Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

WPL 2026 Auction: Check Top 10 most Expensive Signings This Time1
WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)-2026 మెగా వేలంలో భారత క్రికెటర్లు దీప్తి శర్మ, నల్లపురెడ్డి శ్రీచరణి సత్తా చాటారు. వన్డే వరల్డ్‌కప్‌-2025లో వీరిద్దరు అదరగొట్టిన విషయం తెలిసిందే. దీప్తి ఈ మెగా టోర్నీలో 215 పరుగులు సాధించడంతో పాటు.. 22 వికెట్లు కూల్చింది.మరోవైపు.. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ శ్రీచరణి (Shree Charani) పద్నాలుగు వికెట్లతో దుమ్ములేపింది. ఈ క్రమంలో అంచనాలకు అనుగుణంగా దీప్తి శర్మ ఈసారి వేలంపాటలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా నిలవగా.. శ్రీచరణి సైతం జాక్‌పాట్‌ అందుకుంది.మరి డబ్ల్యూపీఎల్‌ 2026 మెగా వేలంలో వీరితో పాటు టాప్‌-10లో ఉన్న ప్లేయర్లు ఎవరో చూసేద్దామా!దీప్తి శర్మ (భారత్‌)👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 3.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌అమెలియా కెర్‌ (న్యూజిలాండ్‌)👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 3 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్‌సోఫీ డివైన్‌ (న్యూజిలాండ్‌)👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 2 కోట్లకు కొనుక్కున్న గుజరాత్‌ జెయింట్స్‌మెగ్‌ లానింగ్‌ (ఆస్ట్రేలియా)👉బ్యాటర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 1.90 కోట్లకు సొంతం చేసుకున్న యూపీ వారియర్స్‌శ్రీచరణి (భారత్‌)👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.3 ​కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌చినెలె హెన్రి (వెస్టిండీస్‌)👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.30 కోట్లకు కొనుక్కున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ఫోబే లిచిఫీల్డ్‌ (ఆస్ట్రేలియా)👉బ్యాటర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌లారా వొల్వర్ట్‌ (సౌతాఫ్రికా)👉బ్యాటర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ఆశా శోభన (భారత్‌)👉బౌలర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న యూపీ వారియర్స్‌లారెన్‌ బెల్‌ (ఇంగ్లండ్‌)👉బౌలర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 90 లక్షలకు కొనుక్కున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.చదవండి: WPL 2026 Auction Updates: ఎవరికి ఎంత ధర?

Virat Kohli U-19 Teammate Saurabh Tiwary Welcomes Him In Ranchi2
కోహ్లితో ఉన్న‌దెవ‌రో క‌నిపెట్టారా?

రాంచీ: ద‌క్షిణాఫ్రికాతో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్ కోసం టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి గురువారం జార్ఖండ్‌లో ల్యాండ్ అయ్యాడు. రాంచీలోని బిర్సా ముండా విమానాశ్ర‌యంలో అత‌డికి స్పెష‌ల్ వెల్‌కం ల‌భించింది. ఒక‌ప్పుడు కోహ్లితో క‌లిసి క్రికెట్ ఆడిన‌ మాజీ క్రికెట‌ర్ సౌర‌భ్ తివారీ అత‌డికి ద‌గ్గ‌రుండి మ‌రీ స్వాగ‌తం ప‌లికాడు. చాలా కాలం త‌ర్వాత కోహ్లితో క‌లిసి సౌర‌భ్ తివారీ కెమెరాకు చిక్క‌డంతో వారిద్ద‌రి జ్ఞాపకాలను క్రికెట్ ల‌వ‌ర్స్ గుర్తు చేసుకుంటున్నారు. తొలి నాళ్ల నాటి అనుభ‌వాల‌ను నెమ‌రువేసుకుంటున్నారు.జూనియ‌ర్ ధోనిగా ముద్ర ప‌డిన 35 ఏళ్ల‌ సౌర‌భ్ తివారీ (Saurabh Tiwary).. చాలా సంవత్సరాలు జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2008లో కోహ్లి నాయ‌క‌త్వంలో అండ‌ర్-19 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన భార‌త జ‌ట్టులోనూ అత‌డు స‌భ్యుడిగా ఉన్నాడు. ఎడమచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అయిన తివారీ జ‌ట్టు విజ‌యంలో త‌న వంతు పాత్ర పోషించాడు. టీమిండియా త‌ర‌పున కేవ‌లం మూడు వ‌న్డేలు మాత్ర‌మే ఆడాడు. 2010, అక్టోబ‌ర్ 20న‌ విశాఖ‌ప‌ట్నంలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌తో వ‌న్డేల్లో అరంగ్రేటం చేశాడు.ఆర్సీబీలోనూ కోహ్లితో క‌లిసి..ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లోనూ నాలుగు జ‌ట్లకు ప్రాతినిథ్యం వ‌హించిన తివారీ 93 మ్యాచ్‌లు ఆడాడు. 2008 నుంచి 2010 ముంబై ఇండియన్స్‌తో ఉన్నాడు. 2011 నుండి 2013 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో జ‌ట్టులో మ‌ళ్లీ విరాట్ కోహ్లితో క‌లిసి ఆడాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా తన శక్తివంతమైన స్ట్రోక్ ఆటతో జూనియ‌ర్‌ ధోనిగా గుర్తింపు పొందాడు.ఆట‌కు వీడ్కోలు ప‌లికిన త‌ర్వాత అడ్మినిస్ట్రేష‌న్‌లోకి ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (JKCA) కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈ హోదాలోనే ఇప్పుడు విరాట్ కోహ్లికి హృదయపూర్వ స్వాగ‌తం ప‌లికాడు. చాలా కాలం త‌ర్వాత వీరిద్ద‌రూ క‌ల‌వ‌డం క్రికెట్ అభిమానుల్లో ఆస‌క్తి రేపింది. మాజీ సహచరులు తిరిగి కలిసిన వీడియో నెట్టింట‌ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి నెటిజ‌నులు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. "నీలం రంగు సూట్‌లో ఉన్న వ్యక్తి కోహ్లి అండ‌ర్‌-19 సహచరుడు అని ఎవరికీ తెలియదు" అని ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించారు. "విమానాశ్రయంలో సౌరభ్ తివారీ!" అని మ‌రొక‌రు పేర్కొన్నారు. "సౌరభ్ తివారీ.. కరణ్ ఔజ్లా లాగా కనిపిస్తున్నాడు!" అంటూ మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశారు.చ‌ద‌వండి: ప‌లాష్ ముచ్చ‌ల్‌ చాట్‌లను బ‌య‌ట‌పెట్టింది నేనే..కాగా, న‌వంబ‌ర్ 30 నుంచి భార‌త్- ద‌క్షిణాఫ్రికా వ‌న్డే సిరీస్ ప్రారంభ‌మ‌వుతుంది. ఇరు జ‌ట్లు మూడు వ‌న్డేలు ఆడ‌నున్నాయి. రెండు టెస్టుల సిరీస్‌ను సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసిన నేప‌థ్యంలో వ‌న్డే సిరీస్ అయినా గెల‌వాల‌ని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. View this post on Instagram A post shared by NDTV (@ndtv)

Deepti Sharma Hits jackpot in WPL 2026 auction Scripts History3
అయ్యో పాపం!.. దీప్తి శర్మకే ఎందుకిలా?

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)-2026 మెగా వేలంలో భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మకు భారీ ధర దక్కింది. న్యూఢిల్లీ వేదికగా గురువారం నాటి వేలంపాటలో యూపీ వారియర్స్‌ ఆమెను ఏకంగా రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఆదిలో దీప్తి కోసం ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.కాగా డబ్ల్యూపీఎల్‌ ఆరంభ సీజన్‌ (2023) నుంచి దీప్తి శర్మ యూపీ వారియర్స్‌కే ప్రాతినిథ్యం వహిస్తోంది. అలిసా హేలీ గాయం వల్ల దూరం కావడంతో 2025లో యూపీ కెప్టెన్‌గానూ దీప్తి వ్యవహరించింది. అయితే, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆమె సారథ్యంలో యూపీ కనీసం ప్లే ఆఫ్స్‌ కూడా చేరలేదు.ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ఇదిలా ఉంటే.. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025లో భారత్‌ విజేతగా నిలవడంలో దీప్తి శర్మదే ముఖ్య పాత్ర. ఈ ఆల్‌రౌండర్‌ మూడు అర్ధ శతకాల సాయంతో 215 పరుగులు చేయడంతో పాటు.. మొత్తంగా 22 వికెట్లు కూల్చి ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు అందుకుంది. ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో హాఫ్‌ సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు కూల్చడం హైలైట్‌గా నిలిచింది.ఢిల్లీ క్యాపిటల్స్‌ తప్పఈ నేపథ్యంలో యూపీ దీప్తిని రిటైన్‌ చేసుకుంటుందని భావించగా.. అనూహ్యంగా ఆమెను వేలంలోకి వదిలింది. వేలంలో దీప్తి కోసం ఫ్రాంఛైజీలు ఎగబడతాయని భావించగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ తప్ప ఎవరూ కనీసం ఆమె వైపు చూడలేదు.ఈ క్రమంలో కనీస ధర రూ. 50 లక్షలకు దీప్తి వేలంలోకి రాగా ఢిల్లీ అదే ధరకు దీప్తిని కొనుగోలు చేయాలనుకుంది. ఇంతలో రంగంలోకి దిగిన యూపీ.. రైట్‌ టు మ్యాచ్‌ (RTM) కార్డు ద్వారా అదే ధర చెల్లించి దీప్తిని సొంతం చేసుకోవాలని భావించింది. అయితే, ఢిల్లీ ఒక్కసారిగా దీప్తి ధరను రూ. 3.2 కోట్లకు పెంచింది.ఢిల్లీ వదిలేలా లేదని భావించిన యూపీ రూ. 3.2 కోట్ల వద్ద తమ RTM కార్డును ఉపయోగించి దీప్తిని తిరిగి సొంతం చేసుకుంది. ఫలితంగా డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ప్లేయర్‌గా.. ఆష్లే గార్డ్‌నర్‌ (గుజరాత్‌- 2023- రూ. 3.2 కోట్లు) రికార్డు సమం చేసింది. కాగా ఆర్సీబీ 2023లో స్మృతి మంధానను రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేయగా.. ఆమె లీగ్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా కొనసాగుతోంది. చదవండి: WPL 2026: వేలంలో శ్రీచరణికి భారీ ధర

Smriti Mandhana wedding controversy Woman behind leaked chats speaks out4
చాట్‌లను బ‌య‌ట‌పెట్టింది నేనే..

టీమిండియా మహిళా స్టార్ క్రికెట‌ర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి ఆగిపోవ‌డానికి తానే కార‌ణ‌మ‌ని ఓ యువ‌తి అంగీక‌రించింది. స్మృతి మంచి కోరే ఇదంతా చేశాన‌ని, త‌న‌కు మ‌రో ఉద్దేశం ఏదీ లేద‌ని వెల్ల‌డించింది. ప‌లాష్ ముచ్చ‌ల్‌తో జ‌రిగిన చాటింగ్ మెసేజ్ స్క్రీన్‌షాట్‌లను బ‌య‌ట‌పెట్టింది తానేన‌ని తెలిపింది. ప‌లాష్ ఎలాంటి వాడో తెలియాల‌న్న భావ‌న‌తోనే ఇలా చేయాల్సి వ‌చ్చింద‌ని పేర్కొంది. అయితే ప‌లాష్‌తో 4 నెల‌ల క్రితం చాటింగ్ చేశాన‌ని, అత‌డి పెళ్లి ఆగిపోవ‌డానికి వీటికి సంబంధం లేద‌ని తెలిపింది. అంద‌రూ అనుకుంటున్న‌ట్టుగా తాను కొరియోగ్రాఫ‌ర్ కాద‌ని క్లారిటీ ఇచ్చింది. తాను వెలుగులోకి రావాల‌ని ఎప్పుడూ అనుకోలేద‌ని అంది. ఈ మేర‌కు తాజాగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.''స్మృతి మంధాన, ప‌లాష్ ముచ్చ‌ల్‌ పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణ‌మైన చాట్‌లను పోస్ట్ చేసిన వ్యక్తి నేనే. నా గుర్తింపును నేను ఎప్పుడూ వెల్లడించాలనుకోలేదు. ప‌లాష్‌తో నేను ఎటువంటి సంబంధం పెట్టుకోలేదు. మా మ‌ధ్య చాట్‌లు మే-జూలై 2025 వరకు జరిగాయి. ఒక నెల మాత్రమే కొనసాగాయి. అతడిని నేను ఎప్పుడూ కలవలేదు. అతనితో ఎలాంటి రిలేష‌న్‌లోనూ లేను. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్మృతి మంధానను ఆరాధిస్తాను. ప్రజలు తెలుసుకోవాలని భావించాను కాబట్టే నేను అతడి (ప‌లాష్ ముచ్చ‌ల్‌) గురించి బహిర్గతం చేశాను.నేను కొరియోగ్రాఫర్‌ను కాదు. అతడు మోసం చేసిన వ్యక్తిని కూడా కాదు. ప‌లాష్‌తో చేసిన చాట్‌ను బ‌య‌ట‌పెట్టినందుకు ఊహించని విధంగా నాపై వ్య‌తిరేక‌త రావ‌డంతో నా సోష‌ల్ మీడియా ఖాతాను (Social Media Account) ప్రైవేట్ మోడ్‌లో పెట్టాల్సివ‌చ్చింది. ప‌లాష్‌తో జ‌రిపిన చాట్‌లను గ‌మ‌నిస్తే.. నేను తప్పు చేయలేదన్న విష‌యం స్పష్టంగా తెలుస్తుంది. ఏ మ‌హిళ‌కు అన్యాయం నేను చేయ‌లేదు. దయచేసి నన్ను టార్గెట్ చేయ‌వ‌ద్ద‌ని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను'' అంటూ వేడుకుంది.చ‌ద‌వండి: ఆగిన స్మృతి.. జెమీమా రోడ్రిగ్స్ సంచ‌ల‌న నిర్ణ‌యంకాగా, స్మృతి, ప‌లాష్ పెళ్లి ఆగిపోయిన నేప‌థ్యంలో మేరీ డికోస్టా అనే యువ‌తి పేరుతో అన‌ధికారిక‌ చాటింగ్ స్క్రీన్‌షాట్లు వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో ఆన్‌లైన్‌లో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు. ఫ‌లితంగా సోష‌ల్ మీడియా ఖాతాను ప్రైవేట్ మోడ్‌లోకి మార్చేసింది. అయితే ఈ వివాదంపై స్మృతి మంధాన, ప‌లాష్ ముచ్చ‌ల్‌ (Palash Muchhal) కుటుంబాలు ఇప్ప‌టివ‌రకు అధికారికంగా స్పందించ‌లేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)

Shree Charani Makes DC Return With Massive Pay Hike After WC Win5
WPL 2026: వేలంలో శ్రీచరణికి భారీ ధర

భారత క్రికెటర్‌, కడప ముద్దుబిడ్డ నల్లపురెడ్డి శ్రీచరణి (Shree Charani)కి జాక్‌పాట్‌ తగిలింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)-2026 మెగా వేలంలో ఫ్రాంఛైజీలు ఆమె కోసం పోటీపడ్డాయి. ఈ క్రమంలో శ్రీచరణికి భారీ ధర దక్కింది.ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌-2025 టోర్నమెంట్లో భారత్‌ చాంపియన్‌గా నిలవడంలో శ్రీచరణిది ముఖ్య భూమిక. ఈ మెగా ఈవెంట్లో శ్రీచరణి ఏకంగా పద్నాలుగు వికెట్లు పడగొట్టింది. తద్వారా భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ నిలిచింది. రూ. 30 లక్షల కనీస ధరఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణికి భారీ ధర దక్కుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆమె అదరగొట్టింది. రూ. 30 లక్షల కనీస ధరతో శ్రీచరణి వేలంలోకి రాగా.. యూపీ వారియర్స్‌ తొలి బిడ్‌ వేసింది. ఆ వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్‌ రంగంలోకి దిగి.. ధరను ఏకంగా రూ. 75 లక్షలకు పెంచింది.దీంతో యూవీ వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఆ వెంటనే మళ్లీ రూ. 90 లక్షలకు ధరను పెంచింది. ఈ క్రమంలో శ్రీచరణిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ధరను ఏకంగా రూ. 1.3 కోట్లకు పెంచగా.. యూపీ వెనక్కి తగ్గింది. ఫలితంగా శ్రీచరణి రూ. 1.3 కోట్లకు మళ్లీ సొంతగూటి (ఢిల్లీ)కి చేరుకుంది.ఎదురులేని చరణికాగా గతంలో శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడింది. 2024 సీజన్‌లో రూ. 55 లక్షలకు ఆమెను ఢిల్లీ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. దీంతో అత్యధిక ధర దక్కించుకున్న నాటి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ల లిస్టులో శ్రీచరణి చేరింది. అరంగేట్రంలోనే ఎలిస్‌ పెర్రీని అవుట్‌ చేసి ఆగమనాన్ని ఘనంగా చాటింది ఈ స్పిన్‌ బౌలర్‌.ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన శ్రీచరణి 2025 ఏప్రిల్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. శ్రీలంకతో ముక్కోణపు వన్డే సిరీస్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అదే ఏడాది ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీ20లలోనూ అడుగుపెట్టింది. 4/12 గణాంకాలతో సత్తా చాటి తొలి అంతర్జాతీయ టీ20లోనే ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది.ఇక ఇప్పటి వరకు భారత్‌ తరఫున 18 వన్డేలు, ఐదు టీ20లు ఆడిన 21 ఏళ్ల శ్రీచరణి.. వరల్డ్‌కప్‌లో ఏకంగా పదకొండు వికెట్లు కూల్చి సత్తా చాటింది. ప్రపంచకప్‌ విజేతగా డబ్ల్యూపీఎల్‌ వేలంలోకి వచ్చిన ఆమె కనీస ధర.. దాదాపుగా 333 శాతం పెరగడం విశేషం.

BCCI Announces WPL 4th edition from Jan 9 to Feb 5 in two cities6
బీసీసీఐ కీలక ప్రకటన

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)-2026 సీజన్‌కు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కీలక ప్రకటన చేసింది. తాజా ఎడిషన్‌లో నవీ ముంబై, వడోదరలను ఈ మెగా ఈవెంట్‌ వేదికలుగా ఖరారు చేసినట్లు తెలిపింది. అదే విధంగా.. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 మధ్య డబ్ల్యూపీఎల్‌ నాలుగో ఎడిషన్‌ నిర్వహిస్తామని వెల్లడించింది.డబ్ల్యూపీఎల్‌-2026 మెగా వేలం సందర్భంగా లీగ్‌ చైర్మన్‌ జయేశ్‌ జార్జ్‌ గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. న్యూఢిల్లీ వేదికగా మెగా వేలం మొదలుకాగా.. ఐదు ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ప్లేయర్ల కోసం పోటీపడుతున్నాయి. ముంబై ఇండియన్స్‌కు రెండుసార్లు టైటిల్‌ అందించిన భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కూడా వేలంలో కూర్చోవడం విశేషం.ఇదిలా ఉంటే.. డబ్ల్యూపీఎల్‌ 2023లో మొదలై ఇప్పటికి మూడు సీజన్లు పూర్తిగా డబ్ల్యూపీఎల్‌ తొలి చాంపియన్‌గా ముంబై నిలిచింది. ఆ మరుసటి ఏడాది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు కెప్టెన్‌ స్మృతి మంధాన ట్రోఫీ అందించింది. ఈ ఫ్రాంఛైజీకి ఇదే తొలి టైటిల్‌. ఇక ఈ ఏడాది హర్మన్‌ మరోసారి తన సారథ్యంతో ముంబైని విజేతగా నిలిపింది.కాగా డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ పాల్గొంటున్నాయి.

WPL 2026 Auction Updates Eyes On World Cup Winning Stars7
WPL 2026 Auction: అప్‌డేట్స్‌.. ఎవరికి ఎంత ధర?

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2026 సీజన్‌ మెగా వేలం మొదలైంది. న్యూఢిల్లీ వేదికగా గురువారం నాటి ఈ వేలంపాటకు మల్లికా సాగర్‌ ఆక్షనీర్‌గా వ్యవహరిస్తున్నారు.డబ్ల్యూపీఎల్‌లోని మొత్తం ఐదు ఫ్రాంచైజీల్లో కలిపి 73 స్థానాలు ఖాళీ ఉన్నాయి. వీటి కోసం ఏకంగా 277 మంది వేలంలో పోటీ పడుతున్నారు. ఇందులో 194 మంది భారత క్రికెటర్లే ఉండటం విశేషం.చదవండి: WPL 2026: రిటైన్‌ చేసుకున్న, రిలీజ్‌ చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితాWPL 2026 Auction Updates:👉గౌతమీ నాయక్‌ను రూ. 10 లక్షలకు కొనుగోలు చేసిన ఆర్సీబీ👉సుమన్‌ మీనాను రూ. 10 లక్షలకు కొన్న ముంబై👉అన్‌క్యాప్డ్‌ ఆల్‌రౌండర్లు త్రివేణి వశిష్టను రూ. 20 లక్షలకు, నల్లరెడ్డిని రూ. 10 లక్షలకు కొన్న ముంబై👉సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్లోయీ ట్రియాన్‌ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌👉భారత అన్‌క్యాప్డ్‌ ఆల్‌రౌండర్‌ సుమన్‌ మీనాను రూ. 10 లక్షలకు కొనుగోలు చేసిన యూపీ👉అమెరికా ప్లేయర్‌ తారా నోరిస్‌ను రూ. 10 లక్షలకు కొన్న యూపీ వారియర్స్‌.👉ఆస్ట్రేలియాకు చెందిన లూసీ హామిల్టన్‌ను రూ. 10 లక్షలకు కొన్న ఢిల్లీ👉ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కిమ్‌ గార్త్‌ను రూ. 50 లక్షలకు సొంతం చేసుకున్న గుజరాత్‌👉యస్తికా భాటియాను రూ. 50 లక్షలకు కొన్న గుజరాత్‌👉సిమ్రాన్‌ షేక్‌ను రూ. 10 లక్షలకు కొన్న యూపీ👉షిప్రా గిరిని రూ. 10 లక్షలకు కొనుక్కున్న యూపీ👉మమత మడివాలాను రూ. 10 లక్షలకు కొన్న ఢిల్లీ👉హ్యాపీ కుమారిని రూ. 10 లక్షలకు సొంతం చేసుకున్న గుజరాత్‌👉నందాని శర్మను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ👉ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్రేస్‌ హ్యారిస్‌ను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన ఆర్సీబీ👉ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ నికోలా క్యారీని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై👉ఆల్‌రౌండర్‌ అనుష్క శర్మను రూ. 45 లక్షలకు దక్కించుకున్న గుజరాత్‌👉ఆస్ట్రేలియా లెగ్‌ స్పిన్నర్‌ జార్జియా వారేహామ్‌ కోసం కోటి రూపాయలు ఖర్చు చేసిన గుజరాత్‌👉ఆల్‌రౌండర్లు తనూజ కణ్వార్‌ను రూ. 45, కనిక్‌ అహుజాను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్‌👉రహీలా ఫిర్దోజ్‌ను రూ. 10 లక్షలకు కొనుక్కున్న ముంబైఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌కు రూ.85 లక్షలుకొనుగోలు చేసిన ఆర్సీబీవికెట్‌ కీపర్‌ తాన్యా భాటియాను రూ. 30 లక్షలకు కొన్న ఢిల్లీ క్యాపిటల్స్‌అరుంధతి రెడ్డి ఆర్సీబీకిభారత పేసర్‌, హైదరాబాదీ స్టార్‌ అరుంధతి రెడ్డిని ఆర్సీబీ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది.ఎస్‌ సజనను కొనుగోలు చేసిన ముంబైసుజన కనీస ధర రూ. 30 లక్షలతో వేలంలోకి రాగా.. ముంబై రూ. 75 లక్షలకు సొంతం చేసుకుంది.ప్రతికా రావల్‌కు భారీ షాక్‌భారత స్టార్‌ ఓపెనర​ ప్రతికా రావల్‌ వేలంలో అమ్ముడుపోలేదు. వరల్డ్‌కప్‌ -2025లో సత్తా చాటిన ఆమెపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. ఈ టోర్నీ సందర్భంగా ప్రతికా చీలమండకు గాయం అయింది. ఆమె కోలుకునేందుకు చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతోనే ఫ్రాంఛైజీలు ఆమెను కొనుగోలు చేయనట్లు తెలుస్తోంది.కశ్వీ గౌతమ్‌కు రూ. 65 లక్షలుతొలుత కశ్వీని కొనుగోలు చేసిన యూపీ.. RTM ద్వారా తిరిగి దక్కించుకున్న గుజరాత్‌శిఖా పాండేకు రూ. 2.4 కోట్లుశిఖా పాండేను కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌డియెండ్రా డాటిన్‌ యూపీకియూపీ రూ. 80 లక్షలకు విండీస్‌ ఆల్‌రౌండర్‌ డియెండ్రా డాటిన్‌ను సొంతం చేసుకుంది.అమ్ముడుపోని అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు (కనీస ధర రూ. 10 లక్షలు)డవీనా పారిన్‌, వ్రింద దినేశ్‌, దిశా కసత్‌, ఆరుషి గోయెల్‌, సనికా చల్కే, హుమైరా కాజీ, అమన్‌దీప్‌ కౌర్‌, గొంగడి త్రిష, జింతిమణి కలిత. యశశ్రీ, షిప్రా గిరి, మమత మడివాలా, ఖుషి భాటియా, ప్రత్యూష కుమార్‌, నందిని కశ్యప్‌, హ్యాపీ కుమారి, నందిని శర్మ, కోమల్‌ప్రీత్‌ కౌర్‌, మిల్లీ ఇల్లింగ్‌వర్త్‌, షబ్నమ్‌ షకీల్‌, ప్రకాశిక నాయక్‌, భారతి​ రావల్‌, ప్రియాంక్‌ కౌశల్‌, పరుణిక సిసోడియా, జాగ్రవి పవార్‌.అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ల వేలంముంబైకి సంస్కృతి గుప్తరూ. 20 లక్షలకు సంస్కృతిని కొనుగోలు చేసిన ముంబైఆర్సీబీకి అన్‌​క్యాప్డ్‌ ఆల్‌రౌండర్‌భారత అన్‌క్యాప్డ్‌ ఆల్‌రౌండర్‌ ప్రేమా రావత్‌ను ఆర్సీబీ రూ. 20 లక్షలకు తిరిగి దక్కించుకుంది. గుజరాత్‌ జెయింట్స్‌ ప్రేమ కోసం బిడ్‌ వేయగా.. RTM కార్డు ద్వారా అదే ధర చెల్లించి సొంతం చేసుకుంది. దీయా యాదవ్‌భారత క్రికెటర్‌ దీయా యాదవ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 10 లక్షల కనీస ధరకు కొనుక్కుంది.ముగిసిన వికెట్‌ కీపర్లు, స్పిన్నర్లు, పేసర్ల వేలంఆశా శోభనకు జాక్‌పాట్‌కనీస ధర రూ. 30 లక్షలతో వేలంలోకి వచ్చిన భారత స్పిన్నర్‌ ఆశా శోభనకు జాక్‌పాట్‌ తగిలింది. ఆర్సీబీతో పోటీ పడి మరీ యూపీ వారియర్స్‌ రూ. 1.1 కోట్లకు ఆమెను దక్కించుకుంది.ఆర్సీబీకి లిన్సే స్మిత్‌ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ లిన్సే స్మిత్‌ను ఆర్సీబీ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.షబ్నమ్‌ ఇస్మాయిల్‌ను కొనుక్కున్న గుజరాత్‌సౌతాఫ్రికా స్టార్‌ షబ్నమ్‌ ఇస్మాయిల్‌ను రూ. 60 లక్షలకు గుజరాత్‌ జెయింట్స్‌ కొనుగోలు చేసింది.టైటస్‌ సాధు ధర ఎంతంటే?భారత స్పిన్నర్‌ టైటస్‌ సాధును గుజరాత్‌ రూ. 30 లక్షలకు కొనుక్కుంది.క్రాంతి గౌడ్‌ ధర ఎంతంటే?యూపీ వారియర్స్‌ కనీస ధర రూ. 50 లక్షలకే వరల్డ్‌కప్‌ విన్నర్‌, భారత పేసర్‌ క్రాంతి గౌడ్‌ను సొంతం చేసుకుంది.ఆర్సీబీకి లారెన్‌ బెల్‌ 24 ఏళ్ల ఇంగ్లండ్‌ పేసర్‌ లారెన్‌ బెల్‌ను ఆర్సీబీ రూ. 90 లక్షలకు కొనుగోలు చేసింది.ఉమా ఛెత్రి అన్‌సోల్డ్‌వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన ఉమా ఛెత్రికి భారీ షాక్‌. రూ. 50 లక్షల కనీస ధరకు కూడా ఎవరూ ఆమెను కొనలేదుజలిజెల్లె లీ ధర ఎంతంటే?సౌతాఫ్రికా వికెట్‌ కీపర్‌ లిజెల్లె లీని రూ. 30 లక్షల కనీస ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది.హర్లిన్‌ డియోల్‌కు కనీస ధరయూపీ వారియర్స్‌ రూ. 50 లక్షలకు భారత ఆల్‌రౌండర్‌ హర్లిన్‌ డియోల్‌ను కొనుగోలు చేసింది.రాధా యాదవ్‌ ఆర్సీబీకిగుజరాత్‌తో పోటీపడి భారత స్పిన్నర్‌ రాధా యాదవ్‌ను ఆర్సీబీ రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది.స్నేహ్‌ రాణాకు రూ. 50 లక్షలుఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 50 లక్షలకు భారత స్పిన్నర్‌ స్నేహ్‌ రాణాను కొనుక్కుంది.నదినె డిక్లెర్క్‌ ఏ జట్టుకంటే?సౌతాఫ్రికా పవర్‌ హిట్టింగ్‌ ఆల్‌రౌండర్‌ నదినె డిక్లెర్క్‌ను ఆర్సీబీ రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది.శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్‌కువరల్డ్‌కప్‌-2025 విజేత, ఆంధ్ర క్రికెటర్‌ శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 1.3 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.చినెల్‌ హెన్రికి రూ. 1.3 కోట్లువెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ చినెల్‌ హెన్రీని రూ. 1.3 కోట్లకు కొనుకున్న ఢిల్లీ.జార్జియా వోల్‌ ఆర్సీబీకిఆసీస్‌ ప్లేయర్‌ జార్జియా వోల్‌ను ఆర్సీబీ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది.కిరణ్‌ నవ్‌గిరేకు రూ. 60 లక్షలుభారత బ్యాటర్‌ కిరణ్‌ నవ్‌గిరేను రూ. 60 లక్షలకు కొనుక్కున్న యూపీ వారియర్స్‌. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక​ భారత క్రికెటర్‌ కిరణ్‌.ఫోబే లిచ్‌ఫీల్డ్‌ను కొనుక్కున్న యూపీఆసీస్‌ యువ బ్యాటర్‌ ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ను రూ. 1.2 కోట్లకు కొనుక్కున్న యూపీ వారియర్స్‌అమ్ముడుపోని సౌతాఫ్రికా ఓపెనర్‌ తజ్మిన్‌ బ్రిట్స్‌సబ్బినేని మేఘనకు షాక్‌ఆంధ్ర క్రికెటర్‌ సబ్బినేని మేఘన అమ్ముడుపోలేదు. రూ. 30 లక్షల కనీస ధరకు కూడా ఆమెను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయలేదు.లారా వొల్వర్ట్‌ ఢిల్లీకిఢిల్లీ క్యాపిటల్స్‌ సౌతాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ లారా వొల్వర్ట్‌ను రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ ముందుగా బిడ్‌ వేసినా ఢిల్లీ వెనక్కి తగ్గలేదు. లారా కొనుగోలుతో ముగిసిన మార్క్యూ సెట్‌.మెగ్‌ లానింగ్‌కు రూ. 1.9 కోట్లుఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్‌ మెగ్‌ లానింగ్‌ను రూ. 1.9 కోట్లకు కొనుక్కున్న యూపీ వారియర్స్‌. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా పనిచేసిన లానింగ్‌.రేణుకా ఠాకూర్‌కు తక్కువ ధరే!భారత స్టార్‌ పేసర్‌ రేణుకా సింగ్‌ ఠాకూర్‌ను రూ. 60 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్‌ జెయింట్స్‌అమేలీ కెర్‌కు ఎంత ధరంటే?న్యూజిలాండ్‌ క్రికెటర్‌ అమేలీ కెర్‌ను రూ. 3 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్‌వేలానికి ముందు వదిలేసి మళ్లీ కొనుగోలు చేసిన ముంబైసోఫీ ఎక్లిస్టోన్‌ ఆడేది ఆ జట్టుకేఇంగ్లండ్‌ స్పిన్నర్‌ సోఫీ ఎక్లిస్టోన్‌ను యూపీ వారియర్స్‌ రూ. 85 లక్షలతో తిరిగి సొంతం చేసుకుంది. RTM కార్డు వాడి ఆమెను దక్కించుకుంది. దీప్తి శర్మకు డిమాండ్‌ లేదా?👉వరల్డ్‌కప్‌ విన్నర్‌ దీప్తి శర్మను పట్టించుకోని ఫ్రాంఛైజీలు👉కనీస ధర రూ. 50 లక్షలకు దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ యత్నం👉ఇంతలో రంగంలోకి యూపీ వారియర్స్‌👉RTM (రైట్‌ టు మ్యాచ్‌) కార్డును ప్రయోగించిన యూపీ👉ఈ క్రమంలో యూపీతో పోటీపడిన ఢిల్లీ👉రూ. 3.2 కోట్లకు ధర పెంచిన ఢిల్లీ👉అనూహ్య రీతిలో RTM కార్డు ద్వారా దీప్తిని రూ. 3.2 కోట్లకు దక్కించుకున్న యూపీ👉వేలానికి ముందు దీప్తిని వదిలేసిన యూపీరూ. 50 లక్షలతో వేలంలోకి👉న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ సోఫీ డివైన్‌ రూ. 50 లక్షలతో వేలంలోకి రాగా.. గుజరాత్‌ జెయింట్స్‌ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.అమ్ముడుపోని అలిసా హేలీ👉ఆస్ట్రేలియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌, ఓపెనర్‌ అలిసా హేలీకి మొండిచేయి👉కనీస ధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన అలిసాను ఎవరూ కొనలేదు.

Jemimah Takes Massive Decision After Smriti Wedding Postponed8
ఆగిన స్మృతి పెళ్లి.. జెమీమా రోడ్రిగ్స్‌ సంచలన నిర్ణయం

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌-2025లో భారత్‌ చాంపియన్‌గా నిలవడంలో జెమీమా రోడ్రిగ్స్‌ (Jemimah Rodrigues)ది కీలక పాత్ర. లీగ్‌ దశలో అంతంత మాత్రంగానే ఆడిన ఈ ముంబైకర్‌ సెమీస్‌లో మాత్రం అదరగొట్టింది. పటిష్ట ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించి ఫైనల్‌కు చేర్చింది.చాంపియన్‌ జట్టు ఆసీస్‌ విధించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ ఆదిలోనే తడబడగా.. వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా జట్టును ఆదుకుంది. అజేయ శతకం (134 బంతుల్లో 127)తో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (89)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఇలా ఆటతోనే విమర్శకులకు సమాధానం చెప్పిన జెమీమా.. వ్యక్తిగత జీవితంలోనూ తనకు తానే సాటి అని చాటుకుంది.అక్కాచెల్లెళ్ల మాదిరిభారత జట్టు వైస్‌ కెప్టెన్‌, స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) జెమీమాకు ప్రాణ స్నేహితురాలన్న విషయం తెలిసిందే. అక్కాచెల్లెళ్ల మాదిరి వీళ్లిద్దరు కలిసి ఉంటారు. తనకు పలాష్‌ ముచ్చల్‌ (Palash Mucchal)తో పెళ్లి కుదిరిన వెంటనే.. ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని జెమీమా సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారానే స్మృతి వెల్లడించింది.ఆ తర్వాత స్మృతి- పలాష్‌ హల్దీ, సంగీత్‌ వేడుకల్లో జెమీమా తోటి క్రికెటర్లు అరుంధతి రెడ్డి, రాధా యాదవ్‌, శ్రేయాంక పాటిల్‌లతో కలిసి ఆడిపాడింది. కానీ అనూహ్య రీతిలో స్మృతి పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. తొలుత స్మృతి తండ్రి ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరడం.. ఆ తర్వాత పలాష్‌ కూడా ఆస్పత్రిపాలు కావడం.. ఆ తర్వాత అతడు వేరే అమ్మాయితో చేసినట్లుగా ఉన్న చాట్స్‌ లీక్‌ కావడం సందేహాలకు తావిచ్చాయి.ఆగిన వివాహంమరోవైపు.. స్మృతి తండ్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత కూడా పెళ్లి గురించి మంధాన కుటుంబం స్పందించలేదు. ఈ నేపథ్యంలో జెమీమా రోడ్రిగ్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కష్టకాలంలో స్మృతికి తోడుగా ఉండేందుకు మహిళల బిగ్‌ బాష్‌ టీ20 లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు కూడా దూరమైంది.స్మృతి కోసం సంచలన నిర్ణయండబ్ల్యూబీబీఎల్‌లో జెమీమా ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రిస్బేన్‌ హీట్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించి.. ‘‘దురదృష్టవశాత్తూ జెమీ ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు కూడా దూరంగా ఉండనుంది. తను భారత్‌లోనే ఉండిపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం.హోబర్ట్‌ జట్టు జెమీ, స్మృతి మంధాన కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని కోరుకుంటుంది. నిజానికి తాను తిరిగి రావాలనుకున్నా.. పరిస్థితుల దృష్ట్యా రాలేకపోతున్నానని జెమీ మాకు చెప్పింది. మా ప్లేయర్లతో ఆమె టచ్‌లోనే ఉంది. జట్టు గెలవాలని ఆమె కోరుకుంటోంది’’ అని ఫ్రాంఛైజీ ఒక ప్రకటన విడుదల చేసింది.కాగా ఈ సీజన్‌లో హీట్‌ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడిన జెమీమా 37 పరుగులు చేసింది. హోబర్ట్‌ హ్యారికేన్స్‌తో మ్యాచ్‌ తర్వాత స్మృతి పెళ్లి కోసం స్వదేశానికి తిరిగి వచ్చింది. అయితే, స్నేహానికి ప్రాణమిచ్చే తనకు కెరీర్‌ కంటే.. క్లిష్ట పరిస్థితుల్లో స్మృతి వెంట ఉండటమే సరైందనే నిర్ణయం తీసుకుంది. ఇక ఈ సీజన్‌లో భారత్‌ తరఫున డబ్ల్యూబీబీఎల్‌ ఆడిన ఏకైక ప్లేయర్‌ జెమీమా కావడం విశేషం.చదవండి: ఇలాగైతే స్మృతిని ఎవరూ పెళ్లి చేసుకోరు!.. తండ్రికి వేధింపులు.. ఇప్పుడిలా!

Is Gambhir To Be Sacked As India Head Coach This is BCCI Stand Report9
గంభీర్‌పై వేటు తప్పదా?.. బీసీసీఐ నిర్ణయం ఇదే!

సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియాకు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. గతేడాది న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో వైట్‌వాష్‌ అయిన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్‌ అయింది. ముఖ్యంగా గువాహటి వేదికగా రెండో టెస్టులో కనీవినీ ఎరుగని రీతిలో 408 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. టెస్టు క్రికెట్‌ కోచ్‌గా అతడు పనికిరాడని.. వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.కోచ్‌గా ఎలాంటి అనుభవం లేకపోయినా..టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నమెంట్లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) హెడ్‌కోచ్‌గా తప్పుకోగా.. గంభీర్‌ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. అంతకుముందు కోచ్‌గా గంభీర్‌కు ఎలాంటి అనుభవం లేకపోయినా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) అతడిపై నమ్మకం ఉంచి గురుతర బాధ్యతను అప్పగించింది.అయితే, గౌతీ వచ్చిన తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగ్గానే రాణిస్తోంది. ఆదిలో శ్రీలంక పర్యటనలో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి వన్డే సిరీస్‌ను కోల్పోయింది భారత్‌. ఆ తర్వాతి ద్వైపాక్షిక సిరీస్‌లలో అదరగొట్టిన టీమిండియా.. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025, ఆసియా టీ20 కప్‌-2025 టోర్నమెంట్లలో చాంపియన్‌గా నిలిచి సత్తా చాటింది.ద్రవిడ్‌కే ఆ క్రెడిట్‌కానీ చాంపియన్స్‌ ట్రోఫీలో దక్కిన విజయాన్ని గంభీర్‌ ఖాతాలో వేసేందుకు టీమిండియా మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంగీకరించలేదు. ద్రవిడ్‌ భాయ్‌ తయారు చేసిన జట్టుతోనే ఇది సాధ్యమైందంటూ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌కు టైటిల్‌కు అందించిన హిట్‌మ్యాన్‌ వ్యాఖ్యానించాడు.పొమ్మనలేక పొగబెట్టి.. ప్రయోగాలతో కొంపముంచి..ఇదిలా ఉంటే.. టెస్టుల నుంచి దిగ్గజ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ.. అంతకుముందే స్పిన్‌ లెజెండ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తప్పుకోవడానికి కారణం గంభీర్‌ అనే ఆరోపణలు ఉన్నాయి. పొమ్మనలేక పొగబెట్టినట్లుగా సీనియర్లను వెళ్లగొట్టాడని.. రోహిత్‌ నుంచి టెస్టు, వన్డే కెప్టెన్సీ శుబ్‌మన్‌ గిల్‌కు దక్కడంలో గంభీర్‌ కీలకమనే విమర్శలు వచ్చాయి.ఇవన్నీ పక్కనపెడితే.. గంభీర్‌ మార్గదర్శనంలోనే గతేడాది న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియాకు టెస్టుల్లో పరాభవం ఎదురుకావడం.. తాజాగా సౌతాఫ్రికా చేతిలోనూ చిత్తుగా ఓడటం అతడి రాజీనామా డిమాండ్లకు ప్రధాన కారణం అయ్యాయి. ముఖ్యంగా టెస్టుల్లో కీలకమైన మూడు, నాలుగు స్థానాల్లో తరచూ మార్పులు, ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యం ఇస్తూ.. స్పెషలిస్టులను పక్కనపెట్టడం, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగాలు కొంపముంచాయని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు.సంధి కాలంఈ నేపథ్యంలో గంభీర్‌ తన భవితవ్యంపై స్పందిస్తూ.. ‘‘టెస్టు జట్టుకు కోచ్‌గా నేను సరైనవాడినా కాదా అనేది చెప్పడం తన చేతుల్లో లేదు. దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది నేను గతంలోనే చెప్పినట్లు భారత జట్టు ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు.చాలా మంది న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి గురించి కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇదే యువ జట్టుతోనే నేను ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌లో మంచి ఫలితాలు రాబట్టిన విషయం మరచిపోవద్దు. నా కోచింగ్‌లోనే జట్టు చాంపియన్స్‌ ట్రోఫీ, ఆసియా కప్‌ కూడా గెలిచింది.కివీస్‌తో సిరీస్‌తో దీనిని పోల్చవద్దు. ప్రస్తుతం జట్టులో అనుభవం తక్కువగా ఉంది. ఓటమికి సాకులు చెప్పే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. నిజానికి ‘సంధి కాలం’ అనే మాటను నేను వాడను కానీ మా పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలాగే ఉంది.ఈ టెస్టులో ఒకదశలో మెరుగైన స్థితిలో ఉన్న జట్టు ఒక 30 నిమిషాల స్పెల్‌లో కుప్పకూలింది. మన ఆటగాళ్లు ఇంకా నేర్చుకుంటున్నారు. వారికి తగినంత సమయం ఇవ్వాలి’’ అని గంభీర్‌ విజ్ఞప్తి చేశాడు.బీసీసీఐ నిర్ణయం ఇదే!ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అనే ఆసక్తి భారత క్రికెట్‌ వర్గాల్లో నెలకొంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు తాజాగా ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పట్లో గంభీర్‌ స్థానాన్ని వేరే వాళ్లతో భర్తీ చేయాలనే ఆలోచన మాకు లేదు.అతడు జట్టును పునర్నిర్మిస్తున్నాడు. 2027 వరల్డ్‌కప్‌ వరకు అతడి కాంటాక్టు ఉంది. సౌతాఫ్రికాతో సిరీస్‌లు ముగిసిన తర్వాత జట్టు యాజమాన్యం, సెలక్టర్లతో గంభీర్‌ సమావేశం అవుతాడు. సంధి దశలో టెస్టు జట్టు ప్రదర్శన గురించి అతడి అభిప్రాయం ఏమిటన్నది చెబుతాడు. లోపాలు ఎలా అధిగమించాలో తన ప్రణాళికలు వివరిస్తాడు’’ అని పేర్కొన్నాయి. దీనిని బట్టి ఇప్పట్లో గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా తప్పించేందుకు బీసీసీఐ సుముఖంగా లేదని స్పష్టమవుతోంది.చదవండి: దంచికొట్టిన సంజూ.. ఇరగదీసిన రోహన్‌.. సరికొత్త చరిత్ర

Sultan Azlan Shah Cup 2025: India Beat Malaysia Highlights10
భారత్‌ను గెలిపించిన సంజయ్‌

సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఇపో వేదికగా బుధవారం జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 4–3 గోల్స్‌ తేడాతో ఆతిథ్య మలేసియా జట్టును ఓడించింది. కొరియాపై తొలి మ్యాచ్‌లో 1–0తో నెగ్గిన భారత్‌... బెల్జింయతో జరిగిన రెండో మ్యాచ్‌లో 2–3తో ఓడిపోయింది. మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ తరఫున సెల్వం కార్తీ (7వ నిమిషంలో), సుఖ్‌జీత్‌ సింగ్‌ (21వ నిమిషంలో), అమిత్‌ రోహిదాస్‌ (39వ నిమిషంలో), కెప్టెన్‌ సంజయ్‌ (53వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు.మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగామలేసియా జట్టుకు ఫైజల్‌ సారి (13వ నిమిషంలో), ఫిత్రి సారి (36వ నిమిషంలో), మర్హాన్‌ జలీల్‌ (45వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. మ్యాచ్‌ మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగా సంజయ్‌ గోల్‌ చేసి భారత్‌ను 4–3తో ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత ఈ ఏడు నిమిషాలు భారత రక్షణపంక్తి మలేసియా ఆటగాళ్లను నిలువరించి ఈ టోర్నీలో రెండో విజయాన్ని ఖాయం చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు నాలుగు పెనాల్టీ కార్నర్‌లు, రెండు పెనాల్టీ స్ట్రోక్‌లు లభించాయి. నాలుగు పెనాల్టీ కార్నర్‌లలో ఒక దానిని... రెండు పెనాల్టీ స్ట్రోక్‌లలో ఒక దానిని భారత్‌ సద్వినియోగం చేసుకుంది. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్‌ మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. రెండింటిలో గెలిచి, ఒక దాంట్లో ఓడిపోయి ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక గురువారం జరిగే నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడుతుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement