Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Shreyas Iyers comments after the third T20 victory over Zimbabwe.1
"సవాళ్లకు మేం సిద్ధం".. శ్రేయస్‌ అయ్యర్‌ కీలక వ్యాఖ్యలు

ఆదివారం హ‌రారే వేదిక‌గా జింబాబ్వేతో జ‌రిగిన నామ‌మాత్ర‌పు మూడో టీ20లోనూ భార‌త్ అద‌ర‌గొట్టింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జ‌ట్టును 35 ప‌రుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో మెన్ బ్లూ క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. యువ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ(81) హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. అనంత‌రం బౌలింగ్‌లో మ‌యాంక్ యాద‌వ్ మూడు వికెట్లతో స‌త్తాచాటాడు. ఈ అద్భుత విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్పందించాడు. తమ ఆటగాళ్లపై అయ్యర్ ప్రశంసల వర్షం కురిపించాడు.'ఈ సిరీస్‌లో మా ఆట‌గాళ్లు ఫియ‌ర్‌లెస్ క్రికెట్ ఆడారు. మూడు మ్యాచ్‌ల‌లోనూ మేము అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేశాము. కెప్టెన్‌గా ఇది నాకు మొదటి సిరీస్‌ విజయం. అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకమైనది మ‌రోసారి చెబుతున్నాను.జట్టులోని చాలామంది ఆటగాళ్లకు ఐపీఎల్‌ ఆడిన అనుభవం ఉంది. వారు మైదానంలో స్వేచ్ఛగా ఆడేలా చూడటమే నా బాధ్యత. రాబోయే రోజుల్లో మాకు మ‌రిన్ని క‌ఠిన స‌వాళ్లు ఎదురుకానున్నాయి.అయితే జట్టు సభ్యులు ఇదే తరహా ధైర్యాన్ని, పట్టుదలను మైదానంలో చూపిస్తే మంచి ఫలితాలు సాధించ‌వ‌చ్చు. ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించుకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగడమే మా సిద్దాంతం అని పోస్ట్‌ మ్యాచ్‌ ప్రెజెంటేషన్‌లో అయ్యర్‌ పేర్కొన్నాడు.

Mirabai Chanu Breaks Another CWG Record, Clinches 3rd Straight Gold2
Commonwealth Games: మీరాబాయి చానుకు గోల్డ్‌ మెడల్

గ్లాస్గోలో వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌-2026లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను గోల్డ్‌మెడల్ కైవసం చేసుకుంది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో మీరాబాయికి ఇది వరుసగా మూడో బంగారు పతకం కావడం విశేషం. ఇంతకుముందు 2018 గోల్డ్ కోస్ట్, 2022 బర్మింగ్‌హామ్‌లోనూ ఆమె స్వర్ణ పతకం కొల్లగొట్టింది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళా వెయిట్‌లిఫ్టర్‌గా మీరా చరిత్ర సృష్టించింది.మీరాబాయి సరికొత్త రికార్డుమీరాబాయి స్నాచ్ విభాగంలో తన తొలి ప్రయత్నంలో 82 కేజీలు ఎత్తడంలో విఫలమైంది. కానీ రెండో సారి ఆ బరువును విజయవంతంగా లిఫ్ట్ చేసింది. ఆ తర్వాత తన మూడో ప్రయత్నంలో ఏకంగా 85 కేజీల భారాన్ని ఎత్తి అందరిని ఆశ్చర్యపరిచింది. అనంతరం క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో కూడా తొలి ప్రయత్నంలో విఫలమైంది.రెండో ప్రయత్నంలో 105 కేజీల బరువును అత్యంత సునాయాసంగా ఎత్తి కామన్‌వెల్త్ గేమ్స్‌లో సరికొత్త రికార్డు సాధించింది. 31 ఏళ్ల మీరాబాయి చాను ఓవరాల్‌గా 190 కేజీల భారాన్ని బంగారు పతకాన్న కైవసం చేసుకుంది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో అత్యధిక వెయిట్ లిఫ్ట్ చేసిన మహిళా లిప్టర్‌గా మీరా నిలిచింది.Mirabai Chanu sets a new Commonwealth record, snatching 85 kg / 187 lbs!#Mirabaichanu #commonwealthgames #weightliftingpic.twitter.com/dGykrz997s— Female In Sports (@femalesports_in) July 26, 2026

IND vs ZIM 3rd T20I: India Clean Sweep Series 3-0 as Vaibhav Suryavanshi Shines3
హరారేలో 'వైభవం'.. జింబాబ్వేపై భారత్‌ ఘన విజయం

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 35 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ నామమాత్రపు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది.యువ సంచలనం వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌రో హాఫ్ సెంచ‌రీతో స‌త్తాచాటాడు. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అత‌డితో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(27), రింకూ సింగ్‌(25), ఇషాన్‌ కిషన్‌(29) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఎవాన్స్‌ రెండు, సికిందర్‌ రజా, ముజార్‌బానీ, మాధవీరే తలా వికెట్‌ పడగొట్టారు.బర్ల్ ఒంటరి పోరాటంఅనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగల్గింది. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్‌ బర్ల్‌(54 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో మయాంక్‌ యాదవ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్‌ ఠాకూర్‌ రెండు, అశోక్‌ శర్మ, రవి బిష్ణోయ్‌ తలా వికెట్‌ సాధించారు.చదవండి: IND vs ZIM: అభిషేక్‌ శర్మ చెత్త రికార్డు.. భారత టీ20 క్రికెట్‌ చరిత్రలోనే

Vaibhav Sooryavanshi Creates History With Another Age Defying T20I Milestone4
చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా

జింబాబ్వే పర్యటనలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో వైభవ్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఓ దశలో తొలి అంతర్జాతీయ సెంచరీ చేసేలా కనిపించిన సూర్యవంశీ.. భారీ షాట్‌కు ప్రయత్నించి 81 పరుగుల వద్ద ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ సిరీస్‌లో అతడికి ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఈ చిచ్చర పిడుగు ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఏళ్ల వయస్సు నిండకముందే ఒకటి కంటే ఎక్కువ అర్ధశతకాలు నమోదు చేసిన తొలి ప్లేయర్‌గా వైభవ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.కాగా తొలి టీ20లో వైభవ్ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు సాధించి, టీ20 క్రికెట్‌లో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా నిలిచాడు. అదేవిధంగా ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 86 సిక్సర్లు బాదాడు. ప్రపంచంలో ఏ ఇతర ఆటగాడు కూడా ఈ ఏడాది ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో భారత్ తరఫున అత్యధిక టీ20 సిక్సర్లు (108 సిక్సర్లు - 2025లో) కొట్టిన రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉంది. రాబోయే నెలల్లో వైభవ్ ఈ రికార్డును దాటేసే అవకాశముంది.That was Hugeeeeee by Vaibhav Sooryavanshi 💥🤯🤯😯 pic.twitter.com/Y8pxze9nyg— TheFakeFakeer (@TheFakeFakeer) July 26, 2026

Abhishek Sharma Scripts Worst-Ever Record By An Indian In T20I History5
అభిషేక్‌ శర్మ చెత్త రికార్డు.. భారత టీ20 క్రికెట్‌ చరిత్రలోనే

జింబాబ్వే పర్యటనలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ మాత్రం జట్టు మేనెజ్‌మెంట్‌ను తీవ్ర కలవరపెడుతోంది. హరారే వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లోనూ అభిషేక్ విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. మరోసారి జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజార్‌బానీ బౌలింగ్‌లో అభిషేక్‌ దొరికిపోయాడు. ఈ సిరీస్‌లోని ప్ర‌తీ మ్యాచ్‌లోనూ అత‌డు సింగిల్ డిజిట్ స్కోర్ల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఈ సిరీస్‌లోని 3 ఇన్నింగ్స్‌లలో కలిపి అభిషేక్ చేసింది కేవలం 11 పరుగులు మాత్రమే. దీంతో ఈ ఎస్ఆర్‌హెచ్ స్టార్ బ్యాట‌ర్ ఓ చెత్త రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతి తక్కువ పరుగులు చేసిన భార‌త (టాప్‌-7) బ్యాటర్‌గా అభిషేక్ శర్మ ఘోర రికార్డును మూటగట్టుకున్నాడు.ఇంతకుముందు ఈ చెత్త రికార్డు టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్య‌ర్ పేరిట ఉండేది. 2019లో వెస్టిండీస్‌పై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అయ్య‌ర్ 14 ప‌రుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో అయ్య‌ర్‌ను అభిషేక్ దాటేశాడు.3-మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతి త‌క్కువ‌ పరుగులు చేసిన భారత ఆటగాళ్లు:అభిషేక్ శర్మ – 11 పరుగులు (విత్ జింబాబ్వే, 2026)శ్రేయస్ అయ్యర్ – 14 పరుగులు (వెస్టిండీస్, 2019)హార్దిక్ పాండ్యా – 15 పరుగులు (న్యూజిలాండ్, 2017)కేఎల్ రాహుల్ – 15 పరుగులు (ఇంగ్లాండ్, 2021)దినేష్ కార్తీక్ – 17 పరుగులు (ఆస్ట్రేలియా, 2022)చదవండి: 'వరల్డ్‌కప్‌ గెలవాలంటే అతడిని జట్టులోకి తీసుకోండి'

Vaibhav Suryavanshi hits 50 as India thump Zimbabwe in 3rd T206
అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ.. సెంచరీ చేస్తాడనుకుంటే?

జింబాబ్వే గడ్డపై టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. హరారే వేదికగా జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో సూర్యవంశీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తన శైలికి విరుద్దంగా బ్యాటింగ్ చేసిన వైభవ్‌.. 31 బంతుల్లో తన రెండో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.అర్ధ‌శ‌త‌కం పూర్తి చేసుకున్న త‌ర్వాత వైభవ్ త‌న బ్యాటింగ్‌లో దూకుడు పెంచాడు. దీంతో అత‌డు తొలి అంత‌ర్జాతీయ సెంచ‌రీ సాధిస్తాడ‌ని భావించారు. కానీ స్పిన్న‌ర్ మాధ‌విరే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి ఔట‌య్యాడు.దీంతో అత‌డి ఇన్నింగ్స్‌కు తెర‌ప‌డింది. మొత్తంగా 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. కాగా తొలి టీ20లో వైభవ్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

Commonwealth Games 2026: Indias Rishikanta Singh Bags Silver In Weightlifting Men's 60kg7
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం

గ్లాస్కో వేదిక‌గా జ‌రుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌-2026లో భార‌త్ ఖాతాలో రెండో ప‌త‌కం చేరింది. పురుషల వెయిట్‌లిఫ్టింగ్ 60 కేజీల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ చనంబమ్ రిషికాంత్ సింగ్ రజత పతకం సాధించాడు. ఈ ఈవెంట్‌లో రిషికాంతకు ప్ర‌ధాన పోటీదారుడిగా నిలిచిన‌ మలేషియా అథ్లెట్ అనిక్ కస్దాన్‌కు గోల్డ్‌మెడ‌ల్ ద‌క్కింది.కాగా తొలుత స్నాచ్ విభాగంలో రిషికాంత, అనిక్ కస్దాన్‌లు ఇద్దరూ అత్యధికంగా 121 కేజీల బరువును ఎత్తి ఇద్దరూ అగ్రస్ధానంలో నిలిచారు. క్లీన్ అండ్ జెర్క్‌లో మాత్రం కస్దాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. రిషికాంత తన అత్యుత్తమ ప్రయత్నంలో 143 కేజీలు మాత్రమే ఎత్తగా, కస్దాన్ 152 కేజీల బరువును ఎత్తి అందరిని ఆశ్చర్యపరిచాడు. కస్దాన్ మొత్తం 273 కేజీల (121kg+152kg) బరువు ఎత్తి అగ్రస్ధానంలో నిలవగా.. రిషికాంత మొత్తం 264 కేజీల (121kg+143kg) రెండో స్ధానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన జోషువా అముంగా మబోయా 260 కేజీల మొత్తం స్కోరుతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.

India vs Zimbabwe 3rd T20 live updates and highlights8
మూడో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసిన భారత్‌

India vs Zimbabwe 3rd T20 live updates and highlights: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 35 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగల్గింది. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్‌ బర్ల్‌(54 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో మయాంక్‌ యాదవ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్‌ ఠాకూర్‌ రెండు, అశోక్‌ శర్మ, రవి బిష్ణోయ్‌ తలా వికెట్‌ సాధించారు. అంతకముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. యువ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ(81) మ‌రో హాఫ్ సెంచ‌రీతో స‌త్తాచాటాడు. జింబాబ్వే ఆరో వికెట్‌ డౌన్‌జింబాబ్వే ఆరో వికెట్‌ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన మరుమణి.. అశోక్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.జింబాబ్వే ఐదో వికెట్ డౌన్‌జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన మాధవీరే.. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.స్పీడ్‌ పెంచిన జింబాబ్వే బ్యాటర్లు15 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 4 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో మాధవీరే(28), ర్యాన్‌ బర్ల్‌(40) ఉన్నారు. ఆతిథ్య జట్టు విజయానికి 30 బంతుల్లో 71 పరుగులు కావాలి.జింబాబ్వే నాలుగో వికెట్‌ డౌన్‌జింబాబ్వే నాలుగో వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసిన బెన్‌ కుర్రాన్‌.. బిష్ణోయ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు జింబాబ్వే స్కోర్‌: 77/4జింబాబ్వే మూడో వికెట్‌ డౌన్‌యశ్‌ ఠాకూర్‌ వేసిన నాలుగో ఓవర్‌లో జింబాబ్వే వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. డియాన్‌ మైర్స్‌(19), సికిందర్‌(0) వెంటవెంటనే ఔటయ్యారు. 5 ఓవర్లకు జింబాబ్వే స్కోర్‌: 40/3జింబాబ్వే తొలి వికెట్‌ డౌన్‌193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు భారీ షాక్‌ తగిలింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే మయాంక్‌ యాదవ్‌ బౌలింగ్‌లో బెన్నెట్‌ ఔటయ్యాడుజింబాబ్వే టార్గెట్‌ ఎంతంటే?హ‌రారే వేదిక‌గా జింబాబ్వేతో జ‌రుగుతున్న నామ‌మాత్ర‌పు మూడో టీ20లో భార‌త బ్యాట‌ర్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. యువ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌రో హాఫ్ సెంచ‌రీతో స‌త్తాచాటాడు. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అత‌డితో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(27), రింకూ సింగ్‌(25), ఇషాన్‌ కిషన్‌(29) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఎవాన్స్‌ రెండు, సికిందర్‌ రజా, ముజార్‌బానీ, మాధవీరే తలా వికెట్‌ పడగొట్టారు.భారత్‌ నాలుగో వికెట్‌ డౌన్‌భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 27 పరుగులు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌.. బ్రాడ్‌ ఎవాన్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 172/4వైభవ్‌ అవుట్‌వైభవ్ సూర్యవంశీ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు.ఇషాన్‌ కిషన్‌ అవుట్‌ఇషాన్‌ కిషన్‌ రూపంలో టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 29 పరుగులు చేసిన కిషన్‌.. రజా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.వైభవ్‌ ఫిప్టీవైభవ్‌ సూర్యవంశీ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. వైభవ్‌ 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 95 పరుగలు చేసింది. క్రీజులో వైభవ్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌(29) ఉన్నాడు.దూకుడుగా ఆడుతున్న వైభవ్‌భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ(18 బంతుల్లో 31) దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 60/1అభిషేక్‌ అవుట్‌జింబాబ్వే పర్యటనలో అభిషేక్‌ శర్మ పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. హరారే వేదికగా జరుగుతున్న మూడో టీ20లో 2 పరుగులు చేసి ఔటయ్యాడు.హరారే వేదికగా నామమాత్రపు మూడో టీ20లో భారత్‌-జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ చివరి టీ20లో భారత్‌ మూడు మార్పులతో బరిలోకి దిగింది.ప్రిన్స్‌ యాదవ్‌, శివమ్‌ దూబేల స్ధానంలో అశోక్‌ శర్మ, సూర్యన్ష్ షెడ్గేలు తుది జట్టులోకి వచ్చారు. జింబాబ్వే కూడా ఓ మార్పు చేసింది. రిచర్డ్ నగరావా స్ధానంలో వెల్లింగ్టన్ మసకద్జాకు అవకాశమిచ్చారు.తుది జట్లుజింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్‌), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్‌), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీభారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్‌), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్‌), తిలక్ వర్మ, రింకూ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ

R Ashwin Backs Bhuvneshwar Kumar Over Mohammed Shami For 2027 ODI World Cup9
'వరల్డ్‌కప్‌ గెలవాలంటే అతడిని జట్టులోకి తీసుకోండి'

ద‌క్షిణాఫ్రికా, జింబాబ్వే వేదిక‌ల‌గా జ‌ర‌గ‌నున్న వన్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2026 కోసం టీమిండియా తమ స‌న్న‌హ‌కాల‌ను ప్రారంభించింది. ఈ మెగా టోర్నీ కోసం ప‌టిష్ట‌మైన జ‌ట్టును సిద్దం చేయాల‌ని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో భార‌త దిగ్గ‌జ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ సెల‌క్ట‌ర్ల‌కు కీల‌క సూచ‌న‌లు చేశాడు.వెట‌ర‌న్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఎంపిక చేయాల‌ని అశ్విన్ అభిప్రాయ‌ప‌డ్డాడు. భువనేశ్వ‌ర్ గ‌త నాలుగేళ్లగా జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ రైట్ ఆర్మ్ పేస‌ర్ ప్ర‌స్తుతం ఐపీఎల్‌తో పాటు దేశ‌వాళీ టీ20 క్రికెట్ లీగ్స్‌లో మాత్ర‌మే ఆడుతున్నాడు. అయితే భువీలో ఏ మాత్రం జోరు త‌గ్గ‌లేదు.ఫిట్‌గా ఉండి త‌న స్వింగ్ బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్ధులను ముప్పుతిప్ప‌లు పెడుతున్నాడు. వ‌రుస‌గా రెండు ఐపీఎల్ సీజన్ల‌లోనూ ఆర్సీబీ త‌ర‌పున అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. దీంతో అత‌డిని తిరిగి జ‌ట్టులోకి తీసుకోవాల‌ని చాలా మంది మాజీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అశ్విన్ కూడా భువీ తిరిగి పున‌రాగ‌మ‌నం చేస్తే చూడాల‌ని ఉంద‌ని అన్నాడు."భువనేశ్వ‌ర్ కుమార్ రీఎంట్రీ గురుంచి సెలక్ష‌న్ క‌మిటీ ఆలోచించాలి. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగం అంత ప‌టిష్టంగా లేదు. కాబ‌ట్టి జ‌ట్టుకు భువీ అవ‌స‌ర‌ముంద‌ని అనిపిస్తోంది. అయితే మ‌హ్మ‌ద్ ష‌మీని జ‌ట్టులోకి తీసుకోవాల‌ని కొంత‌మంది స‌ల‌హా ఇస్తున్నారు.కానీ ష‌మీకి, భువీకి ఒక తేడా ఉంది. భువ‌నేశ్వ‌ర్ వ‌రుస‌గా రెండు సీజ‌న్ల పాటు ఐపీఎల్ ఆడిన‌ప్ప‌టికి పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. కానీ ష‌మీ మాత్రం ఫిట్‌నెస్ ప‌రంగా కాస్త ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా భువ‌నేశ్వ‌ర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆర్సీబీ వ‌రుస‌గా రెండు టైటిల్స్ గెల‌వ‌డంలో అత‌డు కీల‌క పాత్ర పోషించాడు. అయితే వెంట‌నే అత‌డిని జ‌ట్టులోకి తీసుకోమని నేను చెప్పడం లేదు. కానీ ఓ అవ‌కాశ‌మిచ్చి ఇచ్చి చూడండి. అక్క‌డ రాణించ‌గలిగితే అత‌డిని జ‌ట్టులో కొన‌సాగించండి. అత‌డు ప‌వ‌ర్‌ప్లేతో పాటు డెత్ ఓవ‌ర్ల‌లో అద్భుతంగా బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. లోయార్డ‌ర్‌లో బ్యాట్‌తో రాణించే స‌త్తా కూడా భువీకి ఉంది" అని అశ్విన్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు.

Jasprit Bumrah Unlikely To Play In India vs Sri Lanka Tests10
IND vs SL: టీమిండియాకు భారీ షాక్‌!

ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో మొదలయ్యే 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జ‌స్ప్రీత్ బుమ్రా గాయం కార‌ణంగా లంక ప‌ర్య‌ట‌న‌కు దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డే సంద‌ర్భంగా బుమ్రా మెకాలి గాయానికి గుర‌య్యాడు.దీంతో లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేకు జస్ప్రీత్ దూరమయ్యాడు. అయితే బుమ్రా ఇంకా తన గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని ప్రముఖ స్పోర్ట్స్‌ రిపోర్టర్ అభిషేక్ త్రిపాఠి వెల్లడించాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడికి జూలై 30 వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించిందంట. ఆ తర్వాత బుమ్రా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) కు చేరుకుని రికవరీ ప్రక్రియను పూర్తి చేయనున్నాడు. అక్కడ వైద్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాతే అతడి ఎంపికపై సెలక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు. ఏదేమైనప్పటికి బుమ్రా పూర్తిగా కోలుకోవడానికి దాదాపు మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే లంకతో టెస్టు సిరీస్‌కు బుమ్రా దూర‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే భార‌త్‌కు భారీ షాక్ అనే చెప్పాలి.ఎందుకంటే లంక‌తో టెస్ట్ సిరీస్ వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ 2025-27 సైకిల్‌లో జ‌రిగింది. ఈ సిరీస్ టీమిండియాకు చాలా కీల‌కం. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ రేసులో ఉండాలంటే భార‌త్ క‌చ్చితంగా గెల‌వాల్సిందే. ఇక ఈ సిరీస్‌కు బుమ్రాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా దూరం కానున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. మ‌రోవైపు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ వాషింగ్ట‌న్ సుంద‌ర్ వేగంగా కోలుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అత‌డు తొలి టెస్ట్‌కు కాక‌పోయిన రెండో టెస్టులోనైన ఆడే అవ‌కాశ‌ముంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement