మరో మల్టీస్టారర్‌?

Vikram k kumar next movie with Nagarjuna akkineni - Sakshi

‘మనం’ సినిమాలో అక్కినేని కుటుంబం మొత్తం కలసి నటించింది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్‌.. ఇలా అక్కినేని హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కినేని కథానాయకులకు, వాళ్ల అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది.

అయితే  అక్కినేని హీరోలందరూ మరోసారి ఓ సినిమా చేయబోతున్నారన్నది ఫిల్మ్‌న గర్‌ టాక్‌. కుమారులు చైతన్య, అఖిల్‌తో కలసి ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారట నాగార్జున. ఈ మల్టీస్టారర్‌ సినిమాకు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తారట. గతంలో రాహుల్‌ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ చిత్రాన్ని చేశారు నాగార్జున. ఈ మల్టీస్టారర్‌ మూవీ త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుందని టాక్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top