మనం మళ్లీ కలుద్దామా?

Akkineni Nagarjuna to next work with Vikram K Kumar - Sakshi

‘మనం’తో అక్కినేని కుటుంబ సభ్యులకు ఒక స్పెషల్‌ చిత్రాన్ని ఇచ్చారు దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌. ఆ తర్వాత అఖిల్‌తో ‘హలో’ తీశారు. తాజాగా విక్రమ్‌ కె. కుమార్, నాగార్జున కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతోందని టాక్‌. ప్రస్తుతం ‘మన్మథుడు 2’ సినిమాతో బిజీగా ఉన్నారు నాగ్‌. ఆ తర్వాత కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో  ‘బంగార్రాజు’ చిత్రం లైన్‌లో ఉంది. ఈ సినిమా తర్వాత విక్రమ్‌ కె.కుమార్‌ సినిమాను ట్రాక్‌ మీదకు తీసుకెళ్తారట నాగార్జున. ప్రస్తుతం నాని హీరోగా చేస్తోన్న ‘గ్యాంగ్‌లీడర్‌’తో బిజీగా ఉన్నారు విక్రమ్‌. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేసి నాగార్జున చిత్రానికి స్క్రిప్ట్‌ రెడీ చేసే పనిలో ఉంటారట విక్రమ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top