-
‘తికమక తాండ’ కాన్సెప్ట్ కొత్తగా ఉంది: విక్రమ్ కె. కుమార్
‘‘తికమక తాండ’ ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉంది. వెంకట్ ఎంచుకున్న కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. తనకు పెద్ద విజయం చేకూరాలి. అలాగే ఆరిస్టులు హరికృష్ణ, రామకృష్ణ, యాని, రేఖా నిరోషాలకు మంచి పేరు రావాలి’’ అని దర్శకుడు విక్రమ్ కె. కుమార్ అన్నారు. హరికృష్ణ, రామకృష్ణ, యాని, రేఖా నిరోషా హీరో హీరోయిన్లుగా వెంకట్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తికమక తాండ’. తిరుపతి సత్యం సమర్పణలో తిరుపతి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ని విక్రమ్ కె. కుమార్ రిలీజ్ చేశారు. ‘‘ఇప్పటికే విడుదల చేసిన ΄ాటలు, టీజర్కి మంచి స్పందన లభించింది. ఈ నెల 15న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: హరికృష్ణన్. -
కృష్ణవంశీ, క్రిష్, విక్రమ్ కె. కుమార్, హను రాఘవపూడి వెబ్ సిరీస్లివే!
ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అంటే గతంలో థియేటరే.. కానీ, ప్రస్తుతం బుల్లితెర కూడా ఇంటిల్లిపాదికీ వినోదం పంచుతోంది. పైగా కరోనా లాక్డౌన్లో ప్రేక్షకులకు ఓటీటీలు మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యాయి. ఇంట్లో కూర్చునే అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్లు, షోలు చూస్తున్నారు. వెబ్ సిరీస్లకు ఆదరణ బాగా ఉండటంతో సినిమా దర్శకులు సైతం ‘ఓటీటీకి సై’ అంటూ డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు ఓటీటీలోకి ఎంటర్ కాగా తాజాగా ఈ జాబితాలోకి కృష్ణవంశీ, క్రిష్, విక్రమ్ కె. కుమార్, హను రాఘవపూడి వంటి దర్శకులు చేరారు. ఈ దర్శకుల ఓటీటీ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్షన్, యాక్షన్, లవ్, ఫ్యామిలీ.. ఇలా ఏ జోనర్ సినిమా అయినా తన మార్క్ చూపించారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. ఆయన దర్శకత్వం వహించిన ‘రంగ మార్తాండ’ చిత్రం రిలీజ్కు రెడీ అవుతోంది. తదుపరి ప్రాజెక్ట్గా దాదాపు రూ. 300 కోట్లతో ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు ఈ మధ్యనే ప్రకటించారు కృష్టవంశీ. తెలంగాణ సాయుధ పోరాటాన్ని వెబ్ సిరీస్గా మలచనున్నట్లు తెలిపారాయన. ఒక్కో సీజన్కు 10 ఎపిసోడ్స్ చొప్పున 5 సీజన్స్గా ఈ సిరీస్ని రూపొందించనున్నారట. ఇక సమాజంలోని వాస్తవ అంశాలను, నవలలను, చారిత్రక అంశాలను కథలుగా మలిచి వెండితెరపైకి తీసుకురావడంలో క్రిష్ జాగర్లమూడిది ప్రత్యేక శైలి. ఇప్పటికే ‘మస్తీస్, 9 అవర్స్’ వంటి వెబ్ సిరీస్లకు షో రన్నర్గా వ్యవహరించిన ఆయన తొలిసారి ఓ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేయనున్నారని టాక్. ఒక వేశ్య జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా ‘హరి హర వీర మల్లు’ షూటింగ్లో బిజీగా ఉన్న క్రిష్ ఆ తర్వాత ఈ వెబ్ సిరీస్ను పట్టాలెక్కిస్తారని భోగట్టా. కాగా ‘కన్యాశుల్కం’ నవలను కూడా వెబ్ సిరీస్గా తీయాలనుకుంటున్నార ట క్రిష్. మరో దర్శకుడు విక్రమ్ కె. కుమార్ వినూత్న కథాంశాలతో ‘24’, ‘మనం’ వంటి సినిమాలు తెరకెక్కించారు. ప్రేమ కథలతో యువతని, కుటుంబ కథలతో ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసిన విక్రమ్ కె. కుమార్ బుల్లితెర ప్రేక్షకులను భయపెట్టనున్నారు. తొలిసారి ఆయన ‘దూత’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ ద్వారా హీరో నాగచైతన్య ఫస్ట్ టైమ్ డిజిటల్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ‘మనం, థ్యాంక్యూ’ చిత్రాల తర్వాత చైతన్య–విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘దూత’ హారర్, థ్రిల్లర్ జానర్లో ఉంటుందని సమాచారం. నాగచైతన్య పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ఇందులో హీరోయిన్లు పార్వతి, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఓ ప్రముఖ ఓటీటీలో ‘దూత’ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ‘అందాల రాక్షసి’ వంటి ప్రేమకథా చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, గత శుక్రవారం విడుదలైన ‘సీతారామం’ వరకూ ప్రేమకథా చిత్రాలను తెరకెక్కిస్తూ లవ్స్టోరీస్ స్పెషలిస్టు అనిపించు కున్నారు హను రాఘవపూడి. ప్రేమకథలకు సెంటిమెంట్, భావోద్వేగాలను జత చేసే ఆయన తొలిసారి ఓ వెబ్ సిరీస్కి పచ్చజెండా ఊపారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. అయితే ఈ సిరీస్లోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివ రాలు అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఓటీటీ ప్రాజెక్ట్స్ ప్రకటించినవారిలో దర్శకుడు తేజ ఉన్నారు. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు ఆ మధ్య ప్రకటించారాయన. అయితే ఈ ప్రాజెక్ట్ వివరాలు తెలియాల్సి ఉంది. కొందరు యువదర్శకులు కూడా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘పిట్ట కథలు’లో ఓ ఎపిసోడ్కి దర్శకత్వం వహించారు. తాజాగా సోనీ లివ్ కోసం ఓ వెబ్ సిరీస్ కమిట్ అయ్యారు. అలాగే ‘బెస్ట్ యాక్టర్స్, సప్తగిరి ఎక్స్ప్రెస్, వజ్ర కవచధర గోవింద’ వంటి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు అరుణ్ పవార్ ‘బిగ్ బాస్’ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘అసుర’ మూవీ డైరెక్టర్ కృష్ణ విజయ్ కూడా ‘పరంపర’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. గోపీచంద్ హీరోగా ‘పంతం’ సినిమాని తెరకెక్కించిన కె. చక్రవర్తి రెడ్డి ‘పులి–మేక’ అనే ఓ వెబ్ సిరీస్కి దర్శకత్వం వహిస్తున్నారు. ఆది సాయికుమార్, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ సిరీస్ షూటింగ్ జరుపుకుంటోంది. వీరితో పాటు మరికొందరు దర్శకులు వెబ్ సిరీస్ల కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నారు. -
నా మైండ్ సెట్ చాలా మారింది: నాగ చైతన్య
Naga Chaitanya Comments On Thank You Movie: ‘‘ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. సినిమాలో కొత్త విషయం ఉంటేనే థియేటర్స్కు వస్తున్నారు. ట్రైలర్ చూసి ఆ మూవీ చూడాలా? వద్దా అని నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు చిత్రాల ఎంపికలో నా మైండ్ సెట్ కూడా మారింది. సినిమాలో హీరో, డైరెక్టర్ అనే విషయాలు పక్కన పెడితే కథే కింగ్ అని నమ్ముతాను’’ అని అక్కినేని నాగచైతన్య అన్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. నాగచైతన్య హీరోగా, రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. అనిత సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్లో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు. ‘దిల్’ రాజుగారితో 12 ఏళ్ల తర్వాత (2019లో ‘జోష్’ వచ్చింది) ‘థ్యాంక్యూ’ సినిమా చేశాను. ఈ గ్యాప్లో ఆయన కాంపౌండ్ నుంచి చాలా కథలు విన్నాను. అయితే ఎగ్జయిటెడ్గా అనిపించలేదు. కానీ ‘థ్యాంక్యూ’ గురించి రాజు, విక్రమ్, బీవీఎస్ రవి చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్గా అనిపించింది. ఈ సినిమా తప్పక చేయాలనిపించి, చేశా. ఇలాంటి స్క్రిప్ట్స్ దొరకడం చాలా కష్టం. ‘థ్యాంక్యూ’ సినిమా నాకు ఫిజికల్గా, మెంటల్గా ఛాలెంజింగ్గా అనిపించింది. ఇందులో మూడు షేడ్స్లో ఉన్నట్టు కనిపిస్తాను. కానీ ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. 16 ఏళ్ల నుంచి 36 ఏళ్ల వరకు రకరకాల దశలలో కనిపిస్తాను. ఇప్పుడంటే నన్ను టీనేజర్ పాత్రలో ప్రేక్షకులు చూస్తున్నారు. ఇంకో మూడు, నాలుగేళ్ల తర్వాత నేను ఇలాంటి సినిమాలు చేస్తానంటే ఎవరూ పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు. అందుకే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశాను (నవ్వుతూ). విక్రమ్ కుమార్ సున్నితమైన విషయాలను బాగా డీల్ చేస్తారు. ఒక వ్యక్తి తన జీవితంలో కలిసే వ్యక్తుల వల్ల ఎలా ప్రభావం చెందాడు? అనేది ‘థ్యాంక్యూ’లో మెయిన్ పాయింట్. ఈ సినిమాతో వ్యక్తిగా నేను చాలా మారాను. అంతకు ముందు మనసులో ఉన్న విషయాలను సగమే బయటకు చెప్పేవాణ్ణి.. ఇప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీకి మరింత క్లోజ్ అయ్యాను. మనసు విప్పి మాట్లాడుతున్నాను. ఈ సినిమాలో 16 ఏళ్ల కుర్రాడిలా కనపడటానికి ప్రొడక్షన్ వాళ్లు సపోర్ట్ చేసి, మూడు నెలలు సమయం ఇచ్చారు. ఆ టైమ్లో వర్కవుట్స్తో పాటు బాడీ లాంగ్వేజ్ పరంగా వర్క్షాప్స్ కూడా చేశాను. ప్రతి స్క్రిప్ట్లోనూ అది దొరకదు. ఈ సినిమాలో దొరికింది. ఇప్పుడంటే నా శరీరం కూడా సపోర్ట్ చేస్తోంది. భవిష్యత్లో కుదురుతుందో? లేదో చూడాలి (నవ్వుతూ). అఖిల్ ‘ఏజెంట్’ ట్రైలర్ బాగుంది. తన లుక్ మార్చుకోవటం కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ‘ఏజెంట్’తో తనకు మాస్, కమర్షియల్గా పెద్ద సక్సెస్ వస్తుందనుకుంటున్నాను. నా తర్వాతి సినిమా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఉంటుంది. ఇందులో నాది పోలీస్ ఆఫీసర్ పాత్ర. తరుణ్ భాస్కర్తో ఓ చిత్రం డిస్కషన్లో ఉంది. పరుశురామ్తోనూ ఓ పాయింట్ అనుకున్నాం. కోవిడ్ సమయంలోనే హిందీలో ‘లాల్సింగ్ చద్దా’ అవకాశం వచ్చింది. ఈ సినిమా కోసం 25కిలోలు బరువు తగ్గాను. నాన్న (నాగార్జున), చిరంజీవి, రాజమౌళి, సుకుమార్, ఆమిర్ ఖాన్ గార్లతో ‘లాల్సింగ్ చద్దా’ ప్రీమియర్ చూడటం మరచిపోలేని అనుభూతి. అందరికీ సినిమా బాగా నచ్చింది. చిరంజీవిగారు మా సినిమాని సమర్పించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో హిందీ ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే బాలీవుడ్ సినిమాల గురించి ఆలోచిస్తాను. -
అలా మరిచిపోతే విలువ ఉండదు: నాగ చైతన్య
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు. ఇదివరకు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువ ఉండదని నా ఫ్రెండ్ చెప్పాడు అంటూ నాగ చైతన్య చెప్పిన డైలాగ్తో ప్రారంభమైన ట్రైలర్ను 'ఇట్స్ ఏ లాంగ్ జర్నీ మై ఫ్రెండ్' అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్స్తో ముగించారు. లవ్ ఫీల్తో ఎమోషనల్గా ఆకట్టుకునేలా ఉంది ట్రైలర్. క్లాస్, మాస్ గెటప్లో నాగ చైతన్య కనిపించి ఆకట్టుకునేలా ఉన్నాడు. డైలాగ్స్, తమన్ సంగీతం బాగుంది. లవ్, కెరీర్ వంటి తదితర అంశాలను సినిమాలో ప్రస్తావించనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 'మనం' తర్వాత విక్రమ్ కె. కుమార్, నాగ చైతన్య కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం వల్ల 'థ్యాంక్యూ'పై అంచనాలు నెలకొన్నాయి. చదవండి: ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్ 'ఆర్ఆర్ఆర్'పై పోర్న్ స్టార్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ -
నాగ చైతన్య 'థ్యాంక్యూ' నుంచి 'ఫేర్వెల్..'
Naga Chaitanya Thank You Movie Farewell Lyrical Song Released: నాగచైతన్య హీరోగా రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'థ్యాంక్యూ'. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని 'ఫేర్ వెల్..' అంటూ సాగే పాటను హైదరాబాద్లోని ఓ కాలేజీలో విద్యార్థుల సమక్షంలో సోమవారం (జూన్ 28) విడుదల చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ- 'ఐదో తరగతి వరకు అమ్మానాన్నతో ఉంటాం.. ఆ తర్వాత స్కూల్మేట్స్తో కలుస్తాం. ఆ తర్వాత అంతా కళాశాల జీవితమే. అంత అనుబంధమున్న కాలేజ్ లైఫ్ను వదిలేసి వెళ్తుంటే ఎంత భావోద్వేగానికి గురవుతామో ఈ 'ఫేర్వెల్..' పాట ద్వారా చెప్పాం' అన్నారు. 'ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది' అని విక్రమ్ కె. కుమార్ అభిప్రాయపడ్డారు. ''మూడేళ్లు 'థ్యాంక్యూ' కోసం కష్టపడ్డాం. రిజల్ట్ కోసం వేచి చూస్తున్నాం'' అని నాగచైతన్య పేర్కొన్నాడు. ''ఫేర్వెల్..' సాంగ్ సినిమాలో మంచి సందర్భంలో వస్తుంది. ఈ పాట చూశాక మీరు ఉద్వేగానికి గురవుతారు'' అని తమన్ తెలిపాడు. చదవండి: హార్ట్ సింబల్స్తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement