breaking news
Scheme
-
తల్లికి వందనం పథకం అంతా మోసం
-
తల్లికి వందనం పథకంపై రామాంజులు రెడ్డి కామెంట్స్
-
యువ వికాసం అర్హుల లెక్క తేలాకే..
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం(Rajiv Youth Development) మంజూరు పత్రాల జారీ వాయిదా పడింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తొలి రెండు కేటగిరీల వారికి యూనిట్లకు సంబంధించిన మంజూరు పత్రాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే అర్హులందరికీ మంజూరు పత్రాలు ఇచ్చేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఇందులో రాజీవ్ యువ వికాసంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఇతర కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆదివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమావేశం నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటల సాగు సన్నద్ధత, ఉద్యోగుల సమస్యలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, జిల్లాల్లో మంత్రులు చేసిన పరిశీలన, రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.యువ వికాసానికి అనూహ్య స్పందన రాజీవ్ యువ వికాసం పథకానికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో..మొత్తం నాలుగు కేటగిరీలకు సంబంధించి ప్రభుత్వానికి అందిన ప్రతి దరఖాస్తును పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే అర్హుల ఎంపిక జరపాలని, ఈ పథకం కింద అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో చోటు దక్కకుండా, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని మంత్రులు సూచించారు. క్షేత్రస్థాయిలో కూడా ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తుల విషయంలో ఫిర్యాదులు వస్తున్నాయని, కాబట్టి అత్యంత పారదర్శకంగా పరిశీలన జరపాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ నేపథ్యంలోనే దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యాకే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయించారు. సోమవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, ఇందుకు జిల్లాల్లో ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని మంత్రులకు సీఎం సూచించారు. క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి: సీఎం రాష్ట్రంలో ధాన్యం కొనుకోలుకు సంబంధించిన అంశాలపై మంత్రులు క్షేత్రస్థాయి పరిస్థితులను సీఎంకు వివరించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని ఈ సందర్భంగా మంత్రులు అభినందించారు. కాగా ధాన్యం కొనుగోళ్లపై సీఎం జిల్లాల వారీగా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులతో పాటు ప్రభుత్వం తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడం.. రాష్ట్రానికి ముందస్తు రుతుపవనాలతో కలిగే ప్రయోజనాలు, నష్టాలపైనా చర్చించారు. ఈ సీజన్కు సంబంధించి పంటల సాగును వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికార యంత్రాగాన్ని ఈ దిశగా అప్రమత్తం చేయాలని రేవంత్ చెప్పారు. ఆర్థికేతర అంశాలను పరిష్కరిద్దాం! రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వం సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ మంత్రివర్గ ఉప సంఘానికి నివేదిక సమరి్పంచింది. ఈ నివేదికలోని ప్రధాన అంశాలను సీఎం రేవంత్రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. ఉద్యోగుల సమస్యల్లో ప్రధానంగా ఆర్థికేతర అంశాలను పరిష్కరిస్తే వారికి కొంతమేర ఊరటగా ఉంటుందని, ఉద్యోగ సంఘాల డిమాండ్ కూడా ఇదేనని భట్టి చెప్పారు.దీంతో ఆర్థికేతర అంశాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగానే ఉందని, దీనిపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుందామని మంత్రులకు సీఎం సూచించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిపైనా, గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు, భూభారతి ద్వారా సమస్యల పరిష్కారం తదితర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. రుతుపవనాలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మంత్రులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. -
‘నమస్తే’కు రెండేళ్లు.. చేతులతో మలం ఎత్తడానికి ముగింపు పలుకుతూ..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నమస్తే’(నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్) పథకానికి రాబోయే జూలై నాటికి రెండేళ్లు పూర్తికానున్నాయి. ఈ కాలంలో చేతులతో మానవ మలాన్ని ఎత్తడం, మురుగునీటిని తొలగించడంలాంటి ఉపాధి సంబంధిత పనులకు ముగింపు పలకడం జరిగిందని, మాన్యువల్ స్కావెంజర్ వ్యవస్థను వీలైనంతవరకూ రూపుమాపామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా సుమారు 80 వేల మంది మురుగునీటి, సెప్టిక్ ట్యాంక్ కార్మికులు(Sewage and septic tank workers)) (ఎస్ఎస్డబ్ల్యు), 11 వేల మంది వ్యర్థాలను తీసేవారిని గుర్తించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. పథకం అమలు చేశాక, దాని ప్రభావాన్ని అంచనా వేసే అధ్యయన బృందం డిసెంబర్ నాటికి తన నివేదికను సమర్పించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. గుర్తింపు పొందిన పారిశుద్ధ్య కార్మికులలో ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 11,700 మంది, మహారాష్ట్రలో 7,649 మంది, తమిళనాడులో 6,975 మంది, కర్ణాటకలో 6,307 మంది, గుజరాత్లో 5,436 మంది, పంజాబ్లో4,407 మంది, ఆంధ్రప్రదేశ్లో 4,036 మంది, ఢిల్లీలో 3,626 మంది ఉన్నారు.దేశంలోని అన్ని మురుగునీటి పనులను యాంత్రీకరించడం, ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుని కార్మికులు మరణించడాన్ని నిరోధించడం లక్ష్యంగా ప్రభుత్వం నమస్తే పథకాన్ని చేపట్టింది. మాన్యువల్ స్కావెంజర్ల పునరావాసం, స్వయం ఉపాధి కోసం ఈ పథకం చేయూతనందించనుంది. అలాగే ఇది ఈ పథకం మాన్యువల్ స్కావెంజింగ్(Manual scavenging), మురుగునీటి, సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరచడం మధ్య వ్యత్యాసాన్ని వివరించడంలో ఎంతగానో దోహదపడిందని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. కాగా గత జనవరిలో సుప్రీంకోర్టు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్లలో మాన్యువల్ స్కావెంజింగ్ను పూర్తిగా నిషేధించాలని ఆదేశించింది. పార్లమెంటు సామాజిక న్యాయం, సాధికారత కమిటీ ఇటీవల.. భద్రతా పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల పారిశుధ్య కార్మికుల మరణాలు చోటుచేసుకుంటున్నాయని, వీటికి సంబంధించిన వార్తలు పత్రికలలో వస్తున్నాయని పేర్కొంది. పారిశుధ్య కార్మికుల సామర్థ్యాన్ని పెంపొందించడం చాలా అవసరమని సూచించింది.ఇది కూడా చదవండి: శశిథరూర్ దౌత్య విజయం.. వైఖరి మార్చుకున్న కొలంబియా -
ప్రభుత్వ స్కూళ్లలొ చదువులు అటకెక్కాయి: YS జగన్
-
నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (మే 22)న ప్రారంభించనున్నారు. 2022, డిసెంబర్లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధానమంత్రి రెండు దశల్లో శంకుస్థాపన చేశారు. దేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునిక, సమగ్ర రవాణా కేంద్రాలుగా మార్చడంలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 1,300కుపైగా స్టేషన్లను పునరాభివృద్ధి చేసింది.అమృత్ భారత్ స్టేషన్(Amrit Bharat Station) పథకాన్ని దేశంలోని పలు రైల్వే స్టేషన్లలో ఆధునిక వసతుల కల్పన, మల్టీమోడల్ ఇంటిగ్రేషన్, దివ్యాంగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చేపట్టారు. నేడు ప్రధాని మోదీ 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 103 రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు. ఆ స్టేషన్ల వివరాలిలా ఉన్నాయి.అస్సాం: హైబర్గావ్బీహార్: పిర్పైంటి, థావే.ఛత్తీస్గఢ్: దొంగగర్, భానుప్రతాపూర్, భిలాయ్, ఉర్కురా, అంబికాపూర్.గుజరాత్: సమఖియాలీ, మోర్బి, హపా, జామ్ వంతాలి, కనలస్ జంక్షన్, ఓఖా, మిథాపూర్, రాజులా జంక్షన్, సిహోర్ జంక్షన్, పాలిటానా, మహువ, జామ్ జోధ్పూర్, లింబ్డి, డెరోల్, కరంసాద్, ఉత్రాన్, కొసాంబ జంక్షన్, డాకోర్.హర్యానా: మండి దబ్వాలి.హిమాచల్ ప్రదేశ్: బైజ్నాథ్ పప్రోలా.జార్ఖండ్: శంకర్పూర్, రాజమహల్, గోవింద్పూర్ రోడ్.కర్ణాటక: మునీరాబాద్, బాగల్కోట్, గడగ్, గోకాక్ రోడ్, ధార్వాడ్.కేరళ: వడకర, చిరాయింకీజ్.మధ్యప్రదేశ్: షాజాపూర్, నర్మదాపురం, కట్ని సౌత్, శ్రీధం, సియోని, ఓర్చా.మహారాష్ట్ర: పరేల్, చించ్పోక్లి, వడలా రోడ్, మాతుంగా, షాహద్, లోనంద్, కేద్గావ్, లాసల్గావ్, ముర్తిజాపూర్ జంక్షన్, దేవ్లాలి, ధూలే, సావ్దా, చందా ఫోర్ట్, ఎన్ఎస్బీసీ ఇటావ్రీ జంక్షన్, అమ్గావ్. పుదుచ్చేరి: మహే.రాజస్థాన్: ఫతేపూర్ షెఖావతి, రాజ్గఢ్, గోవింద్ గర్, దేశ్నోక్, గోగమేరి, మందావర్ మహువ రోడ్, బుండి, మండల్ గర్.తమిళనాడు: సామలపట్టి, తిరువణ్ణామలై, చిదంబరం, వృద్ధాచలం జంక్షన్, మన్నార్గుడి, పోలూరు, శ్రీరంగం, కుళిత్తురై, సెయింట్ థామస్ మౌంట్.తెలంగాణ: బేగంపేట(Begumpet), కరీంనగర్, వరంగల్.ఉత్తరప్రదేశ్: బిజ్నోర్, సహరాన్పూర్ జంక్షన్, ఈద్గా ఆగ్రా జంక్షన్, గోవర్ధన్, ఫతేహాబాద్, కర్చన, గోవింద్పురి, పోఖ్రాయాన్, ఇజ్జత్నగర్, బరేలీ సిటీ, హత్రాస్ సిటీ, ఉఝని, సిద్ధార్థ్ నగర్, స్వామినారాయణ్ చప్పియా, మైలానీ జంక్షన్, గోల గోకరనాథ్, రామ్ఘాట్ హాల్ట్, సురైమాన్పూర్, బల్రామ్పూర్.పశ్చిమ బెంగాల్: పనగఢ్, కళ్యాణి ఘోష్పరా, జోయ్చండీ పహార్.ఇది కూడా చదవండి: యూట్యూబ్లో జ్యోతి మల్హోత్రా సంపాదన ఎంతంటే.. -
నమ్మించి నట్టేట ముంచారు చంద్రబాబుపై మహిళలు ఫైర్
-
ఆడబిడ్డలకు ద్రోహం
కర్నూలు (టౌన్)/ కాకినాడ రూరల్: ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తామని టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని సమాధి చేశారని మహిళలు మండిపడ్డారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్ నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మహిళలు ర్యాలీ నిర్వహించారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్.. డౌన్.. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలను నమ్మించి మోసం చేశారని నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి మాట్లాడుతూ.. ఓట్ల కోసం సూపర్ సిక్స్ హమీలు ఇచ్చి.. తీరా గద్దెనెక్కాక కూటమి పార్టీల పెద్దలు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు ఏటా రూ.18 వేలు ఇస్తామని చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రకటించారన్నారు. ఆ మేరకు కూటమి మేనిఫెస్టోలోనూ పెట్టారన్నారు. తీరా ఇప్పుడు సీఎం చంద్రబాబు తన కర్నూలు పర్యటనలో.. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించడం దుర్మార్గం అన్నారు.2029 నాటికి కూడా పేదరికం తగ్గకపోతే అప్పుడు పీ–4 పథకానికి ఆడబిడ్డ నిధి పథకాన్ని అనుసంధానం చేస్తానని చెప్పడం మరోసారి మహిళలను దగా చేయడమే అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి భారతి, కర్నూలు నగర మహిళ నాయకులు మంగమ్మ, 43వ వార్డు కార్పొరేటర్ మునెమ్మ, కర్నూలు నియోజకవర్గ ఆంగన్వాడీ మహిళ నాయకురాలు రాధికమ్మ తదితరులు పాల్గొన్నారు.సూపర్ మోసం కూటమి ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలు మహిళలకు శాపంగా మారాయని, ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇస్తామని నమ్మించి.. ఇప్పుడు మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సూపర్ మోసాలు చేస్తోందని ధ్వజమెత్తారు. కాకినాడ 49వ డివిజన్లోని తన నివాసంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని సూపర్ సిక్స్ హామీల కింద పెట్టి.. ఇప్పుడు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారని.. ఆ పథకం అక్కర్లేదని సీఎం చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ముందు మహిళల్లో కనిపించిన పేదరికం.. అధికారం చేపట్టగానే మాయమైందా.. అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెచ్చిన వేల కోట్ల రూపాయలతో ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. -
పేదల ‘ఉపాధి’పై దెబ్బ
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది. 27 లక్షల శ్రామికుల కుటుంబాలకు రూ.800 కోట్ల మేర కూలీ డబ్బులు బకాయిలుండటంతో పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పథకం కింద పని చేసే దాదాపు 15 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది మూడు నెలలుగా వేతనాలు అందక విలవిల్లాడిపోతున్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరకని ప్రస్తుత వేసవి రోజుల్లో ఉపాధి హామీ పథకంపై ఆధారపడి జీవించే పేదల పరిస్థితి దయనీయంగా తయారైంది.నిబంధనల ప్రకారం.. ఉపాధి హామీ పథకం పనుల్లో పనిచేసే శ్రామికులకు గరిష్టంగా 15 రోజుల లోపే వారి పనికి సంబంధించిన కూలీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27 లక్షల పేద కుటుంబాలకు సంబంధించిన 39 లక్షల మంది పేదలకు నెల రోజులుగా చేసిన పనులకు కూలీ డబ్బులు చెల్లించ లేదు. ఇలాగైతే ఎలా అంటూ వ్యవసాయ కారి్మక సంఘాల నేతలు మండిపడుతున్నారు. మరోవైపు.. మెటీరియల్ కేటగిరిలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తదితర పనులు చేసిన వారికి రూ.2,500 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు ఉపాధి హామీ పథకం కార్యక్రమాల పర్యవేక్షణకు మండల కంప్యూటర్ సెంటర్ల(ఎంసీసీ)లో పని చేసే టెక్నికల్ అసిస్టెంట్లు (టీఏ) మొదలు రాష్ట్ర స్థాయి కార్యాలయంలో పనిచేసే దాదాపు ఏడు వేల మంది వివిధ స్థాయిల ఎఫ్టీఈ ఉద్యోగుల వరకు ఫిబ్రవరి నెల వేతనం ఇప్పటి వరకు చెల్లించలేదని ఆయా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. గ్రామ స్థాయిలో ఉపాధి హామీ పథకం పనులను నిత్యం పర్యవేక్షించే ఫీల్డు అసిస్టెంట్లకు, రాష్ట్ర స్థాయి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే కొన్ని కేటగిరీల ఉద్యోగులు 8 వేల మందికి మార్చి నెల నుంచి వేతనం ఇవ్వలేదు. మొత్తంగా 15 వేల మందికి జీతాలు ఇవ్వక పోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. మితిమీరిన అధికార పార్టీ నేతల ఆగడాలు గత ఏడాది జూన్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు పనులు కల్పించే ఉపాధి హామీ పథకం అమలులో రాజకీయ జోక్యం మితిమీరిపోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే అప్పటిదాకా గ్రామాల్లో ఉపాధి పథకం ఫీల్డు అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిలో అత్యధికులను ఏకపక్షంగా తొలగించి, ఆ స్థానాల్లో కూటమి పార్టీల సానుభూతిపరులను నియమించారు. గ్రామాల్లో పార్టీల వారీగా పనులు కేటాయిస్తున్నారని ఎన్నో ఘటనలు రుజువు చేశాయి.కేవలం అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారికి మాత్రమే పనులు కల్పించాలని ఒత్తిళ్లు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు, ప్రభుత్వం సైతం కొత్తగా గ్రూపుల వారీగా మాత్రమే పనులు కల్పించాలని నిర్ణయం తీసుకోవడంతో కొన్ని గ్రూపులకు పనులు కేటాయించడం లేదని విమర్శలున్నాయి. కొద్ది రోజుల కిత్రం.. అనకాపల్లి జిల్లా మామిడపాలెం గ్రామంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేశారని దాదాపు 350 మంది కూలీలకు స్థానిక సిబ్బంది పనులు కల్పించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎల్ఎల్ పురం గ్రామానికి చెందిన 300 మంది కూలీలు తమకు పనుల కల్పనలో రాజకీయ పక్షపాతం చూపుతున్నారని ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి. పనుల కల్పనలో ఘోరంగా విఫలం⇒ 2024 ఏప్రిల్ నెలలో అప్పటి ప్రభుత్వం పేదలకు 5.98 కోట్ల పని దినాల్లో పనులు కల్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల 30 రోజులతో పాటు మే నెలలో పది రోజులు కలుపుకుని.. మొత్తం 40 రోజుల్లో కూటమి ప్రభుత్వం కేటాయించిన పని దినాలు కేవలం 4.41 కోట్లు మాత్రమే. ఎక్కువ డిమాండ్ ఉండే మే నెలలో రోజుకు 25 లక్షల పని దినాలకు మించి పనులు కల్పించడం లేదు. శనివారం దాదాపు 30 లక్షల మంది పేదలు ఉపాధి హామీ పథకం పనులకు డిమాండ్ పెట్టుకుంటే కేవలం 23 లక్షల మందికి మాత్రమే పనులు కల్పించారు. ⇒ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం శ్రామికుల ఆదాయం సైతం పడిపోయినట్టు స్వచ్ఛంద సంస్థ ‘లిబ్టెక్ ఇండియా’ ఓ నివేదిక విడుదల చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పనులకు హాజరైన ఒక్కో పేద కుటుంబం ఏడాది మొత్తంలో రూ.13,484 చొప్పున ఆదాయం పొందింది. అదే 2024–25 ఆర్థిక ఏడాదిలో రోజు వేతన రేటు రూ.272 నుంచి రూ.300కు పెరిగినప్పటికీ సగటున ఓ కుటుంబానికి రూ.13,190 మాత్రమే పొందినట్టు ఆ సంస్థ పేర్కొంది. పెరిగిన ధరల ప్రకారం చూస్తే.. ఒక్కో కుటుంబం సగటున రూ.1531 చొప్పున నష్టపోయిందని వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 25.55 కోట్ల పేదలు పనులు పొందగా, 2024–25లో ఆ సంఖ్య 24.22 కోట్లకు పరిమితమైంది. ⇒ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వంద పని దినాల పాటు పనులు పొందిన కుటుంబాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. 2023–24 ఏడాదిలో 6.87 లక్షల కుటుంబాలు వంద పని దినాల్లో పనులు పొందగా, 2024–25లో 5.1 లక్షల కుటుంబాలు మాత్రమే ఆ మేరకు పనులు పొందాయి. -
Sewing Machine Scheme: మహిళలను మోసం చేసి 167 కోట్లు నొక్కేస్తున్నారు
-
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మెలిక
సాక్షి,శ్రీకాకుళం జిల్లా: తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మరో మెలిక పెట్టారు. తల్లికి వందనాన్ని ఇన్స్టాల్మెంట్ స్కీంగా మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నారు. 15 వేలు ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాం. ఒకే ఇన్స్టాల్మెంటా? లేక ఇంకెలా ఇవ్వాల్లో ఆలోచిస్తున్నామంటూ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో తల్లికి వందనంపై సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటికే 2024-25 విద్యా సంవత్సరం ‘తల్లికి వందనం’ ఇవ్వలేదు...విద్యా సంవత్సరం ముగిసినా తల్లికి వందనం ఇవ్వకుండా పిల్లలు, తల్లులను చంద్రబాబు మోసం చేశారు. ఈ ఏడాది స్కూల్, ఇంటర్ ఫీజుల కోసం పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. ఇన్నాళ్లు మే లో 15 వేలు ఒకేసారి ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు.. తాజాగా ఇన్స్టాల్మెంట్ మెలిక పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
ప్రతి ఏటా వేసవిలో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఏసీ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 2021-22లో 84 లక్షలు.. 2023-24 నాటికి 1.1 కోట్ల ఏసీలు అమ్ముడైనట్లు కొన్ని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఏసీల విక్రయాలు పెరుగుతున్న సమయంలో.. విద్యుత్ వినియోగం ఎక్కువవుతోంది. ఈ వినియోగాన్ని కొంత వరకు తగ్గించడానికి.. ప్రభుత్వం 'పీఎం మోదీ ఏసీ యోజన' స్కీమ్ అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రముఖ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.ప్రధానమంత్రి మోదీ ఏసీ యోజన 2025 అమలు కోసం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే పీఎం మోదీ ఏసీ యోజన పథకాన్ని.. విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) మిర్వహించనుంది. ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. విద్యుత్ ఆదా చేయడమే. కొత్త ఏసీ.. పాత ఏసీ కంటే కొంత తక్కువ కరెంట్ వినియోగిస్తుంది. కాబట్టి ఎలక్ట్రిక్ బిల్ తగ్గుతుంది.బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ప్రకారం, పాత ఏసీని ఫైవ్ స్టార్-రేటెడ్ మోడల్తో రీప్లేస్ చేసుకోవడం వల్ల ఒక ఇంటికి సంవత్సరానికి రూ. 6,300 వరకు విద్యుత్ బిల్లు ఆదా అవుతాయి. కుటుంబాలకు ఖర్చులను తగ్గించడంతో పాటు, ఇది పవర్ గ్రిడ్పై కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది.పీఎం మోదీ ఏసీ యోజన అమలులోకి వచ్చిన తరువాత, ఈ స్కీమ్ కింద.. ఎక్కువ విద్యుత్ వినియోగించే లేదా పాత ఏసీని స్థానంలో 5 స్టార్ రేటెడ్ ఏసీని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది, తద్వారా కరెంట్ బిల్ తగ్గుతుంది. అంతే కాకుండా ఈ స్కీమ్ కింద ఏసీ కొనుగోలు చేస్తే.. డిస్కౌంట్ కూడా పొందవచ్చు.ఈ స్కీమ్ కింద కొత్త 5 స్టార్ ఏసీ పొందటం ఎలా?➤ఎక్కువ విద్యుత్ వినియోగించే ఏసీని గుర్తింపు కలిగిన రీసైక్లింగ్ కేంద్రంలో ఇవ్వండి. వారు మీకు ఒక సర్టిఫికెట్ అందిస్తారు. దీనిని ఉపయోగించి.. కొత్త ఏసీ కొనుగోలుపై తగ్గింపు పొందవచ్చు.➤బ్లూ స్టార్, ఎల్జీ, వోల్టాస్ వంటి పెద్ద ఏసీ బ్రాండ్స్ కూడా పాత ఏసీకి బదులుగా కొత్త ఏసీ కొనుగోలు చేసే కస్టమర్లకు డిస్కౌంట్ అందిస్తాయి.➤పాత ఏసీ స్థానంలో కొత్త ఏసీ వినియోగించేవారి.. విద్యుత్ బిల్లులో కూడా కొంత తగ్గింపు ఇవ్వడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీనికోసం విద్యుత్ పంపిణీ సంస్థలతో చర్చించనుంది.ఇదీ చదవండి: టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు! -
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని సుప్రీం కోర్టు మందలించింది. ఈ విషయాన్ని తీవ్ర ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ బుధవారం సంబంధిత అధికారులకు సమన్లు జారీ చేసింది.ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రిలో ఉచిత వైద్య సాయం కల్పించడమే క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ ఉద్దేశం. ప్రత్యేకించి గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన గంటలోపే)తో సహా రోడ్డు ప్రమాద బాధితులందరికీ దీన్ని వర్తింపజేయాల్సి ఉంటుంది. దీని అమలుకుగానూ కేంద్రానికి సుప్రీం కోర్టు మార్చి 14వ తేదీని గడువుగా ప్రకటించింది. అయితే గడువు దాటినా కేంద్రం ఇంతదాకా దీనిని అమలు చేయలేదు.‘‘ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసిపోయింది. దీనిని తీవ్రమైన కోర్టు ఆదేశాల ఉల్లంఘనగా పరిగణిస్తున్నాం’’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం బుధవారం వ్యాఖ్యానించింది. ఈ అలసత్వానికి సంబంధించి రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులకు కోర్టు సమన్లు జారీ చేసింది. ‘‘అధికారులు కోర్టులకు హాజరైతేనే మా ఆదేశాలను తీవ్రంగా పరిగణిస్తారు. ఈ విషయాన్ని మా సుదీర్ఘ అనుభవం ద్వారా మేం తెలుసుకున్నాం. ఏప్రిల్ 28వ తేదీన సమన్లు అందుకున్నవాళ్లు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలి. సకాలంలో చికిత్స అందకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ.. ఒక్క విషయాన్ని మేం స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. ఎటువంటి పురోగతి సాధించలేదని మేం గనుక గుర్తిస్తే కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తాం అని జస్టిస్ ఓకా సంబంధిత అధికారులను హెచ్చరించారు.రోడ్డుప్రమాదాల సమయంలో ఆ దారిన వెళ్లేవాళ్లు, పోలీసులు,కొన్నిసార్లు ఆస్పత్రులు కూడా ఎవరైనా ముందుకు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాయి. ఇది ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఇదిలా ఉంటే.. 2023 డిసెంబర్లో నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించే విషయంలో కేంద్రం తొలి అడుగు వేసింది. ప్రమాదాల్లో (Road Accidents) గాయపడిన బాధితులకు ఉచిత, నగదు రహిత వైద్య చికిత్స అందించడం ఎంవీఏ యాక్టు 2019లో భాగం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నాయి. అయితే.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహకారంతో రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంది.రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాణాంతకంగా ఉన్న సమయంలో.. ప్రత్యేకించి గోల్డెన్ అవర్ టైంలో రోడ్డు ప్రమాద బాధితుడి ప్రాణాలు రక్షించే చికిత్స కోసం నగదు చెల్లింపులు చేయడానికి ఎవరూ లేనప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. క్యాష్లెస్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ స్కీమ్ కింద.. రోడ్డు ప్రమాదాలకు గురైన వాళ్ల చికిత్స కోసం ఏడు రోజులకుగానూ లక్షా 5 వేల రూపాయల ఖర్చు భరిస్తుంది. అయితే ఇది ప్రమాదం జరిగిన 24 గంటలలోపు పోలీసులకు తెలియజేస్తేనే!. ఇక..ఆస్పత్రులు మోటార్ వెహికిల్స్ యాక్ట్ ఫండ్ నుంచి ట్రీట్మెంట్ సొమ్మును రీయింబర్స్మెంట్ ద్వారా పొందుతాయి. ఇదికాక.. అదనంగా హిట్ అండ్ రన్ కేసుల్లో మరణించిన వాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా కూడా అందిస్తుంది. అయితే.. ఏడాదిన్నరగా ఈ పథకాన్ని ఆచరణలో పెట్టాలనే ప్రయత్నాలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన సరైన విధివిధానాలతో ఓ పథకం రూపొందించాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదే కాకుండా.. మోటార్ వెహికిల్స్ యాక్ట్(సవరణ చట్టం)లోని సెక్షన్ 162(2) ప్రకారం.. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. కానీ, ఇది కూడా అమలు కావడం లేదని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది. -
ఫ్రీ బస్సేది బాబూ
-
‘ఇదిగో చూడు.. చంద్రబాబే చెప్పారు కదయ్యా..!’ ఫ్రీ బస్సు అమలుపై వినూత్న నిరసన (ఫొటోలు)
-
గోల్డ్ బాండ్లు కొన్నవారికి 193 శాతం లాభం
-
ఫ్లైట్ మిస్ అయితే రూ.7500 పరిహారం!: ఉబర్ కీలక ప్రకటన
క్యాబ్ అగ్రిగేటర్ దిగ్గజం 'ఉబర్' (Uber) ముంబైలోని.. తన కస్టమర్ల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ఆలస్యం కారణంగా విమానం మిస్ అయితే రూ.7,500 వరకు పరిహారం అందించనున్నట్లు వెల్లడించింది. ఈ కవరేజ్ ప్లాన్కు 'మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ కవర్' అని పేరు పెట్టారు. దీనితో పాటు, ఒకవేళా ప్రమాదం జరిగిన సందర్భాలలో ఔట్ పేషెంట్ (OPD) ఛార్జీలతో సహా వైద్య ఖర్చులను కూడా కంపెనీ కవర్ చేస్తుంది.2024 ఫిబ్రవరి చివరలో ఉబర్.. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ ప్లాన్ను ప్రారంభించారు. విమానాశ్రయానికి సకాలంలో చేరుకోవడం చాలా ముఖ్యం. అయితే నగరంలోని ట్రాఫిక్ కారణంగా కొన్ని సార్లు ఆలస్యం అవ్వొచ్చు. అలాంటప్పుడు ఈ పరిహారం వారికి కొంత ఉపశమనం అందిస్తుంది.ఇదీ చదవండి: భారత్కు ఆ రెండు టెస్లా కార్లు!.. సర్టిఫికేషన్ కోసం దరఖాస్తువిమానాశ్రయానికి రైడ్ బుక్ చేసుకుని, ఫ్లైట్ మిస్ అయితే మాత్రమే ఈ పరిహారం లభిస్తుంది. ఉబర్ ప్లాన్ కింద పరిహారం పొందాలంటే.. రైడ్ బుక్ చేసుకున్న వ్యక్తి సంతకం చేసిన క్లెయిమ్ ఫారమ్, మిస్ అయిన ఫ్లైట్ టికెట్ కాపీతో పాటు.. మళ్ళీ కొత్తగా బుక్ చేసుకున్న కొత్త విమానం టికెట్ వంటి అవసరమైన వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. -
అన్నదాత సుఖీభవపై చంద్రబాబు సర్కార్ యూటర్న్
-
Super Six Scheme: ఇచ్చేది లేదు సచ్చేది లేదని.. నోటికొచ్చినట్టు చెప్తున్నారు!
-
వజ్రాల పరిశ్రమ పునరుజ్జీవం
న్యూఢిల్లీ: కట్ చేసిన, సానబట్టిన వజ్రాలను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ‘డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ స్కీమ్’ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎగుమతులను పెంచడం, విలువను జోడించడం ఈ పథకం ఉద్దేశ్యాలుగా ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. వజ్రాల పరిశ్రమ ఎగుమతులు క్షీణత, ఉపాధి నష్టాన్ని ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది.తాజా పథకం ఈ ధోరణికి చెక్పెట్టి పరిశ్రమకు పునరుజ్జీవాన్ని కల్పిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా భారత వజ్రాల పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచుతుందని, ఎంఎస్ఎంఈలకు తగిన అవకాశాలను కల్పిస్తుందని తెలిపింది. మరిన్ని ఉపాధి అవకాశాలకు మార్గం కల్పిస్తుందని పేర్కొంది. రెండు స్టార్ల ఎగుమతి హోదా కలిగి, ఏడాదిలో 15 మిలియన్ డాలర్లు అంతకంటే అధిక విలువ మేర ఎగుమతులు చేస్తున్న సంస్థలు ఈ పథకం కింద ప్రయోజనానికి అర్హులని వెల్లడించింది.ఇదీ చదవండి: భారత్ క్రెడిట్ రేటింగ్కు సవాళ్లు25 క్యారట్ (25 సెంట్లు) అంతకంటే తక్కువ ఉన్న సహజ కట్, పాలిష్డ్ వజ్రాలను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు పథకం అనుమతిస్తుందని స్పష్టం చేసింది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) అనే స్వతంత్ర సంస్థ గణాంకాల ప్రకారం.. 2021–22లో ముడి వజ్రాల దిగుమతులు 18.5 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24 నాటికి 14 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు ఇదే కాలంలో 24.4 బిలియన్ డాలర్ల నుంచి 13.1 బిలియన్ డాలర్లకు తగ్గిపోవడం గమనార్హం. -
87 లక్షల మందికి తల్లికి వందనం ఎగవేత
-
సీనియర్ సిటిజన్లకు కేజ్రీవాల్ ‘సంజీవని’
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే 60 ఏళ్లు పైబడిన వారికి పూర్తి ఉచితంగా వైద్యం అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ స్కీమ్ పేరు ‘సంజీవని’ అని తెలిపారు.ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆదాయంతో సంబంధం లేదని పేద,మధ్యతరగతి, ధనిక వర్గాలకు చెందిన వృద్ధులకు ఈ స్కీమ్ కింద ఉచిత వైద్యం అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పతత్రుల్లో ఎక్కడ కావాలంటే అక్కడ వైద్యం పొందవచ్చన్నారు. #WATCH | Delhi | AAP National Convenor Arvind Kejriwal says, “Elderly over the age of 60 will receive free treatment under the Sanjeevani Yojna, in private and government hospitals both… There will be no upper limit on the cost of treatment. Registration for this will start in a… pic.twitter.com/WYQGjQI8Ga— ANI (@ANI) December 18, 2024 మహిళలకు నెలవారి నగదు అందించే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన స్కీమ్ను ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మహిళలు, వృద్ధుల ఓట్లపై ఫోకస్ చేయడం ద్వారా ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని ఆప్ భావిస్తోంది. -
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర
-
ఈపీఎఫ్వో క్షమాభిక్ష పథకం
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తాజాగా 2024 క్షమాభిక్ష పథకాన్ని ఆమోదించింది. దీని ప్రకారం సంస్థలు ఎటువంటి పెనాల్టీ లేకుండా గత ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను డిపాజిట్ చేయడానికి అనుమతిస్తుంది.కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా నేతృత్వంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు (ఈపీఎఫ్వో) చెందిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) శనివారం ఈపీఎఫ్వో ఆమ్నెస్టీ స్కీమ్ 2024ను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పెనాల్టీలు లేదా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోకుండా యజమానులను స్వచ్ఛందంగా బహిర్గతం చేయడానికి, గతంలో పాటించని లేదా తక్కువ నిబంధనలను సరిదిద్దడానికి ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని రూపొందించారు.స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు యజమానుల నుండి ఒక సాధారణ ఆన్లైన్ డిక్లరేషన్ సరిపోతుంది. స్వచ్ఛంద సమ్మతి కోసం పరిమిత అవకాశాన్ని అందించడం ద్వారా మరింత మంది ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను విస్తరించడం, యజమానులతో నమ్మకాన్ని పునర్నిర్మించడం, శ్రామిక శక్తిని అధికారికంగా ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం అని ఈపీఎఫ్వో పేర్కొంది. -
పోస్టాఫీసులకు మహిళలు పరుగులు..ఎందుకో తెలుసా? (ఫొటోలు)
-
ప్రతీ ఇంటికీ మూడు సిలెండర్లు ఇస్తామని గతంలో చంద్రబాబు హామీ
-
Adimulapu Suresh: ప్రజలకు ఉపయోగపడేలా బడ్జెట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు
-
ఆంధ్రప్రదేశ్లో కొందరికే గ్యాస్ సిలిండర్ పథకం... 55 లక్షల మంది లబ్ధిదారులకు పథకాన్ని ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం యత్నం