Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Rohit Sharma becomes fourth Indian with 20,000 international runs1
రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు.. సచిన్‌, కోహ్లి సరసన

టీమిండియా స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) కలిపి 20,000 పరుగులను రోహిత్ పూర్తి చేసుకున్నాడు. వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్‌ను హిట్‌మ్యాన్ అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా రోహిత్ రికార్డులెక్కాడు.రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్‌( (34357), విరాట్‌ కోహ్లీ (27910), రాహుల్‌ ద్రవిడ్‌ (24208) ఈ ఘనత సాధించారు. రోహిత్‌ ఇప్పటివరకు వన్డేల్లో 11486, టెస్టుల్లో 4301, టీ20ల్లో 4231 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్‌లో ఈ ముంబైకర్‌ 50 సెంచరీలు నమోదు చేశాడు.రోహిత్‌ ఇప్పటివరకు వన్డేల్లో 11486, టెస్టుల్లో 4301, టీ20ల్లో 4231 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్‌లో ఈ ముంబైకర్‌ 50 సెంచరీలు నమోదు చేశాడు. వన్డే ఇంటర్నేషనల్స్ చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ కొనసాగుతున్నాడు. అదేవిధంగా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు కూడా రోహిత్‌(264) పేరిటే ఉంది.ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్‌ అయింది. ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు 106 పరుగులు) సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ బవుమా(48) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా నాలుగు వికెట్లతో సఫారీలను దెబ్బతీశారు. అనంతరం లక్ష్య చేధనలో భారత్ నిలకడగా ఆడుతోంది. 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 102 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ(55 బంతుల్లో 51) తన హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రోహిత్‌తో పాటు జైశ్వాల్‌(40) ఆచితూచి ఆడుతున్నాడు.

Shubman Gill declared fit by BCCI Will Return IND vs SA 1st T20I2
టీమిండియాకు శుభవార్త.. స్టార్‌ ప్లేయర్‌ వచ్చేస్తున్నాడు

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. స్టార్‌ బ్యాటర్‌, వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించాడు. సఫారీ జట్టుతో తొలి టీ20 నుంచే అతడు అందుబాటులోకి రానున్నాడు.ఫిట్‌నెస్‌ సాధించాడుభారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (CoE) వర్గాలు ఈ విషయాన్ని శనివారం ధ్రువీకరించాయి. గిల్‌ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించినట్లు తెలిపాయి. ఈ మేరకు.. ‘‘CoEలో శుబ్‌మన్‌ గిల్‌ తన పునరావాసం పూర్తి చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లు ఆడేందుకు ఫిట్‌నెస్‌ సాధించాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబరు 9న కటక్‌ వేదికగా భారత్‌- సౌతాఫ్రికా (IND vs SA T20Is) మధ్య మొదలయ్యే టీ20 సిరీస్‌కు గిల్‌ అందుబాటులోకి రానున్నాడు. కాగా స్వదేశంలో టీమిండియా సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందులో భాగంగా తొలుత టెస్టు సిరీస్‌ జరుగగా.. సఫారీల చేతిలో భారత జట్టు 2-0తో వైట్‌వాష్‌కు గురైంది.మెడనొప్పి కారణంగా..ఇదిలా ఉంటే.. తొలి టెస్టు సందర్భంగానే గిల్‌ గాయపడి జట్టుకు దూరమయ్యాడు. మెడనొప్పి కారణంగా బ్యాటింగ్‌ మధ్యలోనే నిష్క్రమించిన గిల్‌.. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరాడు. ఐసీయూలో చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయిన తర్వాత.. అతడు రెండో టెస్టుతో పాటు.. వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది.ఈ క్రమంలో గిల్‌ టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో ఉంటాడో.. లేదోనన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే, ప్రొటిస్‌ టీమ్‌తో పొట్టి సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటిచ్చిన యాజమాన్యం ఫిట్‌నెస్‌ ఆధారంగా జట్టుతో కొనసాగేది.. లేనిది తేలుతుందని పేర్కొంది. తాజాగా గిల్‌ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించినట్లు వెల్లడించింది.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుబ్‌‌మన్ గిల్ (వైస్‌ కెప్టెన్‌, ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌.భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా టీ20 సిరీస్‌ షెడ్యూల్‌👉మొదటి టీ20: డిసెంబరు 9- కటక్‌, ఒడిశా👉రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్‌పూర్‌, చండీగఢ్‌👉మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్‌ ప్రదేశ్‌👉నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్‌👉ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్‌, గుజరాత్‌.చదవండి: టెస్టుల్లో వెస్టిండీస్‌ క్రికెటర్‌ ప్రపంచ రికార్డు

Ashes 2025: Pat Cummins provides injury update, ready for Adelaide return3
ఆస్ట్రేలియాకు గుడ్‌ న్యూస్‌..

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. వెన్నెముక గాయం నుంచి కమ్మిన్స్ పూర్తిగా కోలుకున్నాడు. యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా మూడో టెస్టుకు కమ్మిన్స్ అందుబాటులోకి రానున్నాడు.ఈ విషయాన్ని కమ్మిన్సే స్వయంగా ధ్రువీకరించాడు. వాస్తవానికి ప్రస్తుతం బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఆడాల్సి ఉండేది. కానీ ఆఖరి నిమిషంలో ముందుస్తు జాగ్రత్తగా అతడిని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోలేదు.ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో తన బౌలింగ్ ప్రాక్టీస్‌ను కమ్మిన్స్ మొదలు పెట్టాడు. స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ సేవలను కోల్పోయిన ఆసీస్‌కు కమ్మిన్స్ రీ ఎంట్రీ కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించే ఆంశంగా చెప్పుకోవాలి. "ఆడిలైడ్ టెస్టుకు సిద్ద‌మ‌వుతున్నాను. ఆదివారం(డిసెంబ‌ర్ 7) మ‌రోసారి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాను. ఆ త‌ర్వాత అడిలైడ్ వెళ్లాక కూడా నెట్స్‌లో బౌలింగ్ చేస్తాను. ప్ర‌స్తుతం ఫిట్‌గా ఉన్నారు. నా శ‌రీరం కూడా అద్భుతంగా స‌హ‌క‌రిస్తోంది. ఈ గ్యాప్‌లో ఎటువంటి స‌మ‌స్య‌లు రాకూడ‌ద‌ని కోరుకుంటున్నానని" మూడో రోజు ఆట సందర్భంగా ఫాక్స్ క్రికెట్‌తో కమిన్స్ చెప్పుకొచ్చాడు. క‌మ్మిన్స్‌, హేజిల్‌వుడ్ లేక‌పోవ‌డంతో బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్‌, మైఖేల్ నేసర్‌ల‌తో కూడిన పేస్ ధళానికి స్టార్క్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తొలి టెస్టులో ఆసీస్ బౌల‌ర్లు అద‌ర‌గొట్టారు. రెండో టెస్టులో కూడా ఫ‌ర్వాలేద‌న్పిస్తున్నారు. ఇక ప్ర‌తిష్టాత్మ‌క సిరీస్‌లోని మూడో టెస్టు అడిలైడ్ ఓవల్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన డికాక్‌.. ప్రపంచ క్రికెట్‌లోనే!

Jayant Yadav four-for trumps Shami three-for as Puducherry thrash Bengal4
దుమ్ములేపిన మహ్మద్ షమీ.. అయినా ఘోర ప‌రాభవం

టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో జాతీయ సెల‌క్ట‌ర్ల‌కు మ‌రోసారి సవాల్ విసిరాడు. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో దుమ్ములేపుతున్నాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో భాగంగా శ‌నివారం పుదుచ్చేరి (Puducherry)తో జ‌రిగిన మ్యాచ్‌లో ష‌మీ నిప్పులు చెరిగాడు. ష‌మీ త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో 32 ప‌రుగులిచ్చి మూడు వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే ష‌మీ స‌త్తాచాటిన‌ప్ప‌టికి బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో బెంగాల్ 81 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మి చూడాల్సి వ‌చ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులు చేసింది.పుదుచ్చేరి బ్యాట‌ర్ల‌లో ఆమ‌న్ ఖాన్‌(74) హాఫ్‌ సెంచరీ సాధించగా.. జస్వంత్‌(45) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. బెంగాల్‌ బౌలర్లలో షమీతో పాటు చటర్జీ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనలో బెంగాల్‌ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు.పుదుచ్చేరి బౌలర్ల దాటికి బెంగాల్‌ 13.5 ఓవర్లలో కేవలం 96 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌గా కరణ్‌ లాల్‌(40) మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పుదుచ్చేరి బౌలర్లలో జయంత్‌ యాదవ్‌ 4 వికెట్లతో సత్తాచాటగా.. సైదక్‌ సింగ్‌ మూడు, అయూబ్‌, అమన్‌ ఖాన్‌ తలా వికెట్‌ సాధించారు. ఈ సీజన్‌లో బెంగాల్‌కు ఇది రెండో ఓటమి.

IND vs SA 3rd ODI Vizag: Prasidh Kuldeep Shine SA 270 All Out5
సౌతాఫ్రికా ఆలౌట్‌.. టీమిండియా లక్ష్యం ఎంతంటే?

సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రత్యర్థి జట్టును 270 పరుగులకు పరిమితం చేశారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచిలో టీమిండియా.. రాయ్‌పూర్‌లో సౌతాఫ్రికా గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం నాటి మూడో వన్డే (IND vs SA 3rd ODI) ద్వారా సిరీస్‌ ఫలితం తేలనుంది. విశాఖపట్నం వేదికగా టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.ఫలితంగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్‌ జట్టుకు భారత పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh) ఆదిలోనే షాకిచ్చాడు. టీమిండియా బౌలింగ్‌ అటాక్‌ను ఆరంభించిన ఈ లెఫ్టార్మ్‌ బౌలర్‌.. ఐదో బంతికే ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ (0)ను పెవిలియన్‌కు పంపాడు. అయితే, మరో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ టెంబా బవుమాతో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.శతక్కొట్టిన డికాక్‌ఈ క్రమంలో డికాక్‌ సెంచరీ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు- 106 పరుగులు) పూర్తి చేసుకుని జోరు కనబరచగా ప్రసిద్‌ కృష్ణ అతడిని బౌల్డ్‌ చేశాడు. మరోవైపు.. బవుమా అర్ధ శతకం దిశగా సాగుతున్న వేళ.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లి (Virat Kohli)కి క్యాచ్‌ ఇచ్చి 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.మార్క్రమ్‌ విఫలంమిగతా వారిలో మాథ్యూ బ్రీట్జ్కే (24), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (29) మాత్రమే చెప్పుకోగదగ్గ స్కోర్లు చేశారు. ప్రధాన బ్యాటర్లలో ఐడెన్‌ మార్క్రమ్‌ (1) దారుణంగా విఫలం కాగా.. ఆల్‌రౌండర్లలో మార్కో యాన్సెన్‌ (17), కార్బిన్‌ బాష్‌ (9) తేలిపోయారు. లుంగి ఎంగిడి ఒక్క పరుగుకే అవుట్‌ కాగా.. ఆఖర్లో కేశవ్‌ మహరాజ్‌ మెరుగైన (20 నాటౌట్‌) బ్యాటింగ్‌తో అలరించాడు. ప్రసిద్‌ బౌలింగ్‌ ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ పదో వికెట్‌గా వెనుదిరగడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ ముగిసిపోయింది.చెరో నాలుగు పంచుకున్న ప్రసిద్‌, కుల్దీప్‌ఈ క్రమంలో 47.5 ఓవర్లలో సౌతాఫ్రికా 270 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ డికాక్‌, బ్రీట్జ్కే, మార్క్రమ్‌ రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చడంతో పాటు బార్ట్‌మన్‌ను అవుట్‌ చేశాడు. మరోవైపు.. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ బ్రెవిస్‌, యాన్సెన్‌. బాష్‌, ఎంగిడిలను పెవిలియన్‌కు పంపాడు. మిగిలిన వారిలో అర్ష్‌దీప్‌ సింగ్‌, రవీంద్ర జడేజా చెరో వికెట్‌ దక్కించుకున్నారు. సౌతాఫ్రికా విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.చదవండి: టెస్టుల్లో వెస్టిండీస్‌ క్రికెటర్‌ ప్రపంచ రికార్డు

Quinton de Kock Breaks a flood of records with a superb 80 ball hundred in Vizag6
చరిత్ర సృష్టించిన డికాక్‌.. ప్రపంచ క్రికెట్‌లోనే!

టీమిండియాతో వన్డే సిరీస్‌లో సౌతాఫ్రికా స్టార్ వికెట్ బ్యాటర్ క్వింటన్ డికాక్ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. వైజాగ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో డికాక్ సెంచరీతో చెలరేగాడు. తొలి రెండు వన్డేల్లో తడబడిన డికాక్‌.. ఈ మ్యాచ్‌లో మాత్రం భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. వైజాగ్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు అని తేడా లేకుండా ఈ వెటరన్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో 80 బంతుల్లో డికాక్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 89 బంతులు ఎదుర్కొన్న డికాక్‌.. 8 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. వ‌న్డేల్లో అత‌డికి ఇది 23వ సెంచ‌రీ కావ‌డం గ‌మనార్హం. అదేవిధంగా భార‌త్‌పై 7వ వ‌న్డే సెంచ‌రీ. త‌ద్వారా డికాక్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన డికాక్‌..ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా క్వింటన్ డికాక్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు ఆసీస్ దిగ్గ‌జం ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్, శ్రీలంక లెజెండ్ సంగ‌ర్క‌ర‌ పేరిట ఉండేది. గిల్లీ శ్రీలంక‌పై 6 సెంచ‌రీలు సాధించగా.. సంగక్క‌ర భార‌త్‌పై స‌రిగ్గా ఆరు వ‌న్డే సెంచ‌రీలు న‌మోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో వీరిద్దరిని డికాక్‌(7) అధిగ‌మించాడు.అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన వికెట్ కీప‌ర్‌గా కుమార సంగ‌క్క‌ర రికార్డును డి కాక్ స‌మం చేశాడు. సంగక్క‌ర త‌న వ‌న్డే కెరీర్‌లో 23 సెంచ‌రీలు చేయ‌గా.. డికాక్ కూడా సరిగ్గా ఇప్ప‌టివ‌ర‌కు 23 సెంచ‌రీలు చేశాడు. మ‌రో సెంచ‌రీ చేస్తే సంగాను డికాక్ అధిగ‌మిస్తాడు. ఈ జాబితాలో వీరిద్ద‌రి త‌ర్వాతి స్ధానంలో షాయ్ హోప్‌(19), గిల్‌క్రిస్ట్‌(19) ఉన్నారు.విదేశీగడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్‌, సయ్యద్ అన్వర్‌, ఏబీ డివిలియర్స్‌, రోహిత్ శర్మ రికార్డును డికాక్ సమం చేశాడు. వీరిందరూ 7 సెంచరీలు విదేశాల్లో చేశారు.భార‌త్‌పై వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు సాధించిన ప్లేయ‌ర్‌గా శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య(7) రికార్డును డికాక్ స‌మం చేశాడు.చదవండి: IND vs SA: అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! గంభీర్‌ నమ్మకమే నిజమైంది

IND vs SA: prasidh krishna super come back in second spell7
అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! గంభీర్‌ నమ్మకమే నిజమైంది

టీమిండియా హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్ ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. అందరూ ఊహించినట్టుగానే ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడింది.కానీ తొలి రెండు వన్డేల్లో దారుణంగా విఫలమైన పేసర్ ప్రసిద్ద్ కృష్ణపై మాత్రం టీమ్ మెనెజ్‌మెంట్ నమ్మకం ఉంచింది. కానీ గంభీర్ నమ్మకాన్ని ఈ కర్ణాటక పేసర్ తొలి స్పెల్‌లో నిలబెట్టుకోలేకపోయాడు. మొదటి స్పెల్‌లో 2 ఓవర్లు వేసిన కృష్ణ ఏకంగా 13.5 ఏకానమీతో 27 పరుగులు ఇచ్చాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 9 ఓవర్‌లో తన తొలి స్పెల్‌ను వేసేందుకు వచ్చిన ప్రసిద్ద్ కృష్ణను క్వింటన్ డికాక్ ఓ ఆడుకున్నాడు. దీంతో గంభీర్‌తో పాటు కృష్ణను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. అతడు తప్ప ఇంకొక బౌలర్ మీకు దొరకలేదా అంటూ నెటిజన్లు మండిడ్డారు.సీన్ రివర్స్‌.. అయితే కాసేపటికే ప్రసిద్ద్‌, గంభీర్‌ను విమర్శించిన వారే శెభాష్ అంటూ ప్రశంసించారు. ప్రసిద్ద్ కృష్ణ తన సెకెండ్ స్పెల్‌లో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్యాడు. ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లను పడగొట్టి సఫారీలను దెబ్బతీశాడు. 29వ ఓవర్‌ వేసిన కృష్ణ రెండో బంతికి ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ బ్రీట్జ్కేను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించిన కృష్ణ.. ఆఖరి బంతికి రాయ్‌పూర్‌ వన్డే హీరో మార్‌క్రమ్‌ను పెవిలియన్‌కు పంపాడు.ఆ తర్వాత డికాక్‌ను కూడా అద్భుత బంతతో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ప్రసిద్ద్‌ తన సూపర్‌ బౌలింగ్‌తో తిరిగి జట్టును గేమ్‌లోకి తెచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న సౌతాఫ్రికా 38 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌(106) సెంచరీతో మెరిశాడు.What a brilliant comeback by Prasidh Krishna 👏🏻 First 2 overs - 28 runs and 0 wickets 😆Next 5 overs - 25 runs and 3 wickets 🔥 pic.twitter.com/wPIluvIgVS— Richard Kettleborough (@RichKettle07) December 6, 2025

Justin Greaves Creates History Becomes First Player In World To Achieve8
వెస్టిండీస్‌ క్రికెటర్‌ ప్రపంచ రికార్డు

వెస్టిండీస్‌ క్రికెటర్‌ జస్టిన్‌ గ్రీవ్స్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో ఆరు లేదంటే అంతకంటే లోయర్‌ ఆర్డర్‌లో వచ్చి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.పరిమిత ఓవర్ల సిరీస్‌లలో పరాభవంకాగా ఐదు టీ20, మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు విండీస్‌ క్రికెట్‌ జట్టు న్యూజిలాండ్‌ పర్యటన (West Indies tour of New Zealand, 2025)కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్‌ జరుగగా ఆతిథ్య కివీస్‌ 3-1తో గెలిచింది. వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ మేరకు పరిమిత ఓవర్ల సిరీస్‌లలో న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాభవాల తర్వాత.. వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌ మొదలుపెట్టింది.తొలి టెస్టులో అసాధారణ పోరాటంక్రైస్ట్‌చర్చ్‌ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టును అసాధారణ పోరాటంతో వెస్టిండీస్‌ కనీసం డ్రా చేసుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌట్‌ అయింది.ఇందుకు బదులిచ్చే క్రమంలో వెస్టిండీస్‌ తడబడింది. తేజ్‌నరైన్‌ చందర్‌పాల్‌ (52), షాయీ హోప్‌ (Shai Hope- 56) మాత్రమే రాణించగా.. మిగతా వాళ్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో 167 పరుగులకే పర్యాటక జట్టు కుప్పకూలింది. ఫలితంగా కివీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 64 పరుగుల ఆధిక్యం లభించింది.హోప్‌ సెంచరీ, జస్టిన్‌ డబుల్‌ సెంచరీఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌.. ఎనిమిది వికెట్ల నష్టానికి 466 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. తద్వారా విండీస్‌కు 531 (64+ 466)పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఈ నేపథ్యంలో షాయీ హోప్‌ (234 బంతుల్లో 140)తో కలిసి జస్టిన్‌ గ్రీవ్స్‌ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు.ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గ్రీవ్స్‌.. 388 బంతులు ఎదుర్కొని 19 ఫోర్ల సాయంతో 202 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, ఆఖరి రోజు విండీస్‌కు చేతిలో 4 వికెట్లు ఉండి.. విజయానికి 74 పరుగుల దూరంలో ఉన్న వేళ.. సమయాభావం దృష్ట్యా ‘డ్రా’కు అంగీకరించాల్సి వచ్చింది.ఆరో స్థానంలో వచ్చిఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా 31 ఏళ్ల జస్టిన్‌ గ్రీవ్స్‌ (Justin Greaves)... టెస్టు క్రికెట్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో వచ్చి డబుల్‌ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇక ఇతరులలో భారత దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ నాలుగో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చి 221 పరుగులు చేయడం విశేషం.చదవండి: భారత్‌తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు భారీ షాకులు

Ashes 2nd test: Australia all out for 511 runs in first innings, gets 177 runs lead9
బ్యాట్‌తోనూ చెలరేగిన స్టార్క్‌.. ఆస్ట్రేలియా భారీ స్కోర్‌

బ్రిస్బేన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ సాధించింది. స్టార్క్‌ నిప్పులు చెరగడంతో తొలుత ఇంగ్లండ్‌ను 334 పరుగులకు పరిమితం చేసిన ఆసీస్‌.. ఆతర్వాత బ్యాటింగ్‌లో సత్తా చాటి 511 పరుగులు సాధించింది. తద్వారా 177 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.బంతితో రాణించిన స్టార్క్‌ (141 బంతుల్లో 77; 13 ఫోర్లు) బ్యాట్‌తోనూ చెలరేగి ఆసీస్‌కు భారీ స్కోర్‌ అందించాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో స్టార్క్‌ స్కోరే అత్యధికం. మరో నలుగురు కూడా అర్ద సెంచరీలు చేశారు. జేక్‌ వెదరాల్డ్‌ 72, లబూషేన్‌ 65, స్టీవ్‌ స్మిత్‌ 61, అలెక్స్‌ క్యారీ 63 పరుగులు చేశారు.ట్రవిస్‌ హెడ్‌ (33), గ్రీన్‌ (45) కూడా పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లలో ఇంగ్లిస్‌ 23, నెసర్‌ 16, బోలాండ్‌ 21 (నాటౌట​్‌), డాగెట్‌ 13 పరుగులు చేశారు. ఇం​గ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌ 4 వికెట్లతో సత్తా చాటగా.. స్టోక్స్‌ 3, ఆర్చర్‌, అట్కిన్సన్‌, జాక్స్‌ తలో వికెట్‌ తీశారు.అంతకుముందు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్‌(138) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(76),ఆర్చర్‌(38) రాణించారు. మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తా చాటాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆసీస్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.రికార్డుల్లోకెక్కిన స్టార్క్‌తాజా ఇన్నింగ్స్‌తో స్టార్క్‌ రికార్డుల్లోకెక్కాడు. పాట్‌ కమిన్స్‌ తర్వాత వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో 1000 పరుగులు సహా 200 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో స్టార్క్‌ డబ్ల్యూటీసీలో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో ఆస్ట్రేలియన్‌గా నిలిచాడు. అలాగే కమిన్స్‌, అశ్విన్‌, జడేజా, వోక్స్‌ తర్వాత డబ్ల్యూటీసీలో 1000 పరుగులు, 100 వికెట్లు పూర్తి చేసుకున్న ఐదో ఆటగాడిగానూ నిలిచాడు. ​

IND vs SA 3rd ODI Vizag: Toss Update Playing XIs Of Both Teams10
ఎట్టకేలకు టాస్‌ గెలిచిన టీమిండియా..

టీమిండియా ఎట్టకేలకు టాస్‌ గెలిచింది. సౌతాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా విశాఖపట్నంలో తమ దురదృష్టానికి స్వస్తి పలికింది. 21వ ప్రయత్నంలో వన్డేల్లో తొలిసారి టాస్‌ గెలిచి.. తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. అందుకే తొలుత బౌలింగ్‌ఈ సందర్భంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్‌ చేస్తాం. నిన్న రాత్రి ఇక్కడ మేము ప్రాక్టీస్‌ చేశాము. రాంచి, రాయ్‌పూర్‌లో మాదిరి కాకుండా ఇక్కడ తేమ కాస్త ఆలస్యంగా ప్రభావం చూపుతోందని గ్రహించాము.వాషీపై వేటు.. జట్టులోకి తిలక్‌అందుకే లక్ష్య ఛేదననే మేము ఎంచుకున్నాము. ఈ వికెట్‌ బాగుందనిపిస్తోంది. గత రెండు మ్యాచ్‌లలో మా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాము. పరిస్థితులకు తగ్గట్లుగా ఇంకాస్త మెరుగుపడితే అనుకున్న ఫలితం రాబట్టవచ్చు. ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం. వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో తిలక్‌ వర్మ (Tilak Varma) తుదిజట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.గాయాలతో వారిద్దరు దూరంమరోవైపు.. సౌతాఫ్రికా సారథి టెంబా బవుమా (Temba Bavuma) సైతం టాస్‌ గెలిస్తే తాము తొలుత బౌలింగే ఎంచుకునే వాళ్లమని పేర్కొన్నాడు. రాంచి, రాయ్‌పూర్‌ మాదిరి ఇక్కడ కూడా ఆఖరి వరకు మ్యాచ్‌ ఉత్కంఠగా సాగితే ప్రేక్షకులు సంతోషిస్తారన్న బవుమా.. బర్గర్‌, డి జోర్జి స్థానాల్లో ఒట్నీల్‌ బార్ట్‌మన్‌, ర్యాన్‌ రికెల్టన్‌ తుదిజట్టులోకి వచ్చారని తెలిపాడు. బర్గర్‌, డి జోర్జి గాయాల కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించాడు.ఫలితం తేల్చే మ్యాచ్‌కాగా మూడు వన్డేలో సిరీస్‌లో భాగంగా రాంచిలో తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆదివారం పదిహేడు పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం రాయ్‌పూర్‌ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా 1-1తో సిరీస్‌ సమం కాగా.. శనివారం నాటి విశాఖపట్నం మ్యాచ్‌లో సిరీస్‌ విజేత ఎవరో తేలనుంది.భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా మూడో వన్డే తుదిజట్లుభారత్‌రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్‌ రాహుల్(వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.సౌతాఫ్రికార్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), టెంబా బావుమా(కెప్టెన్‌), మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రమ్‌, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.చదవండి: భారత్‌తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు భారీ షాకులు

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement