Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Bangladesh Stuns Australia again, clinches ODI series with a match spare1
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్‌ వన్డే జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌, ఆరు సార్లు వరల్డ్‌ ఛాంపియన్స్‌ అయిన ఆస్ట్రేలియాపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌లో విజయం సాధించింది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (జూన్‌ 11) జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌లోనూ ఆసీస్‌ను చిత్తు చేసిన బంగ్లా జట్టు, మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్‌ను హస్తగతం​ చేసుకుంది. 2005లో తొలిసారి ఆస్ట్రేలియాపై ఓ వన్డేలో విజయం సాధించిన బంగ్లాదేశ్‌.. తాజాగా రెండు వరుస విజయాలు సాధించి సంచలనం సృష్టించింది.మ్యాచ్‌ విషయానికొస్తే.. వరుణుడు అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 42 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మరోసారి ఆటకు అంతరాయం కలిగించడంతో బంగ్లా లక్ష్యాన్ని 41 ఓవర్లలో 192 పరుగులకు మార్చారు. లక్ష్య ఛేదనలో బంగ్లా జట్టు రెండో బంతికే వికెట్‌ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా 35 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తౌహిద్‌ హృదోయ్‌ (40), కెప్టెన్‌ మెహిది హసన్‌ మిరాజ్‌ (22) అజేయమైన ఇన్నింగ్స్‌లతో బంగ్లాను గెలుపుతీరాలకు చేర్చారు. అంతకుముందు సౌమ్య సర్కార్‌ (42), నజ్ముల్‌ షాంటో (41) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. మిగతా ఆటగాళ్లలో తంజిద్‌ హసన్‌ డకౌట్‌ కాగా.. లిటన్‌ దాస్‌ 21, తొలి వన్డే హీరో మొసద్దెక్‌ హొసేన్‌ 15 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో బార్ట్‌లెట్‌, మెరిడిత్‌, జంపా, రెన్షా, గ్రీన్‌ తలో వికెట్‌ తీశారు.అంతకుముందు ఆసీస్‌ ఖాతా తెరవకుండానే 3 వికెట్లు కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేని అపవాదును మూటగట్టుకుంది. లబూషేన్‌ (55 నాటౌట్‌), బార్ట్‌లెట్‌ (52) అర్ద సెంచరీలతో రాణించి, ఈ మాత్రం స్కోరైనా అందించారు. మిగతా ఆటగాళ్లలో కెప్టెన్‌ ఇంగ్లిస్‌ (34), గ్రీన్‌ (25), అలెక్స్‌ క్యారీ (13) రెండంకెల స్కోర్లు చేయగా.. షార్ట్‌, కన్నోల్లీ, రెన్షాతో పాటు జంపా డకౌటయ్యారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ (7-2-27-3), తస్కిన్‌ అహ్మద్‌ (8-1-33-3), తన్వీర్‌ ఇస్తాం (10-0-45-2) చెలరేగి బౌలింగ్‌ చేశారు. ఈ సిరీస్‌లోని నామమాత్రపు మూడో వన్డే జూన్‌ 14న జరుగనుంది. కాగా, ఆసీస్‌కు ఇది వరుసగా రెండో ద్వైపాక్షిక సిరీస్‌ ఓటమి. ఈ సిరీస్‌కు ముందు ఆ జట్టు పాకిస్తాన్‌ చేతిలో 1-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది.

Shivam dube smashed 5 sixes in semi finals of T20 Mumbai league]2
శివాలెత్తిన శివమ్‌ దూబే.. సిక్సర్ల వర్షం

టీ20 ముంబై లీగ్‌లో భారత టీ20 ప్లేయర్‌ శివమ్‌ దూబే శివాలెత్తిపోయాడు. ఈ టోర్నీలో అంధేరి ఆర్క్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు.. ఆకాశ్‌ టైగర్స్‌తో ఇవాళ (జూన్‌ 11) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఫలితంగా అతడి జట్టు ఫైనల్‌కు దూసుకుపోయింది.ఈ మ్యాచ్‌లో తొలుత బంతితో (3-0-16-1) రాణించిన దూబే.. ఆతర్వాత బ్యాటింగ్‌లో చెలరేగిపోయాడు. ప్రత్యర్ది నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. 26 బంతుల్లో ఓ బౌండరీ, 5 సిక్సర్లతో విరుచుకుపడి అజేయమైన 45 పరుగులు చేశాడు.తద్వారా అతడి జట్టు మరో 9 బంతులు మిడిలుండగానే విజయతీరాలకు చేరింది. లక్ష్య ఛేదనలో దూబేకు దివ్యాంశ్‌ సక్సేనా (34), ప్రసాద్‌ పవార్‌ (26), గౌరవ్‌ జాథర్‌ (11 నాటౌట్‌) సహకరించారు. ఈ జట్టు స్టార్‌ ఆటగాళ్లు ముషీర్‌ ఖాన్‌ (0), అర్జున్‌ టెండూల్కర్‌ (13) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచారు.అంతకుముందు ఆకాశ్‌ టైగర్స్‌ తరఫున ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. కెప్టెన్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ (34), జయ్‌ గోకుల్‌ బిస్తా (35) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును తాకలేదు. అంధేరి బౌలర్లలో అశుతోష్‌ 2 వికెట్లు తీయగా.. అర్జున్‌ టెండూల్కర్‌, ముషీర్‌ ఖాన్‌, శివమ్‌ దూబే, ప్రసూన్‌ సింగ్‌, అజయ్‌ మిశ్రా తలో వికెట్‌ తీశారు.

Devon Conway Leaves New Zealand Camp Ahead Of 2nd Test vs England3
సిరీస్‌ మధ్యలో స్వదేశానికి వెళ్లిపోయిన డెవాన్‌ కాన్వే

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడి భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో, ఆమెతో ఉండేందుకు తాత్కాలికంగా జట్టును వీడాడు.రెండో టెస్ట్‌ జూన్‌ 17న మొదలు కావాల్సి ఉండగా.. ఆ సమయానికంతా అతడు జట్టుతో కలుస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కాన్వే తన తొలి సంతానం జనన సమయంలోనూ ఇంగ్లండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ను మిస్ అయ్యాడు. ఒకవేళ కాన్వే రెండో టెస్ట్‌ సమయానికి అందుబాటులోకి రాకపోతే కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌తో కలిసి రచిన్‌ రవీంద్ర ఓపెనింగ్‌ చేస్తాడు.కాగా, న్యూజిలాండ్‌ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం​ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఇప్పటికే తొలి టెస్ట్‌ పూర్తి కాగా, ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చిత్తుగా ఓడింది. ఆ మ్యాచ్‌లో కాన్వే తొలి ఇన్నింగ్స్‌లో (1) విఫలమైనా, రెండో ఇన్నింగ్స్‌లో (41) పర్వాలేదనిపించాడు. కాన్వే ఇటీవలికాలంలో బ్యాటింగ్‌లో స్థిరత్వంలేక ఇబ్బందిపడుతున్నాడు. ఓ సిరీస్‌లో రాణిస్తే, మరో సిరీస్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు. తాజాగా విండీస్‌తో జరిగిన సిరీస్‌లో అతడు 452 పరుగులతో సత్తా చాటాడు.ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌పై తొలి టెస్ట్‌ విజయం తర్వాత ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, పేస్‌ బౌలర్‌ గస్‌ అట్కిన్సన్‌ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆ మ్యాచ్‌ గెలిచిన ఆనందంలో వారిద్దరు నిబంధనలు ఉల్లంఘించి నైట్‌క్లబ్‌లో పార్టీ చేసుకోవడంతో పాటు అక్కడు ఓ రగ్బీ ఆటగాడితో గొడవకు దిగారు. అక్కడ స్టోక్స్‌ తాగిన మత్తులో సదరు రగ్బీ ఆటగాడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఈసీబీ.. స్టోక్స్‌, అట్కిన్సన్‌ నిబంధనలు ఉల్లంఘించారని నిర్దారించి వారిని రెండో టెస్ట్‌ నుంచి తప్పించింది. స్టోక్స్‌ గైర్హాజరీలో రూట్‌ను తాత్కాలిక సారధిగా ప్రకటించింది.

IND A vs AFG A ODI: Afghanistan Beat India By 4 Runs4
IND vs AFG: భారత్‌కు భారీ షాక్‌.. అఫ్గన్‌ అనూహ్య విజయం

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌- ‘ఎ’ జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. అఫ్గనిస్తాన్‌- ‘ఎ’ జట్టుతో గురువారం నాటి మ్యాచ్‌లో తిలక్‌ వర్మ సేన ఓటమి పాలైంది.తొలుత ఆతిథ్య శ్రీలంక- భారత్‌ మధ్య మ్యాచ్‌ జరుగగా.. భారత్‌ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. ఈ క్రమంలో గురువారం అఫ్గన్‌తో తలపడ్డ భారత జట్టు.. దంబుల్లాలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అదరగొట్టిన భారత బ్యాటర్లుగత మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఈసారి అదరగొట్టారు. ప్రభ్‌సిమ్రన్‌ 69 బంతుల్లో 84 పరుగులు సాధించగా.. వైభవ్‌ సూర్యవంశీ 22 బంతుల్లోనే 44 పరుగులతో దుమ్ములేపాడు.మూడో స్థానంలో వచ్చిన ప్రియా​న్ష్‌ ఆర్య (8) విఫలం కాగా.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ 80 బంతుల్లో 66, కెప్టెన్‌ తిలక్‌ వర్మ 73 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించారు. మిగతా వారిలో ఆయుశ్‌ బదోని డకౌట్‌ కాగా.. సూయాన్ష్‌ షెడ్గే (40) మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అర్షద్‌ ఖాన్‌ (1), విప్రాజ్‌ నిగమ్‌ (8) ఇలా వచ్చి అలా వెళ్లారు. అనుకుల్‌ రాయ్‌ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.349 పరుగుల భారీ స్కోరుఇక వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించగా.. భారత్‌ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గనిస్తాన్‌ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్జాయ్‌ ఐదు వికెట్లతో అదరగొట్టగా.. ఫర్మానుల్లా సఫీ మూడు వికెట్లు, కెప్టెన్‌ ఇమ్రాన్‌ మిర్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.పదే పదే ఆటంకంఅనంతరం అఫ్గన్‌ లక్ష్య ఛేదనకు దిగగా వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం.. అఫ్గన్‌ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో ఓపెనర్లు ఇమ్రాన్‌ మిర్‌, హసన్‌ ఐసాఖిల్‌ అఫ్గన్‌కు శుభారంభం అందించారు.ఇమ్రాన్‌ 70 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 75 పరుగులతో అజేయంగా నిలవగా.. హసన్‌ 29 బంతుల్లో 34 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఖలీద్‌ తనీవాల్‌ (2) మాత్రం విఫలమయ్యాడు. అయితే, ఓపెనర్‌ ఇమ్రాన్‌కు తోడుగా బహీరీ షా పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు.సారథితో పాటు పట్టుదలగా నిలబడ్డ బహీర్‌బహీర్‌ 52 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 51 పరుగులతో ఇమ్రాన్‌తో కలిసి అజేయంగా నిలిచాడు. అయితే, అఫ్గనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో 25.5 ఓవర్లు పూర్తైన తర్వాత మరోసారి వర్షం ఆటంకం కలిగించింది. అప్పటికి అఫ్గన్‌ రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.భారత్‌ ఓటమిఅయితే, ఆ తర్వాత వర్షం మరింత ఎక్కువైంది. దీంతో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్దతి ప్రకారం నిర్ణీత ఓవర్లలో భారత్‌ కంటే అఫ్గన్‌ జట్టు ఆధిక్యంలో నిలిచినట్లయింది. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు. భారత్‌పై అనూహ్య రీతిలో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో అఫ్గనిస్తాన్‌ విజయం సాధించింది.ఇక ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అర్షద్‌ ఖాన్‌, అనుకుల్‌ రాయ్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ట్రై సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్‌ ఒక గెలుపు, ఒక ఓటమి నమోదు చేసింది. మరోవైపు.. అఫ్గన్‌ ఆడిన ఒక్కటీ గెలిచి రెండు పాయింట్లతో పట్టికలో ప్రథమ స్థానంలో నిలవగా.. భారత్‌ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్‌రన్‌రేటు పరంగా వెనుకబడి రెండో స్థానంలో ఉంది. ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఓడిన లంక చివరి స్థానంలో నిలిచింది.చదవండి: భారత జట్టులోకి ద్రవిడ్‌ కుమారుడు

Tentative dates for ICC ODI WC 2027 out Event to start from This Date5
ICC ODI WC 2027: క్రేజీ అప్‌డేట్‌

ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌-2027కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ అందింది. ఈ మెగా ఈవెంట్‌కు అక్టోబరు- నవంబరు మధ్య షెడ్యూల్‌ ఖరారైనట్లు సమాచారం. వచ్చే ఏడాది అక్టోబరు 4న మొదలై నవంబరు 21న ఫైనల్‌తో వన్డే వరల్డ్‌కప్‌ ముగియనున్నట్లు తెలుస్తోంది. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో కథనం ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) మేలో అహ్మదాబాద్‌లో సమావేశమైన సమయంలో వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ గురించి ప్రధానంగా చర్చ జరిగింది. ఈ మెగా ఈవెంట్‌కు సౌతాఫ్రికాతో పాటు జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.అక్కడ ఎనిమిది వేదికలుఅయితే, ప్రధాన మ్యాచ్‌లనీ సౌతాఫ్రికాలోనే జరుగనున్నాయి. ఇందుకోసం ఎనిమిది వేదికలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈవెంట్లోని 54 మ్యాచ్‌లలో 41 మ్యాచ్‌లు సౌతాఫ్రికాలోనే నిర్వహిస్తారు. ఇక జింబాబ్వేకు 8- 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కగా.. నమీబియాలో కేవలం మూడు మ్యాచ్‌లే నిర్వహించనున్నట్లు సమాచారం.కాగా సౌతాఫ్రికాలోని సెంచూరియన్‌, జొహన్నస్‌బర్గ్‌, బ్లోయేమ్‌ఫొంటేన్‌, డర్బన్‌, ఈస్ట్‌ లండన్‌, గెబెర్హ, పర్ల్‌, కేప్‌టౌన్‌లను వరల్డ్‌కప్‌ వేదికలుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక జింబాబ్వేలో హరారే, క్వీన్స్‌, విక్టోరియా ఫాల్స్‌ ఆతిథ్య హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌పై జూలైలో జరిగే సమావేశంలో పూర్తి స్పష్టత రానుంది.24 ఏళ్ల తర్వాతకాగా దాదాపు 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆఫ్రికా ఖండంలో వన్డే వరల్డ్‌కప్‌ జరుగనుంది. చివరగా 2003లో సౌతాఫ్రికాలో ఈ టోర్నీ జరుగగా.. నాడు ఫైనల్లో టీమిండియాపై గెలిచి ఆస్ట్రేలియా విజేతగా అవతరించింది. ఇదిలా ఉంటే.. 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి సౌతాఫ్రికానే ఆతిథ్యం ఇవ్వడం విశేషం.చదవండి: భారత జట్టులోకి ద్రవిడ్‌ కుమారుడు

Bangladesh pick Hridoy in Test squad, recall pace trio for Australia T20Is6
ఆసీస్‌ సిరీస్‌ కోసం ప్రత్యేక అస్త్రాలు సిద్దం చేసిన బంగ్లా

త్వరలో ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, ఆతర్వాత జింబాబ్వేతో జరుగబోయే ఏకైక టెస్ట్‌ కోసం రెండు వేర్వేరు బంగ్లాదేశ్‌ జట్లను ఇవాళ (జూన్‌ 11) ప్రకటించారు. ముందుగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌ విషయానికొస్తే.. ఈ జట్టుకు కెప్టెన్‌గా లిట్టన్‌ దాస్‌ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా యువ బ్యాటర్‌ తౌహిద్‌ హృదోయ్‌ పేరును ప్రకటించారు.ఈ సిరీస్‌తో పేస్‌ త్రయం ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, తస్కిన్‌ అహ్మద్‌, నహిద్‌ రాణా రీఎంట్రీ ఇచ్చింది. ఈ ముగ్గురు పేసర్లతో బంగ్లాదేశ్‌ ఆసీస్‌ బ్యాటింగ్‌ యూనిట్‌పై దాడికి దిగనుంది. ఈ జట్టులో గత సిరీస్‌లో ఆడిన తంజిమ్‌ హసన్‌ షకీబ్‌, రిపన్‌ మొండల్‌, మొహమ్మద్‌ సైఫుద్దీన్‌లకు చోటు దక్కలేదు. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ కారణంగా వీరిని తప్పించినట్లు సెలెక్టర్లు చెప్పారు.జింబాబ్వేతో ఏకైక టెస్ట్‌ విషయానికొస్తే.. నజ్ముల్‌ హసన్‌ షాంటో కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. దేశవాలీ టోర్నీల్లో విశేషంగా రాణిస్తున్న తౌహిద్‌ హృదోయ్‌ టెస్ట్‌ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. సీనియర్లు ముష్ఫికర్‌ రహీం, లిటన్‌ దాస్‌, మొమినుల్‌ హక్‌ జట్టులో చోటు నిలుపుకున్నారు. కొత్త పేసర్‌ రోబివుల్‌ హాక్‌కు అవకాశం లభించింది.ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ టీ20 సిరీస్‌ జూన్‌ 17, 19, 21 తేదీల్లో చట్టోగ్రామ్‌ వేదికగా జరుగనుండగా.. జింబాబ్వేతో ఏకైక టెస్ట్‌ జూన్‌ 28 నుంచి హరారేలో జరుగనుంది.ఆస్ట్రేలియా సిరీస్‌కు బంగ్లా టీ20 జట్టు: లిటన్ కుమార్ దాస్ (కెప్టెన్), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తంజిద్ హసన్, మహ్మద్ సైఫ్ హసన్, షమీమ్ హొస్సేన్, తౌహిద్ హృదోయ్ (వైస్ కెప్టెన్), నూరుల్ హసన్ సోహన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, రిషద్‌ హొసేన్‌, షోరిఫుల్‌ ఇస్లాం, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, తస్కిన్‌ అహ్మద్‌, నహిద్ రాణా, అబ్దుల్ గఫార్ సక్లైన్.జింబాబ్వేతో ఏకైక టెస్టుకు బంగ్లాదేశ్‌ జట్టు: నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, తాంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ కుమార్ దాస్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, ఖలీద్ అహ్మద్, ఇబాడోత్ హొసేన్‌, హసన్‌ మహమూద్‌, తౌహిద్‌ హృదోయ్‌, అమిటే హసన్‌, రోబివుల్‌ హాక్‌.

IND vs AFG: BCCI Breaks Silence On Hardik Pandya Replacement7
BCCI: అవును.. అతడు జట్టుకు దూరమయ్యాడు!

అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత జట్టు ముల్లన్‌పూర్‌ నుంచి ధర్మశాలకు పయనమైంది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సహా దిగ్గజ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ.. యువ ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌ విమానంలో బయల్దేరారు. జైస్వాల్‌కు చోటుఇక లెజెండరీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి గాయం వల్ల అఫ్గన్‌తో వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్‌కు జట్టులో చోటు దక్కింది. మరోవైపు.. రోహిత్‌ శర్మ గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ తెచ్చుకున్నాడు.రోహిత్‌ పాటు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సైతం ఫిట్‌నెస్‌ సాధించి జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఆ తర్వాత దురదృష్టవశాత్తూ తొడకండరాలు పట్టేశాయి. దీంతో దాదాపు రెండు వారాల పాటు ఆటకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కానీ పాండ్యా గాయం గురించి అధికారిక ప్రకటన రాలేదు.అతడు జట్టుకు దూరమయ్యాడు!ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఈ విషయం గురించి తాజాగా స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా మాట్లాడుతూ.. ‘‘అవును.. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. గాయం వల్ల అతడు అందుబాటులో ఉండటం లేదు.అతడి స్థానంలో వేరే ఆటగాడిని తీసుకోవాలా? లేదంటే పద్నాలుగు మందితోనే జట్టును కొనసాగించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు.నితీశ్‌ రెడ్డి ఉన్నాడుగాకాగా ఇప్పటికే హార్దిక్‌కు బ్యాకప్‌గా మరో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌, ఆంధ్ర కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డిని అఫ్గన్‌తో వన్డేలకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందుకే రీప్లేస్‌మెంట్‌ గురించి సెలక్టర్లు ఆలోచించడంలేదని తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. అఫ్గన్‌తో ముల్లన్‌పూర్‌ వేదికగా టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 300 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తదుపరి జూన్‌ 13, 17, 20 తేదీల్లో మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ధర్మశాల, లక్నో, చెన్నై ఇందుకు వేదికలు. చదవండి: వైభవ్‌ ధనాధన్‌.. భారత్‌ భారీ స్కోరు

Nahid Rana Punished Brutally By ICC After Josh Inglis Fight8
బంగ్లా ప్లేయర్‌పై కన్నెర్ర చేసిన ఐసీసీ

బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ నహిద్‌ రాణాపై ICC (అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌) కఠిన చర్యలు తీసుకుంది. జూన్‌ 9న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో జోష్‌ ఇంగ్లిస్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకుగానూ ఓ డీ మెరిట్‌ పాయింట్‌ కేటాయించింది. రాణా తన తప్పును అంగీకరించడంతో జరిమానా పడలేదు. ఫార్మల్ హియరింగ్ కూడా అవసరం లేకుండా అతి తక్కువ శిక్షతో బయటపడ్డాడు. ఐసీసీ నియమావళి ప్రకారం, రాణా ఆర్టికల్‌ 2.5 ఉల్లంఘనకు పాల్పడ్డాడు.రాణా ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించడం ఇది మొదటిసారి కాదు. గతేడాది ఐర్లాండ్‌ పర్యటనలోనూ ఓ ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించి ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. అప్పట్లో రాణా మ్యాచ్‌ ఫీజ్‌లో 25 శాతం కోత విధించారు.ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ ఆటగాడు 24 నెలల్లో 4 డీ మెరిట్‌ పాయింట్లు మూటగట్టుకుంటే సస్పెన్షన్‌కు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో నిషేధం పడే అవకాశం కూడా ఉంటుంది. రాణా ఇకనై జాగ్రత్తగా ఉండకపోతే నిషేధాన్ని ఎదుర్కోక తప్పదు.ఇంతకీ ఏం జరగిందంటే.. ఆ మ్యాచ్‌లో రాణా అద్భుతమైన బంతి వేసి ఇంగ్లిస్‌ను ఔట్‌ చేశాడు. ఆ వెంటనే శృతిమంచి సంబురాలు చేసుకున్నాడు. ఈ చర్యలు ఇంగ్లిస్‌ను ప్రేరేపించేలా ఉన్నాయని అంపైర్లు భావించారు. దీంతో రాణాపై డిసిప్లినరి చర్యలు తీసుకున్నారు.మ్యాచ్‌ విషయానికొస్తే.. రాణా ఆ వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో 41 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఫలితంగా తన జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఆసీస్‌ ఛేదించలేకపోయింది. డక్త్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం బంగ్లాదేశ్‌ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్‌ స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లోని రెండో వన్డే ఇవాళ జరుగుతుంది.

ICC Reveals Player Of The Month Nominees For May9
ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ పేర్ల ప్రకటన

2026 మే నెలకు సంబంధించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ నామినీస్‌ పేర్లను ఐసీసీ ఇవాళ (జూన్‌ 11) ప్రకటించింది. ఈ జాబితాలో బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల హవా కనిపించింది. గత నెలలో ఆ జట్టు పాకిస్తాన్‌పై టెస్ట్‌ సిరీస్‌ విజయం (2-0తో క్లీన్‌ స్వీప్‌) సాధించిన విషయం తెలిసిందే.ఈ సిరీస్‌లో విశేషంగా రాణించిన వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీం, స్పిన్‌ బౌలర్‌ తైజుల్‌ ఇస్లాం ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌గా ఎంపికయ్యారు. మరో నామినీగా నేపాల్‌ ఆల్‌రౌండర్‌ దీపేంద్ర సింగ్‌ ఎయిరీ ఎంపికయ్యాడు. దీపేంద్ర గత నెలలో ఆడిన వన్డేల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో చెలరేగాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు.ముష్ఫికర్‌ రహీంఈ వెటరన్ బ్యాటర్ మే నెలలో అసాధారణంగా రాణించాడు. పాక్‌పై రెండు టెస్టుల్లో 253 పరుగులు చేశాడు. రెండో టెస్టులో 137 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను పూర్తిగా బంగ్లాదేశ్ వైపు తిప్పేశాడు.తైజుల్‌ ఇస్లాంబంగ్లాదేశ్ ప్రధాన స్పిన్నర్ అయిన తైజుల్‌ పాక్‌తో జరిగిన సిరీస్‌లో 13 వికెట్లతో సిరీస్‌ టాప్‌ వికెట్ టేకర్‌గా నిలిచాడు. రెండో టెస్టులో మ్యాచ్ విన్నింగ్ స్పెల్ (6/120) ఇందులో హైలైట్‌గా నిలిచింది.దీపేంద్ర సింగ్‌ ఎయిరీఎయిరీ గత నెలలో జరిగిన వన్డేల్లో ఓ సెంచరీ (యూఏఈపై), రెండు హాఫ్‌ సెంచరీలు (యూఎస్‌ఏపై) సహా 8 వికెట్లు తీశాడు. అతడి ఆల్‌రౌండ్ ప్రదర్శనల వల్ల నేపాల్ కీలక విజయాలు సాధించింది.మహిళల విషయానికొస్తే.. ఇంగ్లండ్‌ బౌలర్‌ లారెన్‌ బెల్‌, పాకిస్తాన్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ గుల్‌ ఫెరోజా, న్యూజిలాండ్‌ బ్యాటర్‌ మ్యాడీ గ్రీన్‌ మే నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యారు.

BCCI Announces India U19 Squad Sri Lanka Tour Dravid Son Named In10
భారత జట్టులోకి ద్రవిడ్‌ కుమారుడు

శ్రీలంక పర్యటనకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అండర్‌-19 జట్టును ప్రకటించింది. యశ్‌వర్దన్‌ సింగ్‌ చౌహాన్‌ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. కాగా ఈ పర్యటనలో భాగంగా భారత అండర్‌-19 జట్టు ఆతిథ్య లంకతో వన్డే, ఫోర్‌-డే మ్యాచ్‌లు ఆడనుంది.ఇక ఈ జట్టులో టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చిన్న కుమారుడు అన్వయ్‌ ద్రవిడ్‌ (Anvay Dravid)కు కూడా చోటు దక్కింది. వన్డే జట్టులోని ఇద్దరు వికెట్‌ కీపర్‌ బ్యాటర్లలో ఒకడిగా పదహారేళ్ల అన్వయ్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.కొత్త జట్టుబీసీసీఐ జూనియర్‌ క్రికెట్‌ కమిటీ పంథా మార్చింది. అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులోని ఒక్క ఆటగాడిని కూడా తాజా టూర్‌కు ఎంపిక చేయలేదు. ఈ పర్యటనతో యశ్‌వర్దన్‌ సారథ్యంలో కొత్త జట్టును తీర్చిదిద్దే దిశగా సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈ జట్టులో ఆల్‌రౌండర్లకే సెలక్టర్లు పెద్దపీట వేశారు.మరోసారి అన్వయ్‌కు చోటుగతేడాది నవంబరులో చివరగా అన్వయ్‌ ద్రవిడ్‌ భారత అండర్‌-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌ అండర్‌-19 జట్టుతో ఆడిన భారత్‌- ‘బి’ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.బెంగళూరు వేదికగా ఈ సిరీస్‌లో ఏకైక మ్యాచ్‌ ఆడిన అన్వయ్‌.. అఫ్గన్‌ బౌలర్‌ నజీఫుల్లా అమిరి బౌలింగ్‌లో తొలి బంతికే అవుటై వెనుదిరిగాడు. అయితే, దేశీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు సెలక్టర్లు తాజాగా మరోసారి అవకాశం ఇచ్చారు.శ్రీలంక పర్యటనకు భారత మెన్స్‌ అండర్‌-19 వన్డే జట్టుసాగర్ విర్క్, లక్ష్య రాయచందాని (వైస్‌ కెప్టెన్‌), యశ్‌వర్ధన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్‌), వినీత్ వీకే, అర్జున్ రాజ్‌పుత్, కుషాగ్రా ఓజా, రజత్ బఘెల్ (వికెట్‌ కీపర్‌), అన్వయ్ ద్రవిడ్ (వికెట్‌ కీపర్‌), అన్మోల్జీత్ సింగ్, వూట్కూరి యశ్వీర్ గౌడ్, రోహిత్ అనిల్ యాదవ్, శవిన్‌ వి, కావ్యా పరేశ్‌ పటేల్‌, మోహిత్‌ ఉల్వా. ఇషాన్‌ సూద్‌.శ్రీలంక పర్యటనకు భారత మెన్స్‌ అండర్‌-19 మల్టీ-డే జట్టుసాగర్ విర్క్, లక్ష్య రాయచందాని (వైస్‌ కెప్టెన్‌), యశ్‌వర్దన్‌ సింగ్ చౌహాన్ (కెప్టెన్‌), పటేల్ కుష్, మనల్ చౌహాన్, కుషాగ్రా ఓజా, మానవ్ కృష్ణ (వికెట్‌ కీపర్‌), ఆర్యన్ సందేశ్ సక్పాల్ (వికెట్‌ కీపర్‌), హేమ్చుదేశన్ జె, బికె కిషోర్, రోహిత్ అనిల్ యాదవ్, కావ్య పరేష్ సింగ్ పటేల్, ప్రియాన్షు సింగ్‌, ప్రణవ్‌ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట.భారత్‌ అండర్‌-19 వర్సెస్‌ శ్రీలంక అండర్‌-19 షెడ్యూల్‌ (మూడు వన్డేలు, రెండు యూత్‌ టెస్టులు)👉హంబన్‌టోటా వేదికగా మూడు వన్డేలు👉జూలై 4, జూలై 6, జూలై 9 తేదీల్లో వన్డేల నిర్వహణ👉గాలే వేదికగా జూలై 13-16 మధ్య మొదటి యూత్‌ టెస్టు👉కొలంబో వేదికగా జూలై 20-23 మధ్య రెండో యూత్‌ టెస్టు.చదవండి: వైభవ్‌ ధనాధన్‌.. భారత్‌ భారీ స్కోరు

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement