breaking news
fake liquor case
-
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు కొండల్రెడ్డి అరెస్ట్
-
Liquor Case: నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కొండల్రెడ్డి అరెస్ట్ అయ్యాడు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని హయత్నగర్ ఎక్సైజ్ పోలీసులు.. కొండల్రెడ్డిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కొండల్రెడ్డితో పాటు మరో ప్రధాన నిందితుడు బాలరాజ్గౌడ్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం కేసులో వీళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ కోసం ఇబ్రహీంపట్నంకు తరలిస్తున్నారు. ఆ మధ్య జరిగిన నల్లగొండ మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ.. నకిలీ మద్యం సరఫరా అయినట్లు గుర్తించారు. డిసెంబర్ 16వ తేదీన ఇబ్రహీంపట్నం పరిధిలోని యాచారంలో ఒక వ్యక్తి కల్తీ మద్యం తాగి.. అస్వస్థతకు గురైన విషయాన్ని ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఆపై ఈ దందా మొత్తం వెలుగులోకి వచ్చింది. ఐబీ, ఓసీ లాంటి బ్రాండ్లకు నకిలీ లిక్కర్ను ఒడిషా తయారు చేస్తున్నారు. వాటిని తెలంగాణ శివారు ప్రాంతాలకు తరలించి.. రంగారెడ్డి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు చేరవేస్తున్నారు. ఈ వ్యవహారానికి గతంలో పాతిక మందిని అదుపులోకి తీసుకున్నారు కూడా. ఈ స్కామ్లో వీళ్లిద్దరి పాత్ర, లింకులపై ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులు తేల్చాల్సి ఉంది. -
కేసు.. తుస్సు
‘డీల్’ కుదిరింది సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఊహించినట్లుగానే జరిగింది. రూ.4కోట్ల డీల్కు అనుగుణంగా నకిలీ మద్యం కేసు నీరుగారిపోతోంది. జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్గౌడ్ను కేసు నుంచి తప్పించేశారు. ఆయన ప్రమేయమే లేదంటూ కేసును మూసివేసేందుకు ఎక్సైజ్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ‘సాక్షి’ ముందు నుంచి చెబుతున్నట్లు ఆయన వ్యక్తిగత ప్రైవేట్ సహాయకుడు(పర్సనల్ ప్రైవేట్ అసిస్టెంట్) చిక్కా నాగశేఖరప్ప అలియాస్ రాజశేఖర్ను బలిపశువు చేసేందుకు ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా కేసులో కీలకపాత్ర పోషిస్తున్న ‘మౌర్య-ఇన్-హోటల్’లో సమావేశానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీ లేదని కేసును నీరుగార్యే ప్రయత్నం మొదలైంది. ఏకంగా జెడ్పీ చైర్మన్పై రాజకీయ కక్షలో భాగంగానే కేసు బనాయించారనే కోణంలో కేసును మలుపు తిప్పే ప్రయత్నం ముమ్మరమైంది. మొత్తం మీద జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసు కాస్తా ఎక్సైజ్ పోలీసులు విచారణ పేరిట తుస్సుమనిపించారు. చిన్ననాటి స్నేహితుల్లో ఒకడు డోన్ మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోని రాఘవేంద్ర గార్డెన్స్లో నవంబర్ 2న 15,360 బాటిళ్ల నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం కేసులో ఏమైనా జరిగితే... నేను చూసుకుంటానని జెడ్పీ చైర్మన్ రాజశేఖర్గౌడ్ ‘మౌర్య-ఇన్ హోటల్’ సమావేశంలో చెప్పాడని ఈ కేసులోని ఏ-2, ఏ-3లుగా ఉన్న రామన్గౌడ్, ఉమా మహేశ్వరగౌడ్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్ను ఆయన పీఏ రాజశేఖర్ పరిచయం చేయించారని కూడా వారు స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా పీఏపై ఏ-4 కేసును పోలీసులు నమోదు చేశారు. అందులో భాగంగా జెడ్పీ చైర్మన్ పీఏను డోన్ మండలం ఉడుములపాడు గ్రామసమీపంలో నవంబర్ 15న అరెస్టు చేశారు. ‘సాక్షి’ ముందు చెప్పినట్టుగానే ఆయన పీఏను బలిపశువు చేసేందుకు ప్రణాళిక రచించారు. ఆ మేరకు జెడ్పీ చైర్మన్కు సంబంధం లేదని పీఏతోనే చెప్పించారు. ‘జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్ చిన్ననాటి స్నేహితుల్లో ఒకరు. ఆయనకు కేసుతో సంబంధం లేదు. ఏ-2, ఏ-3లుగా ఈడిగ ఉమామహేశ్వర్ గౌడ్, ఈడిగ మనోహర్లను మౌర్య-ఇన్ హోటల్లో కలిశాం. నకిలీ మద్యం వ్యాపారం గురించి చర్చించుకున్నాం’ అని విచారణలో పీఏ తెలిపారు. మొదట్లో ఏ-2, ఏ-3లు చెప్పినట్టుగానే మొత్తం కేసులో మౌర్య-ఇన్ హోటల్ సమావేశమే కేంద్ర బింధువు. ఇంతటి కీలకమైన ‘మౌర్య-ఇన్ హోటల్’లో సీసీ టీవీ ఫుటేజీని చూస్తే... సమావేశం జరిగిన రోజు జెడ్పీ చైర్మన్ వచ్చారా? లేదా? ఇట్టే తెలిసిపోతుంది. అయితే, ఇక్కడే రాజకీయం, రూ.4 కోట్ల డీల్ మంత్రాంగం కాస్తా పనిచేసి... సీసీ టీవీ ఫుటేజీని లేకుండా చేసింది. రాజకీయ కక్షతోనే ఆరోపణలంటూ మళ్లింపు నకిలీ మద్యం కేసులో ఇరుక్కుపోయిన జెడ్పీ చైర్మన్ను తప్పించేందుకు ఫుటేజీ లేదంటున్న అధికారులు... చివరకు అధికార పార్టీ ఒత్తిళ్ల మేరకు రాజకీయ కక్షతోనే చైర్మన్పై ఆరోపణలు చేశారంటూ మొత్తం కేసును మలుపు తిప్పే ప్రయత్నం జరుగుతోంది. తద్వారా కేసుకు కాస్తా రాజకీయ రంగు పులిమి మమ అనిపించాలనే కుట్ర జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద అధికారపార్టీ ఒత్తిళ్లు, రూ.4 కోట్ల డీల్తో... ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ మద్యం వ్యవహారం కథ కాస్తా కంచికి చేరనుంది.