breaking news
Mohsin Naqvi
-
T20 WC: పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాపై వేటు!
టీ20 ప్రపంచకప్-2026 తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాపై వేటు పడనుందా?.. ఫలితంతో సంబంధం లేకుండా అతడిని తొలగించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సిద్ధమైందా?.. అంటే అందుకు అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఏమాత్రం సంతోషంగా లేరుఈ విషయం గురించి పీసీబీ వర్గాలు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ (Mohsin Naqvi)జట్టు ప్రదర్శన పట్ల ఏమాత్రం సంతోషంగా లేరు. ఈసారి పాకిస్తాన్ మెరుగ్గా ఆడుతుందని సెలక్టర్లు, యాజమాన్యం ఆయనకు హామీ ఇచ్చాయి. కానీ ఫలితాలు మాత్రం అందుకు అనుగుణంగా లేవు.కెప్టెన్ సహా వారిపై వేటుముఖ్యంగా సల్మాన్ ఆఘా, బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్ (Usman Khan)లతో పాటు మరికొంత మంది సీనియర్ ఆటగాళ్లకు ఇదే చివరి వరల్డ్కప్ కానుంది. అంతేకాదు వాళ్ల అంతర్జాతీయ టీ20 కెరీర్ ఇంతటితో ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదేమైనా టీ20 ప్రపంచకప్ తర్వాత పాకిస్తాన్ టీ20 జట్టులో భారీ మార్పులు చూడబోతున్నారు’’ అని పేర్కొన్నాయి.పసికూనలపై గెలిచికాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుండగా.. తటస్థ వేదికైన లంకలో పాక్ మ్యాచ్లు ఆడుతోంది. గ్రూప్-ఎ నుంచి భారత్, నమీబియా, అమెరికా, నెదర్లాండ్స్లతో కలిసి లీగ్ దశలో తలపడ్డ పాక్.. టీమిండియా చేతిలో మాత్రమే ఓడింది. మిగిలిన మూడు మ్యాచ్లలో గెలిచి గ్రూప్-ఎలో టీమిండియా తర్వాతి స్థానాన్ని ఆక్రమించి.. సూపర్-8కు చేరుకుంది.లంకపై భారీ తేడాతో గెలిస్తేనేఅయితే, కీలక సూపర్-8 దశలో న్యూజిలాండ్తో ఆడాల్సిన మ్యాచ్ వర్షార్ఫణం కాగా.. ఇంగ్లండ్ చేతిలో పాక్ ఓడిపోయింది. దీంతో శనివారం నాటి మ్యాచ్లో శ్రీలంకపై తప్పక భారీ విజయం సాధిస్తేనే పాకిస్తాన్ సెమీస్ చేరుకుంటుంది. ఇదిలా ఉంటే.. టోర్నీ ఆసాంతం పాక్ సీనియర్ ఆటగాళ్లు పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. దీంతో వారి కెరీర్ ముగించేలా పీసీబీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.చదవండి: IND vs WI: విండీస్ను ఓడిస్తే సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే? -
T20 WC: ‘పీసీబీ చీఫ్ రెచ్చగొట్టడం వల్లే.. నష్టపోయాము’
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే ప్రపంచకప్ టోర్నీలో ఆడటం ప్రతీ క్రికెటర్ చిరకాల స్వప్నం. ఒక్కసారి వరల్డ్కప్ టోర్నీలో ఆడినా తమ కెరీర్ పరిపూర్ణమైందని భావించే ఆటగాళ్లు ఎందరో ఉంటారు. అయితే, బంగ్లాదేశ్ ప్రభుత్వం మొండిపట్టు కారణంగా ఆ దేశ క్రికెటర్లు ఈసారి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి దూరమయ్యారు.ఇందుకు ప్రధాన కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మాజీ అధికారి సయ్యద్ అష్రాఫుల్ హక్ (Syed Ashraful Haque) ఆరోపించారు. వరల్డ్కప్ నుంచి అవుట్కాగా బంగ్లాదేశ్ గత కొంతకాలంగా భారత్తో కయ్యానికి కాలుదువుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగగా.. ఐపీఎల్ నుంచి బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్ను తొలగించారు.ఈ నేపథ్యంలో భారత్లో తమకు భద్రత లేదని.. వరల్డ్కప్ టోర్నీ ఆడేందుకు అక్కడకు వెళ్లమని బంగ్లాదేశ్ బోర్డు ఐసీసీకి తెలిపింది. మరో వేదికైన శ్రీలంకలో తమ మ్యాచ్లు నిర్వహించాలని కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది. భారత్లో బంగ్లా ఆటగాళ్లకు ముప్పులేదని హామీ ఇచ్చింది. అయినప్పటికీ బంగ్లా పట్టువీడకపోడంతో టోర్నీ నుంచి తప్పించింది.ఈ క్రమంలో బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామని చెప్పిన పీసీబీ.. ఐసీసీ జోక్యంతో యూటర్న్ తీసుకుంది. వరల్డ్కప్లో దాయాదితో ఆడి.. మరోసారి ఓడిపోయింది. ఈ పరిణామాలపై ఆసియా క్రికెట్ మండలి (ACC) మాజీ సీఈవో, బీసీబీ మాజీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అష్రాఫుల్ హక్ స్పందించారు. రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతున్న క్రమంలో ‘బంగ్లాదేశ్ నిర్ణయం వెనుక పాకిస్తాన్ ఉందా?’ అన్న ప్రశ్నకు బదులిస్తూ..నక్వీ రెచ్చగొట్టగానే..‘‘ఇందుకు అవకాశం ఉంది. అయితే, నేను ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడదలచుకోలేదు. ఒక క్రికెట్ అడ్మినిస్ట్రేటర్గా నేను ఎల్లప్పుడు ఆట పట్ల నిబద్ధత కలిగి ఉంటాను. అయితే, మా చీఫ్ అమినుల్ ఇస్లాంకు అనుభవం, ఆలోచన లేకుండా పోయాయి.అందుకే ఏసీసీ ప్రస్తుత అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ మాటలు ఆయనపై ప్రభావం చూపాయి. నక్వీ రెచ్చగొట్టగానే ఇస్లాం అందుకు తగినట్లు స్పందించారు. ఆఖరికి ఎవరు గెలిచారు?ఏదేమైనా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది. క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తొందరపడ్డారు. ముస్తాఫిజుర్ రహమాన్ను ఐపీఎల్ నుంచి తొలగించినంత మాత్రాన ప్రపంచకప్ టోర్నీ నుంచి తప్పుకునేంత పెద్ద నిర్ణయం తీసుకోకూడదు.బీసీసీఐతో ఆయన మాట్లాడాల్సింది. లేదంటే భారత ప్రభుత్వంతో చర్చలకు ప్రయత్నించాల్సింది. ఐసీసీ నిర్వహించే టోర్నీకి భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఒకవేళ మనం కోరితే వారు అదనపు భద్రతా ఏర్పాట్లు చేసే అవకాశం కూడా ఉంటుంది.ఈ విషయాలను అర్థం చేసుకోవడంతో నజ్రుల్ విఫలమయ్యారు. అంతర్జాతీయ క్రికెట్లో ఎలా వ్యవహరించాలో ఆయనకు తెలియకుండా పోయింది. ఎవరో (నక్వీ) పన్నిన వ్యూహంలో ఆయన చిక్కుకున్నారు. జాతికి గొప్ప ఆస్తులైన క్రికెటర్లను కాపాడాల్సింది పోయి.. ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచనలో ఉండిపోయారు.నష్టపోయాములిటన్ దాస్, ముస్తాఫిజుర్, నజ్ముల్ షాంటో మూడు పదుల వయసు దాటేశారు. సీనియర్లు ఇలా వరల్డ్కప్ ఆడే అవకాశం పోగొట్టుకోవడం అన్యాయం. భారత్ తర్వాత బంగ్లాదేశ్లోనే క్రికెట్కు ఆదరణ ఎక్కువ. వరల్డ్కప్ నుంచి తప్పుకోవాలనే నిర్ణయంతో అభిమానులను కూడా మోసం చేశారు’’ అని అష్రాఫుల్ పేర్కొన్నారు. నక్వీ రెచ్చగొట్టడం వల్లే నజ్రుల్ అలా వ్యవహరించారని.. ఫలితంగా తమ ఆటగాళ్లు, అభిమానులు నష్టపోయారని విమర్శించారు.చదవండి: పాకిస్తాన్ క్రికెటర్లకు భారీ షాక్! -
‘ఇమ్రాన్ హత్యకు ఆర్మీచీఫ్తో కలిసి పీసీబీ ఛైర్మన్ కుట్ర’
ఇమ్రాన్ హత్యకు పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కుట్రలు చేస్తున్నారంటూ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇమ్రాన్ను హత్య చేసేందుకు ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్తో కలిసి కుట్రపన్నినట్లు డాక్టర్ ఉజ్మా ఖాన్, అలీమాఖాన్ ఆరోపించారు. తమకు కూడా ప్రాణ హానీ ఉందని.. హత్య చేసేందుకు కుట్రలు పన్నినట్లు వారు వెల్లడించారు. ఇటీవల జైలులో ఇమ్రాన్ను కలిసినప్పుడు, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయనే స్వయంగా తమకు చెప్పారని వారు పేర్కొన్నారు."వీరు నన్ను చంపేస్తారు.. నన్ను అంతమొందించేందుకు వారు పక్కా ప్లాన్ వేశారు" అని ఇమ్రాన్ తనతో అన్నారని ఉజ్మా ఖాన్ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అలీమా ఖాన్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ కంటి చూపు మందగిస్తోందని, అయినప్పటికీ ఆయనకు సరైన చికిత్స చేయనీయడం లేదని విమర్శించారు. "మొహ్సిన్ నఖ్వీ మమ్మల్ని బెదిరిస్తున్నారు. వారికి రక్తం రుచి మరిగింది. ఇమ్రాన్ ఖాన్కు గానీ, మాకు గానీ ఏమైనా జరిగితే.. ఎవరి భవిష్యత్తు తరాలను కూడా మేము వదిలిపెట్టం’’ అలీమా ఖాన్ హెచ్చరించారు.తమ వ్యక్తిగత వైద్యులైన డాక్టర్ ఆసిమ్, డాక్టర్ ఫైసల్తో పరీక్షలు చేయించాలని కోరగా ప్రభుత్వం తిరస్కరించిందని వారు తెలిపారు. కుటుంబం తరపున తమ బంధువు నౌషెర్వాన్ బుర్కీ పేరును సూచించినా అధికారులు అంగీకరించలేదంటూ వారు మండిపడ్డారు. కాగా, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినట్లు సమాచారం. ఇమ్రాన్ ఖాన్కు టీమిండియా దిగ్గజాలు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్ పట్ల పాక్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఇటీవల విజ్ఞప్తి చేశారు. అనారోగ్య సమస్యలతో సతమవుతువుతున్న ఇమ్రాన్ఖాన్ కంటి చూపు సన్నగిల్లుతున్నట్లు కోర్టు నియమించిన న్యాయవాది సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ తన కుడి కంటిలో 85 శాతం చూపు కోల్పోయి, ప్రస్తుతం కేవలం 15 శాతం మాత్రమే మిగిలి ఉందని వైద్య నివేదికలు వెల్లడించిన విషయాన్ని సదరు లాయర్ పేర్కొన్నారు. -
T20 WC: పాక్ మరో ‘యూటర్న్’!.. ఈసారి ఎవరంటే?
టీ20 ప్రపంచకప్-2026 నేపథ్యంలో పాకిస్తాన్ వరుస ‘యూటర్న్’లతో వార్తల్లో నిలుస్తోంది. బంగ్లాదేశ్కు మద్దతుగా తాము టోర్నీనే బహిష్కరిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తొలుత సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే.మాట మార్చడమే పనిఆ తర్వాత మొదటికే మోసం వస్తుందని భావించి.. కేవలం టీమిండియాతో మ్యాచ్ మాత్రమే బాయ్కాట్ చేస్తామని ఏకంగా పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ప్రకటన చేశారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) రంగంలోకి దిగడంతో ఈ విషయంలోనూ పాక్ మాట మార్చింది.ఐసీసీతో పాటు పాక్ భద్రతా కారణాల గురించి మాట్లాడటంతో శ్రీలంక సైతం తమపై గతంలో పాక్లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రస్తావిస్తూ లేఖ రాసింది. యూఏఈ కూడా పాకిస్తాన్ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరింది. ఆఖరికి బంగ్లాదేశ్ సైతం భారత్తో మ్యాచ్ ఆడాలని పాకిస్తాన్కు విజ్ఞప్తి చేసింది.ఈ నేపథ్యంలో ఐసీసీతో పాటు శ్రీలంక, యూఏఈ, బంగ్లాదేశ్ ఒత్తిళ్ల కారణంగా టీమిండియాతో మ్యాచ్ ఆడతామంటూ పాక్ అతి పెద్ద యూటర్న్ తీసుకుంది. అన్నట్లుగానే కొలంబో వేదికగా పటిష్ట భారత్తో తలపడ్డ పాకిస్తాన్ 61 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.నాలుక మడతేసిన అక్తర్ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పీసీబీ చైర్మన్ , మంత్రి మొహ్సిన్ నక్వీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసమర్థ వ్యక్తులను అందలం ఎక్కిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ మండిపడ్డాడు. సీనియర్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిది, షాదాబ్ ఖాన్ వరుసగా విఫలమవుతున్నా.. ఎందుకు ఆడిస్తున్నారని ప్రశ్నించాడు.ఆట పట్ల అవగాహన లేని వ్యక్తి చైర్మన్ అయితే ఇలాగే ఉంటుందంటూ నక్వీని ఉద్దేశించి అక్తర్ వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్ వైరల్ కాగా అక్తర్పై విమర్శలు వచ్చాయి. దీంతో అతడు కూడా యూటర్న్ తీసుకున్నాడు. తాను నక్వీ భాయ్ను ఉద్దేశించి.. ‘‘చదువులేని వాడు, అసమర్థుడు’’ అని అనలేదంటూ మాట మార్చాడు.‘‘నేను నక్వీ భాయ్ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఆయనను అగౌరవపరచాలనే ఉద్దేశమే నాకు లేదు. అంతర్జాతీయ స్థాయిలో పాక్ క్రికెట్ దిగజారుతున్న తీరుపైనే నేను ఆవేదన వ్యక్తం చేశాను.నక్వీ భాయ్ మంచి వ్యక్తిఅసమర్థులైన వ్యక్తులు వ్యవస్థను నాశనం చేస్తారు అని మాత్రమే అన్నాను. అయితే, అది నక్వీ భాయ్ను ఉద్దేశించి మాత్రం కాదు. కానీ నా వ్యాఖ్యలను వక్రీకరించారు. అదే కార్యక్రమంలో నేను నక్వీ భాయ్ మంచి వ్యక్తి అని చెప్పాను. కానీ ఆ మాటలను ప్రసారం చేయలేదు.అయితే, ఒక విషయంలో మాత్రం నక్వీ భాయ్పై నాకు నిజంగానే కోపం వచ్చింది. టీమిండియాతో ఆడమని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ మాట మీద నిలబడలేదు. మేమంతా ఆయనతోనే ఉన్నాం. మీకసలు సిగ్గుందా?అయినా సరే యూటర్న్ తీసుకోవడం నచ్చలేదు. ఈ విషయంలో పునరాలోచన చేసే ముందు నన్ను సంప్పదించాల్సింది’’ అని అక్తర్ తాను కూడా మాట మార్చేశాడు. ఈ నేపథ్యంలో ‘‘యూటర్న్ల మీద యూటర్న్లు.. మీకసలు సిగ్గుందా?’’ అంటూ నెటిజన్లు పీసీబీ, అక్తర్కు చివాట్లు పెడుతున్నారు.చదవండి: గంభీర్కు గోల్డెన్ ఆఫర్!.. హెడ్కోచ్ పదవికి గుడ్బై? -
భారత్ చేతిలో ఘోర ఓటమి.. అర్ధరాత్రి పాక్ కీలక నిర్ణయాలు
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ చేతిలో ఘోర ఓటమి ఎదురైన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. నిన్న (ఫిబ్రవరి 15) మ్యాచ్ ముగిసిన వెంటనే పీసీబీ అర్దరాత్రి వేల అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ఇద్దరు స్టార్ ఆటగాళ్లపై వేటు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ స్టార్ ఆటగాళ్ల పేర్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది అని తెలుస్తుంది.వీరిద్దరిని తక్షణమే జట్టు నుంచి తప్పించాలని కొలొంబోలో ఉన్న దేశ ప్రతినిధులకు పీసీబీ అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. పాక్ తదుపరి ఆడబోయే నమీబియా మ్యాచ్లో బాబర్, అఫ్రిది స్థానాల్లో సల్మాన్ మీర్జా, నసీం షా, ఫకర్ జమాన్, ఖ్వాజా నఫాయ్ పేర్లు పరిశీలించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది.భారత్ మ్యాచ్లో జట్టు ప్రదర్శనపై పాక్ ప్రభుత్వం సైతం ఆగ్రహంగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. స్టార్ ఆటగాళ్లను తప్పించే విషయంలో పీసీబీ కంటే పాక్ ప్రభుత్వ జోక్యమే అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. భారత్ చేతిలో తాజా పరాభవం తర్వాత పాక్ ప్రభుత్వంపై కూడా ఆ దేశ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారట. ముందుగా భారత్తో మ్యాచ్ ఆడమని ప్రకటించడమెందుకు, ఆతర్వాత తిరిగి ఆడటమెందుకని దుమ్మెత్తిపోస్తున్నారట. దేశ ప్రజల నుంచి ఒత్తిడి అధికం కావడంతో బాబర్, అఫ్రిది సహా మరికొంత మంది ఆటగాళ్లపై వేటు వేయాలని పాక్ ప్రభుత్వం పీసీబీకి సిఫార్సు చేసినట్లు వినికిడి.పాక్ ప్రజలు పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నట్లు తెలుస్తుంది. టీమిండియా విషయంలో నఖ్వీ మొదటి నుంచి ఓవరాక్షన్ చేస్తున్నాడని మెజార్జీ పాక్ క్రికెట్ అభిమానులు అనుకుంటున్నట్లు సమాచారం. నఖ్వీని పీసీబీ అధ్యక్ష హోదాతో పాటు మంతివర్గం నుంచి కూడా బహిష్కరించాలని పాక్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయట. నఖ్వీ భారత్ చేతిలో ఓటమి తర్వాత తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు పలువురు పాక్ ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ మైక్ హెస్సన్ను కూడా పరుష పదజాలంతో మందలించాడని తెలుస్తుంది.కాగా, భారత్తో మ్యాచ్లో పాక్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమై 61 పరుగుల తేడాతో చిత్తైంది. ఈ టోర్నీలో నెదర్లాండ్స్, యూఎస్ఏపై అతికష్టం మీద గెలిచిన పాక్.. గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో యూఎస్ఏ తర్వాత మూడో స్థానంలో ఉంది. ఫిబ్రవరి 18న నమీబియాతో మ్యాచ్ ఆటుఇటైతే పాక్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది. అదే జరిగితే భారత్తో పాటు యూఎస్ఏ సూపర్-8కు చేరుకుంటుంది. -
పనికిరాని వ్యక్తిని నమ్ముకుంటే ఇంతే: అక్తర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నక్వీ తీరుపై ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. అసమర్థులైన వ్యక్తులను అందలం ఎక్కిస్తే ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆట పట్ల కనీస అవగాహన లేని వ్యక్తిని చైర్మన్ చేయడం అన్నిటికంటే పెద్ద నేరం అంటూ ఘాటు విమర్శలు చేశాడు.61 పరుగుల తేడాతో చిత్తుకాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత కొంతకాలంగా మిశ్రమ ఫలితాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2026లో పసికూనలు నెదర్లాండ్స్, అమెరికాలపై గెలిచిన సల్మాన్ ఆఘా బృందం.. టీమిండియా ముందు మరోసారి తలవంచింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో 61 పరుగుల తేడాతో చిత్తు ఓడిపోయింది.ఫలితంగా తదుపరి నమీబియాపై భారీ విజయం సాధిస్తేనే సూపర్-8 అవకాశాలను పాక్ సజీవం చేసుకోగలదు. ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ పీసీబీ చైర్మన్, మంత్రి మొహ్సిన్ నక్వీ (Mohsing Naqvi) విధానాలను ఘాటుగా విమర్శించాడు.పనికిరాని వ్యక్తులు.. వీరిని నమ్ముకుంటే ఇంతే‘‘షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi) గంటకు 125 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. ఆధునిక క్రికెట్లో ఇలాంటి చెత్త టాలెంట్ అవసరం లేదు. ఇక ఇంకో ప్లేయర్ (బాబర్ ఆజం)ను సూపర్ స్టార్ చేస్తారు. కానీ అతడు మీకోసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేడు.ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆయనకు అసలు తాను పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ని అన్న విషయం గుర్తుందో లేదో కూడా తెలియదు. అలాంటి పనికిరాని వ్యక్తులు జట్టును ఎలా రన్ చేయగలరు? ఈ ప్రపంచంలో అసమర్థ వ్యక్తిని అందలం ఎక్కించడమే అన్నిటికంటే పెద్ద నేరం. అర్హత లేని వాళ్లకు అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది.ఆయనొక అసమర్థుడు.. ఆట పట్ల ఏమాత్రం అవగాహన లేని వాడు. గత 15-20 ఏళ్లుగా పాక్ క్రికెట్ను ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదు. టీమిండియాను ఓడించడం మనకు ఓ కలగానే మిగిపోయింది’’ అని అక్తర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.గతేడాది అలాఅదే విధంగా.. సీనియర్లు బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిది, షాదాబ్ ఖాన్ వరుసగా విఫలమవుతున్నా అవకాశాలు ఇవ్వడం ఏమిటని అక్తర్ ప్రశ్నించాడు. కాగా పాక్పై గెలుపుతో హ్యాట్రిక్ విజయం అందుకున్న టీమిండియా సూపర్-8కు చేరగా.. పాక్ రాత తదుపరి మ్యాచ్ ఫలితంతో తేలుతుంది. కాగా గత వరల్డ్కప్ ఎడిషన్లో పాకిస్తాన్ సూపర్-8 కూడా చేరకుండానే గ్రూప్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.చదవండి: నీకసలు బుద్ధి ఉందా?.. కుల్దీప్ యాదవ్పై హార్దిక్, సూర్య ఫైర్"THEY CANNOT PLAY HIM!" 🔥Jasprit Bumrah gets Saim Ayub & Salman Agha out in the same over! Pakistan are 3 down 🥶ICC Men’s #T20WorldCup | #INDvPAK | LIVE NOW 👉https://t.co/SpqYo6n3dL pic.twitter.com/2mVlsnJBqI— Star Sports (@StarSportsIndia) February 15, 2026 -
పాక్ కోసం బంగ్లాను ఒప్పించారా?: నీళ్లు నమిలిన పీసీబీ చీఫ్
ఊహాగానాలే నిజమయ్యాయి. టీమిండియాతో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయాన్ని పాకిస్తాన్ మార్చుకుంది. క్రికెట్ స్ఫూర్తిని కొనసాగించే ఉద్దేశంతో తమ జట్టు భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది.యూటర్న్ వెనుక గల కారణాలు?ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీ సోమవారం ధ్రువీకరించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ మీడియా సమావేశం సందర్భంగా నక్వీ ‘బాయ్కాట్’ నిర్ణయాన్ని తాము వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఓ రిపోర్టర్.. యూటర్న్ వెనుక గల కారణాలు, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)తో చర్చల వల్ల పాక్కు ప్రయోజనం చేకూరిందా? అని అడిగాడు.శుభవార్తలే అందిస్తాంఇందుకు బదులుగా.. ‘‘కొన్ని నిమిషాల ముందే మా నిర్ణయం మార్చుకున్నాం’’ అని నక్వీ సమాధానమిచ్చాడు. మరి అయితే శుభవార్త ఉందా? అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. ‘‘మేము ఎల్లప్పుడూ శుభవార్తలే అందిస్తాం కదా!.. బంగ్లాదేశ్ ఈ విషయంలో ఏం చెప్పిందో అందరూ చూశారు కదాపాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడాలని బంగ్లాదేశ్ అభ్యర్థించింది. వాళ్ల సమస్యలు తొలగిపోయాయి. అందుకే వాళ్లు మమ్మల్ని భారత్తో మ్యాచ్ ఆడమని చెప్పారు’’ అని నక్వీ పేర్కొన్నాడు.మన కోసం ఏమీ అడగలేదా?అయితే, మన (పాకిస్తాన్) సొంత ప్రయోజనాల కోసం వారు ఈ విషయంలో అంగీకరించేలా చేశామా? అని రిపోర్టర్ అడుగగా.. ‘‘కేవలం బంగ్లాదేశ్కు మద్దతుగా మాత్రమే మనం నిలబడ్డాం. ఇది వాళ్ల సొంత విషయం. మనకోసం మనం ఏమీ అడగలేదు’’ అని నక్వీ నీళ్లు నమిలాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. భారత్లో తమకు భద్రత లేదంటూ ఆరోపించిన బంగ్లాదేశ్.. తమ వేదికను కూడా లంకకు మార్చాలని ఐసీసీని కోరింది.అయితే, బంగ్లాదేశ్ చెప్పినదాంట్లో నిజం లేదని తేల్చిన ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. నిర్ణయం మార్చుకోవాల్సిందిగా గడువు ఇచ్చింది. కానీ బంగ్లా పట్టువీడలేదు. దీంతో ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించింది ఐసీసీ.పాకిస్తాన్ జోక్యం..ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటూ తొలుత తాము బంగ్లాకు మద్దతుగా టోర్నీని బహిష్కరిస్తామని లీకులు ఇచ్చి.. ఆ తర్వాత కేవలం భారత్తో మాత్రమే మ్యాచ్ ఆడమని మాట మార్చింది. ఒకవేళ భారత్- పాక్ మ్యాచ్ రద్దయితే ఐసీసీతో పాటు సభ్య దేశాలన్నీ ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది.రంగంలోకి లంక బోర్డుఈ క్రమంలో శ్రీలంక బోర్డు సైతం పాక్ నిర్ణయం పట్ల ఘాటుగా స్పందించింది. గతంలో పాక్ పర్యటనలో తమపై ఉగ్రదాడి జరిగినా.. ఇంకా ఆ దేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ తమ జట్టు అక్కడ పర్యటించేలా చేస్తున్నామని పేర్కొంది. కానీ ఇప్పుడు తమ దేశంలో భారత్తో ఆడే మ్యాచ్ను పాక్ బహిష్కరిస్తే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినందున భారీగా నష్టపోవాల్సి ఉంటుందని పాక్కు లేఖ రాసింది.బంగ్లాకు రిలీఫ్యూఏఈ సైతం ఇదే తరహాలో పీసీబీకి లేఖ రాయగా.. బంగ్లాదేశ్ సైతం భారత్తో మ్యాచ్ ఆడాలని కోరింది. ఈ నేపథ్యంలో ఐసీసీ బృందం లాహోర్ వెళ్లి పీసీబీ చైర్మన్తో చర్చించగా.. బంగ్లాదేశ్కు ఊరట లభించింది. టోర్నీ నుంచి తప్పుకొన్నందుకు ఎలాంటి ఆంక్షలు ఉండవని ఐసీసీ పేర్కొంది.ఇదిలా ఉంటే.. పాక్ బంగ్లాదేశ్ను అడ్డుపెట్టుకుని భారత్తో ద్వైపాక్షిక సిరీస్ల పునరుద్ధరణ, తమ ఆటగాళ్లతో భారత జట్టు కరచాలనం చేయడం.. తదితర షరతులు పెట్టినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఐసీసీ ఇందుకు నిరాకరించి కేవలం బంగ్లా విషయంలో మాత్రమే సానుకూలంగా స్పందించిందని తెలిసింది. ఈ విషయం నెట్టింట వైరల్గా మారగా.. నక్వీ తమ కోసం ఐసీసీని ఏమీ అడగలేదని ప్రత్యేకంగా నొక్కివక్కాణించడం గమనార్హం. కాగా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్- పాక్ తలపడటం ఖాయమైంది.చదవండి: Bangladesh Cricket: ఐసీసీ మీటింగ్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్కి ఉపశమనంMohsin Naqvi Statement on India Vs Pakistan match #PAKvIND #Pakistan pic.twitter.com/Mm523Uldb3— Ravish Bisht (@ravishbofficial) February 9, 2026 -
IND vs PAK: పాకిస్తాన్ యూటర్న్?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. బంగ్లాదేశ్కు అనుకూలంగా ఓటు వేసి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్ణయాన్ని వ్యతిరేకించిన పీసీబీ.. భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామంటూ నాటకానికి తెరతీసింది. ఈ విషయం గురించి పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ స్వయంగా ప్రకటించడం గమనార్హం.టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, ముందుగా ఐసీసీ కుదిర్చిన ఒప్పందం ప్రకారం.. పాక్ కోసం తటస్థ వేదికను ఏర్పాటు చేశారు. పాక్ తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలో ఆడేలా షెడ్యూల్ ఖరారైంది.భారత్- బంగ్లా.. మధ్యలో పాక్అయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు భారత్లో రక్షణ ఉండదని.. అందుకే తమ వేదికను కూడా లంకకు మార్చాలంటూ బంగ్లా బోర్డు ఐసీసీని కోరింది. బంగ్లా వాదనలో నిజం లేదని తేల్చిన ఐసీసీ ఇందుకు నిరాకరించింది. అయినా సరే బంగ్లాదేశ్ పంతం వీడలేదు. ఫలితంగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ను తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది ఐసీసీ.భారత్తో మాత్రమే ఆడమంటూఈ నేపథ్యంలో బంగ్లాదేశ్కు అన్యాయం జరిగిందని.. లంకలో భారత్తో మ్యాచ్కు తమకు భద్రత ఉండదంటూ పాక్.. టీమిండియాతో మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. లీగ్ దశలో మిగతా మ్యాచ్లకు లేని ఇబ్బంది భారత్తో మాత్రమే ఉందని చెప్పడం పాక్ ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. అంతేకాదు.. ఒకవేళ భారత్- పాక్ మ్యాచ్ నిజంగానే ఆగిపోతే ఐసీసీతో పాటు సభ్య బోర్డులన్నింటికీ పెద్ద ఎత్తున నష్టం వస్తుంది.ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్తాన్కు లేఖ రాసింది. గతంలో పాక్లో తమ జట్టుపై ఉగ్రదాడి జరిగినా.. తిరిగి ఆ దేశంలో పర్యటించిన తొలి జట్టుగా నిలిచామని గుర్తు చేసింది. ఇటీవల కూడా బాంబుల మోతతో దద్దరిల్లిన వేళ పాక్లో పర్యటించి పరిమిత ఓవర్ల సిరీస్ పూర్తి చేశామని సుతిమెత్తగానే చురకలు అంటించింది.ఉగ్రదాడిని గుర్తుచేస్తూఅలాంటిది.. భారత్- పాక్ మ్యాచ్కు తాము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక.. అకస్మాత్తుగా మ్యాచ్ను బహిష్కరిస్తే.. ఆర్థికంగా భారీ నష్టం వస్తుందని.. ఈ అంశంలో పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇలా పాత విషయాలు ముఖ్యంగా ఉగ్రదాడిని గుర్తుచేస్తూ లంక బోర్డు రాసిన లేఖ పాక్ను ఇరకాటంలో పడేసినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బోర్డు చైర్మన్, పాక్ మంత్రి మొహ్సిన్ నక్వీ భారత్తో మ్యాచ్ ఆడే విషయమై పునరాలోచన చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సమాచారం. ఈ విషయం గురించి పీసీబీ సన్నిహిత వర్గాలు జాతీయ మీడియాతో మాట్లాడుతూ..గతంలో సాయం చేశాము కదా!‘‘శ్రీలంక ప్రభుత్వం, క్రికెట్ బోర్డుతో పాకిస్తాన్ ఎల్లప్పుడూ సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. అందుకు తగిన ఫలాలు పొందింది. కాబట్టి లంక బోర్డు నుంచి వచ్చిన లేఖను పాక్ నిర్లక్ష్యం చేయలేదు.లంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా.. మొహ్సిన్ నక్వీని నేరుగా సంప్రదించి.. పాక్ తమకు సాయపడాల్సిందిగా కోరారు. భారత్- పాక్ మ్యాచ్ల వల్ల వచ్చే అదనపు ఆదాయానికి గండికొట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తాము పాక్ బోర్డుకు సహాయపడిన విషయాన్ని గుర్తు చేశారు.నక్వీ ఈ విషయం గురించి తప్పక ప్రధాని దృష్టికి తీసుకువెళ్తారు. శ్రీలంక బోర్డు మాత్రమే కాదు.. శ్రీలంక ప్రభుత్వం కూడా గతేడాది నవంబరులో ఆటగాళ్లు మధ్యలోనే వెళ్లిపోకుండా ఒప్పించి.. పాక్తో ద్వైపాక్షిక సిరీస్ పూర్తి చేసేలా ఒప్పించారు’’ అని పేర్కొన్నాయి.కఠిన చర్యలు తప్పవుఇదిలా ఉంటే.. పాక్ అన్నంత పనిచేస్తే ఐసీసీ కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఐసీసీతో పాటు బ్రాడ్కాస్టర్లు, ఇతర సభ్య దేశాలు పెద్ద ఎత్తున నష్టపోయే క్రమంలో పీసీబీని ఆ పరిహారం చెల్లించాలని కోరే అవకాశాలు లేకపోలేదు. పరిస్థితి చేయిదాటితే ఇంకాస్త కఠినంగా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. కాగా ఫిబ్రవరి 15న భారత్- పాకిస్తాన్ మధ్య వరల్డ్కప్ మ్యాచ్ జరగాల్సి ఉంది.చదవండి: పసికూనను ఓడించేందుకు కష్టపడ్డ పాకిస్తాన్ -
భారత్తో జరగాల్సిన మ్యాచ్కు జట్టును ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు
క్రికెట్ అభిమానులను ఇది కన్ఫ్యూజ్ చేసే వార్త. ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. అదేంటి.. ఆ రోజు భారత్తో జరగాల్సిన మ్యాచ్ను పాక్ ప్రభుత్వం రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది కాదా అనుకుంటున్నారా..? అవును ఇది నిజమే. అంతకుముందు వార్త కూడా నిజమే.వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 15న భారత్-పాక్ మధ్య రెండు మ్యాచ్లు జరగాల్సి ఉన్నాయి. పాక్ ప్రభుత్వం పురుషుల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా జరగాల్సిన మ్యాచ్ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. మరో మ్యాచ్ మహిళల ఏసీసీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా జరగాల్సి ఉంది.ఈ మ్యాచ్కు పాక్ ప్రభుత్వం నుంచి కాని, ఆ దేశ క్రికెట్ బోర్డు నుంచి కాని ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఈ మ్యాచ్తో పాటు టోర్నీ మొత్తం కోసమే పీసీబీ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా ఉమ్మె-హాని ఎంపికైంది.ఈ జట్టులో ఎమాన్ నసీర్, గుల్ రుఖ్, హఫ్సా ఖలీద్, హురైనా సజ్జాద్, షావాల్ జుల్ఫికార్ కీలక బ్యాటర్లు. వికెట్ కీపర్లుగా కోమల్ ఖాన్, యుస్రా ఆమిర్ ఎంపికయ్యారు. ఆల్రౌండర్లుగా నూరీన్ యాకూబ్, ఉమ్మె-హాని ఉన్నారు. బౌలింగ్ విభాగంలో అనోషా నసీర్, లుబ్నా బెహ్రామ్, నేహా షర్మిన్ నదీమ్ , సయిదా మసూమా జాఫ్రీ , వహీదా అఖ్తర్ ఆ జట్టు బలంగా ఉంది. రిజర్వ్ ప్లేయర్లుగా జునాష్ అబ్దుల్ సత్తార్, మహమ్ అనీస్, అంబర్ కైనాత్, ఆయేషా బిలాల్ ఎంపికయ్యారు.ఈ టోర్నీలో పాక్ షెడ్యూల్ ఇలా ఉంది. ఫిబ్రవరి 13 – పాకిస్తాన్ ‘A’ vs నేపాల్ (ఉదయం 9.30) ఫిబ్రవరి 15 – పాకిస్తాన్ ‘A’ vs ఇండియా ‘A’ (మధ్యాహ్నం 2.00) ఫిబ్రవరి 17 – పాకిస్తాన్ ‘A’ vs UAE (మధ్యాహ్నం 2.00) అన్ని మ్యాచ్లు బ్యాంకాక్లో జరగనున్నాయి. ఇదిలా ఉంటే, ఈ టోర్నీలో భారత ఏ జట్టు కూడా ఫిబ్రవరి 13నే తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్లాండ్ గ్రూప్-బిలో ఉండగా.. పాక్, భారత్, యూఏఈ, నేపాల్ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. గ్రూప్ దశలో భారత్ ఫిబ్రవరి 13న యూఏఈతో, 15న పాకిస్తాన్తో, 17న నేపాల్తో మ్యాచ్లు ఆడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా ఆల్రౌండర్ రాధా యాదవ్ వ్యవహరించనుంది. -
'ఫోర్స్ మజ్యూర్' క్లాజ్ను చూసుకొని ధీమాగా ఉన్న పాక్
టీ20 వరల్డ్కప్ 2026లో భారత్–పాకిస్తాన్ పోరు చుట్టూ పెద్ద వివాదం నడుస్తుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్ను పాకిస్తాన్ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ వివాదం మొదలైంది. పాక్ ముందస్తు వ్యూహాల్లో భాగంగానే ఈ బాయ్కాట్ డ్రామాకు తెరలేపింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు ఆడేందుకు భారత్ పాక్కు రాలేదని, అందుకు ప్రతిగా చివరి నిమిషంలో ఈ బాయ్కాట్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీని వల్ల బీసీసీఐ, ఐసీసీకి నష్టం చేకూర్చాలన్నదే పాక్ ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ తాము కూడా నష్టపోతామని తెలిసినా పాక్ ఈ సాహసానికి పూనుకుంది. ఇందుకు కారణం ఫోర్స్ మజ్యూర్ క్లాజ్.ఏంటా ఫోర్స్ మజ్యూర్ క్లాజ్..? ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ (Force Majeure Clause) అనేది ఒప్పందాల్లో ఉండే ఓ నిబంధన. ఈ నిబంధన అనుకోని మరియు నియంత్రణలో లేని పరిస్థితులు ఏర్పడితే, సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందే అవకాశం ఇస్తుంది. ఉదాహరణకు సహజ విపత్తులు, యుద్ధం, మహమ్మారి లేదా ప్రభుత్వ నిషేధాలు వంటి పరిస్థితులు ఏర్పడితే, ఈ ఒప్పందాన్ని అమలు చేయడం అసాధ్యం అవుతుంది. అప్పుడు సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందుతుంది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకొనే పాక్ భారత్తో వరల్డ్కప్ మ్యాచ్ రద్దు విషయంలో డ్రామాలాడుతుంది. దీన్ని అడ్డుపెట్టుకొనే ప్రపంచం ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ క్లాజ్ తమను చట్టపరంగా కాపాడుతుందని భావిస్తుంది. అయితే ఇక్కడే పాక్ ఓ సున్నితమైన విషయాన్ని విస్మరిస్తుంది. ప్రపంచకప్ మొత్తం ఆడి, భారత్తో గ్రూప్ స్టేజీ మాత్రమే బహిష్కరిస్తామని స్పష్టం చేసి, పప్పులో కాలేసింది. ఇలా ఒక్క మ్యాచ్ను మాత్రమే బాయ్కాట్ చేస్తామనేది ఐసీసీ-పాక్ క్రికెట్ బోర్డు చేసుకున్న ఒప్పందాలకు విరుద్దం.ఒప్పందాల్లో పాక్ భారత్తో తటస్థ వేదికలపై ఆడేందుకు ఒప్పుకుంది. ఇప్పుడు ఒక్క మ్యాచ్ను మాత్రమే బహిష్కరిస్తామనేది ఒప్పందాలకు విరుద్ధం. ఇక్కడ పీసీబీ ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ను చూపించి తప్పించుకోవచ్చని ధీమాగా ఉంది. అయితే ఐసీసీ-పీసీబీ మధ్య జరిగిన ముందస్తు ఒప్పందంలో ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ లేదని ఐసీసీ వర్గాలు అంటున్నాయి. పాక్ జట్టు మొత్తం టోర్నమెంట్ ఆడుతోంది. కేవలం భారత్తో మ్యాచ్ను మాత్రమే బహిష్కరిస్తోంది. ఇది అసాధ్యత కాదు, ఎంచుకున్న అసౌకర్యం. ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ selective participationకి వర్తించదని ఐసీసీ స్పష్టం చేయడంలో పాక్ వర్గాల్లో భయం మొదలైంది. భారత్తో మ్యాచ్ జరగడానికి ఇంకా చాలా సమయం ఉన్నందుకు రద్దు అంశాన్ని రద్దు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయాన్ని పీసీబీ ఐసీసీకి ఇంకా లిఖితపూర్వకంగా తెలియజేయలేదు కాబట్టి రద్దుపై పాక్ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. లేదు ఇలాగే ముందుకెళ్దాం అని పాక్ భావిస్తే మాత్రం తిప్పలు తప్పవు. ఆ జట్టు చరిత్రలో కనీవినీ ఎరుగని భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సొంత ప్రజల్నే ఫూల్స్ చేసిన పీసీబీ అధ్యక్షుడు నఖ్వీ
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొనడం ఖరారైంది. మొహిసిన్ నఖ్వీ నేతృత్వంలోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రపంచకప్లో పాల్గొనే తమ జట్టు కోసం కొలొంబోకు (పాక్ తమ ప్రపంచకప్ మ్యాచ్లు ఇక్కడే ఆడుతుంది) విమానం టికెట్లు బుక్ చేసిందని నివేదికలు చెబుతున్నాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచకప్లో పాల్గొనేందుకు అన్నీ సిద్దం చేసుకొని పాక్ డ్రామాలు ఆడుతుంది.ప్రపంచకప్లో పాల్గొనే అంశంపై తమ ప్రధాని ఫిబ్రవరి 2ను డెడ్లైన్గా విధించాడని మొహిసిన్ సొంత ప్రజల్నే ఫూల్స్ చేశాడు. పైకి డ్రామాలు ఆడుతూ, లోలోపల ప్రపంచకప్ బరిలోకి దిగేందుకు అన్నీ సిద్దం చేశాడు. పాక్ జట్టు ప్రస్తుతం తమ దేశంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టుతో కలిసి (మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ముగిసిన తర్వాత) ప్రపంచకప్ కోసం కొలొంబోకు ప్రయాణించనుంది. ఈ విషయాన్ని టెలికామ్ ఏషియా బ్రేక్ చేసింది. ఇది తెలిసి పాక్ ప్రజలు నఖ్వీపై ఫైరవుతున్నారు.ప్రపంచకప్లో పాల్గొనే అంశం ఎందుకు గోప్యంగా ఉంచారని నిలదీస్తున్నారు. దీనికి ప్రధాని డెడ్లైన్ విధించారని ఎందుకు డ్రామాలాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ క్రికెట్కు నఖ్వీ వల్లే సగం దరిద్రం పట్టిందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.కాగా, పాక్ ప్రపంచకప్లో పాల్గొనేందుకు అన్నీ సిద్దం చేసుకున్నా, భారత్తో మ్యాచ్ ఆడుతుందా లేదా అన్న విషయం మాత్రం ఇంకా తేలలేదు. నఖ్వీ కదలికలు చూస్తే భారత్తో మ్యాచ్ బహిష్కరణపై సందేహాలు కలుగుతున్నాయి. భద్రతా కారణాలు సాకుగా చూపుతూ టీమిండియాతో మ్యాచ్ను బాయ్కాట్ చేయాలన్నది పాక్ వ్యూహంగా తెలుస్తుంది. ఇలా చేసి ఐసీసీ శిక్షల నుంచి తప్పించుకోవాలని పీసీబీ వ్యూహాలు రచిస్తున్నట్లు ఎన్డీటీవీ నివేదిక తెలిపింది. ఇదే జరిగితే పాక్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.భారత్-బంగ్లాదేశ్ మధ్య పేచీలో పాక్ ఎంటరై బంగ్లాదేశ్కు వత్తాసు పాడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఐసీసీ కఠినంగా వ్యవహరించడంతో బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. తదనంతరం పరిణామాల్లో పాక్ కూడా బంగ్లాదేశ్ బాటలోనే ప్రపంచకప్ నుంచి తప్పుకుంటుందని ప్రచారం జరిగింది. తీరా చూస్తే పాక్ ప్రపంచకప్లో పాల్గొనేందుకు కొలొంబోకు టికెట్లు బుక్ చేసుకొని సొంత ప్రజల్నే ఫూల్స్ చేసింది. -
టీ20 వరల్డ్కప్లో పాకిస్తాన్.. కలకలం రేపుతున్న పీసీబీ చీఫ్ నఖ్వీ ట్వీట్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్-2026లో దాయాది పాకిస్తాన్ పాల్గొనడంపై సందిగ్దత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐసీసీకి ధిక్కారస్వరం వినిపించి టోర్నీ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్ బాటలోనే పాక్ కూడా నడుస్తుందని గతకొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించినా, దేశ ప్రధాని అనుమతి లభించాకే తుది నిర్ణయం వెలువడుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ స్పష్టం చేశాడు.ఈ నేపథ్యంలో నఖ్వీ ఇవాళ (జనవరి 26) వారి ప్రధాని షహబాజ్ షరీఫ్తో సమావేశమయ్యాడు. ఈ సమావేశంలో చర్చించిన విషయాలను అతను ట్విటర్ వేదికగా వెల్లడించాడు. అయితే నఖ్వీ చేసిన ఈ ట్వీట్లో ఓ పెద్ద తప్పిందం దొర్లడం, ప్రస్తుతం కలకలం రేపుతుంది. నఖ్వీ తన ట్వీట్లో ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ పేరుకు బదులు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరును ప్రస్తావించాడు. నఖ్వీ చేసిన ఈ తప్పిదం వివాదాస్పదంగా మారింది.ఇంతకీ నఖ్వీ చేసిన ట్వీట్లో ఏముందంటే.. ప్రధానమంత్రి మియాన్ మహ్మద్ నవాజ్ షరీఫ్తో ఫలప్రదమైన సమావేశం జరిగింది. ఐసీసీ అంశంపై వారికి వివరించాను. అన్ని అవకాశాలను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు. తుది నిర్ణయం శుక్రవారం లేదా సోమవారం తీసుకుంటామని పేర్కొన్నారు.దేశ అధ్యక్షుడి పేరు తప్పుగా ప్రస్తావించిన విషయాన్ని పక్కన పెడితే, ఈ ట్వీట్తో టీ20 వరల్డ్కప్లో పాక్ పాల్గొనడంపై త్వరలో స్పష్టత రాబోతోందన్న విషయంపై సంకేతాలు వెలువడ్డాయి. పాక్ ప్రభుత్వం సూచనప్రాయంగా పాక్ జట్టు ప్రపంచకప్లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ కఠినంగా వ్యవహరించడంతో పాక్ ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గినట్లు స్పష్టమవుతుంది.వివాదం ఎలా మొదలైందంటే..? బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్ను ఐపీఎల్ నుంచి తొలగించారు. దీన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్లో తమ ప్రపంచకప్ మ్యాచ్లు ఆడబోమని మొండిపట్టు పట్టింది. ఈమేరకు ఐసీసీకి పలు మార్లు విజ్ఞప్తి చేసింది.బీసీబీ విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించిన ఐసీసీ భద్రతా బృందం భారత్లో ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. అయినా మొండిపట్టు వీడని బీసీబీ, చివరికి ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. దీంతో స్కాట్లాండ్ బంగ్లాదేశ్ స్థానాన్ని భర్తీ చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మద్దతు ఇస్తూ వచ్చింది. ఓ దశలో బంగ్లా బాటలోనే తాము కూడా నడుస్తామని చెప్పింది. చివరికి సమస్య పెద్దదిగా మారుతుండటంతో పీసీబీ బంగ్లాదేశ్ను మధ్యలోనే వదిలేసి యూటర్న్ తీసుకుంది. -
అలా అయితే వరల్డ్కప్ ఆడే ప్రసక్తే లేదు: పాకిస్తాన్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి ధిక్కార స్వరం వినిపించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చెప్పినట్లు తాము నడుచుకోమని.. ప్రభుత్వం చెప్పినట్లు మాత్రమే వింటామంటూ అతి చేసింది. ఈ నేపథ్యంలో అసలు తమకు సంబంధం లేని అంశంలో తలదూర్చడమే కాకుండా.. ఐసీసీని కావాలనే చికాకు పెట్టే చర్యలకు పూనుకుంటోందని ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లా బోర్డు (BCB) తాము భారత్లో ఆడలేమని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. కానీ ఐసీసీ ఇందుకు నిరాకరించింది. భారత్లో తమకు భద్రత లేదన్న బంగ్లా వాదనను కొట్టిపారేసింది. అంతేకాదు తుది నిర్ణయం తీసుకునేందుకు అవకాశాలు కూడా ఇచ్చింది.బంగ్లాదేశ్కు అండగా పాక్అయితే, బంగ్లాదేశ్ మాత్రం తమ ప్రభుత్వం నిర్ణయానుగుణంగా టోర్నీ నుంచి వైదొలిగేందుకే మొగ్గుచూపింది. ఈ వ్యవహారంలో బంగ్లాదేశ్కు అండగా నిలిచిన పాక్.. తాము కూడా టోర్నీ నుంచి తప్పుకొంటామని బెదిరింపు ధోరణి అవలంబించింది. నిజానికి భారత్- పాక్ ఉద్రిక్తతల కారణంగానే తటస్థ వేదికలపై ఇరు దేశాల జట్లు ఐసీసీ ఈవెంట్లలో ముఖాముఖి తలపడుతున్నాయి.ఈసారి టీ20 వరల్డ్కప్లోనూ పాకిస్తాన్ (Pakistan)కు శ్రీలంకను తటస్థ వేదికగా నిర్ణయించారు. తమకు అనుకూలంగానే నిర్ణయం ఉన్నా.. బంగ్లాదేశ్ కోసమంటూ పాకిస్తాన్ కొత్త రాగం ఎత్తుకుంది. ఈ క్రమంలోనే బంగ్లా మాదిరే పాక్ను కూడా టోర్నీ నుంచి తప్పించేందుకు ఐసీసీ సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పాక్ తమ వరల్డ్కప్ జట్టును ప్రకటించింది.వరల్డ్కప్లో ఆడతామని చెప్పలేదుఫలితంగా ఈ ఐసీసీ (ICC) ఈవెంట్లో పాక్ పాల్గొంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ స్పందిస్తూ.. తాము జట్టును ప్రకటించినంత మాత్రాన వరల్డ్కప్లో ఆడతామని చెప్పినట్లు కాదని ఓవరాక్షన్ చేశాడు."ఈ విషయం గురించి మా ఆటగాళ్లతో చర్చించాము. బోర్డు, ప్రభుత్వ నిర్ణయమే తమకు శిరోదాఢ్యమని మా ఆటగాళ్లు కుండబద్దలు కొట్టారు. టోర్నీలో పాల్గొనే విషయంలో ప్రభుత్వ సలహా కోసమే మేము ఎదురుచూస్తున్నాం.అలా అయితే బహిష్కరిస్తాంప్రభుత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటాము. ఒకవేళ వారు మమ్మల్ని వరల్డ్కప్ టోర్నీలో ఆడవద్దని చెబితే అలాగే చేస్తాము’’ అని పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ పేర్కొన్నాడు. కాగా ఇప్పటికే టీమిండియా మాదిరే తమకూ వెసలుబాటు కావాలని పాక్ కోరినట్లుగా ఐసీసీ శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పీసీబీ బంగ్లాదేశ్ విషయంలో రాద్దాంతం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ సైతం పాక్ పట్ల కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. కాగా బంగ్లాదేశ్ మొండివైఖరి నేపథ్యంలో ఆ జట్టును తప్పించిన ఐసీసీ.. స్కాట్లాండ్ను టోర్నీలో చేర్చింది. మొత్తం 20 జట్లు వరల్డ్కప్ టోర్నీలో పాల్గొననున్నాయి. చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోము -
అవమానించారు: పాక్ క్రికెట్ బోర్డుపై మాజీ హెడ్కోచ్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ హెడ్కోచ్లు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటారు. సెలక్టర్లు, మెంటార్లు, సహాయక సిబ్బందిలో కూడా తరచూ మార్పులు ఉంటాయి. ఇందులో భాగంగా తాజాగా టెస్టు హెడ్కోచ్ అజహర్ మహమూద్కు పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది.కాంట్రాక్టు ముగియడానికి మూడు నెలల ముందే అజహర్ను సాగనంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ హెడ్కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ జేసన్ గిల్లెస్పి పీసీబీ తీరును ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.పాక్ కోచ్గా ఎందుకు తప్పుకొన్నారు?‘ఎక్స్’ వేదికగా ఓ యూజర్.. ‘‘మీరు పాకిస్తాన్ కోచ్గా ఎందుకు తప్పుకొన్నారు’’ అని గిల్లెస్పిని అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘అప్పట్లో నేను పాకిస్తాన్ టెస్టు జట్టుకు కోచింగ్ ఇచ్చేవాడిని. నాకు తెలియకుండానే.. నలుగురు సీనియర్ అసిస్టెంట్ కోచ్లను చెప్పాపెట్టకుండా పీసీబీ తొలగించింది.అవమానించారుహెడ్కోచ్గా నాకిది అస్సలు నచ్చలేదు. ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కూడా కాదు. ఇవే కాదు ఇలాంటి ఘటనలు ఇంకెన్నో జరిగాయి. పీసీబీ తీరు నన్ను కించపరిచేవిధంగా, అవమాపరిచేలా ఉండటం ఎంతో బాధించింది’’ అని జేసన్ గిల్లెస్పి సమాధానం ఇచ్చాడు.కాగా తాను 2024లో పాక్ కోచ్గా ఉన్న సమయంలో పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ వ్యవహరించిన తీరుపై జేసన్ గిల్లెస్పి.. బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కాడు. ‘‘జట్టులో సామరస్యం పెంచేందుకు ‘కనెక్షన్ క్యాంపు’ ఏర్పాటు చేయాలనే గొప్ప ఆలోచనతో గ్యారీ కిర్స్టన్ మా ముందుకు వచ్చాడు.చైర్మన్ నక్వీ తీరు సరిగా లేదుపాక్ క్రికెట్ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు ఇందులో తమ అనుభవాలు, ఇబ్బందుల గురించి చెప్పవచ్చు. ఈ మీటింగ్ కోసం నేను ఆస్ట్రేలియా నుంచి.. గ్యారీ సౌతాఫ్రికా నుంచి వచ్చాము. కానీ చైర్మన్ నక్వీ మాత్రం జూమ్ కాల్లో హాజరయ్యాడు.అతడు లాహోర్లోనే ఉంటాడు. అయినా సరే సమావేశానికి హాజరుకాలేదు. గ్యారీ సౌతాఫ్రికా నుంచి వచ్చినపుడు.. చైర్మన్ 20 నిమిషాల కారు ప్రయాణంలో మీటింగ్కు చేరుకునే వీలున్నా రాకపోవడం అసాధారణంగా అనిపించింది’’ అని గిల్లెస్పి నక్వీ తీరును విమర్శించాడు. చదవండి: పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడిని.. ఇక్కడ ఇలా: ఉస్మాన్ ఖవాజా -
దిగజారిన పీసీబీ చీఫ్ నఖ్వీ!... ఈసారి..
ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్లో చాంపియన్గా నిలిచిన టీమిండియా ఇప్పటి వరకు ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్, ఆసియా క్రికెట్ మండలి (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఇందుకు ప్రధాన కారణం.పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ (IND vs PAK) తొలిసారిగా ఆసియా కప్ టోర్నీలో తొలిసారిగా ముఖాముఖి తలపడ్డాయి. ఈ క్రమంలో దాయాది దుశ్చర్యలకు నిరసనగా టీమిండియా ఆటగాళ్లు తొలుత లీగ్ దశలో.. పాక్ ప్లేయర్లతో షేక్హ్యాండ్ (No ShakeHand)కు నిరాకరించారు.పప్పులు ఉడకవని తెలుసుకునిదీనిని అవమానంగా భావించిన పాక్ బోర్డు.. టీమిండియాను నిందల పాలు చేయాలని ప్రయత్నాలు చేసింది. భారత్తో మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించిన వ్యక్తిని తప్పించాలంటూ రచ్చ చేసింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) దిగిరాకపోవడంతో తమ పప్పులు ఉడకవని తెలుసుకుని మిన్నకుండిపోయింది.అయితే, సూపర్-4 మ్యాచ్లోనూ భారత జట్టు షేక్హ్యాండ్కు నిరాకరించింది. ఇందుకు ప్రతిగా పాక్ ఆటగాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. గన్ పేలుస్తున్నట్లు సెలబ్రేషన్స్ చేసుకుంటూ వక్రబుద్ధి చాటుకున్నారు. ఇక ఫైనల్లోనూ దాయాది పాక్తో.. సెప్టెంబరు 28న తలపడిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీ గెలుచుకుంది.నఖ్వీ చేతుల మీదుగా తీసుకోమునిబంధనల ప్రకారం తానే టీమిండియాకు ట్రోఫీ అందజేస్తానంటూ మొహ్సిన్ నఖ్వీ ముందుకు వచ్చాడు. అయితే, అతడు కేవలం పీసీబీ, ఏసీసీ చీఫ్ మాత్రమే కాకుండా.. పాక్ మంత్రి కూడా కావడంతో భారత జట్టు అతడి చేతుల మీదుగా కప్ అందుకునేందుకు నిరాకరించింది.ఈ క్రమంలో ట్రోఫీతో పాటు.. మెడల్స్ కూడా తనతోపాటు ఎత్తుకెళ్లిన నఖ్వీ ఇంత వరకు వాటిని తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల నఖ్వీకి ఇ-మెయిల్ పంపింది. ట్రోఫీ తమకు అప్పగించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఐసీసీ వద్దే పంచాయతీ తేలుతుందిఅయినప్పటికీ నఖ్వీ బుద్ధి మారలేదు. తన చేతుల మీదుగానే ట్రోఫీ ఇస్తానని.. ఇందుకోసం బీసీసీఐ ఆటగాళ్లను తన దగ్గరకు పంపించాలంటూ అహంకారం ప్రదర్శించాడు. దీంతో ఐసీసీ వద్దే పంచాయతీ తేల్చుకునేందుకు బీసీసీఐ సిద్ధమైంది.తాజా సమాచారం ప్రకారం.. బీసీసీఐ వర్గాలు ANIతో మాట్లాడుతూ.. నఖ్వీ ట్రోఫీని ఏసీసీ ప్రధాన కార్యాలయం నుంచి తరలించాడని పేర్కొన్నాయి. ‘‘కొన్నిరోజుల క్రితం బీసీసీఐ అధికారి ఒకరు యూఏఈలో ఉన్న ఏసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.మరింత దిగజారిన పీసీబీ చీఫ్ నఖ్వీ!... ఈసారి..ఏసీసీ ఆఫీస్లో ట్రోఫీ ఉందా అని ఆరా తీశారు. అయితే, స్టాఫ్ చెప్పిన సమాధానం విని ఆయన ఆశ్చర్యపోయారు. ట్రోఫీని ఇక్కడి నుంచి తరలించి.. అబుదాబిలో ఓ చోటు నఖ్వీ దాచిపెట్టాడని వాళ్లు చెప్పారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో గెలిచిన జట్టు ట్రోఫీని ఎత్తుకెళ్లిన నఖ్వీ మరీ ఇంతలా దిగజారిపోతాడని అనుకోలేదంటూ నెటిజన్లు అతడిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా ఆసియా కప్-2025 టోర్నీలో లీగ్ దశలో పాక్ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. సూపర్-4 మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది. చదవండి: అతడు అదరగొట్టాడు.. కాబట్టి నితీశ్ రెడ్డిపై వేటు పడొచ్చు: మాజీ కెప్టెన్ -
వచ్చి తీసుకోవాల్సిందే: నఖ్వీ ఓవరాక్షన్.. బీసీసీఐ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచి దాదాపు నెల రోజులు కావస్తున్నా టోర్నీకి సంబంధించిన ట్రోఫీ మాత్రం ఇంకా టీమ్కు అందలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ (Mohsin Naqvi) ఆదేశాల మేరకు ఇప్పటికీ ట్రోఫీ దుబాయ్లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. ఈ విషయంపై దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరోసారి ఏసీసీకి లేఖ రాసింది. ఏసీసీలోని సభ్య దేశాలైన శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్లు కూడా బీసీసీఐకి మద్దతు పలుకుతూ వెంటనే ట్రోఫీని భారత జట్టుకు అందించాలని కోరాయి. బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా, రాజీవ్ శుక్లా లేఖ రాసిన విషయాన్ని ఏసీసీ అధికారి ఒకరు నిర్ధారించారు. అయితే నఖ్వీ మాత్రం తన మొండితనాన్ని వీడలేదు. బీసీసీఐకి సంబంధించినవారు ఎవరైనా దుబాయ్కు వచ్చి తన చేతుల మీదుగా తీసుకుంటేనే దానిని అందిస్తామని అతడు పునరుద్ఘాటించాడు. అయితే బీసీసీఐ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. దాంతో ఆసియా కప్ ఫైనల్ రోజులాంటి యథాతథ స్థితి ఇంకా కొనసాగుతోంది. నా చేతుల మీదుగా తీసుకోవచ్చుబీసీసీఐ లేఖపై తాజాగా నఖ్వీ స్పందించాడు. ‘ఆసియా కప్ ఫైనల్ రోజు నా చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోబోమని భారత్ చివరి క్షణం వరకు చెప్పలేదు. వేదికపై అతిథులంతా చేరిన తర్వాత ఆ విషయం తెలిసింది. మేం 40 నిమిషాలు వేచి చూసినా ఎవరూ రాలేదు. ఆసియా కప్ ట్రోఫీ భారత్దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి బీసీసీఐ ప్రతినిధి ఎవరైనా ఆసియా కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన ఆటగాడు ఒకరితో కలిసి ఇక్కడికి వచ్చి నా చేతుల మీదుగా తీసుకోవచ్చు’ అని అదే మాట చెప్పాడు. ఈ ప్రతిష్టంభనకు ఏసీసీలో పరిష్కారం లభించదని భారత బోర్డుకు అర్థమైంది. త్వరలో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి సమావేశంలో నఖ్వీపై ఫిర్యాదు చేయాలని... అక్కడే ఏదో ఒకటి తేల్చుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది.చదవండి: పాకిస్తాన్ అవుట్ -
BCCI: ఇస్తారా? లేదా?.. పీసీబీ చీఫ్ నక్వీకి బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్
ఆసియా టీ20 కప్-2025 ట్రోఫీ ఇంత వరకు టీమిండియాకు అందనే లేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB), ఆసియా క్రికెట్ మండలి (ACC) చైర్మన్ మొహ్సిన్ నక్వీ మొండి వైఖరి ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నక్వీకి గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.తీవ్ర పరిణామాలుట్రోఫీ గనుక టీమిండియాకు అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీసీసీఐ నక్వీకి అధికారికంగా ఇ- మెయిల్ పంపినట్లు సమాచారం. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఇండియా టుడే పేర్కొంది. ఒకవేళ నక్వీ గనుక తమకు సరైన రీతిలో సమాధానం ఇవ్వకుంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని ఆశ్రయిస్తామని చెప్పినట్లు తెలిపింది.అదే జరిగితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని హెచ్చరించామని.. వీలైనంత త్వరగా ట్రోఫీ పంపించాలని మెయిల్ రాసినట్లు పేర్కొంది. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో టీమిండియా చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.టీమిండియా నిరాకరణలీగ్, సూపర్-4 దశల్లో పరాజయమన్నదే ఎరుగక ఫైనల్ చేరిన సూర్యకుమార్ సేన.. టైటిల్ పోరు (సెప్టెంబరు 28)లో దాయాది పాకిస్తాన్ను ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. అయితే, ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న నక్వీ నుంచి కప్ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. మరోవైపు.. నక్వీ మాత్రం పట్టువీడలేదు. ట్రోఫీ, మెడల్స్ తీసుకుని హోటల్కు పారిపోయాడు.పద్ధతి ప్రకారమేతన చేతుల మీదుగానే టీమిండియా ట్రోఫీ తీసుకోవాలని.. ఒకవేళ ఎవరైనా వచ్చి అడిగినా ట్రోఫీ ఇవ్వొద్దని నక్వీ ఏసీసీ ప్రతినిధులకు చెప్పినట్లు సమాచారం. దీంతో బీసీసీఐ కూడా ఈ విషయాన్ని సీరియస్గానే తీసుకుంది. పద్ధతి ప్రకారమే ట్రోఫీని తమ వద్దకు రప్పించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే మెయిల్ కూడా పంపినట్లు తెలుస్తోంది.పూర్తి స్పృహలో ఉండేకాగా నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని టీమిండియా నిరాకరించడానికి గల కారణాన్ని సైకియా గతంలో వెల్లడించాడు. ‘‘ఏసీసీ చైర్మన్గా ఉన్న వ్యక్తి పాకిస్తాన్ సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. పూర్తి స్పృహలో ఉండే ఈ నిర్ణయం తీసుకున్నాము’’ అని దేవజిత్ సైకియా తెలిపాడు.ఉగ్రదాడికి నిరసనగాపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి నిరసనగా టీమిండియా పాక్ ఆటగాళ్లతో షేక్హ్యాండ్కు నిరాకరించింది. దీంతో రచ్చకెక్కిన పీసీబీ.. అతి చేసింది.ఇందుకు అనుగుణంగానే పాక్ ఆటగాళ్లు హ్యారిస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు, అభిమానులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి.. ఐసీసీతో చివాట్లు తిన్నారు. ఆ తర్వాత ఫైనల్లో దాయాది చేతిలో ఓడి ఇంటిబాట పట్టగా.. పీసీబీ చైర్మన్ నక్వీ ఇలా మెడల్స్, ట్రోఫీ ఎత్తుకెళ్లడం గమనార్హం.చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా రిషభ్ పంత్ -
ఆసియాకప్ ట్రోఫీ ఎత్తుకెళ్లాడు.. కట్ చేస్తే! నఖ్వీ పోస్ట్ ఊస్టింగ్?
2025 ఆసియా కప్.. ఈ ఖండాతర టోర్నీ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఎడిషన్గా నిలిచింది. షేక్ హ్యాండ్ వివాదం మొదలు ఆసియా కప్ ట్రోఫీ వరకూ ఆధ్యంతం తీవ్ర ఉత్కంఠను రేపింది. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో భారత జట్టు అంటిముట్టనట్టే వ్యవహరించింది. తొలుత షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి నిరాకరించిన భారత్.. ఆ తర్వాత ఏసీసీ చైర్మెన్, పీసీబీ చీఫ్ మోహ్సన్ నఖ్వీ(mohsin naqvi) చేతుల మీదగా విన్నింగ్ ట్రోఫీని తీసుకోవడానికి సముఖత చూపలేదు. నక్వీ తన చేతుల మీదుగానే ట్రోఫీ తీసుకోవాలని పట్టుబట్టినప్పటికి బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ అందుకు అంగీకరించలేదు.దీంతో నఖ్వీ స్టేడియం నుంచి ట్రోఫీతో పాటు విజేతల పతకాలను కూడా తీసుకెళ్లడం పెద్ద వివాదానికి దారితీసింది. ఇప్పటికి ఇంకా ట్రోఫీని భారత్కు అతడు అందజేయలేదు. ట్రోఫీ ప్రస్తుతం దుబాయ్లోని ఏసీసీ ఆఫీస్లో ఉంది. తన అనుమతి లేకుండా ట్రోఫీని ఎవరికీ అప్పగించకూడదని ఏసీసీ అధికారులకు నఖ్వీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. నఖ్వీ ట్రోఫీని తీసుకుని వెళ్లిపోవడం, ఇంకా అందజేయకపోవడంపై బీసీసీఐ గుర్రుగా ఉంది. వచ్చే నెలలో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని బీసీసీఐ లేవనెత్తునుంది. అంతేకాకుండా ఐసీసీ డైరెక్టర్ పదవి నుండి అతడిని తొలిగించాలని భారత క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తోంది.నఖ్వీ ఏసీసీ చైర్మెన్తో పాటు ఐసీసీ డైరెక్టర్ గానూ కొనసాగుతున్నాడు. కాగా ఐసీసీ చైర్మెన్గా జై షా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నఖ్వీ డైరక్టర్ పదవి ఊడిపోవడం ఖాయమని ప్రచారం సాగుతోంది."ఆసియాకప్ టోర్నీకి అధికారిక హోస్ట్గా ఉన్న బీసీసీఐకి ట్రోఫీని పంపడానికి నిరాకరించే హక్కు నఖ్వీకి లేదు. అతడు ట్రోఫీని భారత్కు ఇప్పటికే పంపించాల్సింది. కానీ అందుకు అతడు ఒప్పుకోవడం లేదు. కాబట్టి అందుకు నఖ్వీ భారీ మూల్యం చెల్లించుకోనున్నాడు" అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: ఐపీఎల్లో అదరగొట్టాడు.. కట్ చేస్తే! ఇప్పుడు ఊహించని జాక్ పాట్ -
ఇంకెంతకు దిగజారుతావు?.. నఖ్వీ ఓవరాక్షన్ మామూలుగా లేదు
ఆసియాకప్-2025 ట్రోఫీ వివాదానికి ఇప్పటిలో ఎండ్కార్డ్ పడేలా లేదు. ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరిగి దాదాపు వారాలు అవుతున్నప్పటికి ట్రోఫీ ఇంకా టీమిండియా చేతికి రాలేదు. ఈ ట్రోఫీ విషయంలో ఏసీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వెనక్కి తగ్గడం లేదు.ఇప్పటికే తన చేతుల మీదగానే ట్రోఫీ ప్రధానం చేయాలని మొండిపట్టుతో ఉన్నాడంట. కాగా ఆసియాకప్ ఫైనల్లో విజయం తర్వాత విన్నింగ్ ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి భారత్ ఇష్టపడలేదు. ప్రోటోకాల్ ప్రకారం.. ఏసీసీ చైర్మెన్ ఎవరంటే వారే ట్రోఫీని విజేతకు అందించాలి.కానీ నఖ్వీ ఏసీసీ చీఫ్తో పాటు పీసీబీ చైర్మెన్, పాకిస్తాన్ మంత్రిగా ఉండడంతో ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా నిరాకరిచింది. అతడికి బదులుగా యూఏఈ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ల చేతుల మీదగా ట్రోఫీని అందుకుంటామని భారత్ తెలియజేసింది. కానీ అందుకు నఖ్వీ ఒప్పుకోలేదు. తీసుకుంటే తన నుంచే తీసుకోవాలని పట్టుబట్టాడు. టీమిండియా ప్లేయర్లు కూడా వెనక్కి తగ్గకుండా గ్రౌండ్లోనే కూర్చోవడం పెద్ద హై డ్రామా క్రియేట్ చేసింది. దీంతో ఘోర అవమానంగా భావించిన నఖ్వీ.. స్టేడియం నుంచి ట్రోఫీతో పాటు విన్నర్స్ మెడల్స్ను తీసుకువెళ్లిపోయాడు. అతడి తీరుపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. అయితే ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు నఖ్వీ అందజేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదు. ట్రోఫీ ఇంకా నఖ్వీ వద్దే ఉంది."ప్రస్తుతం ఆసియాకప్ ట్రోఫీ దుబాయ్లోని ఏసీసీ కార్యాలయంలో ఉంది. అక్కడి అధికారులకు మొహ్సిన్ నఖ్వీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. తన అనుమతి లేకుండా ట్రోఫీని ఎవరికీ అప్పగించకూడదని అతడు సూచించాడు. ఎప్పుడైనా కానీ భారత జట్టుకు లేదా బీసీసీఐకి ట్రోఫీ తనే అందజేస్తానని ఏసీసీ అధికారులకు నఖ్వీ చెప్పినట్లు" పీసీబీ చీఫ్ సన్నిహితుడు ఒకరు పిటిఐకు తెలిపారు. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న సమావేశాల్లో ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.చదవండి: 'మీ అన్నయ్య లాంటి వాడిని'.. ముషీర్కు సారీ చెప్పిన పృథ్వీ షా -
ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. టీమిండియాపై డివిలియర్స్ విమర్శలు
ఆసియాకప్-2025 ఫైనల్ మ్యాచ్ అనంతరం హైడ్రామా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. విజేతగా నిలిచిన భారత జట్టు ట్రోఫీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి నిరకారించింది.టీమిండియా చర్యతో మొహ్సిన్ నఖ్వీకి ఘోర అవమానం ఎదురైంది. దీంతో నఖ్వీ ట్రోఫీని తనతో పాటు హోటల్కు తీసుకుని వెళ్లిపోయాడు. అతడి తీరుపై బీసీసీఐ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఇప్పటికీ ఇంకా ట్రోఫీ భారత్ వద్దకు చేరలేదు. అతడు ఆసియాకప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అందజేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అదేవిధంగా ఈ టోర్నీ అంతటా పాక్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం కూడా చేయలేదు. ఈ టోర్నీలో భారత్-పాక్ జట్ల మధ్య చోటు చేసుకున్న పరిణామాలపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఎబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించిన భారత జట్టు వైఖరిని డివిలియర్స్ తప్పు బట్టాడు. క్రీడలకు రాజకీయాలను దూరంగా ఉంచాలని అతడు కోరాడు."ఆసియాకప్ ట్రోఫీని ఏసీసీ చైర్మెన్ చేతుల మీదగా తీసుకోవడానికి టీమిండియా సముఖత చూపలేదు. అందుకు కారణం మనందరికి తెలుసు. కానీ నావరకు అయితే అది క్రీడలకు సంబంధించినది కాదు. క్రీడల నుంచి రాజకీయాలను పక్కన పెట్టాలి.స్పోర్ట్స్ను మనం ప్రత్యేకంగా చూడాలి. పాలిటిక్స్తో ముడిపెట్టకూడదు. ఆసియాకప్లో చోటు చేసుకున్న పరిణామాలు నాకు చాలా బాధ కల్గించాయి. అయితే భవిష్యత్తులో ఈ సమస్యలను పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాను. ఇటువంటి సంఘటనలు క్రీడాకారులను మానసికంగా దెబ్బతీస్తాయి. నాకు ఇటువంటివి అస్సలు నచ్చవు. చివరికి వివాదాలతోనే ఆసియాకప్ ముగిసింది" అని ఏబీడీ తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు.అదేవిధంగా ఛాంపియన్స్గా నిలిచిన భారత జట్టు ఈ సౌతాఫ్రికా లెజెండ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా చాలా పట్టిష్టంగా కన్పిస్తోందని, టీ20 ప్రపంచకప్-2026కు సిద్దంగా ఉందని అతడు కొనియాడాడు.చదవండి: IND vs WI: టీమిండియాతో మ్యాచ్.. చందర్పాల్ తనయుడు అట్టర్ ప్లాప్ -
దిగొచ్చిన పీసీబీ చైర్మెన్ నఖ్వీ.. ఆసియా కప్ ట్రోఫీ అందజేత?
ఆసియా కప్-2025 ట్రోఫీ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మన్, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ భారత క్రికెట్ బోర్డు దెబ్బకు దిగొచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. జీ న్యూస్ కథనం ప్రకారం.. నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అందజేసినట్లు సమాచారం. తాజాగా జరిగిన ఏసీసీ సమావేశంలో ఈ విషయంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. అయితే ట్రోఫీ కావాలంటే భారత కెప్టెన్ నేరుగా ఏసీసీ కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని నఖ్వీ చెప్పినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.కానీ ఇప్పుడు నఖ్వీ వెనక్కి తగ్గి ట్రోఫీ యూఏఈ క్రికెట్ బోర్డు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఈ విషయంపై బీసీసీఐ గానీ, యూఏఈ క్రికెట్ బోర్డు గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఈ ఏడాది ఆసియాకప్ యూఏఈ ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే.అసలేంటి ఈ ట్రోఫీ వివాదం..?ఆసియాకప్ విజేతగా నిలిచిన అనంతరం ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని తీసుకోవడానికి భారత్ నిరాకరించింది. నఖ్వీ ఏసీసీ చైర్మెన్తో పాటు పీసీబీ ఛీప్, పాకిస్తాన్ మంత్రిగా ఉండడమే ఇందుకు కారణం.అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్, యూఏఈ క్రికెట్ బోర్డు చైర్మెన్ చేతులు మీదగా ట్రోఫీని తీసుకుంటామని టీమిండియా తెలియజేసింది. కానీ అందుకు నఖ్వీ అంగీకరించలేదు. దీంతో అతడు ట్రోఫీని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయాడు.అప్పటి నుంచి ఆసియాకప్ ట్రోఫీ అతడి వద్దే ఉంది. కాగా ఫైనల్ మ్యాచ్లో పాక్ను 5 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ టోర్నీ అంతటా పాక్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు షేక్ హ్యాండ్ చేయడానికి నిరకారించారు. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.చదవండి: IND vs AUS: ఆసీస్పై శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. 413 పరుగులు చేసిన భారత్ -
ట్రోఫీ కావాలంటే నా ఆఫీస్కు వచ్చి తీసుకో.. భారత కెప్టెన్కు నఖ్వీ షరతు
ఆసియా కప్ (Asia cup 2025) ట్రోఫీ విషయంలో ఏసీసీ (Asia Cricket Council) అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ (Mohsin Naqvi) మొండిపట్టు వీడటం లేదు. తన వద్ద ఉంచుకున్న ట్రోఫీని నిర్వహకులకు ఇచ్చేయాలని నిన్న (సెప్టెంబర్ 30) జరిగిన ఏసీసీ సమావేశంలో బీసీసీఐ ఉపాథ్యక్షుడు రాజీవ్ శుక్లా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. పైగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు (Surya Kumar Yadav) కొత్త షరతు పెట్టాడు.ట్రోఫీ కావాలంటే స్వయంగా నా ఆఫీస్కు వచ్చి తీసుకోవాలని అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. నఖ్వీ వాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నఖ్వీ ఓవరాక్షన్ చూస్తుంటే రక్తం మరిగిపోతుందంటూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. నఖ్వీ విషయంలో బీసీసీఐ, ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. తక్షణమే అతన్ని ఏసీసీ అధ్యక్ష హోదా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.కాగా, ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాక్ను చిత్తుగా ఓడించి ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరస్కరించాడు. ఇందుకు ప్రతిగా నఖ్వీ భారత ఆటగాళ్లకు అందించాల్సిన మెడల్స్ను, ట్రోఫీని ఎత్తుకెళ్లిపోయాడు. నఖ్వీ ట్రోఫీ ఇవ్వకపోయినా భారత ఆటగాళ్లు కృత్రిమంగా ట్రోఫీని అందుకున్నట్లు సంబురాలు చేసుకున్నారు. దీనిపై నిన్న జరిగిన ఏసీసీ సర్వసభ్య సమావేశం బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. అయినా నఖ్వీ మొండిపట్టు వీడలేదు. ట్రోఫీ గురించి ఏజీఎంలో చర్చించాల్సిన అవసరం లేదని, మరో సమావేశంలో మాట్లాడుకుందామని దాటవేశాడు. నఖ్వీ ప్రవర్తనపై యావత్ భారతావణి మండిపడుతుంది. వీడి వేశాలేంట్రా బాబు అని అనుకుంటుంది. ట్రోఫీ తీసుకున్నా, తీసుకోకపోయినా విజేతలం మనమే అని సర్దుకుపోతుంది.చదవండి: అయ్యయ్యో! పుండు మీద కారం జల్లినట్లుగా.. -
ట్రోఫీ, మెడల్స్ ని ఎత్తుకెళ్లిన మొహసిన్ నఖ్వీ..
-
అయ్యయ్యో! పుండు మీద కారం జల్లినట్లుగా..
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించగా.. బీసీసీఐ(BCCI) వెంటనే రూ.21 కోట్లు బోనస్గా ప్రకటించి ఆటగాళ్లను ఘనంగా సత్కరించింది. ఇది మన క్రీడాకారుల శ్రమకు గౌరవం, ప్రోత్సాహం, దేశం తరఫున పోరాడినందుకు ఇచ్చే గుర్తింపు అని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. సాధారణంగా రన్నరప్గా నిలిచిన జట్ల ఆటగాళ్లకూ ఆ దేశాలు ఎంతో కొంత ప్రొత్సాహాకం అందిస్తుంటాయి. మరి రన్నరప్గా నిలిచిన పాక్ ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?..ఆసియా కప్లో రన్నరప్గా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు ఆసియా క్రికెట్ కంట్రోల్ బోర్డు(75,000 డాలర్ల) తరఫున రూ.66.5 లక్షల ప్రైజ్మనీ లభించింది. అంతేగానీ పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటిదాకా ఎలాంటి నజరానా ప్రకటించలేదు. దీంతో ఏదైనా నజరానా ప్రకటిస్తారేమోనని ఆటగాళ్లు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో.. అలాంటి ఆశలేం వద్దంటూ ఓ వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అది 2009 టీ20 వరల్డ్ కప్ విజేతగా పాక్ నిలిచిన సమయం. ఆ సమయంలో పాక్ ఆటగాళ్లకు నజరానాను ప్రకటించింది అప్పటి యూసఫ్ రజా గిలానీ ప్రభుత్వం. అయితే ప్రధాని స్వయంగా జారీ చేసిన ఆ 25 లక్షల చెక్కు బౌన్స్ అయ్యిందట. దీంతో అప్పటి పీసీబీ చైర్మన్ను ఆటగాళ్లు ఆశ్రయిస్తే.. అది ప్రభుత్వం ఇస్తామన్న నజరానా అని, దాంతో మాకేం సంబంధం అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారట. చివరికి ICC ఇచ్చిన ప్రైజ్ మనీ తప్ప ఆటగాళ్లకు ఇంకేమీ అందలేదు... ప్రభుత్వం ఇచ్చే చెక్కు కూడా బౌన్స్ అవుతుందా? అని పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్(Syeed Ajmal Comments Viral) చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. రెండేళ్ల కిందట నదీర్ అలీ అనే యూట్యూబర్ పాడ్కాస్ట్లో అజ్మల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు.. పాక్ జట్టులో వ్యక్తిగత విజయాలకూ తగిన గుర్తింపు ఉండదని అన్నాడాయన. 2012, 2013లో ICC టీమ్ ఆఫ్ ది ఇయర్లో తనకి చోటు దక్కినా.. పీబీసీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రొత్సాహాకం అందలేని గుర్తు చేసుకుని వాపోయాడు. దీనితో పాక్ ఆటగాళ్ల దుస్థితి ఇలా ఉందంటూ.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది.అదే సమయంలో.. మరోవైపు ఏసీసీ అద్యక్షుడైన పీబీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) ఆటగాళ్ల నజరానా గురించి ఆలోచించే స్థితిలో ఏమాత్రం లేడు. ఆయన పరిస్థితి కూడా ‘చంద్రుడి కోసం ఎదురుచూసే చకోర పక్షి’ పరిస్థితిని తలపిస్తోంది. 2025 ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమిండియా జట్టు.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఆయన ట్రోఫీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆయన ట్రోఫీతో పారిపోయాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి. ఈ తరుణంలో.. తాజాగా ఏసీసీ మీటింగ్లో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగతంగానైనా వచ్చి ట్రోఫీ తీసుకెళ్లాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అది జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే బీసీసీఐ ఇప్పటికే నఖ్వీ ట్రోఫీ తస్కరించిన వ్యవహారంపై అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలో ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకుంటోంది కూడా. మరోవైపు.. మా టీమ్ మేట్స్, మా సపోర్ట్ స్టాఫ్.. వీళ్లే నా నిజమైన ట్రోఫీలు” అంటూ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ఏరకంగా చూసుకున్నా ట్రోఫీ కోసం నఖ్వీ ఎదురు చూస్తూ ఉండిపోవాల్సిందేనంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఇదీ చదవండి: ఆ పాక్ ప్లేయర్కు థ్యాంక్స్.. అతని వల్లే గెలిచాం! -
ప్రదానం చేయలేదని.. ఎప్పటికీ పంపరా?
దుబాయ్: ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడి వ్యవహారశైలిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మండిపడింది. మంగళవారం ఇక్కడ ఏసీసీ సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగింది. ఇందులో భారత బోర్డు తరఫున సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, మాజీ కోశాధికారి ఆశిష్ షెలార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు కూడా అయిన ఏసీసీ చీఫ్ మోసిన్ నఖ్వీ విపరీత ధోరణిపై బీసీసీఐ ప్రతినిధులిద్దరు ఆక్షేపించారు. నఖ్వీ పాక్ ప్రభుత్వంలో మంత్రి కూడా కావడంతో టీమిండియా అతని చేతుల మీదుగా జరగాల్సిన ట్రోఫీ ప్రదానోత్సవాన్ని సున్నితంగా తిరస్కరించింది. ఆదివారం రాత్రి తను ప్రదానం చేయలేదన్న అక్కసుతో నఖ్వీ తర్వాత కూడా విజేత భారత జట్టుకు పంపకుండా ఏసీసీ కార్యాలయంలోనే అట్టిపెట్టాడు. దీంతో ‘కప్’ లేకుండానే భారత క్రికెట్ జట్టు సభ్యులు స్వదేశానికి వచ్చారు. మంగళవారం జరిగిన ఏజీఎంలో నఖ్వీ కొనసాగిస్తున్న ‘ట్రోఫీ డ్రామా’పై శుక్లా, షెలార్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇది ఏసీసీ ట్రోఫీ. ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. వ్యక్తిగతంగా ఎవరికి చెందదు. టోర్నీలో గెలిచిన విజేత జట్టుకే అప్పగించాలి’ అని రాజీవ్ శుక్లా గట్టిగానే స్పష్టం చేశారని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఏజీఎంలో ఇంత జరుగుతున్నా... భారత్ నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరం వెల్లువెత్తుతున్నా... ఏసీసీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ మాత్రం ఇంకా తన మొండి పట్టు వీడటం లేదు. ట్రోఫీని ఇచ్చేందుకు సమావేశంలో అంగీకరించలేదని తెలిసింది.ట్రోఫీ గురించి ఏజీఎంలో చర్చించాల్సిన అవసరం లేదని, మరో సమావేశంలో మాట్లాడుకుందామని నఖ్వీ దాటవేశారు. ఏసీసీ ఎజెండాలోని వైస్ చైర్మన్ ఎన్నిక వరకే ఈ మీటింగ్ను పరిమితం చేయాలని చూశారు. అంతేకాదు. వెస్టిండీస్పై నేపాల్ సంచలన విజయం పట్ల నేపాల్ జట్టును అభినందించారు. నేపాల్ ఆసియా జట్టు కావొచ్చు. కానీ ఆ ద్వైపాక్షిక సిరీస్ ఏసీసీకి సంబంధించిన టోర్నీ కానేకాదు. అయినా నేపాల్ను ప్రశంసించిన నఖ్వీ... ఏసీసీ సొంత టోర్నీ అయిన ఆసియా కప్ గెలిచిన భారత్ను మాటమాత్రంగానైనా అభినందించకుండా తన కుటిల బుద్ధిని చాటుకున్నారు. మొత్తానికి ఆసియా కప్ ట్రోఫీ మాత్రం ఇంకా ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. -
కొనసాగుతున్న ఆసియా కప్ హైడ్రామా.. ట్రోఫీ తిరిగి ఇచ్చేందుకు షరతులు పెట్టిన నఖ్వీ
ఆసియా కప్ 2025 (Asia cup 2025) హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. టోర్నీ ముగిసి రెండు రోజులైనా ఛాంపియన్గా నిలిచిన భారత జట్టుకు (Team India) విన్నింగ్ ట్రోఫీ అందలేదు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ (Mohsin Naqvi) చేతుల మీద నుంచి విన్నింగ్ ట్రోఫీని అందుకునేందుకు టీమిండియా నిరాకరించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా నఖ్వీ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్ను తీసుకెళ్లిపోయాడు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకున్నా గెలుపు సంబురాలు అద్భుతంగా చేసుకున్నారు.తాజాగా నఖ్వీ తాను ఎత్తుకెళ్లి పోయిన ట్రోఫీని, మెడల్స్ను భారత ఆటగాళ్లకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించినట్లు తెలుస్తుంది. అయితే ఇందుకు ఓ కండీషన్ పెట్టాడట. అతనే స్వయంగా భారత కెప్టెన్కు ట్రోఫీని, మిగతా ఆటగాళ్లకు మెడల్స్ను ఇస్తానని చెప్పాడట. నఖ్వీ పెట్టిన ఈ కండీషన్కు భారత ఆటగాళ్లు ససేమిరా అన్నట్లు సమాచారం. ఈ వివాదం అతి త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇవాళ (సెప్టెంబర్ 30) జరుగబోయే ఏసీసీ సమావేశంలో బీసీసీఐ నఖ్వీని తూర్పారబెట్టాలని డిసైడైంది. ఇది అతని పదవికే ముప్పు తెచ్చిపెట్టవచ్చు. ఈ వివాదాన్ని బీసీసీఐ ఐసీసీ వరకు కూడా తీసుకెళ్లకుండా ఏసీసీలోనే తెంచేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది.కాగా, సెప్టెంబర్ 28న జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తొలుత తడబడినప్పటికీ.. తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు.ఈ టోర్నీలో భారత్ మొత్తం మూడు సార్లు పాక్ను ఓడించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్షేక్ను నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పీసీబీ నానా యాగీ చేసినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.తమకు అనుకూలంగా ఏదీ జరగడం లేదని తెలిసి పీసీబీ వారి ఆటగాళ్లను రెచ్చగొట్టింది. భారత్ను, భారత ఆటగాళ్లను ఉద్దేశిస్తూ పాక్ ఆటగాళ్లు హరీస్ రౌఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ చాలా ఓవరాక్షన్ చేశారు. దీనికి కూడా పాక్ ఆటగాళ్లు మూల్యం చెల్లించుకున్నారు. పాక్ ఆటగాళ్ల కవ్వింపులకు ఎక్కడా సహనం కోల్పోని టీమిండియా మైదానంలో వారికి తగు రీతో బద్ది చెప్పింది.చదవండి: ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్ను మట్టికరిపించిన పసికూన -
‘మా ఆటగాళ్లంతా ఒక్కో ట్రోఫీతో సమానం’
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. చాంపియన్ టీమ్కు ట్రోఫీ ఇవ్వకుండా నిలిపివేసిన ఘటన గతంలో ఎన్నడూ చూడలేదని అతను అన్నాడు. అయితే తాము ఈ విషయాన్ని పట్టించుకోమని, ట్రోఫీ లేకపోవడం వల్ల తమ విజయం విలువ ఏమాత్రం తగ్గదని సూర్య వ్యాఖ్యానించాడు. ‘ఒక క్రికెట్ అభిమానిగా, ఆపై ఆటగాడిగా ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదు. ఎంతో కష్టపడి విజేతగా నిలిచి సంపాదించిన ట్రోఫీని ఆటగాళ్లకు ఇవ్వకపోవడం ఏమిటి? దానిని అందుకునేందుకు మాకు పూర్తి అర్హత ఉంది. అయితే ట్రోఫీల గురించే మాట్లాడాల్సి వస్తే మా డ్రెస్సింగ్రూమ్లోనే ఇలాంటి 14 ట్రోఫీలు ఉన్నాయి. ఈ ఆసియా కప్ గెలుపు ప్రయాణంలో మా ఒక్కో ఆటగాడు, సహాయక సిబ్బంది ఒక్కో ట్రోఫీతో సమానం. పాకిస్తానీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించరాదనే విషయం మాకు ఎవరూ చెప్పలేదు. మా జట్టు సభ్యులంతా మైదానంలో కలిసి తీసుకున్న నిర్ణయమిది’ అని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. మరోవైపు పహల్గాం దాడిలో మృతి చెందిన కుటుంబాల సంక్షేమం కోసం తాను ఆసియా కప్లో 7 మ్యాచ్ల ద్వారా అందుకున్న మ్యాచ్ ఫీజు మొత్తాన్ని (రూ. 28 లక్షలు) విరాళంగా ఇస్తున్నట్లు సూర్యకుమార్ ప్రకటించాడు. నఖ్వీ తీసుకెళ్లిపోయాడు! ఫైనల్ ముగిసిన తర్వాత బహుమతి ప్రదానోత్సవానికి వేదికను ఏర్పాటు చేశారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, పాకిస్తాన్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కూడా అయిన మొహసిన్ నఖ్వీ అక్కడే ఉన్నాడు. అయితే పహల్గాం దాడి సమయంలో నఖ్వీ సోషల్ మీడియాలో భారత్కు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశాడు. దాంతో అతడి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోబోమని భారత జట్టు ముందే ఏసీసీకి సమాచారం అందించింది. దాంతో ప్రత్యామ్నాయంగా వేదికపై ఉన్న ఇతర అధికారుల నుంచి అందించవచ్చని నిర్వాహకులు భావించారు. అయితే నఖ్వీ వేదికపై ఉన్నంత సేపు తాము అక్కడికి వెళ్లమని భారత్ స్పష్టం చేసింది. అయితే నిబంధనల ప్రకారం ఏసీసీ అధ్యక్షుడి హోదాలో తానే ట్రోఫీ ఇస్తానంటూ నఖ్వీ మొండితనం ప్రదర్శించాడు. దాంతో చివరకు భారత్ కప్ అందుకోకుండానే కార్యక్రమం ముగిసింది. అయితే ఆశ్చర్యకరంగా, ఎవరూ ఊహించని విధంగా నఖ్వీ సన్నిహితులు కొందరు అక్కడ ఉన్న ఆసియా కప్ ట్రోఫీని తమతో పాటు తీసుకెళ్లిపోయారు. అనంతరం భారత జట్టు మొత్తం వేదిక వద్ద చేరి ఊహాత్మకంగా ట్రోఫీ చేతిలో ఉన్నట్లుగా నటిస్తూ సంబరాలు చేసుకుంది. బీసీసీఐ ఆగ్రహం... నఖ్వీ ప్రవర్తనపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘నఖ్వీ పాకిస్తాన్ రాజకీయ నాయకుడు కూడా. అందుకే ఆయన నుంచి ట్రోఫీ తీసుకోవద్దని భారత్ నిర్ణయించింది. కానీ ఆయన తనతో పాటు ట్రోఫీని, పతకాలను కూడా తీసుకెళ్లమని దానర్థం కాదు. అవన్నీ వీలైనంత త్వరగా భారత్కు వస్తాయని నమ్ముతున్నాం. నవంబరులో జరిగే ఐసీసీ సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడి ప్రవర్తనపై మేం చాలా గట్టిగా నిరసన వ్యక్తం చేయనున్నాం’ అని సైకియా వెల్లడించారు. మరోవైపు టోర్నీలో భారత జట్టు ప్రవర్తన క్రికెట్ను అగౌరవపర్చినట్లుగా ఉందని పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా అన్నాడు. టోర్నీ ఆరంభానికి ముందు వేర్వేరు సందర్భాల్లో తనతో కరచాలనం చేసిన సూర్యకుమార్... జనం మధ్యలోకి వచ్చేసరికి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదని సల్మాన్ విమర్శించాడు. తిలక్ వర్మకు ఘన స్వాగతం... అద్భుత ఇన్నింగ్స్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ సోమవారం రాత్రి నగరానికి తిరిగొచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలో అతనికి అభిమానులు, తెలంగాణ స్పోర్ట్ అథారిటీ అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ‘నేను క్రీజ్లోకి వచ్చిన సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు ఎన్నో వ్యాఖ్యలు చేశారు. అయితే నా బ్యాట్తోనే వారికి సమాధానం చెప్పాలని భావించా. అనుకున్నట్లుగానే చెలరేగిపోయా. నా ఆట తర్వాత మైదానంలో వారెవరూ కనిపించలేదు. మరో మాట అనే అవకాశం వారికి లేకుండా పోయింది. స్టేడియంలో అభిమానులు వందేమాతరంతో హోరెత్తించడంతో మరింత కసిగా చెలరేగిపోయా’ అని తిలక్ మ్యాచ్ తర్వాత వ్యాఖ్యానించాడు. -
ట్రోఫీ, మెడల్స్ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్
ఆసియాకప్-2025 ఛాంపియన్స్గా టీమిండియా నిలిచిన అనంతరం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని స్వీకరించడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు.ప్రోటోకాల్ ప్రకారం.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ బాస్ అయిన మొహ్సిన్ నఖ్వీనే విజేతకు ట్రోఫీ అందించాలి. కానీ భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ట్రోఫీని అతడి నుంచి తీసుకోవాడనికి మెన్ ఇన్ బ్లూ సముఖత చూపలేదు.దీంతో దాదాపు గంట అలస్యంగా ప్రారంభమైన పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో కేవలం పాక్ ఆటగాళ్లే రన్నరప్ మెడల్స్ను అందుకున్నారు. అయితే భారత జట్టు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్-చైర్మన్ ఖలీద్ అల్ జరూని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్ అమీనుల్ ఇస్లాం చేతుల మీదగా ట్రోఫీని అందుకుంటామని తెలియజేసింది. అందుకు వారిద్దరూ అంగీకరించారు. కానీ మొహ్సిన్ నఖ్వీ మాత్రం తానే అందిస్తానని మొండిపట్టు పట్టాడు. దీంతో టీమిండియా పూర్తిగా ట్రోఫీనే తీసుకోమని తేల్చి చెప్పేసింది. భారత్ తీరుతో సహనం కోల్పోయిన పీసీబీ చీఫ్.. ఆసియా కప్ ట్రోఫీతో పాటు, టీమిండియా ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్ను హోటల్కు తీసుకువెళ్లిపోయాడు. ఈ క్రమంలో నఖ్వీ వ్యవహరించిన తీరు పట్ల సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఇదే విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. మొహ్సిన్ నఖ్వీ చర్యను భారత క్రికెట్ బోర్డు సీరియస్గా తీసుకుంటున్నట్లు సైకియా తెలిపారు.బీసీసీఐ సీరియస్.."భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికి తెలుసు. పాకిస్తాన్ సీనియర్ లీడర్స్లో ఒకరిగా ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ కొనసాగుతున్నారు. అటువంటి అప్పుడు అతడి చేతుల మీదగా ట్రోఫీని ఎలా తీసుకుంటాము? అతడి నుంచి మేము ఆసియా కప్ ట్రోఫీని తీసుకోకూడదని ముందే నిర్ణయించుకున్నాము. అతడు చేతుల మీదగా తీసుకోవడం లేదంటే ట్రోఫీ వద్దని కాదు. ట్రోఫీని, పతకాలను హోటల్ గదికి తీసుకువెళ్లే హక్కు ఎవరు ఇచ్చారు? నఖ్వీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు. అతడికి కొంచెం కూడా జ్ఞానం లేదు. ఈ విషయంపై మేం ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ట్రోఫీ, పతకాలు వీలైనంత త్వరగా భారత్కు పంపిస్తారని ఆశిస్తున్నా" అని ఎఎన్ఐతో సైకియా పేర్కొన్నాడు.చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్ -
పట్టు బట్టిన పీసీబీ చైర్మెన్.. ఊహించని షాకిచ్చిన భారత్
ఆసియాకప్-2025 విజేతగా టీమిండియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దాయాది పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. తొమ్మిదో సారి ఆసియాకప్ టైటిల్ను ముద్దాడింది. ప్రత్యర్ధి నిర్ధేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది.భారత విజయంలో మిడిలార్డర్ బ్యాటర్, హైదరాబాదీ తిలక్ వర్మ (53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 69 పరుగులు నాటౌట్) కీలక పాత్ర పోషించాడు. లక్ష్య చేధనలో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ తన అద్బుత ఇన్నింగ్స్తో ఛాంపియన్గా నిలిపాడు.అతడితో పాటు సంజూ శాంసన్(24), శివమ్ దూబే(33) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. బుమ్రా, వరుణ్, అక్షర్ తలా రెండు వికెట్లు సాధించారు.ట్రోఫీని నిరాకరించిన భారత్.. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత హైడ్రామా చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసి 45 నిమిషాల సమయం దాటినా బహుమతి ప్రదానోత్సవం జరగలేదు. దాంతో ఏం జరిగిందనే అంశంపై చర్చ మొదలైంది. భారత జట్టు విజేత ట్రోఫీని స్వీకరించే విషయంలో వివాదం నెలకొనడమే అందుకు కారణమని తేలింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్ను అందుకునేది లేదని టీమిండియా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్-చైర్మన్ ఖలీద్ అల్ జరూని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్ అమీనుల్ ఇస్లాం ట్రోఫీని అందించడానికి ముందుకొచ్చారు. అందుకు టీమిండియా కూడా అంగీకరించింది. కానీ మొహసిన్ నఖ్వీ మాత్రం తనే స్వయంగా ట్రోఫీ అందిస్తాని పట్టుబట్టాడు. దీంతో భారత్ ప్రేజెంటేషన్ వేడుకునే కాకుండా ఏకంగా ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించింది. దెబ్బకు పీసీబీ చైర్మెన్తో పాటు పాక్ ఆటగాళ్లు షాకయ్యారు.కేవలం పాక్ ఆటగాళ్లు మాత్రమే రన్నరప్ మెడల్స్ను అందుకున్నారు. భారత్ నుంచి తిలక్, దూబే, అభిషేక్ మాత్రం స్పాన్సర్ల నుంచి తమ వ్యక్తిగత బహుమతులు అందుకున్నారు. అయితే ఫైనల్ వేడుక ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి.Big Breaking 🚨🚨Team India refuses to accept the Asia Cup 2025 Trophy 🏆 from Pakistan interior minister and ACC Chairman Mohsin Naqvi.Someone just picked up the trophy and walked off the ground.Another Embarrassing Moment for 🇵🇰Video 📷#INDvsPAK #AsiaCupFinal #Tilak pic.twitter.com/h4CrRZgcUF— Globally Pop (@GloballyPop) September 28, 2025చదవండి: ‘ఠాకూర్’ జితాదియా... -
అందుకే ఆసియా కప్లో ఆడుతున్నాం!.. అవునా?.. నిజమా?!
‘నో- షేక్హ్యాండ్’ వివాదంలో రచ్చ చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆఖరికి తలవంచకతప్పలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్పై పీసీబీ చేసిన ఫిర్యాదులకు ఆధారాల్లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాక్ బోర్డు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయింది. ఫలితంగా ‘బాయ్కాట్’ నాటకాన్ని పక్కనపెట్టిన పాక్ జట్టు.. యూఏఈతో బుధవారం మ్యాచ్ ఆడింది. అంతేకాదు ఈ మ్యాచ్కు రిఫరీ కూడా ఆండీనే కావడం విశేషం. అయితే, ‘సమాచార లోపం కారణంగానే ఇది జరిగిందంటూ పైక్రాఫ్ట్ మాకు క్షమాపణ చెప్పారు. ఆడియో లేని వీడియో.. చీప్ ట్రిక్స్ ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరిపిస్తామని ఐసీసీ కూడా చెప్పింది’ అంటూ పీసీబీ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పైక్రాఫ్ట్తో తమ బృందం చర్చిస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. అయితే పాక్ ఏదైనా రుజువులు చూపిస్తే తప్ప వారి ఆరోపణలపై తాము విచారణ చేసే అవకాశాలు లేవని ఐసీసీ అధికారి ఒకరు స్పష్టం చేసినట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఆడియో లేకుండా పాక్ విడుదల చేసిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరీ ఇలాంటి చీప్ ట్రిక్స్ పనికిరావని.. నిజంగానే రిఫరీ క్షమాపణ చెప్పి ఉంటే ఆడియో కూడా పెట్టాల్సిందని చురకలు అంటిస్తున్నారు.బాయ్కాట్కు అందరి మద్దతు ఉంది.. కానీఇదిలా ఉంటే.. తాము ఆసియా కప్ నుంచి వైదొలగకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ మండలి ప్రస్తుత అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. ‘‘సెప్టెంబరు 14 తర్వాత జరిగిన పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. మ్యాచ్ రిఫరీ విషయంలో మేము అభ్యంతరాలు లేవనెత్తాము.కాసేపటి క్రితమే మ్యాచ్ రిఫరీ మా జట్టు కోచ్, కెప్టెన్, మేనేజర్తో మాట్లాడారు. నో- షేక్హ్యాండ్ ఘటన జరగకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ విషయంలో విచారణ జరపాల్సిందేనని మేము ముందుగానే ఐసీసీకి ఫిర్యాదు చేశాం.రాజకీయాలు, క్రీడలను కలపకూడదు. ఆటను ఆటగానే ఉండనివ్వాలి. ఒకవేళ మనం బాయ్కాట్ చేస్తే.. అదొక అతిపెద్ద నిర్ణయం అవుతుంది. మనకు ప్రధాన మంత్రి, ప్రభుత్వ అధికారులు, ప్రజల మద్దతు ఉంది. చింత చచ్చినా పులుపు చావలేదు!కానీ ఈ విషయాన్ని మేము నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం’’ అంటూ నక్వీ అసలు కారణం చెప్పకుండా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా రిఫరీ విషయంలో తమదే పైచేయి అయినందన్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.కాగా సెప్టెంబరు 14న పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత జట్టు పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించింది. దీంతో అవమానభారంతో రగిలిపోయిన పాక్.. బాయ్కాట్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అయితే, ఒకవేళ నిజంగానే వాళ్లు ఈ టోర్నీని బహిష్కరిస్తే మిగతా వారికి వచ్చే నష్టమేమీ లేదు.వారికే నష్టంఇప్పటికే ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న పాక్ బోర్డు పరిస్థితి మాత్రం మరింత దిగజారడం ఖాయం. టోర్నీ నుంచి రావాల్సిన ఆదాయం కోసమే కొనసాగినా.. నక్వీ ఇలా సాకులు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుధవారం నాటి మ్యాచ్లో యూఏఈని ఓడించిన పాక్.. సూపర్-4కు అర్హత సాధించింది. ఈ క్రమంటో సెప్టెంబరు 21న సల్మాన్ ఆఘా బృందం టీమిండియాను ఢీకొట్టనుంది.చదవండి: అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్ -
పాకిస్తాన్ భారత్లో మ్యాచ్లు ఆడదు: పీసీబీ చీఫ్
భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే వరల్డ్కప్ (ICC Women's ODI World Cup) కోసం పాకిస్తాన్ జట్టు భారత్లో పర్యటించబోదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహసిన్ నఖ్వీ శనివారం స్పష్టంచేశారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల ఐసీసీ పురుషుల చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్లో పర్యటించేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో రోహిత్ సేన ఆడే మ్యాచ్లను ‘హైబ్రీడ్ మోడల్’లో దుబాయ్లో నిర్వహించారు. ఇప్పుడదే రీతిన మహిళల వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్ ఆడనున్న మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించనున్నారు. దీనికి గతంలోనే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకారం తెలిపాయి. ‘భారత జట్టు పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ ఆడలేదు. తటస్థ వేదికపై మ్యాచ్లు ఆడింది. ఇప్పుడు మహిళల ప్రపంచకప్ విషయంలోనే అదే జరుగుతుంది. ఆతిథ్య హోదాలో భారత్ నిర్ణయించిన తటస్థ వేదికపై మ్యాచ్లు ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సిద్ధంగా ఉంది’అని నఖ్వీ పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ –అక్టోబర్లలో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్కప్ టోర్నీ జరుగనుంది.వెస్టిండీస్ అవుట్.. బంగ్లాదేశ్ క్వాలిఫైభారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్కు బంగ్లాదేశ్ అర్హత సాధించింది. పాకిస్తాన్లో జరుగుతున్న వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా బంగ్లాదేశ్ వరల్డ్కప్ బెర్త్ దక్కించుకుంది. లాహోర్లో శనివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రితూ మోని (48; 5 ఫోర్లు), ఫహీమా ఖాతూన్ (44 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ మహిళల జట్టు 39.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’మునీబా అలీ (93 బంతుల్లో 69; 8 ఫోర్లు), ఆలియా రియాజ్ (52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) సత్తాచాటారు.ఈ టోర్నీలో ఆడిన 5 మ్యాచ్ల్లోనూ గెలిచిన పాకిస్తాన్ 10 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలవగా... బంగ్లాదేశ్ జట్టు 5 మ్యాచ్ల్లో 3 విజయాలు, 2 పరాజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకున్న బంగ్లాదేశ్ రెండో ‘ప్లేస్’దక్కించుకుంది. వెస్టిండీస్ కూడా 5 మ్యాచ్ల్లో 3 విజయాలు, 2 ఓటములతో 6 పాయింట్లు సాధించినా... రన్రేట్లో స్వల్పంగా మెరుగ్గా ఉన్న బంగ్లాదేశ్ ముందంజ వేసింది. మాథ్యూస్ మెరుపులు వృథా... వెస్టిండీస్ మహిళల జట్టుకు నిరాశ తప్పలేదు. థాయ్లాండ్తో మ్యాచ్లో 10 ఓవర్లలో లక్ష్యఛేదన పూర్తిచేస్తే మెరుగైన రన్రేట్తో వరల్డ్కప్నకు అర్హత సాధించే అవకాశం ఉండగా...ఐదు బంతుల తేడాతో అవకాశం కోల్పోయింది. ఆ జట్టు 10.5 ఓవర్లలో 168 పరుగులు చేసింది. మొదట థాయ్లాండ్ మహిళల జట్టు 46.1 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. నాథకన్ చాంతమ్ (66; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్ 4, ఆలియా అలీనె 3 వికెట్లు పడగొట్టింది.అనంతరం ఛేదనలో విండీస్ 10.5 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెపె్టన్ హేలీ మాథ్యూస్ (29 బంతుల్లో 70; 11 ఫోర్లు, 2 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... షినెల్ హెన్రీ (17 బంతుల్లో 48; 3 ఫోర్లు, 5 సిక్స్లు) దంచికొట్టింది.మాథ్యూస్ మెరుపులతో కరీబియన్ జట్టు సునాయాసంగా గమ్యాన్ని చేరేలా కనిపించినా... కీలక సమయంలో ఆమె అవుట్ కావడం విండీస్ అవకాశాలను దెబ్బకొట్టింది. చివర్లో హెన్రీ విజృంభించినా... అది సాధ్యపడలేదు. లీగ్ మ్యాచ్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 0.639 రన్రేట్తో నిలవగా... వెస్టిండీస్ 0.626తో నిలిచింది. అంటే 0.013 తేడాతో వెస్టిండీస్ వరల్డ్కప్ పోటీ నుంచి తప్పుకొంది. చదవండి: కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ -
ఏసీసీ నూతన చైర్మన్గా పాక్ క్రికెట్ బోర్డు చీఫ్
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) కొత్త చైర్మన్గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ ఎన్నికయ్యారు. శ్రీలంక క్రికెట్ (SLC) అధిపతి షమ్మీ సిల్వా స్థానంలో నఖ్వీ నియమితులయ్యారు. గురువారం మధ్యాహ్నం జరిగిన సంస్థ ఖండాంతర సభ్యుల ఆన్లైన్ సమావేశం ద్వారా ACC నాయకత్వ మార్పు నిర్ధారించబడింది. నఖ్వీ ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉంటారు. చైర్మన్ మార్పుకు సంబంధించి ACC నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. సమావేశానికి హాజరైన పలువురు సభ్యులు నఖ్వీ ఎన్నికైన విషయాన్ని మీడియాకు వెల్లడించారు.సెప్టెంబర్లో జరగాల్సిన ఆసియా కప్ను నిర్వహించడం నఖ్వీ ముందున్న ప్రథమ పరీక్ష. వాస్తవానికి ఈ టోర్నీ భారత్లో జరగాల్సి ఉండింది. అయితే భారత్, పాక్ మధ్య దౌత్యపరమైన సమస్యలు ఉండటం చేత టోర్నీని తటస్థ వేదికపై నిర్వహించనున్నారు. రెండు నెలల క్రితం ఆసియా కప్ మీడియా హక్కులను విక్రయించే సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఆరు జట్లు పాల్గొనే ఆసియా కప్ను నిర్వహించే తటస్థ దేశం ఏది అనేది నఖ్వీ నిర్ణయించాల్సి ఉంటుంది. టోర్నీ నిర్వహణ రేసులో యూఏఈ పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ.. శ్రీలంక కూడా పోటీలో ఉంది. -
సిగ్గుచేటు.. పరువు తీస్తున్నారు: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరుపై ఆ దేశ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) మండిపడ్డాడు. వరుస పరాజయాలతో పరువు తీస్తున్నారని.. ఇందుకు కారణం పాక్ క్రికెట్ బోర్డు (PCB) చెత్త నిర్ణయాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ క్రికెట్ బాగుపడాలంటే పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ వెంటనే రాజీనామా చేయాలని సూచించాడు.వరుస పరాజయాలుకాగా పాక్ జట్టు గత కొన్ని రోజులుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్ విజయాల తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. సొంతగడ్డపై సౌతాఫ్రికా- న్యూజిలాండ్తో త్రైపాక్షిక వన్డే సిరీస్లో ఓటమి పాలైంది.అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి ఘోర పరాభవం పాలైంది. న్యూజిలాండ్, టీమిండియాతో మ్యాచ్లలో ఓడి.. గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. అనంతరం టీ20 కొత్త కెప్టెన్ సల్మాన్ ఆఘా సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ మరోసారి దారుణంగా విఫలమైంది.ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో ఆతిథ్య కివీస్ జట్టుకు కోల్పోయింది. ఇక వన్డే సిరీస్తో మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్గా రీఎంట్రీ ఇవ్వగా.. తొలి మ్యాచ్లో ఘోర పరాజయం చవిచూసిన పాక్.. రెండో వన్డేలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.84 పరుగుల తేడాతోమూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన రెండో వన్డేలో 84 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పాక్పై విజయం సాధించింది. తద్వారా 2–0తో సిరీస్ చేజిక్కించుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మిచెల్ హే (78 బంతుల్లో 99 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్స్లు) అజేయ శతకానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు.పాక్ బౌలర్ వసీమ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో హే 2,0,6,6,4,4తో 22 పరుగులు పిండుకున్నాడు. కివీస్ ఇతర బ్యాటర్లలో మొహమ్మద్ అబ్బాస్ (41; 3 ఫోర్లు), నిక్ కెల్లీ (31; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ వసీమ్, సుఫియాన్ ముఖీమ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ పూర్తిగా తడబడింది. 41.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది.ఫహీమ్ అష్రఫ్ (80 బంతుల్లో 73; 6 ఫోర్లు, 3 సిక్స్లు), నసీమ్ షా (44 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధశతకాలతో పోరాడారు. వీరిద్దరికీ ఈ ఫార్మాట్లో ఇవే మొదటి హాఫ్ సెంచరీలు. కివీస్ బౌలర్ల ధాటికి పాకిస్తాన్ ఒకదశలో 32 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (5), బాబర్ ఆజమ్ (1), అబ్దుల్లా షఫీఖ్ (1), ఇమాముల్ హక్ (3), సల్మాన్ ఆఘా (9) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.చివర్లో ఫహీమ్, నసీమ్ షా ధాటిగా ఆడటంతో పాకిస్తాన్ 200 పరుగుల మార్క్ దాటగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్ సియర్స్ 5 వికెట్లు పడగొట్టగా... జాకబ్ డఫీ 3 వికెట్లు తీశాడు. మిచెల్ హేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.సిగ్గుచేటు.. పరువు తీస్తున్నారుఈ నేపథ్యంలో పాక్ జట్టు వరుస వైఫల్యాలపై మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఘాటుగా స్పందించాడు. ‘‘నిజంగా ఇది సిగ్గు చేటు. పీసీబీ చైర్మన్ పరిస్థితులను చక్కదిద్దకపోయినట్లయితే.. వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలి.అంతేగానీ.. పాక్ క్రికెట్కు ఉన్న పేరును నాశనం చేయకండి. ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రస్తుత జట్టు పరిస్థితిని బాగుచేయండి’’ అని కమ్రాన్ అక్మల్ మండిపడ్డాడు. కాగా న్యూజిలాండ్- పాకిస్తాన్ మధ్య నామమాత్రమైన చివరి వన్డే శనివారం మౌంట్మాంగనీలో జరుగుతుంది. చదవండి: నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించింది: సెహ్వాగ్ ప్రశంసలు -
అతడి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయండి: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నాడు. బాబర్ ఆజం (Babar Azam) నుంచి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పర్యటనల్లో అద్వితీయ విజయాలు అందుకున్న రిజ్వాన్.. సొంతగడ్డపై మాత్రం తేలిపోయాడు.న్యూజిలాండ్- సౌతాఫ్రికాలతో వన్డే త్రైపాక్షిక సిరీస్తో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా పేలవ ప్రదర్శనతో విమర్శలపాలవుతున్నాడు. ఈ క్రమంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతడికి గట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే. టీ20 జట్టు కెప్టెన్గా రిజ్వాన్ను తొలగించి.. సల్మాన్ ఆఘాకు ఆ బాధ్యతలు అప్పగించింది.ఇదిలా ఉంటే.. రిజ్వాన్ తాజాగా పీసీబీ ఆదేశాలను బేఖాతరు చేసినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో ఆడకుండా అతడు.. పెషావర్లో ఓ స్థానిక క్లబ్కు ఆడినట్లు తెలుస్తోంది. ఇలా నేషనల్ టీ20 కప్ ఆడకుండా.. క్లబ్ క్రికెట్కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సికందర్ బక్త్ తప్పుబట్టాడు.పీసీబీని అవమానించాడు.. ఈ విషయంలో రిజ్వాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీకి సూచించాడు. ‘‘నెలకు రూ. 60 లక్షలు తీసుకుంటున్నాడు. మరి జాతీయ జట్టు ఆటగాళ్లు పీసీబీ నిర్వహించే దేశీ మ్యాచ్లలో ఎందుకు ఆడరు? దేశవాళీ క్రికెట్ ఆడకుండా.. క్లబ్ క్రికెట్కు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రిజ్వాన్ పీసీబీని దారుణంగా అవమానించాడు.సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయండిమొహ్సిన్ నక్వీ మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని తెలుసు. అయితే, ఈసారి మాత్రం ఆయన తన వైఖరి మార్చుకోవాలి. ఇలాంటి వాళ్లపై కొరడా ఝులిపించాల్సిందే. పీసీబీని పట్టించుకోని ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు రద్దు చేసే దిశగా ఆలోచన చేయాలి’’ అని సికందర్ బక్త్ పేర్కొన్నాడు.బ్యాటర్గానూ విఫలంకాగా కెప్టెన్గా ఆస్ట్రేలియా గడ్డ మీద వన్డే సిరీస్ గెలవడంతో పాటు.. సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేయడం ద్వారా రిజ్వాన్ ప్రశంసలు అందుకున్నాడు. కానీ.. ఆ తర్వాత వరుస పరాజయాల కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అతడి సారథ్యంలో పాకిస్తాన్.. గ్రూప్ దశలో న్యూ జిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడిపోయింది.ఇక ఆఖరిదైన మూడో మ్యాచ్ వర్షం వల్ల టాస్ పడకుండానే రద్దు కావడంతో గెలుపున్నదే లేకుండా ఈ వన్డే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మెగా ఈవెంట్లో రిజ్వాన్ కివీస్తో మ్యాచ్లో 3, భారత్తో మ్యాచ్లో 46 పరుగులు చేశాడు. రోహిత్ సేనతో పోరులో రిజ్వాన్ స్లో ఇన్నింగ్స్ వల్ల పాకిస్తాన్కు చేదు అనుభవం ఎదురైందని ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శించడం గమనార్హం. కాగా పాక్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా కివీస్తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్లు ఆడుతుంది.చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే! -
టీమిండియాను అవమానించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత టీమిండియాపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ తన అక్కసును వెళ్లగక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయవంతం కావడంపై ట్వీట్ చేస్తూ టోర్నీ విజేత భారత్ను విస్మరించాడు. తన ట్వీట్లో నఖ్వీ ఛాంపియన్స్ టీమిండియా పేరెత్తకుండా మిగతా విషయాలన్నిటిని ప్రస్తావించాడు. ఇది ఓ లెక్కన టీమిండియాకు అవమానమేనని భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. తమ దేశం ఆతిథ్యమిచ్చిన టోర్నీలో సొంత జట్టు కనీసం గ్రూప్ దశ కూడా దాటలేకపోగా.. భారత్ ఛాంపియన్గా అవతరించడాన్ని నఖ్వీ జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే అతను దుబాయ్లో జరిగిన టోర్నీ ముగింపు వేడుకకు కూడా హాజరుకాలేదు. టోర్నీ ఆతిథ్య బోర్డు అధ్యక్షుడి హోదాలో నఖ్వీ ముగింపు వేడుకకు రావాల్సి ఉన్నా ఓ సాధారణ ఉద్యోగిని పంపి చేతులు దులుపుకున్నాడు. ఇలా చేసినందుకు ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న జై షా పాక్కు గట్టిగానే బుద్ది చెప్పాడు. పీసీబీ పంపించిన ఉద్యోగిని ప్రోటోకాల్ సాకుగా చూపి పోడియంపైకి అనుమతించలేదు. ఈ టోర్నీ ప్రారంభం కాక ముందు నుంచి నఖ్వీ ఏదో ఒక రూపంలో భారత్ తన అయిష్టతను బహిర్గతం చేస్తూనే ఉన్నాడు. టీమిండియా తమ జెర్సీలపై పాక్ పేరును తప్పక ఉంచుకోవాలని పట్టుబట్టి మరీ ఐసీసీ చేత ఒప్పించుకున్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందు అన్ని దేశాల జాతీయ జెండాలను ప్రదర్శించి, ఒక్క భారత జెండాను మాత్రమే విస్మరించాడు. భద్రతా కారణాల చేత టీమిండియా పాక్లో అడుగుపెట్టేందుకు నిరాకరించినందుకు ఏదో ఒక రీతిలో భారత్పై అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు. తాజాగా టోర్నీ సక్సెస్ నోట్లో ఛాంపియన్స్ టీమిండియా పేరు ప్రస్తావించుకుండా తన వక్రబుద్దిని చాటుకున్నాడు. ఇలా చేయడంపై కొందరు భారత అభిమానులు మండిపడుతున్నప్పటికీ.. మరికొందరు మాత్రం లైట్గా తీసుకుంటున్నారు. వాళ్లు మన జట్టు పేరు ప్రస్తావించడమేంటి.. వారికి అస్సలు టీమిండియా పేరెత్తే అర్హత లేదంటూ కౌంటరిస్తున్నారు.ఇంతకీ ఛాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ నోట్లో నఖ్వీ ఏం రాశాడంటే.. టోర్నీని అద్భుతంగా నిర్వహించిన పీసీబీ అధికారులు, స్టాఫ్కు కృతజ్ఞతలు. టోర్నీ నిర్వహణకు సహకరించిన ప్రాంతీయ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. టోర్నీ నిర్వహణలో తమకు సహకరించిన ఐసీసీ అధికారులకు మరియు పాకిస్తాన్కు ప్రయాణించిన అద్భుతమైన క్రికెట్ జట్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి నిబద్ధత మరియు సమిష్టి కృషితోనే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహణ విజయవంతమైంది. ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించినందుకు యావత్ పాకిస్తాన్ గర్వపడుతుంది.కాగా, మార్చి 9న దుబాయ్లో జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్పై విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్తో జరిగిన పోరులో పాక్ యధా మామూలుగా చిత్తుగా ఓడింది. పసికూన బంగ్లాదేశ్పై అయినా విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలనుకుంటే అది కాస్త వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు టోర్నీ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ పాక్కు చుక్కలు చూపించింది. ఇలా స్వదేశంలో జరిగిన టోర్నీలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న పాక్, అవమాన భారంతో నిష్క్రమించింది. -
CT 2025: టీమిండియా మ్యాచ్లన్నీ అక్కడే.. ఐసీసీ నిర్ణయం ఇదే
చాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాట నెగ్గింది. బీసీసీఐ పట్టుబట్టినట్లుగానే హైబ్రిడ్ మోడల్తో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీతో శనివారం స్వయంగా ప్రకటన వెలువరించేందుకు ఏర్పాట్లు చేసింది. పీసీబీ చీఫ్ శనివారం ఇందుకు సంబంధించి ప్రకటన చేస్తారని ఐసీసీ వర్గాలు తెలిపాయి.టీమిండియా మ్యాచ్లన్నీ అక్కడేమరోవైపు.. ఐసీసీ చైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా బ్రిస్బేన్ నుంచి వర్చువల్ ఈ సమావేశంలో పాల్గొని అధికారికంగా ప్రకటన చేస్తారని తెలిసింది. వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో నిర్వహిస్తారు. చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్లు అన్నీ ఇక హైబ్రిడ్ పద్ధతిలోనేఇదొక్క టోర్నీయే కాదు... ఇకపై అన్ని ఐసీసీ టోర్నీలకు చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్లు హైబ్రిడ్ పద్ధతిలోనే నిర్వహిస్తారు. అంటే వచ్చే ఏడాది భారత్లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్లో ఆడేందుకు పాకిస్తాన్ ఇక్కడకు రాదు. భారత్ మాదిరే పాక్ మ్యాచ్ల్ని కూడా తటస్థ వేదికపై నిర్వహిస్తారు. అదే విధంగా.. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే పురుషుల టీ20 ప్రపంచకప్ కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే జరుగుతుంది. భద్రతా కారణాల దృష్ట్యాకాగా వన్డే వరల్డ్కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే, డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఫలితంగా నేరుగా ఈ ఈవెంట్కు క్వాలిఫై అయింది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. భారత విదేశాంగ శాఖ సైతం బోర్డు నిర్ణయాన్ని సమర్థించింది. ఈ నేపథ్యంలో అనేక చర్చల అనంతరం టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. వేదిక మొత్తాన్ని తరలిస్తామంటూ ఐసీసీ కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధం కావడంతో పట్టువీడి హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకొంది. అయితే, తాము కూడా ఐసీసీ ఈవెంట్ల కోసం ఇకపై భారత్లో పర్యటించబోమన్న షరతు విధించినట్లు తాజా పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది.చదవండి: Vijay Merchant Trophy: సెంచరీతో చెలరేగిన ద్రవిడ్ చిన్న కుమారుడు.. బౌండరీల వర్షం -
డబ్బు కోసం అలా చేయము: పట్టువీడని పాకిస్తాన్.. ఐసీసీ నిర్ణయం?
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నక్వీ కీలక వ్యాఖ్యలు చేశాడు. డబ్బు కోసం ఆతిథ్య హక్కులను అమ్ముకోబోమని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో.. తమకు అంతిమంగా దేశ ప్రయోజనాలే ముఖ్యమని నక్వీ పేర్కొన్నాడు. కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్కు టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ అర్హత సాధించగా.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది. పాకిస్తాన్కు పంపే ప్రసక్తి లేదుఅయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను పాకిస్తాన్కు పంపే ప్రసక్తి లేదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి స్పష్టం చేసింది.హైబ్రిడ్ విధానం కావాలిఈ నేపథ్యంలో టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానం తెరమీదకు వచ్చింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. మిగతా జట్లన్నీ తమ దేశానికి వస్తున్నాయని.. రోహిత్ సేన కూడా రావాల్సిందేనని పట్టుబడుతోంది. అయితే, బీసీసీఐ మాత్రం తమ ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేదు.ఈ క్రమంలో పీసీబీకి ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు చేకూరేలా ఐసీసీ ఆఫర్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. నవంబరు 29 నాటి సమావేశంలో ఇందుకు సంబంధించి తుదినిర్ణయం వెలువడనుందని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ గురువారం తెల్లవారుజామున మీడియాతో మాట్లాడాడు.ఐసీసీ నిర్ణయం ఏమిటో?!‘‘పాకిస్తాన్ క్రికెట్కు ఏది మంచో అదే చేస్తాం. ఐసీసీ చైర్మన్తో నేను సంప్రదింపులు జరుపుతున్నాను. ఒకవేళ టీమిండియా ఇక్కడికి రాకపోతే మేము కూడా ఇకపై భారత్లో ఆడబోమని కచ్చితంగా చెప్పేశాం. సమానత్వ భావన ముఖ్యం. ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.అదైతే ఎప్పటికీ జరుగదుఏదేమైనా డబ్బు కోసం ఆతిథ్య హక్కులను మాత్రం అమ్ముకోమని నేను మీకు వాగ్దానం చేస్తున్నా. అదైతే ఎప్పటికీ జరుగదు. అయితే, అంతిమంగా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం’’ అని నక్వీ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్లో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపుతప్పిన విషయం తెలిసిందే.అదుపుతప్పిన శాంతి భద్రతలుపాకిస్తాన్కు వరల్డ్కప్ ట్రోఫీ అందించిన మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలతో ఇస్లామాబాద్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్(పీటీఐ) పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. ఫలితంగా దేశంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఇలాంటి తరుణంలో పాక్లో మెగా టోర్నీ నిర్వహించడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశం ఉంది.చదవండి: డేంజర్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంక -
ఐదుగురిని సంప్రదించా.. త్వరలోనే కొత్త కోచ్ ఎంపిక: పీసీబీ చీఫ్
దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్స్టెన్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నక్వీ స్పందించాడు. కిర్స్టెన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని.. ఈ క్రమంలోనే అతడితో తమ బంధం ముగిసిందని పేర్కొన్నాడు. త్వరలోనే పాక్ పరిమిత ఓవర్ల జట్టుకు కొత్త కోచ్ను నియమిస్తామని తెలిపాడు.అందుకే రాజీనామా!కాగా పాకిస్తాన్ వన్డే, టీ20 జట్లకు హెడ్ కోచ్గా ఉన్న గ్యారీ కిర్స్టెన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన బాధ్యతల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు అతడు సోమవారం ప్రకటించాడు. రెండేళ్ల కాంట్రాక్ట్ వ్యవధితో ఈ ఏడాది ఏప్రిల్లో కిర్స్టెన్ను ప్రధాన కోచ్గా పీసీబీ నియమించింది. కానీ.. కనీసం ఆరు నెలలు కూడా అతడు కోచ్గా పని చేయలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ వెళ్లనున్న నేపథ్యంలో కిర్స్టెన్ తన పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. అయితే, జట్టు ఎంపిక విషయంలో తనకు ఉన్న అధికారాలను తప్పించడం పట్ల కలత చెందిన కిర్స్టెన్ రాజీనామా చేసినట్లు సమాచారం. పరిమిత ఓవర్ల జట్లకు కెప్టెన్లను ఎంపిక చేసే విషయంలో తన సూచనలను కనీసం పరిగణనలోకి తీసుకోకపోగా... తాను దేశంలోనే లేని సమయంలో జట్టును ప్రకటించడంపై పీసీబీ అధికారులతో కిర్స్టెన్ వాదనకు దిగినట్లు తెలిసింది.కాగా ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ తొలి టెస్టులో చిత్తయిన తర్వాత పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దని కిర్స్టెన్కు పీసీబీ సూచించడం గమనార్హం. ఇక కిర్స్టెన్తో టెస్టు టీమ్ హెడ్ కోచ్గా ఉన్న జాసన్ గిలెస్పీ కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నా... ఇంగ్లండ్తో తర్వాతి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించి పాక్ సిరీస్ గెలుచుకోవడంతో ఈ అంశం కాస్త వెనక్కి వెళ్లింది. ఒక్క వన్డే ఆడకుండా... ఇదిలా ఉంటే.. కిర్స్టెన్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్లో బరిలోకి దిగింది. గ్రూప్ దశలో భారత్, అమెరికా చేతుల్లో పరాజయంతో సూపర్–8 దశకు కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాను వన్డే వరల్డ్ చాంపియన్గా నిలిపిన రికార్డు ఉన్న కిర్స్టెన్ను ఎంపిక చేసినప్పుడు ప్రధానంగా తమ వన్డే టీమ్ను తీర్చిదిద్దే విషయంపైనే బాధ్యతలు అప్పగించారు.అంతేకాదు.. 2025లో పాకిస్తాన్ వేదికగా జరిగే చాంపియన్స్ ట్రోఫీలో తమ టీమ్ను విజేతగా నిలపాలని...అందు కోసం ఆయన ఆలోచనల ప్రకారం జట్టును మలిచే అధికారాన్ని పీసీబీ ఇచ్చింది. అయితే ఈ ఆరు నెలల వ్యవధిలో పాక్ ఒక్క వన్డే కూడా ఆడకపోవడం విశేషం!గిలెస్పీకి వన్డే, టీ20 కోచ్గా తాత్కాలిక బాధ్యతలుమరోవైపు ప్రస్తుతం టెస్టు కోచ్గా ఉన్న ఆసీస్ మాజీ పేస్ బౌలర్ గిలెస్పీకి వన్డే, టీ20 కోచ్గా తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు పీసీబీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘కిర్స్టెన్ పీసీబీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. అంతేకాదు.. బోర్డు నిబంధనల్లో కొన్నిటిని ఉల్లంఘించాడు. మాతో కాంట్రాక్టును అతడే ముగించుకున్నాడు’’ అని తెలిపాడు.ఐదుగురిని సంప్రదించాఇక జింబాబ్వే పర్యటన సందర్భంగా తమ వన్డే, టీ20 జట్లకు కొత్త కోచ్ వస్తాడని నక్వీ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా గడ్డపై పాక్ ఆడే మూడు వన్డేలు, మూడు టీ20 వరకు మాత్రమే తాను కోచ్గా పని చేస్తానని గిల్లెస్పీ చెప్పాడని పేర్కొన్నాడు. అతడికి పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకునే ఉద్దేశం లేదని తెలిపిన నక్వీ.. కొత్త కోచ్ అన్వేషణలో భాగంగా ఇప్పటికే తాను ఐదుగురిని సంప్రదించానని పేర్కొన్నాడు. చదవండి: IPL 2025: అత్యంత ఖరీదైన ఆటగాడు అతడే.. పది జట్ల రిటెన్షన్ లిస్టు ఇదే! -
టీమిండియా పాకిస్తాన్కు రావాల్సిందే: పీసీబీ చీఫ్
చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ టీమిండియాను తమ దేశానికి రప్పించాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం గురించి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వద్ద తమ వాదనను వినిపించిన పాక్ బోర్డు.. భారత జట్టు కోసం వేదికను తరలించవద్దని విజ్ఞప్తి చేసింది.వేదిక మార్చబోమన్న ఐసీసీ ఇందుకు తాము సానుకూలంగా ఉన్నట్లు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ ఇటీవల సంకేతాలు ఇచ్చాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డే(పీసీబీ) ఈ మెగా టోర్నీని నిర్వహిస్తుందని.. వేదికను మార్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాడు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం ఇందుకు సుముఖంగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి.కేంద్రం అనుమతినిస్తేనేఆటగాళ్ల భద్రత దృష్ట్యా పాకిస్తాన్ పర్యటనకు పంపకూడదని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. టీమిండియా పాకిస్తాన్కు వెళ్తుందా? లేదా అనేది భారత ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశాడు. కేంద్రం అనుమతినిస్తేనే తమ జట్టు ఏ టూర్కైనా వెళ్లుందని.. పాకిస్తాన్ కూడా ఇందుకు మినహాయింపుకాదని పేర్కొన్నాడు.జైశంకర్తో భేటీ కానున్న పీసీబీ చీఫ్?ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ కీలక ముందడుగు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో నక్వీ భేటీ కానున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్ పాకిస్తాన్కు వెళ్లనున్న విషయం తెలిసిందే.ఇస్లామాబాద్లో అక్టోబరు 15-16 తేదీల్లో ఈ సమ్మిట్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో నక్వీ జైశంకర్ను కలిసి.. టీమిండియా పాక్ పర్యటన గురించి మాట్లాడాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న ఈ ఐసీసీ టోర్నీ వీక్షించేందుకు ఆయనను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.అన్ని జట్లు ఇక్కడకు రావాల్సిందేఇందుకు సంబంధించిన ప్రొటోకాల్స్, భద్రతా అంశాల గురించి మొహ్సిన్ నక్వీ.. జైశంకర్కు వివరించనున్నట్లు క్రికెట్ పాకిస్తాన్ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో నక్వీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా ఇక్కడకు వస్తుందనే అనుకుంటున్నాం. పర్యటనను రద్దు చేసుకోవడానికి గానీ.. వాయిదా వేయడానికి గానీ కారణాలు లేవు. అన్ని జట్లు ఇక్కడకు రావాల్సిందే’’ అని పేర్కొన్నాడు. కాగా 2008 ఆసియా కప్ తర్వాత ఇంత వరకు భారత జట్టు ఒక్కసారి కూడా పాకిస్తాన్కు వెళ్లలేదు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బీసీసీఐ కూడా పాక్తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లలోనూ పాల్గొనడం లేదు. అయితే, గతేడాది ఆసియా వన్డే కప్-2023 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. టీమిండియా అక్కడకు వెళ్లలేదు. ఎవరి మాట నెగ్గుతుందో?దీంతో రోహిత్ సేన ఆడిన మ్యాచ్లకు తటస్థ వేదికగా శ్రీలంకను ఉపయోగించుకున్నారు. ఇక చాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ ఇదే తరహా హైబ్రిడ్ విధానాన్ని అనుసరించాలని బీసీసీఐ ఐసీసీని కోరినట్లు సమాచారం. కానీ పీసీబీ మాత్రం తమ దేశంలో ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్టు పర్యటించాయని.. ఆటగాళ్ల భద్రత విషయంలో ఆందోళన అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి! కాగా చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్య పాకిస్తాన్తో పాటు టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ అర్హత సాధించాయి.చదవండి: నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్ యాదవ్ -
జై షా స్థానాన్ని భర్తీ చేయనున్న పీసీబీ చీఫ్?
భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ పదవి చేపట్టనున్నారు. ఈ ఏడాది డిసెంబరు 1న ఐసీసీ బాస్గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ఇప్పటికే పూర్తైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జై షా త్వరలోనే బీసీసీఐ కార్యదర్శి పదవి నుంచి తప్పుకోనున్నారు.అదే విధంగా.. ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడిగానూ రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏసీసీ కొత్త ప్రెసిడెంట్ ఎవరన్న చర్చ జరుగుతుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ పేరు తెరమీదకు వచ్చింది. జై షా స్థానాన్ని నక్వీ భర్తీ చేయనున్నాడని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.కొత్త బాస్గా నక్వీ?‘‘వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న ఏసీసీ సమావేశంలో.. కొత్త అధ్యక్షుడిగా మొహ్సిన్ నక్వీ ఎంపిక కానున్నారు. రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు’’ అని ఏసీసీ వర్గాలు వెల్లడించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. కాగా ఆసియా వన్డే కప్-2023 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లలేదన్న సంగతి తెలిసిందే.అయితే, పాక్ బోర్డు మాత్రం భారత జట్టు తమదేశానికి రావాల్సిందేనని పట్టుపట్టగా.. జై షా నేతృత్వంలోని ఏసీసీ హైబ్రిడ్ విధానంలో మ్యాచ్లు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో పాక్తో పాటు శ్రీలంకను ఆతిథ్య దేశంగా ఎంపిక చేసి.. టీమిండియా మ్యాచ్లను అక్కడ నిర్వహించింది. భారత్తో పాటు లంక ఫైనల్కు చేరగా.. టైటిల్ పోరు కూడా శ్రీలంకలోనే జరిగింది. అయితే, జై షా స్థానంలో నక్వీ వస్తే.. భవిష్యత్లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది.ఐసీసీ టోర్నీలకు సన్నాహకాలుగాఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది భారత్లో పురుషుల ఆసియాకప్ జరుగనుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీని2025 సెప్టెంబర్లో నిర్వహించనున్నారు. స్వదేశంలో జరుగనున్న టీ20 ప్రపంచకప్-2026కు ముందుగా ఈ టోర్నీని నిర్వహించడం వల్ల.. ఆసియా దేశాలకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. అనంతరం.. ఆసియా కప్-2027నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది. అదే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో బంగ్లాలో వన్డే ఫార్మాట్లో ఆసియాకప్ నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. -
పాక్ క్రికెట్ను నాశనం చేశారు: పీసీబీ చీఫ్పై ఇమ్రాన్ ఖాన్ ఫైర్
బంగ్లాదేశ్ చేతిలో ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. టెస్టుల్లో తొలిసారి పాక్ బంగ్లాతో మ్యాచ్లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అది కూడా సొంతగడ్డపై ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి షాన్ మసూద్ బృందం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరాడు. అయితే, ఈ ఘోర పరాభవానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న విధానాలే కారణమంటూ చైర్మన్ మొహ్సిన్ నక్వీపై సంచలన ఆరోపణలు చేశాడు. అవినీతిలో కూరుకుపోయిన నక్వీ నేతృత్వంలోని బోర్డు పాక్ క్రికెట్ను భ్రష్టు పట్టిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.పాక్ క్రికెట్ను నాశనం చేశారు‘‘దేశ ప్రజలు టీవీలో ఆసక్తిగా చూసే ఏకైక క్రీడ క్రికెట్. కానీ ఇప్పుడు దానిని కూడా నాశనం చేస్తున్నారు. సమర్థత లేని, తమకు ప్రియమైన అధికారులను నియమించుకోవడం వల్లే పాక్ బోర్డుకు ఈ గతి పట్టింది. వాళ్ల హయాంలో తొలిసారి మన జట్టు వన్డే వరల్డ్కప్ టాప్-4కు చేరలేకపోయింది.టీ20 ప్రపంచకప్-2024 టాప్-8లోనూ నిలవలేకపోయింది. ఇప్పుడు ఏకంగా కనీవినీ ఎరుగని రీతిలో బంగ్లాదేశ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడి పూర్తిగా దిగజారిపోయింది. రెండున్నరేళ్ల క్రితం ఇదే జట్టు టీమిండియాను ఓడించింది కదా! మరి ఈ స్వల్ప కాలంలో అంతగా ఏం జరిగిందని.. ఇంతటి ఘోర పరాభవాలు. ఇందుకు ఎవరిని బాధ్యులను చేయాలి? దీనంతటికీ ఒకే వ్యవస్థ కారణం’’ అంటూ ఇమ్రాన్ ఖాన్ పాక్ బోర్డుపై నిప్పులు చెరిగాడు.పీసీబీ చీఫ్పై ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలుఅదే విధంగా.. నక్వీ దుబాయ్లో తన భార్య పేరు మీద ఐదు మిలియన్ డాలర్ల మేర ఆస్తులు కూడబెట్టాడని.. 2008లో అవినీతి ఆరోపణలపై విచారణ కూడా ఎదుర్కొన్నాడని ఇమ్రాన్ ఖాన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్కు ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాడు. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అనే పార్టీని స్థాపించిన ఇమ్రాన్ ఖాన్.. ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయ్యాడు. అయితే, అవినీతి ఆరోపణలపై అరెస్టైన ఈ మాజీ క్రికెటర్పై ఇతరత్రా కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం అతడు రావల్పిండి సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. అక్కడి నుంచే సోషల్ మీడియా వేదికగా ఈమేరకు సందేశం పంపించాడు.పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు(ఆగష్టు 21- 25)వేదిక: రావల్పిండిటాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 448/6 డిక్లేర్డ్బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 565పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 146 ఆలౌట్బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 30/0ఫలితం: పాకిస్తాన్ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించిన బంగ్లాదేశ్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముష్ఫికర్ రహీం(191 పరుగులు).చదవండి: రిజ్వాన్ ముఖంపైకి బంతి విసిరిన షకీబ్.. ఐసీసీ చర్యలు -
పాక్ స్టేడియాల్లో కనీస వసతులు లేవు.. ఒక్కటీ..: పీసీబీ చీఫ్
పాకిస్తాన్ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా లేవని ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అన్నారు. చాలా స్టేడియాల్లో కనీస వసతులు కూడా లేవని పెదవి విరిచారు. చాంపియన్స్ ట్రోఫీ నాటికి ఈ దుస్థితిని మార్చే దిశగా ప్రక్షాళన చర్యలు చేపట్టామని తెలిపారు.వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేడియాలను పునరుద్దరించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన పీసీబీ పనులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో లాహోర్లో గల ప్రసిద్ధ గడాఫీ స్టేడియాన్ని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ సందర్శించారు.మన స్టేడియాలు బాలేవుఈ సందర్భంగా నఖ్వీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మన స్టేడియాలకు.. అంతర్జాతీయ స్టేడియాలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. మన స్టేడియాల్లో ఒక్కటీ అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా లేదు. ఆ పరిస్థితిని మార్చేందుకు మేము ప్రక్షాళన చర్యలు చేపట్టాం. ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ రాత్రిపగలూ తేడా లేకుండా ఎంతో కష్టపడుతోంది.ప్రథమ ప్రాధా న్యం అదేప్రపంచంలోని అత్యుత్తమ స్టేడియాలలో ఒకటిగా మన స్టేడియాలను తీర్చిదిద్దుతాం. అయితే, అంతకంటే ముందు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించడమే మొదటి ప్రాధాన్యంగా పనిచేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో క్రికెట్ స్టేడియాల పునరుద్ధరణలో భాగంగా పీసీబీ ఇప్పటికే 17 బిలియన్ల పాక్ రూపాయలను కేటాయించినట్లు సమాచారం.ఇక ఈ మెగా టోర్నీ నిర్వహణ కోసం ఐసీసీ పీసీబీకి 70 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. అయితే, ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు టీమిండియా పాక్కు వెళ్లబోదని బీసీసీఐ పెద్దలు చెబుతుండగా.. హైబ్రిడ్ విధానానికి తాము ఒప్పుకోమని పీసీబీ అంటోంది. ఈ విషయంపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి!!చదవండి: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదిక అదే: పీసీబీ చీఫ్


