ప్రధాన వార్తలు
ఇప్పుడు టి20 శైలికి మారిపోతా!
చెన్నై: దులీప్ ట్రోఫీలో సౌత్జోన్ కెప్టెన్గా రెండు మ్యాచ్లు ఆడిన ఠాకూర్ తిలక్ వర్మ మూడు ఇన్నింగ్స్లలో వరుసగా 116 నాటౌట్, 51 నాటౌట్, 99 పరుగులు (మొత్తం 266) చేశాడు. టి20 స్పెషలిస్ట్గానే ప్రస్తుతం భారత జట్టులో ఉన్న తిలక్... ఫస్ట్ క్లాస్ ఆట శైలికి తగినట్లుగా తన బ్యాటింగ్ను ప్రదర్శించాడు. దులీప్ ట్రోఫీ సెమీస్, ఫైనల్ మ్యాచ్ కలిపి 461 బంతులు ఎదుర్కొన్న అతను... ఫైనల్ మ్యాచ్లో పరిస్థితికి అనుగుణంగా ఆడుతూ ఒకదశలో వరుసగా 63 బంతులపాటు బౌండరీ కొట్టకుండా నియంత్రణ కూడా ప్రదర్శించాడు. దీనికి ముందు భారత ‘ఎ’ జట్టుకు కూడా తిలక్ కెప్టెన్గా వ్యవహరించాడు. ‘నా వ్యక్తిగత ఫామ్ చాలా బాగుంది. ఈ ప్రదర్శనతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ నా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చానని భావిస్తున్నా. ఈ మ్యాచ్లో కాస్త ముందుగానే దూకుడు ప్రదర్శించగలిగేవాడిని. కానీ పరిస్థితులకు, జట్టు అవసరాలకు తగినట్లు ఆడటమే ముఖ్యం. నాతో పాటు అవతలి ఎండ్లో మరో బ్యాటర్ నిలిస్తే సెషన్లవారీగా ఆడుతూ డ్రా కోసం ప్రయత్నించేవాడిని. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడం ఈస్ట్కు మేలు చేసుంది. భారత ‘ఎ’ జట్టుకు, ఇప్పుడు సౌత్జోన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం వల్ల ఇతర యువ ఆటగాళ్ల నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం లభించింది. సారథిగా నేను ఎదుగుతున్నాననే భావన కలిగింది. కొన్ని సార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడే కెప్టెన్గా నా బాధ్యత మరింత పెరుగుతుంది’ అని తిలక్ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 13 నుంచి అఫ్గానిస్తాన్తో జరిగే టి20 సిరీస్లో భారత జట్టును గెలిపించడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టినట్లు తిలక్ వెల్లడించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి ఒక్కసారిగా టి20లకు మారడం తనకు కష్టమేమీ కాదని, సిరీస్కు సిద్ధంగా ఉన్నానని అతను చెప్పాడు.‘ఇప్పుడు నా బ్యాటింగ్ గేర్లు మార్చి దూకుడు ప్రదర్శిస్తా. నా ఆటపై నాకు చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు అఫ్గానిస్తాన్తో సిరీస్ గెలవడమే లక్ష్యం. ఎరుపు రంగు బంతి మ్యాచ్ నుంచి టి20లకు మారడం అంత సులువు కాదు. అయితే సిరీస్కు ముందు ప్రాక్టీస్ కోసం నాకు రెండు రోజుల సమయం లభిస్తోంది. నా ఆట శైలిని మార్చుకునేందుకు ఇది సరిపోతుంది’ అని తిలక్ వ్యాఖ్యానించాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 64 టి20 మ్యాచ్లు ఆడిన తిలక్ 145.18 స్ట్రయిక్రేట్తో 1645 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతను మరో 5 వన్డేల్లో కూడా బరిలోకి దిగాడు.
హాట్ కేకుల్లా...
ఆక్లాండ్: టీమిండియాతో వచ్చే నెలలో జరుగనున్న సిరీస్ల కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు టికెట్ల అమ్మకం ప్రారంభించింది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ఐదు టి20లు, ఐదు వన్డేలు, 2 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. న్యూజిలాండ్తో భారత్ పూర్తి స్థాయి సిరీస్లు ఆడనుండటం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్లు వీక్షించేందుకు అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. టికెట్ల విక్రయం ప్రారంభించిన రెండు రోజుల్లోనే 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 22న క్రైస్ట్చర్చ్లో తొలి టి20 జరగనుంది. ఆ తర్వాత 24న అక్కడే రెండో మ్యాచ్... 27న వెల్లింగ్టన్లో మూడో మ్యాచ్... 30న ఆక్లాండ్లో నాలుగో మ్యాచ్ జరుగుతాయి. నవంబర్ 1న హామిల్టన్ వేదికగా జరగనున్న చివరి మ్యచ్తో పొట్టి సిరీస్ ముగియనుంది. ‘క్రైస్ట్చర్చ్ వేదికగా జరిగే రెండో టి20 మ్యాచ్ టికెట్లు దాదాపు అయిపోయాయి. మిగిలిన మ్యాచ్ల టికెట్లు కూడా వేగంగా అమ్ముడవుతున్నాయి. ఈడెన్ పార్క్లో అధిక డిమాండ్ ఉంది. 2019లో టీమిండియా న్యూజిలాండ్లో పర్యటించిన అనంతరం ఇంత పెద్ద మొత్తంలో టికెట్ల కోసం పోటీ కనిపించలేదు. దీంతో మైదానంలోని పై అంతస్తును కూడా అభిమానుల కోసం అందుబాటులోకి తేనున్నాం’ అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. టి20 సిరీస్ అనంతరం నవంబర్ 4న ఆక్లాండ్లో తొలి వన్డే... 7న వెల్లింగ్టన్లో రెండో వన్డే... 10న హామిల్టన్లో మూడో వన్డే నిర్వహించనున్నారు. నవంబర్ 13, 15న జరగనున్న చివరి రెండు వన్డే మ్యాచ్లు మౌంట్ మాంగనీలో జరుగుతాయి. అనంతరం నవంబర్ 19 నుంచి వెల్లింగ్టన్లో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. క్రైస్ట్చర్చ్లో నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుతో ఈ పర్యటన ముగియనుంది.
తొలి రౌండ్లోనే మానవ్ పరాజయం
న్యూఢిల్లీ: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) మకావ్ చాంపియన్స్ లెవెల్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. తొలి రోజు మంగళవారం భారత నంబర్వన్ ర్యాంకర్ మనుశ్ షా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టగా... బుధవారం భారత రెండో ర్యాంకర్, ప్రపంచ 47వ ర్యాంకర్ మానవ్ ఠక్కర్ కూడా మొదటి రౌండ్లోనే ఓటమి చవిచూశాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ అలెక్స్ లెబ్రున్ (ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్లో మానవ్ 12–14, 4–11, 11–9, 3–11తో పరాజయం పాలయ్యాడు. 24 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో మానవ్ తన సర్వీస్లో 18 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్లో 12 పాయింట్లు సాధించాడు. తొలి రౌండ్లో ఓడిన మానవ్కు 8,000 డాలర్ల (రూ. 7 లక్షల 58 వేలు) ప్రైజ్మనీతోపాటు 15 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చాంపియన్స్ లెవెల్ టోర్నీని కేవలం సింగిల్స్ విభాగాల్లోనే నిర్వహిస్తారు.
భారత ‘ఎ’ జట్టులో షేక్ రషీద్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో ఆ్రస్టేలియా జట్టు... భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో... త్వరలో ఇరు దేశాల ‘ఎ’ జట్ల మధ్య అనధికారిక టెస్టు, వన్డే సిరీస్లు జరగనున్నాయి. వీటి కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం వేర్వేరుగా జట్లను ప్రకటించింది. సుదీర్ఘ ఫార్మాట్ కోసం ప్రకటించిన భారత ‘ఎ’ జట్టులో ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్కు చోటు దక్కింది. ప్రస్తుతం చెన్నై వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో రషీద్ సౌత్ జోన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక గాయం కారణంగా చాన్నాళ్లుగా మైదానానికి దూరంగా ఉన్న సీనియర్ పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఆస్ట్రేలియా ‘ఎ’తో అనధికారిక వన్డేలకు ఎంపిక చేశారు. 32 ఏళ్ల పాండ్యా ఐపీఎల్ అనంతరం గ్రౌండ్లో అడుగు పెట్టలేదు. ఇటీవలే ఫిట్నెస్ సాధించిన పాండ్యా... ఈ సిరీస్ ద్వారా తిరిగి పోటీ క్రికెట్ ప్రారంభించనున్నాడు. భారత్ ‘ఎ’, ఆ్రస్టేలియా ‘ఎ’ జట్ల మధ్య ఈ నెల 22 నుంచి పాండిచ్చేరి వేదికగా తొలి అనధికారిక టెస్టు జరగనుంది. అనంతరం సెప్టెంబర్ 29 నుంచి అక్కడే రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది. సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్లు ముగిసిన అనంతరం పాండిచ్చేరిలోనే అక్టోబర్ 6, 9, 11న వరుసగా మూడు అనధికారిక వన్డేలు నిర్వహించానున్నారు. దాదాపు అదే సమయంలో భారత సీనియర్ జట్టు వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. సుదీర్ఘ ఫార్మాట్లో భారత ‘ఎ’ జట్టుకు దేవదత్ పడిక్కల్ సారథ్యం వహించనున్నాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న పడిక్కల్ నిలకడైన ప్రదర్శనతో మూడో స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. గాయం కారణంగా లంక పర్యటనకు దూరమైన సాయి సుదర్శన్... ఈ సిరీస్కు వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. లంక సిరీస్లో అద్వితీయ ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన పడిక్కల్... ఆస్ట్రేలియా ‘ఎ’పై ఎలా ఆడతాడనేది కీలకం. ఇక వన్డే ఫార్మాట్లో భారత ‘ఎ’ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా వ్యవహరించనుండగా... పడిక్కల్ అతడి డిప్యూటీగా ఎంపికయ్యాడు.సుదీర్ఘ ఫార్మాట్కు భారత ‘ఎ’ జట్టు: దేవదత్ పడిక్కల్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), అమన్ మోఖడే, ఆయుశ్ పాండే, యశ్ రాథోడ్, షేక్ రషీద్, కుమార్ కుషాగ్ర, షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్, తుశార్ దేశ్పాండే, అన్షుల్ కంబోజ్, ప్రఫుల్ హింగే, ఎన్ జగదీశన్, నచికేత్ భుటే, వైశాక్. వన్డే ఫార్మాట్కు భారత ‘ఎ’ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, సాయి సుదర్శన్, రజత్ పాటీదార్, కుమార్ కుషాగ్ర, నిశాంత్ సింధు, విప్రాజ్ నిగమ్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా, ప్రభ్సిమ్రన్సింగ్, గుర్జపనీత్ సింగ్, యశ్ ఠాకూర్.
ఫేవరెట్గా భారత్
దుబాయ్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జట్టు సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్తో హర్మన్ప్రీత్ కౌర్ బృందం తలపడుతుంది. లీగ్ దశలో మూడు విజయాలతో భారత మహిళలు అజేయంగా నిలవగా... రెండు చిన్న జట్లపై విజయాలతో బంగ్లాదేశ్ సెమీస్కు చేరింది. ఓవరాల్గా బలాబలాలను బట్టి చూస్తే బంగ్లాదేశ్పై భారత బృందం ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. థాయ్లాండ్తో మ్యాచ్లో మిడిలార్డర్ కొంత తడబడినా... తర్వాతి రెండు మ్యాచ్లలో టీమ్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఓపెనర్లుగా షఫాలీ, స్మృతి దూకుడైన ఆటతో ఇన్నింగ్స్కు సరైన పునాది వేస్తున్నారు. జెమీమా గాయంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ప్రతీక రావల్ మూడు మ్యాచ్లలోనూ విఫలం కావడం ఒక్కటే ఇప్పుడు జట్టుకు కాస్త ఆందోళన కలిగించే అంశం. హర్మన్ప్రీత్, దీప్తి శర్మ, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్ మిడిలార్డర్లో రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించగలరు. భారత బౌలింగ్ మరింత పదునుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ముగ్గురు స్పిన్నర్లు శ్రీచరణి, దీప్తి, ప్రేమ రావత్ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడే యగలరు. పేసర్లు క్రాంతి, నందని శర్మ కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు కాబట్టి తుది జట్టులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. మరోవైపు బంగ్లాదేశ్ బ్యాటింగ్ చాలా బలహీనంగా ఉంది. దియానా, జువేరియా, నిగార్, షర్మిన్ భారత్పై ఏమాత్రం ప్రభావం చూపించగలరనేది సందేహమే. అయితే బౌలింగ్ కొంత మెరుగ్గా ఉండటం జట్టుకు సానుకూలాంశం. ముఖ్యంగా పేసర్ మారుఫా తన స్వింగ్తో చెలరేగిపోగల సమర్థురాలు. సుల్తానా, నాహిదా ఆమెకు సహకరించాల్సి ఉంది. వేడి వాతావరణం కొనసాగుతుండగా, ఈ టోర్నీలో పిచ్లు స్పిన్కు బాగా అనుకూలిస్తున్నాయి. బంగ్లాదేశ్ చేతిలో చివరిసారిగా 2023లో ఓడిన భారత్... ఆ తర్వాత వరుసగా 8 మ్యాచ్లలో గెలిచింది. స్మృతి మరో 67 పరుగులు చేస్తే అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొత్త రికార్డు నెలకొల్పుతుంది.
సెమీఫైనల్లో భారత్... చైనీస్ తైపీపై 15–0తో జయభేరి
మోకి (చైనా): డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్టు ఆడుతోన్న భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ జూనియర్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పూల్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 15–0 గోల్స్ తేడాతో చైనీస్ తైపీపై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున కెపె్టన్ అన్మోల్ ఎక్కా ఆరు గోల్స్ (25వ, 29వ, 32వ, 33వ, 45వ, 51వ నిమిషాల్లో)... ఆర్యన్ మూడు గోల్స్ (17వ, 52వ, 53వ నిమిషాల్లో), హర్పాల్ రెండు గోల్స్ (48వ, 53వ నిమిషాల్లో) చేశారు. గురుసేవక్ సింగ్ (22వ ని.లో), ప్రభ్దీప్ సింగ్ (18వ ని.లో), అజీత్ యాదవ్ (35వ ని.లో), అర్జున్ సంతోష్ హర్గుడె (28వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఐదు జట్లున్న పూల్ ‘ఎ’లో భారత్ మూడు మ్యాచ్ల్లో గెలిచి, ఒక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకొని 10 పాయింట్లతో టాప్ ర్యాంక్లో... దక్షిణ కొరియా 9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాయి. పూల్ ‘బి’ నుంచి పాకిస్తాన్, మలేసియా జట్లు సెమీఫైనల్ చేరుకున్నాయి. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్లో మలేసియాతో భారత్; పాకిస్తాన్తో దక్షిణ కొరియా తలపడతాయి. మరోవైపు భారత మహిళల జట్టు చైనాతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ను 0–0తో ‘డ్రా’ చేసుకుంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్లో పాకిస్తాన్తో భారత్; హాంకాంగ్తో చైనీస్ తైపీ; బంగ్లాదేశ్తో జపాన్; మలేసియాతో దక్షిణ కొరియా పోటీపడతాయి.
శీతల్ దేవి సంచలనం.. భారత్కు రెండు స్వర్ణాలు
వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్-3లో భారత ఆర్చర్లు అదరగొట్టారు. ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఫైనల్లో శీతల్, కజకిస్థాన్కు చెందిన ఐజాడా సెయ్దాన్ను షూట్ఆఫ్లో ఓడించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.ఈ టోర్నీలో శీతల్కు ఇది రెండో పతకం. టోమన్ కుమార్తో కలిసి కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఆమె ఇప్పటికే కాంస్య పతకం సాధించింది. కాంస్య పతక పోరులో భారత జోడీ ఇరాక్కు చెందిన సారా అల్ హమీద్, అబ్బాస్ కదిమ్ జోడీని 157-145తో ఓడించింది.మరోవైపు పారాలింపిక్ ఛాంపియన్ హర్విందర్ సింగ్ కూడా భారత్కు స్వర్ణ పతకం అందించాడు. భావనతో కలిసి రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో చైనాకు చెందిన లియాంగ్ కియురోంగ్, షియా లెయ్ జోడీని 6-0తో ఓడించారు.భావన రికర్వ్ మహిళల వ్యక్తిగత విభాగంలో మరో కాంస్య పతకం సాధించింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో సరిత చైనాకు చెందిన వాంగ్ హ్యూటింగ్పై 141-140తో విజయం సాధించి కాంస్యం గెలిచింది.కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో టోమన్ కుమార్ కూడా కాంస్య పతకం సాధించాడు.ఈ టోర్నీలో టోమన్కు ఇది రెండో పతకం.మొత్తంగా చివరి రోజున భారత్ రెండు స్వర్ణాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించి, టోర్నీలో పతకాల సంఖ్యను 13కు పెంచుకుంది.చదవండి: అల్కరాజ్కు ఊహించని షాక్.. సెమీస్ చేరకుండానే అవుట్
584 పరుగుల ఆధిక్యం.. టైటిల్కు అడుగు దూరంలో ఈస్ట్జోన్!
దులీప్ ట్రోఫీని అందుకునేందుకు ఈస్ట్జోన్ జట్టు అడుగుదూరంలో నిలిచింది. సౌత్జోన్తో జరుగుతున్న ఫైనల్లో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో 51 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కుమార్ కుషాగ్ర (34), ఖురేషీ (26) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఈస్ట్జోన్ 584 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. గురువారం ఆటకు చివరి రోజు కావడంతో ఈస్ట్జోన్ గెలుపు లాంఛనమే. ఐదోరోజు ఉదయం సెషన్లో వేగంగా బ్యాటింగ్ చేసి సౌత్జోన్ ముంగిట 650 పరుగుల లక్ష్యాన్ని టార్గెట్గా ఉంచే అవకాశముంది. ఇంత టార్గెట్ ఛేదించడం అసాధ్యం కాబట్టి మ్యాచ్ డ్రా అవనుంది. దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించిన ఈస్ట్జోన్ విజేతగా నిలవనుంది. దీంతో 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీలో ఫైనల్ చేరిన ఈస్ట్జోన్ చాంపియన్గా నిలిచేందుకు అడుగుదూరంలో ఉంది.Photo Credit: BCCI Twitterతొలి ఇన్నింగ్స్ మాదిరే రెండో ఇన్నింగ్స్ను వేగంగా ఆరంభించిన ఈస్ట్జోన్కు ఓపెనర్లు వైభవ్ (8), అభిమన్యు ఈశ్వరన్ (3) శుభారంభం అందించలేకపోయారు. అయితే మిడిలార్డర్లో శిఖర్ మోహన్ (52), కెప్టెన్ ఇషాన్ కిషన్ (80), కుమార్ కుషాగ్ర (34) రాణించడంతో ఈస్ట్జోన్ 200 పరుగుల మార్క్ను దాటింది. సౌత్జోన్ బౌలర్లలో సిరాజ్, త్రిపురానా విజయ్, నిదీష్, షేక్ రషీద్లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు సౌత్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ (99) సెంచరీ చేజార్చుకోగా, పడిక్కల్ (62), సీవీ మిలింద్ (43) పర్వాలేదనిపించారు. ముఖేశ్కుమార్ 3 వికెట్లు తీయగా, షమీ, ఖురేషీ, శికర్ మోహన్లు తలా 2 వికెట్లు పడగొట్టారు.MD Nidheesh breaks the partnership 👏He gets the crucial wicket of East Zone captain Ishan Kishan who played yet another superb knock of 80(98) 🙌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/j9C01OLgmB— BCCI Domestic (@BCCIdomestic) September 9, 2026Read: షాకింగ్.. కోహ్లిపై ఆధారపడిన పాక్ మహిళా ప్లేయర్లు!
ఆసీస్ సిరీస్కు భారత జట్టులోకి సర్ప్రైజ్ ఎంట్రీ
త్వరలో ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగనున్న రెండు ఫార్మాట్ల సిరీస్కు భారత జట్లను ఇవాళ ప్రకటించారు. మల్టీ డే మ్యాచ్లకు దేవదత్ పడిక్కల్, వన్డే జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్లుగా ఎంపిక కాగా.. మల్టీ డే ఫార్మాట్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఓ ఆసక్తికర ఎంపిక జరిగింది.దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న విదర్భ ఆల్రౌండర్ నచికేత్ భూటేకు ఊహించని అవకాశం దక్కింది. నచికేత్ తొలిసారి భారత ఎ జట్టుకు ఎంపికయ్యాడు. గత రంజీ సీజన్లో 29 వికెట్లతో అదరగొట్టిన ఈ 26 ఏళ్ల ఆటగాడి కెరీర్పై ఓ లుక్కేద్దాం.రైట్ఆర్మ్ మీడియం పేసర్, రైట్హ్యాండ్ బ్యాటర్ అయిన నచికేత్.. కొత్త బంతితో అద్బుతమైన లైన్ అండ్ లెంగ్త్తో బంతులు వేయడంలో దిట్ట. అలాగే లోయర్ ఆర్డర్లో కీలక బ్యాటర్ కూడా. 2018-19లో విదర్భ అండర్-19 జట్టు వినూ మన్కడ్ ట్రోఫీ సాధించడంలో నచికేత్ కీలకపాత్ర పోషించాడు. అనంతరం అండర్-23 స్థాయిలోనూ తన ప్రతిభ చాటాడు.2019-20 సీకే నాయుడు ట్రోఫీలోనూ నచికేత్ కీలక ప్రదర్శనలు చేశాడు. ఆ సీజన్లో అతడు 8 మ్యాచ్ల్లో 25 వికెట్లు తీసి తన జట్టు టైటిల్ గెలవడంలో ప్రధానపాత్ర పోషించాడు.2021లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా సీనియర్ దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టిన నచికేత్.. ఆ తర్వాత లిస్ట్ ఎ, ఫస్ట్క్లాస్ క్రికెట్లో కూడా అరంగేట్రం చేశాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 18 మ్యాచ్లు ఆడిన నచికేత్ 50 వికెట్లు సాధించాడు. గత రంజీ సీజన్లో 29 వికెట్లు తీసిన నచికేత్ విదర్భ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. బ్యాటింగ్లోనూ నచికేత్ ఈ సీజన్లో (2 అర్ద సెంచరీల సాయంతో 196 పరుగులు) రాణించాడు. ఈ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకొనే సెలెక్షన్ కమిటీ అతన్ని ఆసీస్ ఎతో సిరీస్కు ఎంపిక చేసింది.కాగా, ఆసీస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్లలో మరో ఆశ్చర్యకర ఎంపిక కూడా జరిగింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను వన్డే జట్టుకు ఎంపిక చేశారు. హార్దిక్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు ఎంపిక చేయలేదు. రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు భారత పర్యటనకు వస్తోంది. సెప్టెంబరు 22- అక్టోబరు 11 వరకు జరిగే ఈ రెండు సిరీస్లకు పుదుచ్చేరి వేదిక.ఆస్ట్రేలియా ‘ఎ’తో అనధికారిక టెస్టులకు భారత-‘ఎ’ జట్టుఅమన్ మోఖడే, ఆయుశ్ పాండే, దేవదత్ పడిక్కల్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), యశ్ రాథోడ్, షేక్ రషీద్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), షామ్స్ ములాని, తనుష్ కొటియాన్, తుషార్ దేశ్పాండే, అన్షుల్ కాంబోజ్, ప్రఫుల్ హింగే, నారాయణన్ జగదీశన్ (వికెట్ కీపర్), నచికేత్ భూటే, వి వైశాక్* (ఫిట్నెస్ ఆధారంగా).ఆసీస్ ‘ఎ’తో అనధికారిక వన్డేలకు భారత-‘ఎ’ జట్టుప్రియాన్ష్ ఆర్య, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), నిశాంత్ సింధు, విప్రాజ్ నిగమ్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, నమన్ ధిర్, హార్దిక్ పాండ్యా (ఫిట్నెస్ ఆధారంగా), ప్రభ్సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), గుర్జప్రీత్ సింగ్, యశ్ ఠాకూర్.చదవండి: IND vs AUS: భారత జట్టు ప్రకటన.. హార్దిక్ పాండ్యాకు చోటు
షాకింగ్.. కోహ్లిపై ఆధారపడిన పాక్ మహిళా ప్లేయర్లు!
మహిళల ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్ జట్టు హాంకాంగ్పై విజయం సాధించడం ద్వారా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. అయితే పాక్ సెమీస్ బెర్తు కంటే పాక్ ప్లేయర్స్ ధరించి షూస్(Footwear)కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను తెగ ఊపేస్తుంది. నష్రా సంధు, ఐమన్ ఫాతిమా కోహ్లి వన్8 బ్రాండ్ షూతో కనిపించినప్పటికీ, జట్టులో దాదాపు అందరు ప్లేయర్లు ఇదే బ్రాండ్ షూను ధరించినట్లు తెలుస్తోంది.పాక్ జట్టులో ప్రతీ మహిళా ప్లేయర్ ‘వన్8’ (one8) బ్రాండ్ షూనే ధరించారు. ఈ ‘వన్8’ ఫుట్వేర్ బ్రాండ్ మరెవరిదో కాదు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఇదే ‘వన్8’ షూకు సహ యజమానిగా ఉన్నాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం లేనప్పటికీ, పాక్ ఆటగాళ్లు తమ సొంత బ్రాండ్ను వదిలేసి టీమిండియా ఐకాన్ ప్లేయర్కు చెందిన బ్రాండ్తో అసోసియేట్ అవ్వడమే ఇక్కడ విశేషం. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసిన అభిమానులు.. ‘‘పాక్ ఆటగాళ్లకు సొంత బ్రాండ్ అనేది లేదు. తాము ధరించే షూస్పై కూడా భారత్ బ్రాండ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇదీ మన భారత్ బ్రాండ్.’’ అని కామెంట్లు చేయడం ఆసక్తి కలిగించింది.కోహ్లీతో అనుబంధం దృష్ట్యా ‘వన్8’ కంపెనీ షూస్తో పాటు దుస్తులు, ఇతర క్రీడా ఉత్పత్తులను అందించే స్పోర్ట్స్వేర్ బ్రాండ్గా విస్తరించింది. ఈ బ్రాండ్ను తన పోర్ట్ఫోలియోలో కలిగి ఉన్న అగిలిటాస్, వన్8ను కోహ్లీతో కలిసి స్థాపించిన స్పోర్ట్స్వేర్ లేబుల్గా అభివర్ణిస్తుంది. అంతేకాదు కోహ్లి ‘వన్8’ పార్టనర్ ‘అగిలిటాస్’లో పెట్టుబడిదారుడు కూడా. కోహ్లి ఈ కంపెనీలో 400 మిలియన్లు పెట్టుబడి పెట్టడం జరిగింది.సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో పాక్ 72 పరుగుల తేడాతో హాంకాంగ్ జట్టుపై ఘన విజయం సాధించింది. ముందుగా పాక్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. షావాల్ (47), ఆయేషా జఫర్ (26), ఫాతిమా సనా (24 నాటౌట్) రాణించారు. హాంకాంగ్ బౌలర్ జాయ్లీన్ కౌర్ 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం హాంకాంగ్ 19 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. కేరీ చాన్ (30) టాప్ స్కోరర్గా నిలిచింది. నష్రా సంధు (4–0–7–6) ఆరు వికెట్లతో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసింది.Many players of Pakistan women team was wearing @one8world shoes in asia cup match.I have following questions 1. Products registered in india can't be exported to pak ,so did this deal happened in Dubai? Where matches are being played2.Aisi kya majburi thi @one8world pic.twitter.com/GkVdg3BfUG— varun (@mystic_varunn) September 7, 2026 देखिए पाकिस्तानी महिला क्रिकेटर ईमान फातिमा विराट कोहली के One8 ब्रांड के जूते पहने हुए हैं। 👀पाकिस्तानी खिलाड़ी भी वो अपने खुद के देश के ब्रांड्स से ज्यादा कोहली के ब्रांड पर भरोसा करती हैं।कुछ फैंस कह रहे हैं कि उसने ये जूते स्मृति के किट बैग से चुराए हैं🤣 pic.twitter.com/n5zMtQicDR— Indian🇮🇳 (@singh31919) September 9, 2026Read: ఏ బౌలర్ను వదల్లేదు.. భీకర ఫామ్లో ఇషాన్ కిషన్!
‘పూటుగా తాగి పీడకలనుకొని మరిచిపోతా’
యూఎస్ ఓపెన్లో చెక్ రిపబ్లిక్ స్టార్ ప్లేయర్, ఆరో...
భారత పారా ఆర్చర్లకు ఐదు పతకాలు
అహ్మదాబాద్: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న వరల్డ్...
మళ్లీ ‘బ్లూ’ జెర్సీతో...
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా భారత హాకీ జట్టుకు గుర్తి...
సబలెంకా శ్రమించి...
న్యూయార్క్: ‘హ్యాట్రిక్’ యూఎస్ ఓపెన్ టైటిల్ ద...
ఏ బౌలర్ను వదల్లేదు.. భీకర ఫామ్లో ఇషాన్ కిషన్!
టీమిండియా వికెట్ కీపర్, ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన...
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్
సౌతాఫ్రికా యువ ఓపెనర్ జోర్డన్ హెర్మన్ చరిత్ర సృ...
IND vs AUS: భారత జట్టు ప్రకటన.. హార్దిక్ పాండ్యాకు చోటు
ఆస్ట్రేలియా-‘ఎ’తో సిరీస్కు భారత క్రికెట్ నియంత్ర...
వైభవ్ సూర్యవంశీకి షాక్
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి షాక్ త...
క్రీడలు
చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)
సన్రైజర్స్ సిక్సర్ల కింగ్కు హ్యాపీ బర్త్డే..ఫోటోలు
కూతురిని ఆడిస్తూ.. ట్రిప్ను ఆస్వాదిస్తున్న సూర్యకుమార్ (ఫొటోలు)
యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)
హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)
హైదరాబాద్లో స్పోర్ట్ ఎక్స్పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు)
ప్యారిస్ ట్రిప్లో జెమీమా రోడ్రిగ్స్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)
18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు)
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం (ఫొటోలు)
వీడియోలు
వైభవ్..నువ్వు సూపర్ రా! బుడోడిపై ఇషాన్ ప్రశంసలు
మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!
సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..
ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్
పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమాపై ట్రోలింగ్స్
శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..
ఆసియా కప్లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?
వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా
ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ
స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్
