breaking news
Driver
-
హాలీవుడ్ మోడల్గా ఈ-రిక్షాడ్రైవర్..!
మన కళ్లముందే సాదాసీదాగా కనిపించని వ్యక్తులు ఒక్కసారిగా స్టన్నింగ్ మోడల్ లుక్లో కనిపిస్తే..కచ్చితంగా షాకవ్వతాం. నిజంగా మోడల్ రైంజ్ లుక్ ఉందా వీరికి అని విస్తుపోతాం. అందుకు కావాల్సినంత డబ్బు లేకపోవడంతోనే ముఖాకృతికి సంబంధించిన హంగులు, మేకప్ జోలికి వెళ్లే ఛాన్స్ ఉండదు. దాంతో సాధారణ వ్యక్తుల్లా మన మధ్య ఉంటారు. ఎవరో ఓ టాలెంటెడ్ మేకప్ ఆర్టిస్ట్ లేదా మోడల్నో దాన్ని గుర్తించి వారిలో ఉన్న అద్భుత మోడల్ని వెలికితీస్తారు. అలానే ఇక్కడొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓ రిక్షడ్రైవర్ని ఎంత గ్లామరస్గా మార్చాడో చూస్తే విస్తుపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆ వీడియోలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మోడల్గా తీర్చిదిద్దే మాస్టర్పీస్ కోసం వెదుకుతున్నట్లు కనిపిస్తుంది. ఎదురుగా ఈ రిక్షాడ్రైవర్. అతని లుక్స్లో ఏదో మోడ్రన్ని గుర్తించి మొత్తం అతడి రూపురేఖలనే మార్చేస్తాడు. ఇంట్లో దొరికే పెరుగు, పుదీనా ప్యాక్తో స్కిన్ లుక్, విటమిన్ ఈ వంటి ఆయిల్స్ హెయిర్ని అందంగా మార్చేస్తాడు. మంచి డ్రెస్సింగ్ వేర్తో అతడిలో దాగున్న అద్భుతమైన మరో వ్యక్తిని వెలికితీస్తాడు. నిజంగా ముందున్న లుక్కి ఇప్పుడున్నీ స్టన్నింగ్ లుక్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. కచ్చితంగా ఈ వ్యక్తి అంతకుముందు చూసి వ్యక్తేనే అని మన కళ్లను మనమే నమ్మలేనంతంగా అతడి మొత్తం ఆహార్యాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతాడు ఈ ఇన్ఫ్లుయెన్సర్. నెటిజన్లు కూడా అంత అందంగా మార్చే వ్యక్తి మాక్కూడా కావాలి. బ్రో నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Karron S Dhinggra (@theformaledit) (చదవండి: తొమ్మిది పదుల వయసులో ఆ తల్లికి ఎంత కష్టం..? పాపం కొడుకు కోసం..) -
దుబాయ్కి డ్రైవర్లు కావలెను.. జీతం ఎంతంటే?
సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలో డ్రైవర్లు స్వదేశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. డ్రైవర్లు వంటి అసంఘటిత రంగ కార్మికుల కొరతతో విలవిల్లాడుతోంది. దీంతో భారత్కు వచ్చేసిన డ్రైవర్లను ఆకర్షించేందుకు యూఏఈ కంపెనీలు ముందుకొస్తున్నాయి. దీనికోసం జలంధర్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నియామక డ్రైవ్ను నిర్వహిస్తోంది. దుబాయ్కి చెందిన త్రీస్టార్ గ్రూపు, వియోలీయ, అల్లయ్డ్ ట్రాన్స్పోర్టు, దుబాయ్పోర్ట్ వంటి సంస్థలు డ్రైవర్ల నియామకం కోసం 10, 30వ తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో గణేష్కుమార్ తెలిపారు.కడప, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో దుబాయ్ (Dubai) నుంచి తిరిగి వచ్చిన అనుభవజ్ఞులైన డ్రైవర్లు (Drivers) అత్యధికంగా ఉన్నారని, వారిని గుర్తించి అక్కడ దేశాల్లో ఉపాధి కల్పించేలా స్థానిక అధికారులు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండి యూఏఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ట్రైలర్, ట్రక్, ఐటీవీ డ్రైవర్లుగా అవకాశాలు కల్పించనున్నారు. 24 నుంచి 48 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులని, నెలకు రూ.35,000 నుంచి రూ.94,000 వరకు జీతం లభిస్తుందని ఏపీఎస్ఎస్డీసీ తెలిపింది. డ్రైవింగ్ టెస్ట్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఆగస్టు 10న స్టార్ గ్రూపు, వియోలీయ, అల్లయ్డ్ ట్రాన్స్పోర్టు ఉద్యోగాలకు ఆగస్టు 30న ఐటీవీ డ్రైవర్లకు ఇంటర్వ్యూలు (Interviews) నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏపీఎస్ఎస్డీసీ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. లేదా skillinternational@apssdc.in ఈమెయిల్, 91–99888533 35, 8712655686, 8790118349, 8790117279 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరింది.చదవండి: స్కూల్లో కూలి పనులు చేయిస్తున్నారు -
డిప్యూటీ సీఎం డ్యూటీ.. వెంటనే సీఎం డ్యూటీ
సాక్షి, అమరావతి : ‘సార్.. రాత్రి వరకు డ్యూటీ చేశాను. గంటల తరబడి కాన్వాయ్ వెహికిల్ డ్రైవింగ్ చేశాను. కనీసం రెస్ట్ తీసుకోలేదు. మళ్లీ ఇప్పుడే డ్రైవింగ్ విధులకు వెళ్లాలంటే కష్టం’ అని పోలీస్ వాహనం డ్రైవర్ చెప్పినప్పటికీ ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ‘సీఎం టూర్.. డ్యూటీ చేయాల్సిందే’ అని ఆదేశించారు. పోనీ ఆ పోలీస్ వాహనం కండీషన్ సరిగా ఉందా అంటే అదీ లేదు. ఉన్నతాధికారుల ఆదేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో డ్యూటీ చేశారు ఆ డ్రైవర్. ఫలితంగా తీవ్రమైన రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డీఎస్పీలు దుర్మరణం.. డ్రైవర్తోపాటు ఓ అదనపు ఎస్పీకి తీవ్ర గాయాలు. పోలీసు శాఖలో తీవ్ర విషాదం మిగిల్చిన రోడ్డు ప్రమాదం వెనుక అసలు కారణమిది. పోలీసు శాఖలో ఉన్నతాధికారుల నిర్వాకమే పోలీసు అధికారులను బలి తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ వెళుతున్నందున నిఘా విధుల కోసం విజయవాడ నుంచి అదనపు ఎస్పీ కోకా దుర్గా ప్రసాదరావు, డీఎస్పీలు మేక చక్రధరరావు, జల్లు శాంతారావులను హైదరాబాద్ వెళ్లాలని ఉన్నతాధికారులు శుక్రవారం ఆదేశించారు. కానీ వారికి కేటాయించిన పోలీసు వాహనం సరైన కండిషన్లో లేదు. ఆ వాహనం శుక్రవారం అర్ధరాత్రి దాటాక తెలంగాణలోని కొర్లవహడ్ టోల్ గేటు వద్దకు రాగానే మొరాయించింది.పోలీసు అధికారులు ఆ విషయాన్ని హైదరాబాద్లోని తమ ఉన్నతాధికారులకు తెలిపారు. దాంతో హైదరాబాద్ నుంచి మరో స్కారి్పయో వాహనాన్ని పంపిస్తామని చెప్పారు. అందుకోసం డ్రైవర్ రెడ్డిచర్ల నరసింహరాజును ఆ వాహనం తీసుకుని వెళ్లాలని ఆదేశించారు. ఆయన అప్పుడే డిప్యూటీ సీఎం కాన్వాయ్ విధులు ముగించుకుని వచ్చారు. వరుసగా గంటల తరబడి డ్రైవింగ్ చేశాను.. బాగా అలసిపోయాను అని చెప్పారు. కానీ ఉన్నతాధికారులు వినిపించుకోలేదు. సమకూర్చిన స్కార్పియో వాహనం అయినా సరిగా ఉందా అంటే ఆ వాహనం కండిషన్ కూడా బాగోలేదు. డ్రైవర్ అలసిపోయినందునే ప్రమాదంఉన్నతాధికారుల ఆదేశాలతో తప్పనిసరై డ్రైవర్ నరసింహరాజు ఆ డొక్కు స్కార్పియోతో కొర్లవహడ్ వెళ్లారు. అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలతోసహా హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే గంటల తరబడి డ్రైవింగ్ చేసి బాగా అలసిపోయి ఉన్న నరసింహరాజు కళ్లు మూతలు పడుతున్నా అతి కష్టంగా డ్రైవింగ్ చేశారు. శనివారం తెల్లవారుజామున 4.45 గంటలకు కైతాపురం వద్ద రోడ్డుపై ఎదురుగా సడన్గా ఆగిన లారీని గుర్తించలేక పోయారు. చివరి నిముషంలో పక్కకు తప్పుకునే యత్నంలో స్కారి్పయో డివైడర్పైకి ఎక్కి పల్లిటిలు కొట్టి రోడ్డుకు అవతలి వైపు పడింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న ట్యాంకర్ ఈ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీఎస్పీలు మేక చక్రధరరావు, జల్లు శాంతారావులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అదనపు ఎస్పీ దుర్గా ప్రసాదరావు పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నరసింహరాజు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని పోలీసు కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీక్లీ ఆఫ్లూ ఇవ్వకుండా, గంటల తరబడి డ్యూటీ చేసి అలసిపోయినా విశ్రాంతి ఇవ్వకుండా డ్యూటీలు వేస్తున్నారని మండిపడుతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనలు సాఫీగా సాగితే చాలా.. పోలీసు కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదా అని నిలదీస్తున్నారు. -
పనస పండు ఎంత పనిచేసింది..? పాపం ఆ డ్రైవర్లను పట్టుబడేలా చేసింది..!
డ్రైవర్లు లేదా వాహనాలు నడిపేవాళ్లు ఈ పండు తిన్నారో అంతే సంగతులు. చుక్క మందు తాగకపోయినా..అన్యాయంగా ఇరుక్కుపోతారు. తమాషా కాదు..నమ్మశక్యం కానీ పచ్చి నిజం. ఏంటిదంతా అనుకోకండి. పాపం ఇలానే కేరళ డ్రైవర్లు రొటీన్ బ్రీత్ అనలైజర్ టెస్ట్లో పట్టుబడి చిక్కుల్లోపడ్డారు. చివరికి అధికారులే అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే..కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని పండలం మండలంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది అక్కడ డ్రైవర్లకు రొటీన్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అవాక్యయ్యారు ఆ ఉద్యోగులు. ఒక్క చుక్క మందు తాగకుండానే ఇదేంటని విస్తుపోయారు. పాపం వాళ్లంతా తాము మద్యం సేవించలేదని మమ్మల్ని నమ్మండి మహాప్రభో అంటూ మొరపెట్టుకోవడంతో..అధికారులు వారికి ఒక్క అవకాశం ఇచ్చారు. తాము కొల్లం జిల్లాలో వస్తువులు రవాణా చేసేటప్పుడు పనసపండు కొన్నామని అది తప్ప ఇంకొకటి తాము తినలేదని చెప్పారు. అయితే మీరు చెప్పింది నిజమే అయితే మరొక సిబ్బంది ఈ పనస పండు ఇచ్చి వాస్తవం నిర్థారిస్తామని ఆ డ్రైవర్లోతో అధికారులు అన్నారు. అన్నట్లుగానే తదుపరి పరీక్ష నిర్వహించారు. ఒక సిబ్బందికి ఇలాంటి పనసండు పెట్టి బ్రిత్ అనలైజర్తో పరీక్షించగా మద్యం సేవించినట్లుగా పాజిటివ్ చూపించింది. అది చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. పనసపండు ఇంతలా బ్రీత్ అనలైజర్ను కన్ఫ్యూజ్ చేసేలా తప్పుదారిపట్టిస్తుందా అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సదరు డ్రైవర్లు మద్యం సేవించలేదని నిర్థారించి వారిని వదిలేశారు అధికారులు. పనపండు తింటే మద్యం సేవించినట్లేనా అంటే..కేరళకు చెందిన ఈ సుగంధభరిత పనసపండు. అసాధారణమైన తేనెలాంటి తీపి రుచిని కలిగి ఉంటుంది. పైగా ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. అయితే అతిగా పండిన ఈ పనసపండులోని సహజ కిణ్వప్రక్రియ కారణంగా ఆల్కహాల్ని కలిగి ఉంటుందట. ఎప్పుడైతే దీన్ని తింటామో అది శరీరంలోకి వెళ్లగానే ఇథనాల్ని ఉత్పత్తి చేస్తుందట. దాంతో ఈ పనసపండు తిన్న వెంటన్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే ఆల్కహాల్ సేవించినట్లుగా చూపిస్తుందట. ముఖ్యంగా బాగా ముగ్గిన పనస పండు తీసుకుంటే ఇది మరింత స్పష్టంగా ఆల్కాహాల్ సేవించినట్లు చూపిస్తుందట బ్రిత్ అనలైజర్ రీడింగ్లో. ఇందుకు ప్రధాన కారణం బాగా పండిన పండ్లు ఇథనాల్ను తక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడమేనని చెబుతున్నారు నిపుణులు.ఇలా తప్పుదారి పట్టించేవి ఇవే..అతిగా పండిన అరటిపండు, మామిడిపండు కిమ్చి, సౌర్క్రాట్, ఇడ్లీఆల్కాహాల్ లేని బీర్ లేదా మౌత్వాష్వెనిగర్ అధికంగా ఉండే వంటకాలు లేదా ఆల్కహాల్తో వండిన ఆహారాలుచక్కెర ఆల్కహాల్లు లేదా కిణ్వ ప్రక్రియ ఉపఉత్పత్తులను కలిగి ఉన్న ప్రోటీన్ బార్లు లేదా ఎనర్జీ డ్రింక్స్(చదవండి: ఆ మూవీలో మాదిరిగా 20 ఏళ్లకే అల్జీమర్స్ వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
మహిళా డ్రైవర్ని నియమించుకున్న తొలి అధికారిణి..!
మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి. అన్ని రంగాల్లో ముందుండాలి వంటి ఉపన్యాసాలు లెక్కకు మించి చూసుంటాం. చేతల్లో మాత్రం శూన్యం. అతివల తమ ప్రతిభతో సంపాదించుకున్న అత్యున్నత స్థానాలే తప్ప..చాలమటుకు కొన్ని రంగాల్లో అవకాశాలు ఉండనే ఉండవు. అంతెందుకు మహిళా అధికారులు సైతం..తమ వరకు వచ్చేటప్పటికీ ఒకలా..బయటకు ఎన్నో లెక్చర్లు ఇస్తారు. కానీ ఈ అధికారిణి..మాటల్లోనే కాదు..చేతల్లో కూడా మహిళలకే తన తొలి ప్రాధాన్యాత అంటూ చేసి చూపించింది. ఆమె చేసిన పని భారతదేశంలో ఒక సరికొత్త మైలు రాయి. ఇలాంటి అద్భుతం ఇదే దేశంలోనే తొలిసారి కూడా కావొచ్చు.ఒడిశాలో మహిళా డ్రైవర్ను అధికారికంగా నియమించిన తొలి మహిళా ప్రభుత్వాధికారిణిగా ఉషా పాధీ గుర్తింపు పొందారు. ఒడిశా రవాణా, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి అయినా ఆమె తన శక్తిమంతమైన అధికారంతో ఒక సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. మయూర్ భంజ్కి చెందిన సంధ్యారాణి మాఝిని తన అధికారిక డ్రైవర్లలో ఒకరిగా నియమించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు ఉషా. దీంతో ప్రభుత్వ వాహన తొలి మహిళా డ్రైవర్గా రికార్డు సృష్టించింది సంధ్యారాణిసంధ్యా జాజ్పూర్ ఛటియాలోని హెచ్ఎంవీ శిక్షణా కేంద్రంలో డ్రైవింగ్ శిక్షణ పొందారామె. తదనంతరం ఒక అధికారి వద్ద డ్రైవర్గా పనిచేసే అవకాశాన్ని అందుకుంది. ఆమెకు వరకూ ప్రైవేట్ స్కూల్ బస్ వంటి భారీ వాహనాలను నడిపిన అనుభవం కూడా ఉందట! మహిళలు అన్నింట్లో ముందుడాలంటూనే, డ్రైవింగ్, పాలన, సేవా బట్వాడా వంటి వాటిల్లో సమాన అవకాశాలు ఇవ్వం. ఆ లింగ మూసధోరణికి తిలోదకాలు ఇస్తూ..ఆమెనే డ్రైవర్గా కేటాయించుకున్నారు ఉషా. ఇది కేవలం సంధ్యతో మొదలైన మార్పు కాదు.అక్కడ రవాణా శాఖ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కింద అమాబస్ ఓఎస్ఆర్టీసీ అనేక మంది మహిళా కండక్టర్లను నియమించుకుని సంచలనం సృష్టించింది. బస్సులను, జీవితాలను కమాండ్ చేసే సత్తా మహిళలకే ఉందంటూ ఉమె సువాహాక్ చొరవతో వాణిజ్య రవాణా శాఖ మంత్రి ఈ ఏడాది సుమారు 500 మంది మహిళా డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి, ఆర్థిక స్వాతంత్ర్యం, స్వీయ విలువల దిశగా నడిపించాలని చూస్తుండటం విశేషం. శక్తిమంతమైన మార్పు పుష్కలమైన అవకాశాలు అందించనప్పుడే అని చెప్పడానికి ఈ ఘటనలే ఉదాహారణలు. అంతేగాదు అధికారుల సరైన నిర్ణయాలే ప్రజల అభ్యున్నతికి బాటలు వేసి నవ సమాజ నిర్మాణానికి దోహదపడతాయి అనే మాటకు ఇదే నిదర్శనం కూడా. (చదవండి: ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నా.. ఐనా సంతోషంగా నిల్!: ఎంటర్ప్రెన్యూర్ ఆవేదన) -
వాళ్ళని కూడా అలాగే చంపేయండి.. డ్రైవర్ రాయుడు చెల్లి కన్నీరు
-
అన్నా లేరా.. నాకు దిక్కెవరు రా?
‘అన్నా.. మనకు రెక్కలు రాకముందే అమ్మానాన్నను ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడు. అప్పటి నుంచి అష్టకష్టాలు పడి ఇక్కడిదాకా వచ్చాము. అమ్మమ్మ అక్కున చేర్చుకుని పెంచి పెద్ద చేసింది. నా మనవడు ఉన్నాడన్న ధైర్యంతో బతికేస్తోంది. నేను కూడా తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ మా అన్న చూసుకుంటాడనే ఆశతో జీవిస్తున్నాను. ఇప్పుడు మా అందర్నీ దూరం చేసి వెళ్లిపోయావు. మేమెలా బతికేదన్నా’ అంటూ ఆ సోదరి తన అన్న మృతదేహంపై పడి రోదించిన తీరు చూపరుల గుండెల్ని మెలిపెట్టింది. శ్రీనివాసులు అంత్యక్రియల సందర్భంగా ఈ దృశ్యం ఆదివారం శ్రీకాళహస్తి మండలం, బొక్కసంపాళెంలో తీవ్ర విషాదాన్ని నింపింది.శ్రీకాళహస్తి: మండలంలోని బొక్కసంపాళెం శోకసంద్రంలో మునిగిపోయింది. జనసేన మాజీ నాయకురాలు వినుత, ఆమె భర్త చంద్రశేఖర్నాయుడు, మరో ముగ్గురు కలిసి మా అన్నను చంపేశారంటూ మృతుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతదేహం వద్ద అతడి సోదరి కీర్తి బోరున విలపించడం అక్కడి వారికి కన్నీళ్లు తెప్పించింది. ‘చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాం. ఇపుడు నా రక్తసంబంధమైన అన్నను కూడా కోల్పోయాను’ అని విలపించడం చూపరుల కళ్లు చెమర్చేలా చేసింది. ఏడేళ్ల వయసులో వెంకటగిరి నుంచి వచ్చేసి అమ్మమ్మ వద్ద పెరిగాము. ఇప్పుడు అన్నని పోగొట్టుకున్నానని మృతుని సోదరి, వారిని పెంచిన అమ్మమ్మ రాజేశ్వరి ఆవేదనను చూసి గ్రామస్తులు చలించిపోయారు.మా అన్నని మాట్లాడనివ్వలేదుఅనంతరం మృతుడు శ్రీనివాసులు చెల్లెలు కీర్తి మాట్లాడుతూ ‘మా అన్న వారి(జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్చార్జి) ఇంటికి పరిమితమయ్యాడు. చాలాకాలంగా చూడడానికి కూడా కష్టంగా ఉండేది. ఒకరోజు కాలు విరిగిందని చెబితే చూడడానికి వెళ్లా. ఇప్పుడు ఎవరైతే చంపేశారో ఆ రోజు మా అన్నను వారు మాట్లాడనివ్వకుండా చేశారు’ అని వెల్లడించింది. మా అన్నను పంపించేస్తామని చెప్పారే గానీ ఇలా చంపేస్తారని అనుకోలేదని కన్నీటి పర్యంతమైంది. తన అన్న చావుకు కారణమైన వారిని ఎవర్నీ వదలిపెట్టనని, వారికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తామని తెలిపింది. తనకు అండగా ఉండాలని స్థానికులను కోరింది.‘నాకున్న ఒకే ఒక బంధాన్ని దూరం చేశారు. నా అన్నను అతి కిరాతకంగా చంపేశారు. చిన్నప్పుడే అమ్మానాన్న దూరమయ్యారు. అన్నున్నాడనే ధైర్యంతో బతికేస్తున్నా. ఇప్పుడు ఆ ఒక్క ఆశను కూడా తుంచేశారు. నా అన్నను నాకు లేకుండా చేశారు. పవన్కళ్యాణ్ మాకు న్యాయం చేయాలి. న్యాయం కోసం ఎందాకై నా వెళ్తాం..’ అంటూ మృతుడు శ్రీనివాసులు సోదరి కీర్తి మాట్లాడడం అక్కడి వారిని ఆలోచనలో పడేసింది. -
Delhi: ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైకి కారు పోనిచ్చిన డ్రైవర్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఫుట్పాత్పై నిద్రిస్తున్న ఐదుగురిపై నుంచి కారును పోనిచ్చిన డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నైరుతి ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలోని శివ క్యాంప్ సమీపంలో చోటుచేసుకుంది. ఫుట్పాత్పై నిద్రిస్తున్న ఇద్దరు జంటలతో పాటు ఎనిమిదేళ్ల బాలిక.. మొత్తం ఐదుగురు పైకి డ్రైవర్ ఉత్సవ్ శేఖర్ (40) కారును ఎక్కించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన సమయంలో శేఖర్ మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు.కారు డ్రైవర్ ఉత్సవ్ శేఖర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికే.. స్థానికులు ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బాధితులను లాధి (40), ఆమె ఎనిమిదేళ్ల కుమార్తె బిమ్లా, భర్త సబామి అలియాస్ చిర్మా (45), రామ్ చందర్ (45), అతని భార్య నారాయణి (35)గా గుర్తించారు. వీరందరూ రాజస్థాన్కు చెందినవారని పోలీసులు తెలిపారు. నిందితునిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, సంఘటనల ఖచ్చితమైన క్రమాన్ని నిర్ధారించేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.