Bihar Election: యూట్యూబర్ అభ్యర్థి సంగతేంటి? | What happened to YouTuber Manish Kashyap | Sakshi
Sakshi News home page

Bihar Election: యూట్యూబర్ అభ్యర్థి సంగతేంటి?

Nov 14 2025 1:51 PM | Updated on Nov 14 2025 2:52 PM

What happened to YouTuber Manish Kashyap

పట్నా:  బీహార్‌లోని చాన్పాటియా అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రారంభ ట్రెండ్‌లు అగ్రశ్రేణి పోటీదారులెవరనేది వెల్లడించాయి. తాజా డేటా ప్రకారం బీజేపీ అభ్యర్థి ఉమాకాంత్ సింగ్ 30,290 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఆయన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ రంజన్ 28,719 ఓట్లు సాధించారు. మనీష్ కశ్యప్‌గా  పేరొందిన ప్రముఖ యూట్యూబర్‌ ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

యూట్యూబర్ నుండి రాజకీయ నేత మారిన త్రిపురారి కుమార్ తివారీ(మనీష్‌ కశ్యప్‌) ప్రస్తుతం 12,081 ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. ఆయన  జన్ సురాజ్ అభ్యర్థిగా పోటీకి దిగారు. చాన్పాటియా అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2020లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఉమాకాంత్ సింగ్ కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్ రంజన్‌ను 13,469 ఓట్ల తేడాతో ఓడించి ఈ స్థానాన్ని గెలుచుకున్నారు.

సోషల్ మీడియాలో ప్రాంతీయ సమస్యను ప్రస్తావిస్తూ ప్రజాదరణ పొందిన మనీష్‌ కశ్యప్‌ ఆ తర్వాత రాజకీయాల్లోకి దిగారు. తన డిజిటల్ ప్రజాదరణతో ఎన్నికల్లో విజయం సాధించాలని  ఆశించారు. కాగా బీహార్ వలసదారులపై దాడులకు సంబంధించి తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణలతో 2023లో తమిళనాడు పోలీసులు  యూట్యూబర్‌ మనీష్‌ కశ్యప్‌ను అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మనీష్ 2024లో సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆ తరువాత బీజేపీని వీడి జన్ సురాజ్‌లో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement