Sweden: జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు మృతి | six killed after bus drives into crowd in Swedens Stockholm | Sakshi
Sakshi News home page

Sweden: జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు మృతి

Nov 15 2025 7:13 AM | Updated on Nov 15 2025 11:22 AM

six killed after bus drives into crowd in Swedens Stockholm

స్టాక్‌హోమ్‌: స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ స్టాక్‌హోమ్‌లోని ఓస్టర్‌మాల్మ్ పరిధిలోని, రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సమీపంలోని వల్హల్లావాగెన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం 3.23 గంటల ప్రాంతంలో  అత్యంత రద్దీ సమయంలోఒక సిటీ బస్సు అకస్మాత్తుగా బస్ స్టాప్ క్యూలో వేచి ఉన్న జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
 

ప్రమాదానికి గురైన బస్సు సర్వీసులో లేదని, అందులో ప్రయాణీకులు ఎవరూ లేరని అధికారులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా  గాయపడిన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం వెనుక కారణాలను తెలుసుకునేందుకు ఆయనను ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్వీడన్ ప్రధాన మంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఈ విషాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ‘బస్ స్టాప్‌లో పలువురు మరణించడం, మరికొందరు గాయపడటం తీరని విషాదం... బహుశా వారు ఇంటికి వెళ్తున్న కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కావచ్చు’ అని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా రాశారు. కాగా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Bihar Election: యూట్యూబర్ అభ్యర్థి సంగతేంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement