపై గెలిచినా.. తాజాగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులోనూ ఓటమిని మూటగట్టుకుంది. వేళ్లన్నీ గంభీర్‌ వైపేకోల్‌కతా వేదికగా సఫారీ (IND vs SA)లు విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా 93 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ముప్పై పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌పై విమర్శలు రాగా.. వేళ్లన్నీ గంభీర్‌ వైపే చూపాయి. అతడి ఆలోచనకు తగ్గట్లే రూపొందించిన పిచ్‌పై భారత జట్టు బోల్తా పడిందని బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ సైతం మండిపడ్డాడు.ఈ క్రమంలో గంభీర్‌ కూడా పిచ్‌ పరిస్థితికి తానే కారణమంటూ నైతిక బాధ్యత వహించాడు. అయినా సరే గంభీర్‌పై విమర్శల వర్షం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్‌ సైకియా తాజాగా స్పందించాడు. గంభీర్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందంటూ అతడికి మద్దతు పలికాడు.బీసీసీఐ స్పందన ఇదే‘‘మా సెలక్టర్లు, కోచింగ్‌ సిబ్బంది.. మరీ ముఖ్యంగా హెడ్‌కోచ్‌, మా ఆటగాళ్లపై బీసీసీఐకి పూర్తి నమ్మకం ఉంది. ఎవరినీ మేము తక్కువ చేయము. ప్రతి ఒక్కరికి మా మద్దతు ఉంటుంది. అందుకే మా జట్టు చాన్నాళ్లుగా అద్భుత విజయాలు సాధిస్తోంది.అయితే, ఏదో ఒక్క మ్యాచ్‌ ఓడినంత మాత్రాన దాని గురించి సోషల్‌ మీడియాలో రచ్చ చేయడం సరికాదు. ఇలాంటి వాళ్లను మేము అస్సలు పట్టించుకోము. ఇదే జట్టు.. ఇదే హెడ్‌కోచ్‌ మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచింది.అదే విధంగా.. ఆసియా టీ20 కప్‌ టోర్నీలోనూ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్‌ గడ్డ మీద ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది’’ అంటూ దేవజిత్‌ సైకియా.. గంభీర్‌, టీమిండియాను సమర్థించాడు. బయటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేసే విమర్శలను తాము పట్టించుకోమని రెవ్‌స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు. కాగా గంభీర్‌ గైడెన్స్‌లో ఈ ఏడాది టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీతో పాటు ఆసియా కప్‌ గెలిచిన విషయం తెలిసిందే. అయితే, స్వదేశంలో కివీస్‌ చేతిలో టెస్టుల్లో ఘోర పరాభవంతో పాటు ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని 1-3తో చేజార్చుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని టీమిండియా కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తాజాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు ఓడిన టీమిండియా.. గువాహటిలో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో తప్పకగెలవాల్సిందే!.. లేదంటే సొంతగడ్డపై మరో పరాభవం తప్పదు!!చదవండి: ఎవరిని ఆడించాలో తెలుసు.. నిర్ణయం తీసుకున్నాం: రిషభ్‌ పంత్‌

Its A YES: Palash Proposes To Smriti Mandhana At WC Final Venue Video7
స్మృతి మంధానకు కాబోయే భర్త సర్‌ప్రైజ్‌.. వీడియో వైరల్‌

భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. చిరకాల స్నేహితుడు, సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌ (Palash Muchhal)తో ఏడడుగులు వేయనుంది. చాన్నాళ్ల క్రితమే తమ బంధాన్ని బయటి ప్రపంచానికి తెలిపిన స్మృతి- పలాష్‌ జంట.. తమ ప్రేమను వైవాహిక బంధంతో నవంబరు 23న పదిలం చేసుకోనున్నారు.జగజ్జేతగా భారత్‌ఈ నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు పెళ్లి వేడుకలు మొదలుకాగా.. పలాష్‌ తన రొమాంటిక్‌ ప్రపోజల్‌తో స్మృతిని సర్‌ప్రైజ్‌ చేశాడు. కాగా భారత మహిళా క్రికెట్‌ జట్టు ఇటీవలే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2025 టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత్‌ ప్రపంచకప్‌ గెలవాలన్న మిథాలీ రాజ్‌, ఝులన్‌ గోస్వామి వంటి దిగ్గజ ఆటగాళ్ల కలను హర్మన్‌ సేన సొంతగడ్డపై నెరవేర్చింది.ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. మహిళల వన్డే క్రికెట్‌లో తొలిసారి భారత్‌ జగజ్జేతగా నిలిచింది. నాలుగున్నర దశాబ్దాల కలను నెరవేరుస్తూ ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంలో ఓపెనర్‌గా, వైస్‌ కెప్టెన్‌గా స్మృతి మంధాన తన వంతు పాత్ర పోషించింది. ఇంతటి ప్రత్యేకమైన ఈ మైదానంలోనే స్మృతికి పలాష్‌ అదిరిపోయే బహుమతి ఇచ్చాడు.నన్ను పెళ్లి చేసుకుంటావా?కళ్లకు గంతలు కట్టి మరీ స్మృతిని డీవై పాటిల్‌ స్టేడియానికి తీసుకువెళ్లిన పలాష్‌.. మోకాళ్లపై కూర్చుని.. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ ప్రతిపాదన తెచ్చాడు. ఇందుకు ఆమె నవ్వుతూ అంగీకరించింది. పలాష్‌ తన వేలికి ఉంగరం తొడగడంతో సిగ్గులమొగ్గయిన స్మృతి.. ఆ తర్వాత తాను కూడా పలాష్‌ వేలికి ఉంగరం తొడిగింది.ఇందుకు సంబంధించిన వీడియోను పలాష్‌ ముచ్చల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘‘ఆమె సరేనంది’’ అంటూ తమ జీవితంలోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. కాగా తమ్ముడు పలాష్‌తో పాటు బాలీవుడ్‌ సింగర్‌ పాలక్‌ ముచ్చల్‌ కూడా స్టేడియానికి వచ్చి మరదల్ని సర్‌ప్రైజ్‌ చేసింది. ఆ తర్వాత అంతా కలిసి నవ్వులు చిందిస్తూ స్టెప్పులు వేశారు. కాగా మహారాష్ట్రకు చెందిన 29 ఏళ్ల స్మృతి మంధాన క్రికెటర్‌గా సత్తా చాటుతుండగా.. ఇండోర్‌కు చెందిన 30 ఏళ్ల పలాష్‌ ముచ్చల్‌ బాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఇరుకుటుంబాల సమ్మతితో స్మృతి- పలాష్‌ ఆదివారం (నవంబరు 23) పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నారు.చదవండి: ఐపీఎల్‌ ఆడటం మానెయ్‌: గిల్‌కు గంభీర్‌ సలహా ఇదే View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal)

19 Wickets On Opening Day Of 1st Ashes Test8
యాషెస్‌ సిరీస్‌కు అదిరిపోయే ఆరంభం

2025-26 యాషెస్‌ సిరీస్‌కు (Ashes Series) అదిరిపోయే ఆరంభం లభించింది. పెర్త్‌ వేదికగా ఇవాళ (నవంబర్‌ 21) మొదలైన తొలి మ్యాచ్‌లో (Australia vs England) ఏకంగా 19 వికెట్లు పడ్డాయి. యాషెస్‌ సిరీస్‌ చరిత్రలో గడిచిన వందేళ్లలో ఇలా ఎప్పుడూ జరగలేదు. 2001 ట్రెంట్‌బ్రిడ్జ్‌ టెస్ట్‌లో అత్యధికంగా 17 వికెట్లు పడ్డాయి.యాషెస్‌ టెస్ట్‌ తొలి రోజు 18 అంతకంటే ఎక్కువ వికెట్లు పడిన ఏకైక ఉదంతం 1909 ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ టెస్ట్‌లో చోటు చేసుకుంది. ఆ మ్యాచ్‌ తొలి రోజు రికార్డు స్థాయిలో 20 వికెట్లు పడ్డాయి. తొలుత ఆస్ట్రేలియా 147, ఆర్వాత ఇంగ్లండ్‌ 119 పరుగులకు ఆలౌటయ్యాయి.ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఇవాళ మొదలైన యాషెస్‌ టెస్ట్‌లోనూ పునరావృతమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 172 పరుగులకు ఆలౌట్‌ కాగా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌పై మిచెల్‌ స్టార్క్‌ నిప్పులు చెరిగాడు. ఏకంగా 7 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టాడు. అరంగేట్రం పేసర్‌ బ్రెండన్‌ డాగ్గెట్‌ 2, గ్రీన్‌ ఓ వికెట్‌ తీశారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్‌ (52) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ఓలీ పోప్‌ (46), జేమీ స్మిత్‌ (33), డకెట్‌ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జాక్‌ క్రాలే, రూట్‌, మార్క్‌ వుడ్‌ డకౌట్లు కాగా.. స్టోక్స్‌ 6, అట్కిన్సన్‌ 1, కార్స్‌ 6 పరుగులకు ఔటయ్యారు.అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ బౌలర్లు సైతం విరుచుకుపడ్డారు. కెప్టెన్‌ స్టోక్స్‌ 5, ఆర్చర్‌, కార్స్‌ తలో 2 వికెట్లు తీసి ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను పతనం అంచుకు తీసుకెళ్లారు. ఇప్పటివరకు ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో అలెక్స్‌ క్యారీ (26) టాప్‌ స్కోరర్‌ కాగా.. హెడ్‌ (21), గ్రీన్‌ (24), స్టీవ్‌ స్మిత్‌ (17), స్టార్క్‌ (12) రెండంకెల స్కోర్లు చేశారు. అరంగేట్రం బ్యాటర్‌ వెదరాల్డ్‌, బోలాండ్‌ డకౌట్లు కాగా.. లబూషేన్‌ 9, ఖ్వాజా 2 పరుగులకు ఔటయ్యారు. లియోన్‌ (3), డగ్గెట్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండగా భూకంపం.. ఉలిక్కిపడ్డ ప్లేయర్లు

Maharashtra squad for the Syed Mushtaq Ali Trophy 2025-26 Announced. Ruturaj Gaikwad will lead9
కెప్టెన్‌గా రుతురాజ్‌

త్వరలో ప్రారంభం కానున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ (SMAT 2025-26) కోసం 16 మంది సభ్యుల మహారాష్ట్ర జట్టును (Maharashtra) ఇవాళ (నవంబర్‌ 21) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad) ఎంపికయ్యాడు. ఇటీవలే ముంబై నుంచి వలస వచ్చిన పృథ్వీ షాకు (Prithvi Shaw) ఈ జట్టులో చోటు దక్కింది. రుతురాజ్‌, షా ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.ఈ టోర్నీ ఈ నెల 26 నుంచి ప్రారంభం​ కానుండగా, అదే రోజు మహారాష్ట్ర తమ తొలి మ్యాచ్‌లో జమ్మూ అండ్‌ కశ్మీర్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో మహారాష్ట్ర ఎలైట్‌ గ్రూప్‌-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో హైదరాబాద్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఛండీఘడ్‌, బిహార్‌, గోవా జట్లు ఉన్నాయి. గ్రూప్‌ దశలో మహారాష్ట్ర మొత్తం 7 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ కోల్‌కతా వేదికగా జరుగనున్నాయి.SMAT 2025-26 కోసం మహారాష్ట్ర జట్టు..రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, అర్శిన్‌ కులకర్ణి, రాహుల్‌ త్రిపాఠి, నిఖిల్‌ నాయక్‌ (వికెట్‌కీపర్‌), రామకృష్ణ ఘోష్‌, విక్కీ ఓస్త్వాల్‌, తనయ్‌ సంఘ్వీ, ముకేశ్‌ చౌదరీ, ప్రశాంత్‌ సోలంకి, మందర్‌ బండారీ (వికెట్‌కీపర్‌), జలజ్‌ సక్సేనా, రాజవర్దన్‌ హంగార్గేకర్‌, యోగేశ్‌ డోంగరే, రంజిత్‌ నికమ్‌చదవండి: క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండగా భూకంపం.. ఉలిక్కిపడ్డ ప్లేయర్లు

BAN VS IRE 2nd Test Day 3: Earthquake stops play briefly in Mirpur10
క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండగా భూకంపం.. ఉలిక్కిపడ్డ ప్లేయర్లు

ఢాకా (Dhaka) వేదిక‌గా బంగ్లాదేశ్‌ (Bangladesh)-ఐర్లాండ్ (Bangladesh vs Ireland) మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్‌ మూడో రోజు (నవంబర్‌ 21) ఆట‌లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ్యాచ్‌ జరుగుతుండగా భూకంపం (Earth Quake) సంభవించ‌డంతో మైదానంలో ఉన్న ఆట‌గాళ్లంతా ఉలిక్కిపడ్డారు. మ్యాచ్‌ ఉన్నపళంగా ఆగిపోయింది. ఆటగాళ్లు, అంపైర్లు బౌండరీ లైన్‌ వైపు పరుగులు పెట్టారు. కొందరేమో మైదానంలోనే కింద పడుకుండిపోయారు.ప్రేక్షకులు ఏం జరుగుతుందో అర్దం కాక స్టేడియం బయటికి లగెత్తారు. దీంతో కాసేపు గందరగోళ వాతావరణం​ నెలకొంది. మూడు, నాలుగు నిమిషాల భూకంపం ధాటి తగ్గడంతో సాధారణ పరిస్థితి నెలకొంది. మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైంది. ఈ షాకింగ్‌ ఘటన ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ 56వ ఓవర్‌ రెండో బంతి బౌల్‌ చేస్తుండగా చోటు చేసుకుంది.కాగా, ఇవాళ ఉదయం 10:08 గంటల సమయంలో బంగ్లాదేశ్‌లోని ఢాకా నగరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (US Geological Survey) తెలిపింది. భూప్రకంపనల కారణంగా ఢాకాలోని పలు భవనాలు కూలిపోయాయి. ఇందులో ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం.మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ పట్టు సాధించింది. మూడో రోజు మూడో సెషన్‌ సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 70 పరుగులు చేసి, 281 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగుల భారీ స్కోర్‌ చేసిన బంగ్లాదేశ్‌.. ఆతర్వాత ఐర్లాండ్‌ను 265 పరుగులకే పరిమితం చేసి 211 పరుగుల కీలక ఆధిక్యం​ సాధించింది. రెండు మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో తొలి టెస్ట్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ 1-0 ఆధిక్యంలో ఉంది. చదవండి: టీమిండియా కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌.. బీసీసీఐ అధికారిక ప్రకటన

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement