uttar pradesh elections 2017
-
యూపీ అసెంబ్లీలో మళ్లీ యాంటీ క్రైం బిల్లు
ఉత్తరప్రదేశ్ : రాష్ట్రంలో క్రిమినల్స్ను రూపుమాపటం కోసం యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం యాంటీ క్రైం (యూపీ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైం) బిల్లును మంగళవారం అసెంబ్లీలో మరోసారి ప్రవేశపెట్టింది. యోగి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా రాష్ట్రంలో క్రిమినల్స్ను ఎన్కౌంటర్ చేస్తున్న విషయం తెలిసింది. ఈ ఎన్కౌంటర్లన్ని రాజకీయ ఎన్కౌంటర్లుగా ప్రతిపక్షం విమర్శిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దానిలో భాగంగా 2017 డిసెంబర్ 21న రాష్ట్ర శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టింది. శాసన సభలో స్పష్టమైన మెజారిటీ ఉండటంతో బిల్లు సునాయాసంగా ఆమోదం పొందింది. ఇక శాసన మండలిలో 100 మంది సభ్యుల్లో బీజేపీకి కేవలం 13 మంది సభ్యులే ఉండటంతో బిల్లు విగిపోయింది. మండలిలో విపక్ష ఎస్పికి 61, బీఎస్పీకి 9 మంది చొప్పున సభ్యులు ఉండటంతో ప్రభుత్వానికి తిప్పలు తప్పడం లేదు. కాగా దేశంలో ఇదివరకే మహారాష్ట్ర ప్రభుత్వం క్రైంను అంతమొందించడం కోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను తీసుకువచ్చిందని, ఉత్తరప్రదేశ్ లో కూడా అలాంటి వ్యవస్థనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. -
విపక్షాలన్నీ ఏకతాటిపైకి..!
లక్నో/ముంబై: యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమితో దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 20 ఏళ్లకు పైగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీలు ఏకమై సాధించిన ఈ ఫలితాలతో బీజేపీ వ్యతిరేక బలమైన కూటమి నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉద్ఘాటించారు. తాజా ఓటమితో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. బీఎస్పీతో కలిసి ముందుకెళ్లేందుకు సిద్ధమేనని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంకేతాలిచ్చారు. గతాన్ని మరిచిపోయి (బీఎస్పీ, ఎస్పీ మధ్య వైరం, కాంగ్రెస్ విమర్శలు).. బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధమేనని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్తో ఇప్పటికీ సత్సంబంధాలే ఉన్నాయని అఖిలేశ్ తెలిపారు. కాగా విపక్షాలను ఏకం చేసేందుకు రాహుల్ ఒక్కోపార్టీ నేతతో వ్యక్తిగతంగా సమావేశమవుతున్నారు. దీంతో 2019లో పోటీ బీజేపీ వర్సెస్ విపక్ష కూటమిగా ఎన్నికల పోరు జరగనుంది. బీజేపీకి నిద్ర పట్టదు: మాయావతి చండీగఢ్లో నిర్వహించిన ర్యాలీలో మాయావతి మాట్లాడుతూ.. బీజేపీని ఓడించేందుకు ఎస్పీ సభ్యులకు బీఎస్పీ మద్దతిచ్చిందని పేర్కొన్నారు. అందుకే.. వారి కంచుకోటలో బీజేపీని ఘోరంగా ఓడించామన్నారు. మోదీకి సరైన గుణపాఠం చెప్పేందుకే ఎస్పీతో చేయి కలిపామని ఆమె తెలిపారు. ఈ దెబ్బకు నిద్రకరువైన బీజేపీ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఎక్కువ ఆలస్యం చేస్తే మరింత ముప్పుతప్పదని బీజేపీకి ఇప్పటికే అర్థమై ఉంటుందని మాయావతి ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు 1975నాటి ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్నాయని మాయావతి విమర్శించారు. గతం గతః: అఖిలేశ్.. కాంగ్రెస్తో ఈ ఎన్నికల వరకు పొత్తులేకున్నా.. ఆ పార్టీతో సత్సంబంధాలే ఉన్నాయని అఖిలేశ్ ప్రకటించారు. ‘సమాజ్వాదీలు అందరినీ గౌరవిస్తారు. అందుకే మాకు అన్ని పార్టీలతో సత్సంబంధాలున్నాయి. ప్రజలు పాత ఘటనలను (బీఎస్పీతో విభేదాలు, ప్రచారంలో కాంగ్రెస్ విమర్శలు) గుర్తుచేసుకున్నారు. కానీ కొన్నిసార్లు గతాన్ని మరిచిపోవటమే మంచిది. దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు మార్గాలను అన్వేషిస్తున్నాం’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. బీజేపీ మునుగుతున్న నావ: పట్నాయక్ ఈ ఫలితాలు విపక్ష కూటమిని బలోపేతం చేస్తాయని బీజేపీ మిత్రపక్షమైన శివసేన అభిప్రాయపడింది. విపక్షాల ఐక్యకూటమి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించగలదని ఎన్సీపీ తెలిపింది. ‘బీజేపీ చాలా వేగంగా మునుగుతున్న నావ’ అని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. రాహుల్–పవార్ భేటీ: ఎన్సీపీ అధినేత శరద్పవార్తో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముంబైలో బుధవారం రాత్రి సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరూ చర్చించారు. తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ రాహుల్ సమావేశం కానున్నారు. కాంగ్రెస్లో గుబులు! యూపీ ఎన్నికల ఫలితాలతో విపక్ష కూటమి బలోపేతం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నప్పటికీ.. లోలోపల హస్తం పార్టీ గుండెల్లో గుబులు రేగుతోంది. ఎందుకంటే.. యూపీలో కాంగ్రెస్ పోటీచేసిన రెండుచోట్లా డిపాజిట్ కూడా దక్కలేదు. ఒకవైపు, బీజేపీపై కాంగ్రెస్ సమరశంఖం పూరిస్తూనే.. మరోవైపు తన బలాన్ని పెంచుకోలేక విఫలమవుతున్న నేపథ్యంలో.. ప్రాంతీయ పార్టీలు బలపడే అవకాశం ఉంది. ఒకవేళ 2019కి ముందు జరగనున్న ఎన్నికల్లో (కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్).. కాంగ్రెస్ విజయం సాధించలేని పక్షంలో.. విపక్షాల ఐక్యకూటమి బలహీనపడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్పీ–బీఎస్పీ కూటమి గెలవటం బీజేపీ కన్నా కాంగ్రెస్కే బలమైన సవాలంటున్నారు. ‘ప్రాంతీయ పార్టీలు కూడా తాము బలపడాలనుకుంటాయి. కానీ.. కాంగ్రెస్కు ఎందుకు ఎక్కువసీట్లు ఇవ్వాలనుకుంటాయి. అలాంటప్పుడు, యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలో 5–6 కన్నా ఎక్కువ సీట్లలో పోటీచేసే అవకాశం మాకు ఉండకపోవచ్చు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించటం ఆ పార్టీలో అంతర్గతంగా నెలకొన్న ఆందోళనకు అద్దంపడుతోంది. పెద్దరాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ కన్నా కొత్తకూటమిలో ఉంటాయని భావిస్తున్న ప్రాంతీయపార్టీలే బలంగా ఉన్నాయి. -
యూపీలో ‘కల్తీ సారా’కు మరణశిక్షే!
లక్నో: కల్తీ సారా అమ్మి అమాయక ప్రజల మరణానికి కారకులయ్యేవారికి మరణశిక్ష విధించే బిల్లును ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం ఆమోదించింది. యూపీ ఎక్సైజ్(సవరణ) చట్టం–2017 ప్రకారం కల్తీ సారా వల్ల మరణాలు సంభవిస్తే దాని తయారీతో సంబంధమున్న వారికి మరణశిక్ష లేదా యావజ్జీవంతో పాటు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. కల్తీ సారాతో అంగవైకల్యం సంభవిస్తే సారా తయారీదారుకు గరిష్టంగా పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. రూ.5 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. ఇటీవలి కాలంలో కల్తీసారాతో వరుస మరణాలు సంభవించడంతో సెప్టెంబర్లో ఎక్సైజ్ చట్టానికి సవరణలు చేసి యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. -
ఇంతకీ పీఈటీఎన్ ఏమిటి?
పెంటాఎరిథ్రిటాల్ టెట్రానైట్రేట్ (పీఈటీఎన్) అత్యంత శక్తిమంతమైన ప్లాసిక్ పేలుడు పదార్థం. నైట్రోగ్లిసరిన్ తరహా రసాయనిక మిశ్రమం. పౌడర్ రూపంలో, స్పటికాకృతిలో లేదా సన్నని ప్లాస్టిక్ షీట్ రూపంలో ఉంటుంది. రంగేమీ ఉండదు. వేడిని పుట్టించడం ద్వారా (బ్లాస్టింగ్ క్యాప్ ద్వారా... సన్నటి అల్యూమినియం లేదా రాగి గొట్టానికి వైర్లతో కనెక్ట్ చేసి బ్యాటరీ ద్వారా వేడి చేస్తారు), షాక్వేవ్ ద్వారా దీన్ని పేల్చవచ్చు. నేరుగా నిప్పు పెట్టి పేల్చడం కుదరదు.. పీఈటీఎన్ అమ్మకాలపై చాలాదేశాల్లో కఠిన ఆంక్షలున్నాయి. బ్లాక్మార్కెట్లో దొరుకుతుంది. గనుల్లో పేలుళ్లకు వాడతారు. ఆర్మీ కూడా వినియోగిస్తుంది. తీవ్రత ఎక్కువ... పీఈటీఎన్ పేలుడు తీవ్రత అధికంగా ఉంటుంది. అందుకే అధిక జననష్టాన్ని కోరుకునే ఉగ్రవాదులు పేలుళ్లకు దీన్ని ఎంచుకుంటారు. రవాణా, నిలువ చేయడం తేలిక, సురక్షితం కూడా. పేల్చినపుడు మాత్రం భీకరమైన శక్తి వెలువడుతుంది. తక్కువ మోతాదుతో పెనునష్టం కలిగించవచ్చు. 100 గ్రాముల పీఈటీఎన్తో ఒక కారును తునాతునకలు చేయవచ్చు. యూపీ అసెంబ్లీలో 150 గ్రాముల పీఈటీఎన్ దొరికింది. అసెంబ్లీ భవనాన్ని మొత్తాన్ని పేల్చడానికి 500 గ్రాముల పీఈటీఎన్ చాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం సభలో చెప్పారు. 1894లో జర్మనీ పేలుడు పదార్థాల ఉత్పత్తి సంస్థ స్ప్రెంగ్స్టోఫ్ మొదటిసారిగా దీన్ని ఉత్పత్తి చేసి పేటెంట్ పొందింది. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత వాణిజ్యస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. పట్టుకోవడం కష్టం... పీఈటీఎన్ సాధారణ ఎక్స్రే స్కానర్లకు, మెటల్ డిటెక్టర్లకు దొరకదు. పైగా ప్లాస్టిక్ షీట్ రూపంలో ఉన్నపుడు దీన్ని ఏ ఆకృతిలోకైనా మార్చవచ్చు. అనుమానం రాకుండా ఏదైనా వస్తువులో దాయొచ్చు. శరీరానికి అతికించేయొచ్చు. అయితే దీన్ని పేల్చడానికి వాడే వైరింగ్, బ్యాటరీలాంటి వాటితో దొరికిపోతారు. ఎలట్రికల్ వస్తువుల్లో దాస్తే మాత్రం పట్టుకోవడం కష్టం. అందుకే విమానాశ్రయాల్లో తనిఖీలను దాటుకొని వెళుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే వాణిజ్య తయారీ సంస్థలు పీఈటీఎన్ను గుర్తించేందుకు వీలుగా దాంట్లో కొన్ని పదార్థాలను కలుపుతున్నాయి. తద్వారా వాసనను పసిగట్టడానికి వీలవుతోంది. కొంచెం రసాయన శాస్త్ర పరిజ్ఞానంతో మార్కెట్లో సులువుగా దొరికే పదార్థాలను కొని పీఈటీఎన్ను తయారు చేస్తున్నారు. దీన్ని పట్టుకోవడం కష్టం. విమానాల్లో రెండు యత్నాలు... 2001లో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానాన్ని కూల్చడానికి బ్రిటన్కు చెందిన రిచర్డ్ రీడ్ విఫలయత్నం చేశాడు. బూట్లలో పెంటాఎరిథ్రిటాల్ టెట్రానైట్రేట్ను దాచి విమానం ఎక్కాడు. పేలకపోవడంతో చేత్తో అంటించే ప్రయత్నం చేశాడు. తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది అతనికి పైకి లంఘించి కట్టేశారు. 183 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఆ సమయంలో విమానంలో ఉన్నారు. రీడ్కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. తర్వాత 2009 క్రిస్మస్ పర్వదినాన డెట్రాయిట్కు వెళుతున్న నార్త్వెస్ట్ ఎయిర్లైన్స్ విమానాన్ని పీఈటీఎన్తో పేల్చడానికి ఉమర్ ఫరూక్ అబ్దుల్ ముతల్లాబ్ విఫలయత్నం చేశాడు. లోదుస్తుల్లో దాచిన పీఈటీఎన్ను పేల్చడానికి ఉమర్ సిరంజితో ఎవో రసాయానాలను అందులోకి జొప్పించాడు. బాంబు పేలలేదు కాని అతని తొడ భాగం కాలిపోయింది. 2011లో ఢిల్లీ హైకోర్టులో జరిగిన పేలుడుకు కూడా పీఈటీఎన్ వాడినట్లు వార్తలొచ్చాయి. ఈ పేలుడులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఎమ్మెల్యే సీటు కింద బాంబు కలకలం..
లక్నో: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే సీటు కింద బాంబు లభించడం కలకలం సృష్టిస్తోంది. అనుమానాస్పదంగా ఎమ్మెల్యే సీటు కింద 60 గ్రాముల పౌడర్ను అసెంబ్లీ సిబ్బంది బుధవారం గుర్తించింది. దీన్ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపగా పెంటాఎరిత్రిటాల్ టెట్రానైట్రేట్ (పీఈటీఎన్) అనే శక్తివంతమైన ప్లాస్టిక్ పేలుడుపదార్థంగా గుర్తించారు. దీంతో అసెంబ్లీలోనే ఈ పేలుడు పదార్థం లభించడంతో ఎమ్మెల్యేలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సంఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ హుటాహుటిన ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనిపై భద్రతాధికారులు విచారణ ప్రారంభించినట్టు చెబుతున్నారు. అసెంబ్లీలోనే భద్రత ఇంత దారుణంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ ప్రతపక్షాలు ధ్వజమెత్తాయి. -
యూపీ అసెంబ్లీలో రచ్చ!
- గవర్నర్పై కాగితపు బంతులు విసిరిన ప్రతిపక్ష నేతలు - తొలిసారి డీడీలో ప్రత్యక్ష ప్రసారం లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల తరువాత సోమవారం తొలిసారి సమావేశమైన శాసన సభలో ప్రతిపక్ష పార్టీలు రచ్చరచ్చ చేశాయి. సభలో ప్రసంగిస్తున్న గవర్నర్ రామ్నా యక్పై ఎస్పీ, కాంగ్రెస్ సభ్యులు కాగితపు బంతులు విసిరారు. ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలతో హోరెత్తించారు. ఈలలేసి గోల చేశారు. దూసుకువస్తున్న కాగితపు బంతుల నుంచి గవర్నర్ను రక్షించేందుకు మార్షల్స్... పుస్తకాలు, ఫైళ్లను అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం చేశారు. కాగా, యూపీలో అసెంబ్లీ సమావేశాలను దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే తొలిసారి. యూపీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ప్రారంభించగానే... ప్రతిపక్ష ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా పెద్దపెట్టున నిరసనలు తెలిపారు. ఎస్పీ శాసనసభాపక్ష నాయకుడు రాజేష్యాదవ్... తనకు ప్రసం గం వినిపించడం లేదంటూ పెద్దగా ఈల వేసి చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్లోకి చొచ్చుకు పోయారు. 84 పేజీల ప్రసంగాన్ని తీవ్ర గందరగోళం మధ్య గవర్నర్ రామ్నాయక్ 35 నిమిషాల్లో పూర్తి చేశారు. ఒకప్పుడు యూపీ అన్నింటా ముందుండేదని, కానీ.. గత కొన్నేళ్లుగా వెనుకబడిందని గవర్నర్ చెప్పారు. మళ్లీ ఇన్నాల్టికి యోగి ఆధ్వర్యంలో అగ్ర భాగాన దూసుకుపోతోందని కితాబిచ్చారు. ఈ గందరగోళం సమయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సభలోనే ఉన్నారు. -
ఒక్కటైన విపక్షాలు; ఆ ఇద్దరి రూటే వేరు
- యూపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రచ్చరచ్చ - గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలిన ఎస్పీ, బీఎస్పీ - యోగి సర్కారుపై ‘ఉమ్మడి’ పోరుకు పిలుపు - ఎడమొహం, పెడమొహంగా అఖిలేశ్- శివపాల్ లక్నో: ఉత్తరప్రదేశ్ 17వ అసెంబ్లీ తొలి సమావేశాలు.. విపక్షాల నిరసనల మధ్య రసాభసగా సాగాయి. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరుగుతోన్న మొదటి సమావేశాలు కావడంతో అధికార బీజేపీ అసెంబ్లీ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిపాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూ విపక్షలు కూడా అంతే స్థాయిలో నిరసనలు తెలిపాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ రామ్నాయక్ సోమవారం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. దీనిని సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. విపక్ష సభ్యులు ఒక దశలో గవర్నర్ పైకి పేపర్లు విసరడంతో సభలో గందరగోళం ఏర్పడింది. మార్షల్స్ అడ్డుగా నిలవగా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ సమయంలో స్పీకర్ హృదయనారాయణ్ దీక్షిత్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లు సభలోనే ఉన్నారు. విపక్షాల ఐక్యత.. యూపీలో బీజేపీ ప్రజావ్యతిరేక పాలన సాగుతున్నదని ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది. మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలని ఎస్పీఎల్పీ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన రాంగోవింద్ చౌదరి పిలుపునిచ్చారు. బీజేపీని అడ్డుకోకపోతే అది యూపీ సర్వనాశనం చేస్తుందని ఆయన అన్నారు. బీఎస్పీ పక్ష నేత లాల్జీ వర్మ్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘బీజేపీని, అది సాగిస్తోన్న ప్రజావ్యతిరేక పాలను ఎండగట్టే క్రమంలో భావస్వారూప్యం ఉన్న పార్టీలతో.. అది ఎస్పీ అయినా, మరొక పార్టీ అయినా కలిసి పనిచేయడానికి బీఎస్పీ సిద్ధంగా ఉంది’ అని లాల్జీ వర్మ చెప్పారు. చెరోదారిలో బాబాయి - అబ్బాయి.. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే సభలో అఖిలేశ్యాదవ్, శివపాల్ యాదవ్లు ఎడమొహం పెడమొహంగా వ్యవహరించారు. అందరికంటే ముందే సభకు వచ్చిన శివపాల్.. ఎస్పీ సభ్యులు అందరితో కలివిడిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. గవర్నర్ రాకకు కొద్దిగా ముందు సభలోకి వచ్చిన అఖిలేశ్.. బాబాయిని చూసి కూడా చూడనట్లే ముఖం తిప్పుకున్నారు. ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత శివపాల్.. ములాయం నేృత్వంలో లైకిక ఫ్రంట్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
యూపీ అసెంబ్లీలో తొలిరోజే రభస
-
పెద్దాయనా.. ఇదేం పని?
ములాయంపై కాంగ్రెస్, బీజేపీ మండిపాటు లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఓటమికి కాంగ్రెస్ పార్టీతో పొత్తే కారణమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. ములాయం మాటలకు చేతలకు పొంతనే లేదని పేర్కొంది. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఐక్య కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేసినప్పుడల్లా ములాయం దూరంగా వెళ్లారని గుర్తు చేసింది. అలాగే ములాయం కుటుంబంలో తలెత్తిన సంక్షోభం ప్రజల వరకు చేరకుండా, ఇరు వర్గాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని ఉండాల్సిందని యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ వ్యాఖ్యానించారు. యూపీలో ఓటమికి కాంగ్రెస్తో పొత్తే కారణమని ములాయం చేసిన వ్యాఖ్యలు నిరాధారమని కొట్టిపారేశారు. కాగా, ప్రధాని మోదీపై ములాయం సింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. యూపీ ప్రజల తీర్పును ఆయన అగౌరవపరుస్తున్నారని పేర్కొంది. ములాయం ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించింది. తన కుమారుడే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టిన తీరుతో ఆయన ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నారని, ఆయన వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగించలేదని యూపీ బీజేపీ అధికార ప్రతినిధి మనీశ్శుక్లా పేర్కొన్నారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ రూ.15వేలు కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని ములాయం విమర్శించిన విషయం తెలిసిందే. -
‘మీడియా మా ఇంటిపైనే పడింది.. అందుకే ఓడాం’
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తమ ఓటమికి మీడియా, ఓటర్లు కారణమని సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు. తమ కుటుంబ వివాదంపైనే మీడియా తన దృష్టిని కేంద్రీకరించిందని, ప్రజలంతా బీజేపీ చేతిలో మూర్ఖులయ్యారని విమర్శించారు. అఖిలేశ్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిన ప్రజలు బీజేపీ ప్రభావానికి లోనై ఓటమిని కట్టబెట్టారని ఆరోపించారు. చల్ మోదీ, చల్ మోదీ అనే పిలుపుతో ప్రజలు మూర్ఖులుగా మారి బీజేపీతో వెళ్లిపోయారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో పార్టీ చీఫ్ను మార్చే ఆలోచన ఏదైనా ఉందా అని ప్రశ్నించగా ప్రస్తుతానికి ఆ ఆలోచనేది లేదని, ఇప్పుడా విషయం మాట్లాడటం కూడా అర్థం లేదన్నారు. మరోపక్క, ములాయం వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ప్రజలకు ఉన్న వ్యూహాన్ని ములాయం తక్కువ అంచనా వేస్తున్నారని, ప్రజల అవగాహనను ఆయన తక్కువ అంచనా వేస్తున్నారని మండిపడింది. -
సీఎం యోగి వ్యాఖ్యలతో వివాదం!
వందేమాతరం పాడకపోవడం దురుద్దేశమేనని కామెంట్ లక్నో: జాతీయగేయం వందేమాతరంపై ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొత్త వివాదానికి తెరలేపారు. వందేమాతరం పాడకపోవడం తీవ్రమైన విషయమని, దీనిని తీవ్రంగా పరిగణించి పరిష్కరించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఈ విషయంలో దురుద్దేశపూరితంగా వ్యవహరించేవారితో ఎలా ఎదుర్కోవాలనే దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని చెప్పారు. ‘కొంతమంది వ్యక్తులు ఇప్పుడు తాము వందేమాతరం పాడబోమని పేర్కొంటున్నారు. వందేమాతరం పాడకపోవడం తీవ్రమైన విషయం.. వందేమాతరం పాడకపోవడం దురుద్దేశపూరితమే. ప్రతి ఒక్కరూ వందేమాతరం పాడాల్సిందే’ అని సీఎం యోగి అన్నారు. లక్నోలో శనివారం జరిగన ఓ పుస్తకావిష్కరణ సభలో సీఎం యోగి ప్రసంగించారు. అయితే, తమ ప్రభుత్వం ఏకైక అజెండా అభివృద్ధి మాత్రమేనని స్పష్టం చేశారు. 21వ శతాబ్దంలో కూడా ‘వందేమాతరం’ పాడకపోవడం అనేది అత్యంత చర్చనీయాంశంగా మార్చకూడదని పేర్కొన్నారు. యూపీలోని కొన్ని మున్సిపాలిటీలలో వందేమాతరం పాడటంపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో సీఎం యోగి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మీరట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ సమావేశంలో వందేమాతరం పాడకపోవడంపై వివాదం రేగింది. అలాగే అలహాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ సమావేశంలో వందేమాతరం పాడటాన్ని తప్పనిసరి చేయాలంటూ బీజేపీ తీర్మానం పెట్టగా.. ఎస్పీ, ఇతర సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకించారు. -
బీజేపీలోకి ములాయం కోడలు?
లక్నో: సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరే అవకాశముందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అపర్ణ నేతృత్వంలోని ఎన్జీవో నిర్వహిస్తున్న కన్హా ఉపవాన్(గోశాల)ను శుక్రవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. బీజేపీలో చేరే అవకాశముందా అని ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నించగా.. సమయం వచ్చినప్పుడు చెబుతా అని అపర్ణ సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని, ఇప్పుడు తానేమి చెప్పలేనని అన్నారు. బీజేపీలో చేరికను ఆమె ఖండించకపోవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ స్థానం పోటీ చేసిన అపర్ణ.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు. ఈ నెల 24న తన భర్త ప్రతీక్ యాదవ్ తో పాటు సీఎం యోగిని కలిసి 20 నిమిషాల పాటు మంతనాలు జరిపారు. మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రిని కలిసినట్టు అపర్ణ అప్పుడు చెప్పారు. ఈ పరిణామాలన్ని చూస్తుంటే ఆమె బీజేపీలోకి వెళ్లే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. -
ములాయం, అఖిలేశ్ తాజా పోరు
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా సమాజ్ వాదీ పార్టీలో ‘పరివార్’ పంచాయతీ తేలలేదు. ప్రతిపక్ష నేతగా ఎవరు ఉండాలన్న దానిపై తండ్రీకొడుకు ములాయం, అఖిలేశ్ యాదవ్ మధ్య పోరు మొదలైంది. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో తండ్రీకొడుకు వేర్వేరుగా సమావేశం కావాలని నిర్ణయించడమే ఇందుకు తాజా రుజువు. అఖిలేశ్ మంగళవారం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. బుధవారం ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని ‘పెద్దాయన’ నిర్ణయించారు. మాజీ మంత్రి రామగోవింద్ చౌదరిని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాలని అఖిలేశ్ భావిస్తుండగా, ములాయం తన సోదరుడికి కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. తన సోదరుడు శివపాల్ యాదవ్ ను ప్రతిపక్ష నాయకునిగా ఎంపిక చేయాలని ములాయం తలపోస్తున్నారు. పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ కూడా విపక్ష నేత రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ములాయం, అఖిలేశ్ విడివిడిగా కొత్త ఎమ్మెల్యేలతో మంతనాలు జరపాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కూటమి 325 స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ-కాంగ్రెస్ కూటమి 54 స్థానాలకే పరిమితమైంది. -
హిందూ రాజ్యంగా మార్చడానికే..
యూపీ సీఎంగా ఆదిత్యనాథ్ ఎంపికపై న్యూయార్క్ టైమ్స్ విమర్శలు న్యూయార్క్: యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ను నియమించడం పట్ల అమెరికా పత్రిక ‘ది న్యూయార్క్ టైమ్స్’ విస్మయం వ్యక్తం చేసింది. లౌకిక భారత్ను హిందూ దేశంగా మార్చివేయడంలో తమకు ఎదురులేదని బీజేపీ భావిస్తున్నట్లు ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోందని శుక్రవారం నాటి తన ఎడిటోరియల్ ‘హిందూ అతివాదులతో మోదీ ప్రమాదకర ఆలింగనం(మోదీస్ పెరిలస్ ఎంబ్రేస్ ఆఫ్ హిందూ ఎక్స్ట్రిమిస్ట్స్)’లో తీవ్రంగా విమర్శించింది. 2014 సాధారణ ఎన్నికల్లో గెలిచాక మోదీ ఓ వైపు హిందుత్వ అతివాదులను బుజ్జగిస్తూ, మరోవైపు ఆర్థిక వృద్ధి లాంటి లౌకిక లక్ష్యాలపై మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా వ్యవహరించారంది. ముస్లిం మైనారిటీలపై హింసను ఆయన బహిరంగంగా సమర్థించలేదని పేర్కొంది. అయితే యూపీ ఎన్నికల్లో ఘన విజయం తరువాత మోదీ అసలు రంగు బయటపడిందని, ఆ రాష్ట్రానికి సీఎంగా ఆదిత్యనాథ్ను ప్రకటించడం మైనారిటీలను షాక్కు గురిచేసే పరిణామమని వెల్లడించింది. ఆదిత్యనాథ్ ముస్లింలను దెయ్యాలుగా చూపుతూ రాజకీయంగా ఎదిగారని, 2015లో బీఫ్ తిన్నదన్న అనుమానంతో ఓ ముస్లిం కుటుంబంపై దాడి చేసిన హిందూ మూకలకు ఆయన మద్దతిచ్చారని తెలిపింది. యోగా చేసే సమయంలో సూర్య నమస్కారాలకు నిరాకరించిన ముస్లింలు సముద్రంలో మునగాలని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ప్రస్తావించింది. అయితే, ఆదిత్యనాథ్ సీఎం కావడాన్ని విమర్శించడానికి న్యూయార్క్ టైమ్స్కు ఉన్న అవగాహన ఏపాటిదని భారత్ తిప్పికొట్టింది. -
యూపీ రాజకీయాల్లో ఇంట్రస్టింగ్ సీన్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ అధినేత చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్, ఆయన భార్య అపర్ణా యాదవ్ శుక్రవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో భేటీ అయ్యారు. ఈ ఉదయం వీవీఐపీ అతిథి గృహానికి వచ్చిన ప్రతీక్, అపర్ణ దంపతులు సీఎం యోగితో మంతనాలు జరిపారు. వీరు ఏం చర్చించారన్నది వెల్లడి కాలేదు. తాజాగా ముగిసిన యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం పాలైంది. బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అపర్ణా యాదవ్.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో 33,796 ఓట్లతో ఓడిపోయారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని మోదీతో ములాయం, అఖిలేశ్ మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో సీఎం యోగితో ప్రతీక్, అపర్ణ దంపతుల భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. -
యూపీ ఎంపీలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఉదయం ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం మూడింట రెండొంతుల మెజారిటీతో ఏర్పాటైన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అభివృద్ధిని ఉరకలెత్తించాలని సూచించేందుకు ప్రధాని మోదీ ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. తాజా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బంపర్ మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గత లోక్సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ 71 ఎంపీ స్థానాలను యూపీలో గెలుపొందింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ యూపీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. '15 ఏళ్ల తర్వాత యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో పార్టీ సంకల్పమైన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం, అందులో ఎంపీల పాత్రను గురించే చర్చించేందుకే ప్రధాని మాతో భేటీ అవుతున్నారు' అని ఈ సమావేశానికి ముందు యూపీ బీజేపీ ఎంపీ ఒకరు మీడియాకు తెలిపారు. -
సీఎం యోగి మొదటి ఆదేశం ఇదే!
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టని యోగి ఆదిత్యనాథ్ అప్పుడే పని ప్రారంభించారు. అవినీతిపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన తన మంత్రివర్గ సహచరులకు తొలి ఆదేశాన్ని జారీచేశారు. 15రోజుల్లోగా మంత్రులంతా తమ స్థిర, చరాస్తులు, ఆదాయ వివరాలను సీఎం కార్యదర్శికి, పార్టీకి అందజేయాలని ఆదేశించారు. లోక్భవన్లో మంత్రులతో భేటీ అయిన అనంతరం విలేకరులతో మాట్లాడిన సీఎం యోగి.. అవినీతి నిర్మూలనే తన ప్రభుత్వం తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి, సుసంపన్నతకు అవసరమైన ప్రతి చర్యను తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. గత 15 ఏళ్లలో అవినీతి, ఆశ్రితపక్షపాతం వల్ల యూపీ అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, శాంతిభద్రతలు క్షీణించడం వల్ల ప్రజలు అనేక కష్టాలు పడ్డారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, శాంతిభద్రతల పరిరక్షణ తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో అయిన లోక్కల్యాణ్ సంకల్ప పత్రంలోని ప్రతి హామీని నెరవేరుస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. -
పార్టీ కార్యకర్తలకు యోగి ఘాటు సూచన!
లక్నో: హిందూ అతివాదిగా పేరొందిన యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా తన ఇన్నింగ్స్ను ఆదివారం ప్రారంభించారు. దేశంలో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఆయనను సీఎంగా బీజేపీ ఎంచుకోవడంపై పలు విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అనంతరం తాను అందరినీ సమానంగా చూస్తానని, ఏ వర్గంపైనా వివక్ష చూపబోనని యోగి పేర్కొన్నారు. తమ ఎన్నికల నినాదమైన ’సబ్కా సాథ్, సబ్కా వికాస్’ (అందరికీ చేయూత, అందరికీ ప్రగతి) నేరవేరుస్తానని అన్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన అనంతరం యోగి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ఘాటు సూచనలు చేశారు. పార్టీ కార్యకర్తలు, నేతలు అనాలోచిత వ్యాఖ్యలు చేయవద్దని ఆయన సూచించినట్టు తెలిసింది. రాజ్నాథ్ తనయుడికి షాక్.. సీఎం యోగితో కలిపి 47మందితో కొలువుదీరిన యూపీ కేబినెట్లో పలువురు ఆశావహులకు చాన్స్ దక్కలేదు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్కు నిరాశే ఎదురైంది. అదేవిధంగా మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మనవడికి, బీజేపీ సీనియర్ నేత లాల్జీ టాండన్ తనయుడికి కూడా మంత్రివర్గంలో చాన్స్ దక్కలేదు. అయితే, యూపీ కేబినెట్లో చాలావరకు బీజేపీ చీఫ్ అమిత్ షా సన్నిహితులకు పెద్దపీట దక్కడం గమనార్హం. ఆయనకు విశ్వసనీయులుగా ముద్రపడిన శ్రీకాంత్వర్మ, సిద్ధార్థనాథ్ సింగ్, దినేశ్ శర్మ, కేశవప్రసాద్ మౌర్య తదితరులకు కీలక మంత్రి పదవులు దక్కాయి. యోగి కేబినెట్ కుల, సామాజిక సమీకరణల సమతుల్యాన్ని పాటించారు. యూపీ కేబినెట్లో అగ్రకులానికి చెందిన 23మందికి మంత్రులుగా అవకాశం లభించగా, 14మంది ఓబీసీలకు, ఐదుగురు దళితులకు చాన్స్ దక్కింది. అదేవిధంగా ఒక ముస్లింకు, ఒక సిక్కుకు కూడా అవకాశం కల్పించారు. కేబినెట్ పదవులు దక్కిన వారిలో 13మంది ఎమ్మెల్యేలు తొలిసారి గెలుపొందిన వారు కావడం గమనార్హం. -
కొత్త సీఎం టాప్ 5 డేరింగ్ కామెంట్స్..
లక్నో: ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్కు వివాదాలు కొత్తేమి కాదు. వ్యక్తిత్వపరంగా, రాజకీయపరంగా ఆయనకు మంచి మార్కులే ఉన్నప్పటికీ.. వివాదాస్పదంగా, నిర్భయంగా ముక్కుసూటిగా మాట్లాడటంలో ఆయనకు సాటి ఎవరూ లేరనే చెప్పాలి. అందుకే ఆయన మాట్లాడిన ప్రతిసారి వార్తల్లో ప్రథమ వరుసలో ఉంటారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ గతంలో చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను పరిశీలిస్తే.. మైనారిటీలపై.. ‘పశ్చిమ ఉత్తరప్రదేశ్లో సమాజ్ వాది పార్టీ రెండున్నరేళ్ల పాలనలో 450అల్లర్ల కేసులు నమోదయ్యాయి. ఎందుకంటే అక్కడ ఉంటున్న ఓ ప్రత్యేక కమ్యూనిటీ భిన్నరకాల చర్యలకు పాల్పడుతోంది. ఎందుకు ఈశాన్య ఉత్తరప్రదేశ్లో ఇలా జరగడం లేదు? ఎక్కడ 10-20శాతం మైనారిటీ పాపులేషన్ ఉంటే అక్కడ చెదురుమదురు అల్లర్లు జరుగుతాయి. అలాగే, వారు ఎక్కడ 20-35శాతంమంది ఉంటారో అక్కడ చాలా తీవ్రమైన అల్లర్లు చోటు చేసుకుంటాయి. ఇక ఎక్కడ 35శాతానికిపైగా వారుంటారో అక్కడ ముస్లిమేతరులకు చోటే ఉండదు. కైరానా వలసలపై.. యోగి నేటి గురించి మాట్లాడటం లేదు. భవిష్యత్ గురించి మాట్లాడుతున్నాడు. వలసలు అనేది మనకు అతిపెద్ద సమస్య. పశ్చిమ ఉత్తరప్రదేశ్ను మరో కశ్మీర్గా బీజేపీ మారనివ్వదు. మదర్ థెరిసాపై.. భారతదేశాన్ని మదర్ థెరిసా క్రైస్తవ దేశంగా మార్చాలనుకుంటున్నారు. సేవ పేరుతో హిందువులను మతమార్పిడి చేసి క్రిస్టియన్లుగా మార్చే కుట్ర ఆమె సేవలో ఉంది. యోగాపై.. యోగాను ప్రారంభించిన శంకరుడే అతిపెద్ద యోగి. దేశంలోని ప్రతి పదార్థంలో పరమ శివుడు ఉన్నాడు. ఎవరైనా యోగాను పట్టించుకోకుండా ఉండాలని భావిస్తే శివుడు హిందుస్థాన్ విడిచి వెళతాడు షారుక్ఖాన్పై.. ప్రజలు గనుక షారుక్ చిత్రాలను బహిష్కరిస్తే ఆయన కూడా ఓ సాధారణ ముస్లింల మాదిరిగా వీధుల్లో తిరగాల్సిందే. వీళ్లంతా ఉగ్రవాదుల భాషలో మాట్లాడుతున్నారు. హఫీజ్ సయీద్ భాషకు షారుక్ ఖాన్ ఉపయోగించే భాషకు పెద్ద భేదమేమి లేదని నాకు అనిపిస్తోంది. ఇలా యోగి ఆదిత్యనాథ్ గతంలో ఎన్నో సంచలనాత్మక కామెంట్లు చేశారు. -
'నా కొడుకు సీఎం కావడం ఆనందంగా ఉంది'
-
ఒక ముస్లిం.. ఒక క్రికెటర్.. యోగి కేబినెట్ ఇదే!
-
ఒక ముస్లిం.. ఒక క్రికెటర్.. యోగి కేబినెట్ ఇదే!
లక్నో: హిందుత్వ ఐకాన్గా పేరొందిన యోగి ఆదిత్యనాథ్ (44) ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. లక్నోలోని కాన్షీరాం స్మృతి ఉప్వన్లో మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయనతో గవర్నర్ రాంనాయక్ ప్రమాణం చేయించారు. అట్టహాసంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, పార్టీ చీఫ్ అమిత్షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అలాగే యూపీ మాజీ సీఎంలు అఖిలేశ్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో పాటు పలువురు ఎన్డీయే పాలిత ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సీఎం రేసులో ముందు వరసలో కనిపించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ సీనియర్ నేత, లక్నో మేయర్ దినేశ్ శర్మలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. యోగి కేబినెఎట్లో 46మంది ముఖ్యమంత్రి యోగితో కలిపి మొత్తం 46మందితో ఉత్తరప్రదేశ్ కొత్త కేబినెట్ కొలువుదీరింది. ఇందులో 22 మంది కేబినెట్ మంత్రులు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు. ఈ మెగా ప్రమాణ స్వీకార వేడుకలో సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 43 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రివర్గంలో ముస్లిం వర్గానికి చెందిన మోహ్సిన్ రాజాకు అవకాశం ఇచ్చారు. అలాగే మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్కు కూడా మంత్రిగా చాన్స్ లభించింది. అట్టహాసంగా జరగనున్న ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు లక్షమందికిపైగా ప్రజలు హాజరయ్యారు. ఈ వేడుకకు 35వేలమంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. యూపీ సీఎంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్ర మంత్రులు రాజ్నాథ్, మనోజ్ సిన్హాలతోపాటు పలువురి పేర్లు ప్రముఖంగా చర్చకు వచ్చినప్పటికీ.. గోరఖ్పూర్ ఎంపీ యోగివైపే పార్టీ అధినాయకత్వం మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. శనివారం లక్నోలో జరిగిన బీజేపీ శాసనసభాపక్షం సమావేశంలో యోగి పేరును ఖరారు చేసింది. -
'నా కొడుకు సీఎం కావడం ఆనందంగా ఉంది'
లక్నో: గోరఖ్పూర్ ఎంపీ, మఠాధిపతి అయిన యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతుండటంతో ఆయన కుటుంబసభ్యుల్లో, మద్దతుదారుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. కీలకమైన యూపీ ప్రభుత్వాధినేతగా యోగి బాధ్యతలు చేపట్టబోతుండటంతో ఆయన కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 'చాలా చిన్నప్పటినుంచే ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో యోగి ఉండేవాడు. ఇప్పుడు అతను ముఖ్యమంత్రి అవుతుండటం చాలా ఆనందంగా ఉంది' అని యోగి తండ్రి తెలిపారు. యోగి సోదరి మాట్లాడుతూ 'నిన్న సాయంత్రం వరకు టీవీలను చూస్తూ ఒకింత సందేహాస్పదంగా గడిపాం. కానీ సాయంత్రానికి శుభవార్త అందండంతో పటాకులు కాల్చి సంబరాలు జరిపాం' అని మీడియాతో చెప్పారు. ఉత్తరాఖండ్ యమకేశ్వర్లోని పంచూర్లోని యోగి స్వగృహంలోనూ ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. యోగి ప్రస్తుత స్వస్థలమైన గోరఖ్పూర్లో కులమతాలకు అతీతంగా అన్నివర్గాలు వారు యోగికి మద్దతుగా సంబరాలు నిర్వహించడం గమనార్హం. -
యోగి ఆదిత్యనాథ్పై ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు
-
21 సెంచరీలో నాకు ఇదే బెస్ట్ న్యూస్!
లక్నో: 'నా వరకు 21వ శతాబ్దిలో ఇదే ఉత్తమవార్త ఏదంటే.. అది నరేంద్రమోదీజీ ప్రధానమంత్రి కావడం, సోదరుడు యోగిజీ యూపీ సీఎం అవుతుండటమే' అని కేంద్రమంత్రి ఉమాభారతి ఆనందం వ్యక్తం చేశారు. జాతీయవాదం, అభివృద్ధి కలయికగా యూపీని యోగి నడిపిస్తారని ఆమె పేర్కొన్నారు. మరోవైపు యూపీ సీఎం కాబోతున్న యోగి ఆదిత్యనాథ్తో తనకెలాంటి విభేదాలు లేవని బీజేపీ రాష్ట్ర చీఫ్ కేశవప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. తనకు అప్పగించిన డిప్యూటీ సీఎం పదవిని బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రథమ ప్రాధాన్యమిస్తానని తెలిపారు. కాగా, యూపీ సీఎంగా మధ్యాహ్నం 2.15 గంటలకు యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ సహా బీజేపీ ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం యోగి లోక్భవన్ చేరుకొని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత మంత్రులతో భేటీ అవుతారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. -
‘బీజేపీకి ముస్లిం మహిళల భారీ ఓటింగ్’
గాంధీనగర్: ట్రిపుల్ తలాక్తో నష్టపోయిన ముస్లిం మహిళలు ఉత్తరప్రదేశ్లో పెద్దఎత్తున బీజేపీకి ఓటువేశారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. గుజరాత్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన 8వ స్నాతకోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ‘ట్రిపుల్ తలాక్ వల్ల యూపీలో ముస్లిం మహిళలు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారు. వారందరూ బీజేపీకే పట్టం కట్టారు’ అని తెలిపారు. ట్రిపుల్ తలాక్ కేవలం మత సంబంధమైన అంశం కాదనీ, అది న్యాయం, సమానత్వం, గౌరవానికి సంబంధించిన విషయమని రవిశంకర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై బీఎస్పీ చీఫ్ మాయావతి, ప్రియాంకా గాంధీ, యూపీ మాజీ సీఏం అఖిలేశ్ భార్య డింపుల్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. మహిళల పట్ల వివక్ష చూపడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. 20కి పైగా ఇస్లామిక్ దేశాల్లో ట్రిపుల్ తలాక్కు సవరణలు చేయడమో, నిషేధించడమో చేశారన్నారు. అయోధ్యలోని వివాదాస్పద భూభాగంలో రాజ్యాంగబద్ధంగా రామ మందిరాన్ని కట్టితీరుతామని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ఆశాభావాన్ని ప్రసాద్ వ్యక్తం చేశారు. ఇందుకోసం బలమైన సాక్ష్యాధారాలను న్యాయస్థానానికి అందించినట్లు తెలిపారు. కాంగ్రెస్ అసలు సమస్య రాహుల్ గాంధీయేనని ఆయన విమర్శించారు. తాము బలమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రాబోయే గుజరాత్ ఎన్నికల్లో యూపీ తరహాలో బీజేపీ భారీ మెజారిటీ సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
యోగి ఆదిత్యనాథ్పై ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ను ఎన్నుకోవడం ప్రధాని నరేంద్రమోదీ 'నూతన భారత' విజన్లో భాగమని, ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందంటూ ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఒకింత ఘాటుగా స్పందించారు. ముస్లిం ఫైర్బ్రాండ్ నేతగా పేరొందిన ఒవైసీ మోదీ నిర్ణయాన్ని పరోక్షంగా ఎద్దేవా చేశారు. భారత అనాది హిందు, ముస్లిం సంస్కృతుల సమ్మేళనమైన 'గంగాయమున తెహజీబ్'పై ఇది దాడి చేయడమేనని తీవ్రంగా మండిపడ్డారు. 'ఇదే మోదీజీ, బీజేపీ కొత్త భారతం. ఇందులో ఆశ్చర్యపోవాల్సినది ఏముంది? అధికారంలో ఉన్నప్పుడు సమాజ్వాదీ పార్టీ ముస్లింలను వంచించింది. ఇప్పడు పరిమితవాద అభివృద్ధి నమూనాను మనం చూడబోతున్నాం. వాళ్లు మాట్లాడుతున్న 'ప్రగతి' ఇదే' అని ఒవైసీ పేర్కొన్నారు. కాగా, మరో ముస్లిం నాయకుడు అయిన ఢిల్లీ జమా మసీదు ఇమాం సయెద్ అహ్మద్ బుఖారీ ఈ అంశంపై ఆచితూచి స్పందించారు. తన వివాదాస్పద గతాన్ని వీడనాడి.. ప్రధాని మోదీ పేర్కొన్నట్టు అన్ని వర్గాల శ్రేయస్సు కోసం యోగి ఆదిత్యనాథ్ కృషి చేస్తారని తాను భావిస్తున్నట్టు బుఖారీ చెప్పారు. -
మోదీ నేర్చుకునే తీరు అద్భుతం
ప్రధానిపై రాష్ట్రపతి ప్రశంసలు ముంబై: కొత్త విషయాలను ప్రధాని మోదీ నేర్చుకునే తీరు తనను ఆకట్టుకుందని రాష్ట్రపతి ప్రణబ్ వ్యాఖ్యానించారు. ముంబైలో ఇండియాటుడే సదస్సులో పాల్గొన్న రాష్ట్రపతి.. ‘పలు అంశాలను మోదీ తనదైన శైలిలో చక్కబెడతారు. తక్కువ కాలంలోనే ఈ స్థాయికి ఎదిగిన మోదీని ప్రశంసించకుండా ఉండలేం’ అని అన్నారు. ‘చరణ్ సింగ్ నుంచి చంద్రశేఖర్ వరకు అందరు ప్రధానులూ పార్లమెంటులో అనుభవం ఉన్నవారే. కానీ ఓ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మోదీ.. విదేశీ వ్యవహారాలు, సంక్లిష్టమైన ఆర్థిక అంశాలపై పూర్తి పట్టు సాధించారు. అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య, ఆంక్షలపై పనిచేసే జీ–20 గ్రూపుపై తన చాతుర్యంతో ప్రభావం చూపారు’ అని ప్రశంసించారు. యూపీ ఎన్నికల్లో విజయంతో వినమ్రతతో పనిచేయాలన్న మోదీ మాటలు హర్షించదగ్గవన్నారు. అధికారంలో ఉన్న వాళ్లు ఆధిక్యతావాదానికి వ్యతిరేకంగా సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. పార్లమెంటు తరచూ వాయిదా పడటంపై ప్రణబ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కులం, మతం, ప్రాంతం, రాజకీయాల పేరుతో విభేదాలు పెట్టుకున్నన్ని రోజులూ.. దేశం అభివృద్ధి పథంలో పయనించటం కష్టం. ఐకమత్యంతో ఉంటేనే గెలుస్తాం.’అని ప్రణబ్ సుతిమెత్తగా హెచ్చరించారు. ఇద్దరు ప్రధానులు మన్మోహన్, మోదీ నుంచి తను చాలా నేర్చుకున్నట్లు ఆయన తెలిపారు. విపక్ష పార్టీల నాయకులతో వ్యక్తిగతంగా సత్సంబంధాలున్న గొప్ప వ్యక్తి అని మాజీ ప్రధాని వాజ్పేయిని పొగిడారు. చిన్న చిన్న పార్టీలను కలుపుకుని ఆరేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపిన ఘనత వాజ్పేయికే దక్కుతుందన్నారు. ఇందిరా గాంధీని తన గురువుగా చెప్పుకున్న ప్రణబ్.. ఆమె ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన తప్పులనుంచి రాజకీయ నాయకులు చాలా నేర్చుకోవచ్చన్నారు. ఒక వ్యక్తి హీరోగా ఉండటం కంటే బలమైన ప్రతిపక్షం ఉండేదే అసలైన ప్రజాస్వామ్యమని నెహ్రూ బలంగా నమ్మి ఆచరణలో పెట్టారన్నారు. తాను ప్రజలనుంచే పుట్టానని వారిలోనే కలిసిపోతానని ప్రణబ్ అన్నారు. ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేస్తానన్నారు.కాగా, యూపీ ఎన్నికల్లో ఖబరస్తాన్పై శ్మశానం విజయం సాధించిందని మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. విద్యాసంస్థల్లో అసహనానికి తావులేదు విద్యాసంస్థలో అసహనం, విద్వేషాలకు తావుండకూడదని.. అవి భిన్నాభిప్రాయాలకు వేదికలుగా ఉండాలని ముంబై వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ప్రణబ్ అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాక మాట్లాడారు. దేశాభివృద్ధిలో విద్యారంగం కీలకపాత్ర పోషిస్తుందని.. విద్యాకోర్సులు పరిశ్రమల అవసరాలను తీర్చేలా ఉండాలని సూచించారు. -
‘సీఎం ఎవరో మీకు రేపు తెలుస్తుంది’
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనే విషయం రేపు(శనివారం) తెలుస్తుందని యూపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య స్పష్టం చేశారు. సీఎం ఖరారు విషయంపై శాసనసభా పక్షం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ‘యూపీ సీఎం ఎవరనే విషయంపై లెజిస్టేచర్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం మార్చి 19న ఉంటుంది. దీనికి బీజేపీ అగ్ర నేతలతోపాటు కేంద్రమంత్రులు, ప్రముఖ వ్యక్తులు హాజరుకానున్నారు’ అని మౌర్య శుక్రవారం పార్లమెంటు వెలుపల చెప్పారు. కొంత అస్వస్థతగా ఉందంటూ ఆస్పత్రిలో చేరిన ఆయన తదనంతరం డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ‘నాకు ఏవో చిన్న సమస్యలు అనిపించాయి. అందుకే ఆస్పత్రిలో చేరాను. అయితే, నిన్ననే నేను బయటకొచ్చాను. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను’ అని మౌర్య చెప్పాడు. అదే సమయంలో సీఎం ఎవరనే విషయంపై పదేపదే ప్రశ్నించగా ‘రేపు సాయంత్రం 4.30గంటలకు లెజిస్టేచర్ పార్టీ సమావేశం కానుంది. ప్రభుత్వ పెద్దగా ఎవరు వస్తారనేది మీకు రేపు కచ్చితంగా తెలుస్తుంది’ అని అన్నారు. అయితే, సీఎం కాబోయే వ్యక్తిని ఎంపికచేయాలంటూ అమిత్షా బాధ్యతలు అప్పగించారంట కదా అని ప్రశ్నించగా.. ఒక పార్టీ అధ్యక్షుడిగా తాను ఏం చేయాలో అది పూర్తి చేస్తానని అన్నారు. సీఎం రేసులో మౌర్య కూడా ఉన్న విషయం తెలిసిందే. -
యూపీలో ఒక్కో ఓటుకు ఎంతపెట్టారంటే..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఎంత డబ్బును ఆయా పార్టీలు ఖర్చు చేశాయో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.5,500కోట్లను యూపీ ఎన్నికల్లో అడ్డగోలుగా వెదజల్లినట్లు ఓ ఎన్నికల సర్వే తెలిపింది. వీటిల్లో దాదాపు రూ.1000కోట్లు ఓట్లను నేరుగా కొనుగోలు చేసేందుకు ఉపయోగించుకున్నారంట. అంతేకాదు, 1/3వంతు మంది డబ్బు తీసుకోవడమో లేదా మద్యానికి తమ ఓటును ఇచ్చేయడమో చేసినట్లు కూడా ఆ సర్వే వెల్లడించింది. సీఎంఎస్ ప్రీ పోస్ట్ పోల్ అనే పేరిట ఒక స్టడీ చేయగా అందులో ఒక్క యూపీలో ఖర్చయిన డబ్బు వివరాలు తెలిశాయి. ఒక్కో వ్యక్తికి ఎన్నికల ప్రచారంలో భాగంగా రూ.25లక్షలను ఖర్చుచేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ చెబితే దాదాపు దానికి రెట్టింపుల కొద్ది డబ్బును ఇతర మార్గాల్లో రహస్యంగా ఖర్చుచేసినట్లు తాజా అధ్యయనంలో తెలిసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, పెద్ద పెద్ద తెరలమీద తమ ప్రచారం చూపించడం, వీడియో వ్యానులు ఉపయోగించడం తదితర పనులకు యూపీ ఎన్నికల్లో రూ.600 నుంచి రూ.900కోట్లు సర్వే తెలిపింది. ఒక్కో ఓటును సగటున రూ.750 పెట్టి కొనుగోలు చేశారంట. ఇప్పటి వరకు సగటున ఒక ఓటుకు చేసిన అతి పెద్ద వ్యయం ఇదేనని సర్వే తెలిపింది. -
మాయావతి ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలి
బీఎస్పీ అధినేత్రి మాయావతి కోర్టుకు వెళ్లినా ఇంకెక్కడికి వెళ్లినా పర్వాలేదని, కానీ అంతకంటే ముందు ఆమె ఒకసారి ఆస్పత్రికి వెళ్లి చూపించుకుంటే మంచిదని బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య విమర్శించారు. యూపీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని, దానివల్ల ఎవరికి ఓటేసినా బీజేపీకే ఓట్లు పడ్డాయని మాయావతి ఆరోపించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇతర పార్టీలకు ఓట్లు వేస్తే అసలు ఈవీఎంలు స్పందించలేదని, లేదా ఆ ఓట్లన్నీ కూడా బీజేపీకి వెళ్లిపోయాయని.. అందుకే ముస్లిం ఓట్లు కూడా బీజేపీకి పడ్డాయని మాయావతి అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు కొంతమంది ముస్లిం పెద్దలు, కొన్ని సంస్థలు బాహాటంగా బీఎస్పీకి మద్దతు పలికాయని, కానీ వాళ్ల ఓట్లేవీ తమకు పడలేదని.. అందుకే కేవలం 19 స్థానాలు మాత్రమే వచ్చాయని మాయావతి ఆవేదన చెందుతున్నరు. బీఎస్పీని స్థాపించిన తర్వాత ఇప్పటివరకు యూపీ ఎన్నికల్లో వాళ్లకు ఇంత తక్కువ సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు రావడం ఇదే మొదటిసారి. బీఎస్పీ నుంచి 100 మంది ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినా, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న 77 నియోజకవర్గాలకు గాను కేవలం నాలుగుచోట్ల మాత్రమే బీఎస్పీ అభ్యర్థులు గెలిచారు. ఈ నేపథ్యంలో మాయావతి విమర్శించగా.. దానికి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా దీటుగా స్పందించారు. -
కాంగ్రెస్లో వ్యవస్థాగత మార్పులు రావాలి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కాంగ్రెస్లో అంతర్మథనం మొదలైంది. పార్టీలో నిర్మాణాత్మక, వ్యవస్థాగత మార్పులు అవసరమని ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు చెబుతున్నారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమ ఫలితాలు మరీ తీసికట్టుగా లేవని, ఓటర్లను వర్గాల వారీగా చీల్చడం వల్లే బీజేపీ గెలిచిందని రాహుల్ మంగళవారం విలేకర్లతో అన్నారు. పార్టీలో కొత్త శక్తిని నింపాలని, భారీ శస్త్రచికిత్స అవసరమని మొయిలీ పేర్కొన్నారు. -
మాయాకు అసాధ్యమే.. అఖిలేశ్కు ఇదే బెస్ట్!
లక్నో: రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కానీ కొన్నిసార్లు ఎదురయ్యే పరాభవాలు మాత్రం ఆయా నాయకుల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తాయి. తాత్కాలికమే కావొచ్చు కానీ, ప్రస్తుతం బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కావాలన్న ఆమె ఆశలను తాజా అసెంబ్లీ ఎన్నికలు చిత్తు చేశాయి. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న ఆమె పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్తో ముగియనుంది. ఇక, మరోవైపు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ రాజ్యసభ వైపు ముగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతుండటంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బీజేపీ సర్కారును ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆయన రాజ్యసభకు వెళ్లడమే ఉత్తమమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ పెద్దలసభకు వెళ్లాలన్నా అఖిలేశ్ వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఆగక తప్పదు. ఎమ్మెల్సీగా కొనసాగుతూ 2012 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి ఆ తర్వాతి ఎన్నికల్లో ఎస్పీ చేతిలో పరాజయం ఎదురవ్వడంతో రాజ్యసభకు మారారు. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి 87 సీట్లు రావడంతో పెద్దలసభలో ఆమె ఎంట్రీకి ఎలాంటి అవాంతరాలు ఏర్పడలేదు. కానీ, ఈసారి బీఎస్పీ కేవలం 19 స్థానాలు మాత్రమే గెలుపొందడంతో ఆమె మరోసారి రాజ్యసభకు ఎన్నిక కావడం దాదాపు అసాధ్యమే. ఈ సవాల్ను మాయావతి ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. బిహార్ ఫార్మూలాను తెరపైకి తెచ్చి బద్ధ విరోధి ఎస్పీతో ఆమె జత కలుస్తారా? అన్నది వేచి చూడాలి. ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపితే.. ఆ రెండు రాజ్యసభ స్థానాలను గెలుచుకునే అవకాశముంది. అప్పుడు రాజ్యసభకు అఖిలేశ్కు, మాయావతికి ఎంట్రీ ఉంటుంది. కానీ, అప్పటివరకు రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయి? అనేది ఇప్పుడే చెప్పలేం. -
యూపీపై బీజేపీకి చిదంబరం సూటి ప్రశ్న
చెన్నై: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహంపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం సూటి ప్రశ్నాస్త్రాలు సంధించారు. దేశంలో అతిపెద్ద మైనారిటీ వర్గాన్ని, మహిళలను, అట్టడుగు వర్గాలను ఎన్నికల్లో విస్మరించడం ద్వారా సమగ్ర ఆర్థికాభివృద్ధి సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని ప్రస్తావించిన ఆయన.. ’19.3శాతం ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రంలో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వకుండా బీజేపీ ఈ విజయాన్ని సాధించింది. దీంతో ’సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అన్న నినాదానికి సరికొత్త సంకుచిత అర్థం ఇచ్చినట్టు అయింది. ఒక జాతీయ పార్టీ అసలు మహిళా అభ్యర్థులను బరిలోకి దింపకపోవడం, లేదా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వుచేయబడిన స్థానాల్లో అసలు అభ్యర్థులనే నిలబెట్టకపోవడం లాంటిదే ఇది’ అని చిదంబరం బీజేపీ తీరును తప్పుబట్టారు. చెన్నైలో హిందూ సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ పాలసీలో నిర్వహించిన ’నిరంతరాయ వృద్ధిని భారత్ సాధిస్తుందా’ అన్న అంశంపై చిదంబరం ప్రసంగించారు. అతిపెద్ద మైనారిటీ వర్గాన్ని, మహిళలను, ఎస్సీ, ఎస్టీలను ఎన్నికల్లో విస్మరించడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని సాధించడం సాధ్యమా అని ఆయన సూటిగా కేంద్రాన్ని ప్రశ్నించారు. -
ఆ మంత్రులంతా చిత్తయ్యారు!
లక్నో: ఉత్తరప్రదేశ్ను ముంచెత్తిన కాషాయ సునామీ.. అఖిలేశ్ మంత్రివర్గాన్ని దాదాపుగా కుప్పకూల్చింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన అఖిలేశ్ మంత్రుల్లో నాలుగింట మూడొంతుల మంది చిత్తుగా ఓడిపోవడం గమనార్హం. సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, యూపీ అసెంబ్లీ స్పీకర్ మతా ప్రసాద్ పాండే సైతం బీజేపీ ప్రభంజనం ముందు నిలబడలేకపోయారు. తన కంచుకోట అయిన ఈట్వా నియోజకవర్గంలో పాండే బీజేపీ చేతిలో పరాజయంపాలై.. మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. అఖిలేశ్కు అత్యంత సన్నిహిత మంత్రులుగా ముద్రపడిన అరవింద్ సింగ్ గోపే, అభిషేక్ మిశ్రాలు సైతం ఓటమిపాలయ్యారు. రాంనగర్, లక్నో నార్త్ నియోజకవర్గాల్లో వారు చిత్తయ్యారు. ఇక కళంకిత మంత్రి గాయత్రి ప్రజాపతిని ఏరికోరి మరీ అమేథి స్థానంలో ఎస్పీ నిలబెట్టినా.. ఆయనను ప్రజలు ఛీకొట్టారు. రేప్ కేసులో నిందితుడిగా ఉండి.. సుప్రీంకోర్టు నుంచి ఘాటు హెచ్చరికలు ఎదుర్కొన్న ప్రజాపతి ఎస్పీ సుప్రీం ములాయం యాదవ్కు అత్యంత సన్నిహితుడు కావడంతో.. ఆయనకు అఖిలేశ్ సీటు ఇవ్వకతప్పలేదు. కానీ, రేప్ కేసులో పోలీసులకు లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు హెచ్చరికలతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అంతేకాకుండా ఆయన నిర్వహించిన మైనింగ్ శాఖ అక్రమాలపై సీబీఐ దర్యాప్తుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఇక అఖిలేశ్ మంత్రివర్గంలోని రవిదాస్ మెహ్రోత్రాపై (లక్నో సెంట్రల్), శివకాంత్ ఓజా (రాణిగంజ్), జియావుద్దీన్ రిజ్వీ (సికందర్పూర్), అవదేష్ ప్రసాద్ (మిల్కిపూర్), వినోద్ కుమార్ అలియాస్ పండిట్ సింగ్ (తరాబ్గంజ్), రామ్మూర్తి వర్మ (అక్బర్ పూర్ ), శంక్లాల్ మాఝి (జలాల్పూర్), రాంకరణ్ ఆర్య (మహదేవ్), బ్రహ్మాశంకర్ త్రిపాఠి (కుషినగర్), కమల్ అక్తర్ (హసన్పూర్), రియాజ్ అహ్మద్ (పిలిభిత్), షహీద్ మంజూర్ (కిఠోర్) తదితర మంత్రులు ఓటమిపాలయ్యారు. వివాదాస్పద మంత్రి ఆజంఖాన్ (రాంపూర్), రామ్ గోవింద్ చౌదరి (బన్సదీ), పరాస్ నాథ్ యాదవ్ (మల్హనీ), దుర్గాప్రసాద్ యాదవ్(సదర్), యాసిర్ షా (మటేరా), మెహబూబ్ ఆలీ (అమ్రోహ), ఇక్బాల్ మహమూద్ (సంభాల్), రఘురాజ్ ప్రతాప్ సింగ్ (కుండ), మనోజ్ కుమార్ పాండే (ఉచాహర్), నరేంద్ర సింగ్ వర్మ (మహమూదాబాద్) తదితర మంత్రులు మాత్రం కమలం ధాటిని తట్టుకొని విజయం సాధించారు. -
అఖిలేష్ చేసిన పెద్దతప్పు అదే
కోల్ కత్తా: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని పార్టీగా బీజేపీ అవతరించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ దెబ్బకు ఎస్పీ-కాంగ్రెస్ ల కూటమి కోలుకోలేని దెబ్బతిన్నది. ఈ ఎన్నికల్లో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ తో జతకట్టి అతిపెద్ద తప్పు చేశారని బీజేపీ అంటోంది. ''సమాజ్ వాద్ పార్టీ అతిపెద్ద తప్పు కాంగ్రెస్ తో చేతులు కలుపడం. కాంగ్రెస్ తో చేతులు కలుపక పోయినప్పటికీ అఖిలేష్ ఈ ఎన్నికల్లో ఓడిపోయేవారు. కానీ ఇంత చిత్తుగా కాదు'' అని బీజేపీ నేత రాహుల్ సిన్హా అన్నారు. ప్రజలు నూతన భారత్ కు మద్దతుగా నిలిచారని, ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ లో తాము ఘన విజయం సాధించామని చెప్పారు. గోవా, మణిపూర్ లో కూడా తాము ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఇతర పార్టీలు, అభ్యర్థులు తమకు మద్దతిస్తారని నమ్ముతున్నట్టు తెలిపారు. 403 అసెంబ్లీ సీట్లలో యూపీలో బీజేపీ 312 సీట్లను గెలుచుకోగా.. పొత్తులతో మరో 13 సీట్లు బీజేపీకి దక్కబోతున్నాయి. ఉత్తరాఖాండ్ లో మొత్తం 70 సీట్లకు గాను 57 సీట్లు బీజేపీనే వరించాయి. గోవా, పంజాబ్ లో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా సీట్లను దక్కించుకోగా.. ప్రాంతీయ పార్టీల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధమైంది. ఇక ఒక్క పంజాబ్ లోనే బీజేపీకి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. -
యూపీలో అత్యధిక, అత్యల్ప మెజారిటీలు
⇒ అత్యధికం 1,50,685 ⇒ అత్యల్పం 171 లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నాలుగింట మూడొంతుల ఆధిక్యం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. వివిధ పార్టీల నుంచి ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఒకరు లక్షన్నరకు పైగా మెజారిటీ సాధిస్తే.. మరొకరు కేవలం 171 ఓట్ల తేడాతో గట్టెక్కారు. యూపీలో అత్యధిక, అత్యల్ప మెజారిటీ సాధించిన వారిని పరిశీలిస్తే.. ఐదుగురు అభ్యర్థులు లక్ష ఓట్ల పైచిలుకు ఆధిక్యంతో గెలవగా, ఎనిమిది మంది కేవలం వెయ్యి లోపు మెజారిటీతో గట్టెక్కారు. అలాంటివారి వివరాలు... ► సాహిబాబాద్ నుంచి పోటీ చేసిన సునీల్ కుమార్ శర్మ అత్యధికంగా 1,50,685 ఓట్ల మెజారిటీ సాధిం చారు. కాంగ్రెస్ అభ్యర్థి అమర్ పాల్ను సునీల్ ఓడించారు. ► రథ్ నియోజకవర్గంలో మనీషా అనురాగి 1,04,643 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గాయదీన్ అనురాగిపై గెలిచారు. ► నోయిడా నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ కొడుకు పంకజ్ సింగ్ 1,04,016 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎస్పీ అభ్యర్థి సునీల్ చౌదరిని ఆయన ఓడించారు. ► దోమరియాగంజ్ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ కేవలం 171 ఓట్ల మెజారిటీ సాధించారు. బీఎస్పీ నుంచి పోటీ చేసిన సయ్యదా ఖటూన్ను ఆయన ఓడించారు. ► మీరాపూర్లో బీజేపీ అభ్యర్థి అవతార్ సింగ్ భదానా 193 ఓట్ల తేడాతో ఎస్పీ అభ్యర్థి లియాకత్ అలీపై గెలుపొందారు. ► మంత్ నియోజకవర్గంలో బీఎస్పీకి చెందిన శ్యామ్ సుందర్ శర్మ ఆర్ఎల్డీ అభ్యర్థి యోగేశ్ చౌదరిని 432 ఓట్ల తేడాతో ఓడించారు. -
ఉత్తరప్రదేశ్లో గెలుపు కోసం బీజేపీ వ్యూహం
⇒ 900 సభలు ⇒ 10000 వాట్సాప్ గ్రూపులు ⇒ 67000 కార్యకర్తలు లక్నో: యూపీ ఎన్నికల్లో స్వీప్ చేసిన కాషాయ దళం.. గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకెళ్లింది. రెండేళ్ల కిందటే కసరత్తు ప్రారంభించిన బీజేపీ.. సభలు, రోడ్షోలు, సమ్మేళనాలు, సోషల్ మీడియా.. వంటి అనేక మార్గాల్లో ప్రజలను చేరుకుంది. బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ శ్రేణులను పటిష్టం చేసి, 67 వేలమంది క్రియాశీల కార్యకర్తలను రంగంలోకి దింపింది. ఒక్కో నియోజ కవర్గంలో 2 నుంచి 4 సభల చొప్పున మొత్తం 900 సభలు ఏర్పాటు చేసింది. మోదీ 23 సభ ల్లో ప్రసంగించారు. వ్యూహాన్ని పార్టీ అమిత్ షా, రాష్ట్ర ఇన్చార్జి ఓ మాధుర్, రాష్ట్ర కమిటీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రూపొందించి అమలు చేశారు. దళితులు, ఓబీసీల ఓట్ల కోసం.. గత ఏప్రిల్లో మాజీ ఎంపీ, బౌద్ధ సన్యాసి ధమ్మ విరియోతో బీజేపీ ప్రచారాన్ని మొదలుపెట్టింది. మాయావతి ఓటు బ్యాంకును దెబ్బతీయడానికి దళితులు, ఓబీసీల జనాభా అధికంగా ఉన్న 175 నియోజకవర్గాల్లోవిరియో ‘ధమ్మ చేతన యాత్ర’ చేపట్టి మోదీకి మద్దతు పలకాలని ప్రజలను కోరారు. ఓబీసీలను ఆకట్టుకోవడానికి పార్టీ 200 పిచ్డా వర్గ్ సమ్మేళనాలను, ఎస్సీ, ఎస్టీలను ఆకర్షించేందుకు 18 స్వాభిమాన్ సమ్మేళనాలను, వ్యాపారుల మద్దతు కోసం 14 వ్యాపారీ సమ్మేళనాలను నిర్వహించింది. కాలేజీల్లో 1,650 సభల ద్వారా యువతకు చేరువైంది. యాత్రలు.. మహిళా సమ్మేళనాలు.. రోడ్షోల రూపంలో డిసెంబర్ 24 నుంచి మొత్తం 403 నియోజకవర్గాల్లో పరివర్తన్ యాత్రలు చేపట్టింది. 50 లక్షల మంది ప్రజలకు మోదీ విజయాలను వివరించింది. మహిళల ఓట్లను రాబట్టుకోవడానికి అన్ని జిల్లాల్లో 77 ‘మహిళా సమ్మేళన్’లు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ 34 జిల్లాల్లో ‘కమల్ మేళా’ ఎగ్జిబిషన్లను, రైతులకు చేరువకావడానికి 3,564 ‘అలావో సభ’ (చలిమంట భేటీలు) ఏర్పాటు చేశారు. 75 జిల్లాల్లో జరిగిన ‘మాటీ తిలక్ ప్రతిజ్ఞా ర్యాలీ’ల్లో తాము రైతుల ఆకాంక్షలను నెరవేరుస్తామని బీజేపీ ఎంపీలు తిలకధారణ చేశారు. సోషల్ మీడియా.. సోషల్ మీడియాలో ప్రచారం కోసం కమల నాథులు రాష్ట్రస్థాయిలో 25 మంది ఐటీ నిపుణు లతో ఒక టీమ్ను, ప్రాంతీయ స్థాయిలో 21 మందితో 6 టీమ్లను ఏర్పాటు చేశారు. 15 మంది సభ్యులతో మరో 90 జిల్లా యూనిట్లనూ రంగంలోకి దింపారు. ఈ టీమ్లన్నీ కలిపి మొత్తం 10,344 వాట్సాప్ గ్రూపులు, 4 ఫేస్బుక్ పేజీలను ఏర్పాటు చేసి, ఆడియో, వీడియో క్లిప్పులను చేరవేశాయి. ఇంకా ఏం చేశారంటే.. ► పార్టీ పరిశోధన బృందాలు ఒక్కో నియోజక వర్గానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను గుర్తించి ప్రతి నియోజకవర్గానికి ఒక ఎన్నికల ప్రణాళిక రూపొందించాయి. ► 33 మంది ఎంపీలు 92 నియోజకవర్గాల్లో 263 సభల్లో ప్రసంగించారు. 1,025 శిక్షణా శిబిరాలు నిర్వహించి 88 వేలమంది కార్యకర్త లకు పార్టీ విధానాలను వివరించారు. ► ప్రజల ఆకాంక్షలను తెలుసుకోవడానికి 75 వీడియో వ్యాన్లను రాష్ట్రమంతటా తిప్పారు. ‘బూత్ విజయ్ అభియాన్’ పేరుతో అభ్యర్థులకు ఓటేయాలని ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు పంచారు. ► రాష్ట్రంలోని మొత్తం 1,47,401 పోలింగ్ బూత్లలో 10 నుంచి 21 మందితో బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. బూత్ కమిటీ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశాలను ఉద్దేశించి పార్టీ చీఫ్ అమిత్ షా ప్రసంగించారు. ‘ఆజీవన్ సహయోగ్ నిధి’ పేరుతో సభ్యుల నుంచి రూ.16.91 కోట్లను వసూలు చేసి పార్టీ కార్యక్రమాలకు ఖర్చు చేశారు. -
కొత్త శిఖరాలకు మార్కెట్..!
బీజేపీ భారీ విజయంతో జోష్.. ►నేడు మార్కెట్కు హోలీ సెలవు ►మరింత వేగంగా సంస్కరణలు ►ఫెడ్ నిర్ణయంతో కరెక్షన్ ! ►ఈ వారం మార్కెట్ తీరుపై విశ్లేషకుల అంచనా న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించడంతో స్టాక్ మార్కెట్ పండుగ చేసుకోనున్నదని విశ్లేషకులంటున్నారు. మరిన్ని ఆర్థిక సంస్కరణలు రానున్నాయనే అంచనాలతో స్టాక్ సూచీలు రికార్డ్ స్థాయిలను తాకనున్నాయని వారంటున్నారు. హోలీ కారణంగా నేడు(సోమవారం) మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ 4 రోజులకే పరిమితం కానున్నది. అయినప్పటికీ, రానున్న రోజుల్లో బలమైన ర్యాలీ చోటు చేసుకోగలదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరింత బలంగా ఇన్వెస్టర్ల విశ్వాసం.. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ భారీ విజయం సాధించడంతో మార్కెట్ కొత్త జోన్లోకి ప్రవేశిస్తుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా అంచనా వేస్తున్నారు. ఈ విజయంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరుగుతుందని, మరిన్ని ఆర్థిక సంస్కరణలకు మోదీ ముందుకు వస్తారని పేర్కొన్నారు. జనాభా పరంగా దేశంలో అతి పెద్దదైన ఉత్తర ప్రదేశ్లో జరిగిన ఎన్నికలు 2019 నాటి సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ లాంటివని అందరూ పరిగణించారని వివరించారు. ఈ విజయంతో ఎన్డీఏ మరింత పటిష్టంగా తయారైందని, ఈ ఏడాది జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ ప్రభావం తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల విశ్వాసం మరింత బలపడిందని సెంట్రమ్ బ్రోకింగ్ ఈడీ, సీఈఓ కె. సందీప్ నాయక్ చెప్పారు. సమీప భవిష్యత్తులో స్టాక్ మార్కెట్ సానుకూలంగా సాగుతుందని, మార్కెట్ కొత్త జీవిత కాల గరిష్ట స్థాయిని తాకుతుందని పేర్కొన్నారు. 2015, మార్చి 4న బీఎస్ఈ సెన్సెక్స్ 30,025, నిఫ్టీ 9,119 పాయింట్లను తాకాయి. ఇవే ఇప్పటిదాకా ఈ స్టాక్ సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయిలు. నిఫ్టీ బ్రేక్ అవుట్.. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్లో భారీ విజయం సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన వ్యవస్థాగత ఆర్థిక సంస్కరణల దూకుడును పెంచుతారని ప్రభుదాస్ లీలాధర్ సీఈఓ అజయ్ బోడ్కే వ్యాఖ్యానించారు. ఈ విజయం స్టాక్ మార్కెట్కు ఉత్తేజాన్నిస్తుందని పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయంతో సంస్కరణలు మరింత వేగాన్ని పుంజుకుంటాయని, అన్ని రంగాల్లో వృద్ధి వెల్లివిరుస్తుందని శామ్కో సెక్యూరిటీస్ జిమీత్ మోడీ పేర్కొన్నారు. ఈ వారంలో నిఫ్టీ కొత్త శిఖరాలకు చేరుతుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అబ్నిశ్ కుమార సుధాంశు చెప్పారు. ఇక వారం మంగళవారం వెలువడే ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావం కూడా మార్కెట్పై ఉండనున్నది. రెండు వారాల కన్సాలిడేషన్ తర్వాత ఈ మంగళవారం నిఫ్టీ బ్రేక్ అవుట్ కానున్నదని విశ్లేషకులంటున్నారు. ఆ రోజు 9,119 పాయింట్ల నిఫ్టీ ఇంట్రా డే రికార్డ్ బద్దలయ్యే అవకాశాలున్నాయని వారంటున్నారు. జనవరిలో పారిశ్రామికోత్పత్తి 2.7 శాతం పెరగడం కూడా సానుకూల ప్రభావం చూపించనున్నది. ఇక ఈ నెల 16న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కూడా కీలకం కానున్నది. ర్యాలీ తర్వాత కరెక్షన్..: ఈ వారంలో జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంలోనే వడ్డీరేట్లు పెంచే అవకాశాలున్నాయన్న అంచనాలు బలం పుంజు కుంటున్నాయని సింఘానియా వ్యాఖ్యానించారు. ఫెడ్ రేట్లు పెరిగితే భారత్ వంటి వర్ధమాన దేశాలపై ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ర్యాలీ తర్వాత కొంత కరెక్షన్ చోటు చేసుకోవచ్చని, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు అంచనాలు బలంగా ఉండడమే దీనికి కారణమని విశ్లేషకులంటున్నారు. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ విజయాన్ని మార్కెట్ అంచనా వేసిందని, ఇది గత శుక్రవారం నాటి ట్రేడింగ్లో కనిపించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. మంగళవారం స్టాక్ సూచీలు మంచి జోరునే చూపిస్తాయని, అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్తో సహా పలు దేశాల కేంద్ర బ్యాంక్లు తీసుకునే ద్రవ్య విధాన నిర్ణయాలపైననే ఈ జోరు కొనసాగే అవకాశాలు ఆధారపడి ఉన్నాయని వివరించారు. కాగా గత వారంలో బీఎస్ఈ సెన్సక్స్ 114 పాయింట్లు లాభపడి 28,946 పాయింట్ల వద్ద, ఎన్ఎన్సీ నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 8,935 పాయింట్ల వద్ద ముగిశాయి. రూ.10,288 కోట్ల విదేశీ పెట్టుబడులు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) ఈ నెలలో మన క్యాపిటల్ మార్కెట్లో నికరంగా రూ.10,288 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఈ ట్రెండ్ మరింతగా కొనసాగుతుందని అంచనాలున్నాయి. -
యూపీ ముఖ్యమంత్రి... మరో చాయ్వాలా?
2014లో ఉత్తరప్రదేశ్లో మోదీ ప్రభంజనం వీచి.. రాష్ట్రంలోని 80 లోక్సభ స్థానాల్లో 73 సీట్లను ఆ పార్టీ గెలుపొందుతుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత తిరిగి చూస్తే అదే మ్యాజిక్ను బీజేపీ పునరావృతం చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల స్థానాలను గెలుపొందింది. నాడు చాయ్వాలాగా పేరొందిన నరేంద్రమోదీ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టారు. నేడు యూపీ అధినేతగా మరో చాయ్వాలా పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 80శాతం సీట్లు గెలుపొందడం వెనుక ఒక 'చాయ్వాలా' కృషి ఉంది. ఆయనే కేశవ్ప్రసాద్ మౌర్య. చాయ్వాలా నుంచి ప్రస్థానం..! యూపీ కౌశంబి జిల్లాలోని ఓ పేద రైతు కుటుంబంలో కేశవ్ ప్రసాద్ మౌర్య జన్మించారు. ఆయన బాల్యమంతా పేదరికంలోనే గడిచిపోయింది. ప్రధాని మోదీలాగే కుటుంబానికి అండగా ఉండేందుకు మౌర్య కూడా టీ స్టాల్లో పనిచేశారు. న్యూస్పేపర్లు అమ్మారు. మారుమూల గ్రామాల్లో, పట్టణాల్లో టీ అమ్ముకొని జీవించడమంటే ఇప్పుడు రాజకీయాల్లో అదేమీ నామోషి కాదు. గుజరాత్ నుంచి వచ్చిన మోదీ తాను చాయ్ అమ్మిననాటి నిరాడంబర నేపథ్యాన్ని పదేపదే గుర్తుచేసుకుంటారు. అదేవిధంగా మౌర్య బాల్యంలో తాను అమ్ముకొని జీవితం వెళ్లదీసిన రోజులను గర్వంగా చెప్పుకుంటారు. ఈ విషయంలో తనకు, ప్రధాని మోదీతో సారూప్యముందని సంతోషపడతారు. రాజకీయ ప్రస్థానం..! చిన్నప్పటినుంచే మౌర్య ఆరెస్సెస్ బాల స్వయం సేవక్లో కొనసాగారు. ఆ తర్వాత విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ), బజరంగ్ దళ్కు అనుబంధంగా పనిచేశారు. 12 ఏళ్లు ఈ రెండు సంస్థల్లో కొనసాగిన ఆయన వీహెచ్పీ సిద్ధాంతకర్త అశోక్సింఘాల్కు సన్నిహితుడిగా ముద్రపడ్డారు. ఆవేశపూరితమైన ఉపన్యాసాలకు పేరొందిన మౌర్య.. అయోధ్య, గోరక్షణ ఉద్యమాల్లో జైలుకు కూడా వెళ్లారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో అలహాబద్ సిరాతు సీటు నుంచి గెలుపొందిన ఆయన.. 2014 లోక్సభ ఎన్నికల్లో.. దేశ ప్రథమ ప్రధాని నెహ్రూ నియోజకవర్గమైన ఫూల్పూర్ నుంచి విజయం సాధించారు. 2016 ఏప్రిల్లో మౌర్య యూపీ బీజేపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. విజయం వెనుక మౌర్య పాత్ర ఏమిటి? యూపీలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం వెనుక యాదవేతర ఓబీసీలు, జాటవేతర దళితులు కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ ఓబీసీ ఉపకులానికి చెందిన మౌర్యకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించిన మౌర్య.. యాదవేతర ఓబీసీల మద్దతు బీజేపీకి కూడగట్టడంలో విజయం సాధించారు. కుశ్వాహా, కోయెరి, కుర్మీ, శాక్య, పటేల్ తదితర సామాజిక వర్గాల నేతలకు జిల్లా యూనిట్ చీఫ్ బాధ్యతలను అప్పగించి.. ఆయా వర్గాలను బీజేపీ వైపు తిప్పుకోగలిగారు. ఇప్పుడు సంపన్నుడే! ఒకప్పుడు మౌర్య పేదరికంలో ఉన్నారు కానీ, ఇప్పుడు ఆయన సంపన్నుడు. ఆయనకు, ఆయన భార్యకు అలహాబాద్ చుట్టూ కోట్లరూపాయలు విలువచేసే ఆస్తులు ఉన్నాయి. ఆయనపై 11 పోలీసు కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు యూపీ ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో మౌర్య కూడా ఉన్నారు. ఓబీసీల్లో గట్టి పట్టున్న నేతగా పేరొందిన మౌర్యకు బీజేపీ అధిష్టానం అవకాశమిస్తుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. -
అందుకే బీజేపీకి ఓటేశారు: ఆరెస్సెస్
ఉత్తరప్రదేశ్లో బీజేపీ చరిత్రాత్మక విజయంపై ఆ పార్టీ మాతృసంస్థ ఆరెస్సెస్ స్పందించింది. యూపీలో బీజేపీ భారీ విజయాన్ని అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దక్కిన ప్రజామద్దతుగా భావించాలని ఆరెస్సెస్ సిద్ధాంతకర్త ఎంజీ వైద్య పేర్కొన్నారు. బీజేపీ మ్యానిఫెస్టోలో సైతం అయోధ్యలో రామమందిర నిర్మాణ అంశాన్ని ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో ఈ భారీ విజయాన్ని ఇందుకు ప్రజామోదంగా భావించవచ్చునని ఆయన పీటీఐతో అన్నారు. అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో రామమందిరం ఉండేదని, ఆ ఆలయం శకలాలు తవ్వకాల్లో బయటపడ్డాయని అలహాబాద్ హైకోర్టు పేర్కొన్నదని ఆయన అన్నారు. రామమందిరం అంశాన్ని పరిష్కరించడంలో సుప్రీంకోర్టు విఫలమైనపక్షంలో మందిర నిర్మాణం కోసం ఎన్డీయే ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తేవాలని ఆయన సూచించారు. -
ఒవైసీకి గట్టి ఎదురుదెబ్బ!
లక్నో: అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆలిండియా మజ్లిస్ ఇతేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీకి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూపీ ఎన్నికల్లో 38 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపినా.. ఎక్కడ కూడా ఆ పార్టీ బోణీ కొట్టలేదు. ఒక్క స్థానాన్ని కూడా గెలుపొందలేకపోయింది. దీంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటి ఉత్తరప్రదేశ్లోనూ తమ పార్టీని విస్తరించుకోవాలన్న ఒవైసీ కలలు నెరవేరలేదు. ఎంఐఎం నుంచి కచ్చితంగా విజయం సాధిస్తారని భావించిన జియావుర్ రెహ్మాన్ బర్క్ కూడా ఓటమి పాలయ్యారు. జియావుర్ నాలుగుసార్లు ఎంపీ అయిన షఫీక్ ఉర్ రెహ్మాన్ బర్క్ మనవడు. ఉత్తరప్రదేశ్లో భారీగా ముస్లిం ఓటర్లు ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు ఒవైసీ తీవ్రంగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. యూపీలో ముమ్మరంగా ప్రచారం చేసిన ఆయన.. ప్రచారపర్వంలో బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారని తాజా ఫలితాలు చాటుతున్నాయి. అయితే, తాము ఇంకా యుద్ధం నుంచి తప్పుకోలేదని, మున్ముందు మరింత తీవ్రంగా ఎన్నికల్లో పోరాడుతామని ఒవైసీ స్పష్టం చేశారు. యుద్ధం మొదలుకాకముందే పారిపోవాలనేవిధంగా ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన విమర్శించారు. -
వెళ్లే సమయమొచ్చింది ఓటమిపై సీఎం నిర్వేదం
-
వెళ్లే సమయమొచ్చింది.. ఓటమిపై సీఎం నిర్వేదం
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో అధికార సమాజ్వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో ఆయన శనివారం లక్నోలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అనంతరం సీఎం పదవికి రాజీనామా చేశారు. విలేకరుల సమావేశంలో ఒకింత నిర్వేదంగా కనిపించిన అఖిలేశ్.. 'ప్రజలకు మా ఎక్స్ప్రెస్ వే నచ్చలేదేమో. అందుకే బుల్లెట్ ట్రెయిన్కు ఓటు వేశారు. ప్రజలు ఎన్నికల కేంద్రానికి వెళ్లారు కానీ మాకు ఓటువేయలేదేమో అనిపిస్తుంది' అని అన్నారు. ఈవీఎంలు ట్యాపరింగ్ చేశారంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని, దీనిపై తాను కూడా పరిశీలన జరుపుతామని చెప్పారు. రానున్న ప్రభుత్వం తమ ప్రభుత్వం కంటే బాగా పనిచేయాలని కోరుకుంటున్నట్టు అఖిలేశ్ పేర్కొన్నారు. ఎన్నికల తీర్పుపై సమీక్ష చేసిన అనంతరమే ఓటమికి బాధ్యత తీసుకుంటానని ఆయన అన్నారు. కాంగ్రెస్తో పొత్తు వల్లే ఎస్పీ ఓటమిపాలైందన్న విమర్శలు వస్తున్నప్పటికీ, ఆ పార్టీతో పొత్తు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని అఖిలేశ్ స్పష్టం చేశారు. అనంతరం తన ఇంటిముందు గుమిగూమిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 'ఇక నేను వెళ్లాల్సిన సమయం వచ్చిందనుకుంటా' అంటూ అఖిలేశ్ వ్యాఖ్యానించారు. -
ఇది చారిత్రాత్మక విజయం: మోదీ
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన 202 స్థానాలకు పైగా సీట్లు కైవసం చేసుకున్న అనంతరం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన యూపీ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు తమ ప్రభుత్వంపై ఎంతో నమ్మకం ఉంచారని, అందుకే విశేషమైన మద్దతు లభించిందన్నారు. యూపీ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకమయ్యామని ఇతర రాష్ట్రాల్లోనూ యువత బీజేపీ వైపు మొగ్గు చూపిందని చెప్పారు. ఉత్తమ పాలన, అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారని మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా సానుకూల దృక్పథంతో ఉన్నారని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయన్నారు. నమ్మకం, నిజాయితీలకే దేశం మొత్తం ఓటేసిందని, అందువల్లే బీజేపీ విజయం సాధ్యమైందని మోదీ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో బీజేపీ జయకేతనం ఎగరవేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో మరికొన్ని స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. సమాజ్ వాదీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేసినా ఆ కూటమి కేవలం 50 సీట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తుండగా, మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ పట్టుమని 20 సీట్లు వచ్చేలా కనిపించడం లేదు. -
ప్రజలు చారిత్రక నిర్ణయం తీసుకున్నారు
-
ఆలయాల ముందు అభ్యర్థుల బారులు!
లక్నో: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు ఆలయాల ముందు బారులు తీరారు. తమ పార్టీలు విజయం సాధించాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ జోషి.. హజ్రత్ గంజ్ హనుమాన్ దేవాలయంలో ఈ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు తమ పార్టీ విజయం కోసం లక్నోలో హోమాలు చేపట్టారు. పలుచోట్ల ఆయా పార్టీల అభ్యర్థులను ప్రార్థనా మందిరాలను సందర్శించారు. ఎన్నికల ఫలితాలను పురస్కరించుకుని వారణాసిలో ముందుగానే లడ్డూలు తయారు చేశారు. -
బీజేపీని అడ్డుకునేందుకు ఎవరితోనైనా కలుస్తాం!
⇒ ఎగ్జిట్పోల్స్ నేపథ్యంలో అఖిలేశ్ ప్రకటన ⇒ బీఎస్పీతో దోస్తీకీ సిద్ధమనే సంకేతాలు ⇒ యూపీ పీఠం బీజేపీదేనన్న రాజ్నాథ్ లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ హంగ్ను సూచిస్తుండటంతో.. సీఎం అఖిలేశ్ యాదవ్ ముందస్తు ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయకుండా ఎవరితోనైనా కలుస్తామని గురువారం ప్రకటించారు. బీఎస్పీతో పొత్తు విషయాన్ని కూడా అఖిలేశ్ పూర్తిగా ఖండించలేదు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. మేజిక్ ఫిగర్కు చేరుకోలేదన్న వార్తల నేపథ్యంలో పొత్తుపై అన్ని సాధ్యమైన మార్గాలను పరిశీలిస్తున్నామని బీబీసీతో మాట్లాడుతూ అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీని అడ్డుకోవటమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ‘యూపీలో రాష్ట్రపతి పాలన రావాలని, బీజేపీ రిమోట్ కంట్రోల్ ద్వారా ఢిల్లీ నుంచి పాలించాలని ఎవరూ కోరుకోవటం లేదు. ఎస్పీ–కాంగ్రెస్కు సరిపోయేటంత సీట్లు వస్తాయి. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం. ఒకవేళ కాస్త తగ్గితే పొత్తుపై ఆలోచిస్తాం. బీఎస్పీతో పొత్తుపై ఇప్పడేమీ చెప్పలేను. కానీ మాయావతి నాకు బంధువులాంటి వారు. నేను ఆమెను బౌజీ (ఆంటీ)గా పిలుస్తాను’ అని అఖిలేశ్ తెలిపారు. శనివారం ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో అఖిలేశ్ వార్తలు కొత్త పొత్తులకు దార్లు తెరిచాయని నిపుణులంటున్నారు. కాగా, అఖిలేశ్ రెండోసారీ సీఎంగా బాధ్యతలు తీసుకుంటారని ఆ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్తో కలిసి స్పష్టమైన మెజారిటీ సంపాదిస్తామన్నారు. అటు, యూపీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణమైన మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంటుందని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో తెలిపారు. బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరన్న విషయంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. -
యూపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
న్యూఢిల్లీ: బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపాయి. 403 స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు చేయడానికి కావల్సిన మేజిక్ ఫిగర్ 202. ఎన్నికల పోలింగ్ కౌటింగ్ ఈనెల 11న జరగనుంది. కాంగ్రెస్ తో పొత్తు అధికార సమాజ్ వాదీ పార్టీకి పెద్దగా కలిసి రాలేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎస్పీ-కాంగ్రెస్ కూటమి రెండో స్థానంలో నిలుస్తాయని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించనుందని పేర్కొన్నాయి. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ మూడో స్థానానికి పరిమితం కానుంది. చానల్ ఎస్పీ-కాంగ్రెస్ బీజేపీ బీఎస్పీ ఇతరులు ఎన్డీటీవీ 120 193 78 12 ఇండియా టీవీ-సీ ఓటర్ 135-147 155-167 81-93 08-20 టైమ్స్ నౌ- వీఎమ్మార్ 110-130 190-210 57-74 08 ఏబీపీ న్యూస్-లోక్ నీతి 156-169 164-176 60-72 02-06 ఇండియాన్యూస్-ఎమ్మార్సీ 120 185 90 08 -
ఆ ఎమ్మెల్యేల ఆస్తులు ఏకంగా 82% పెరిగాయ్!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 311 మంది ఎమ్మెల్యేలు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విశేషమేమంటే ఈ ఎమ్మెల్యేల ఆస్తులు గత ఐదేళ్లలో సగటున రూ. 2.84 కోట్ల మేర పెరిగాయి. అంటే వీరి ఆస్తి ఎమ్మెల్యేగా ఉన్నకాలంలో సుమారు 82శాతం పెరిగిపోయింది. ఈ 311మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తి 2012 ఎన్నికల్లో రూ. 3.49 కోట్లు (రూ. 3,49,08,073) ఉండగా.. ఇప్పుడది రూ. 6.33 కోట్ల (రూ. 6,33,64,781)కు పెరిగిందని ప్రజాస్వామిక సంస్కరణల సంస్థ (ఏడీఆర్) వెల్లడించింది. 2012లో పోటీచేసి 2017లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న 311 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తి సగటున రూ. 2.84 కోట్ల మేర పెరిగిపోయిందని తెలిపింది. యూపీ ఎన్నికల నిఘా సంస్థతో కలిసి ఆయా అభ్యర్థుల ఆస్తుల వివరాలను విశ్లేషించడం ద్వారా ఈ వివరాలను వెల్లడించింది. తిరిగి పోటీచేస్తున్న ఎమ్మెల్యేలలో బీఎస్పీ నేత షా ఆలం ఉర్ఫ్ జమాలి అత్యధికంగా ఆస్తులు కూడబెట్టారు. 2012 నుంచి 2017 మధ్యకాలంలో ఆయన ఆస్తులు ఏకంగా రూ. 64 కోట్లు పెరిగిపోయాయి. ఆయన తర్వాత మరో బీఎస్పీ ఎమ్మెల్యే నవాబ్ కరీం ఆలీ ఖాన్ ఆస్తులు ఏకంగా రూ. 40 కోట్లు పెరిగాయి. తదుపరి స్థానంలో ఎస్పీ ఎమ్మెల్యే అనూప్ కుమార్ ఉన్నారు. ఆయన ఆస్తులు రూ. 35 కోట్లు పెరిగాయి. పార్టీల ప్రకారం చూసుకుంటే ఎస్పీకి చెందిన 162మంది ఎమ్మెల్యేల ఆస్తులు సగటును రూ. 2 కోట్ల మేర పెరిగిపోగా, బీఎస్పీకి చెందిన 57మంది ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 4 కోట్ల వరకు పెరిగిపోయాయి. బీజేపీకి చెందిన 55మంది ఎమ్మెల్యేల ఆస్తులు సగటున రూ. 2 కోట్లు పెరుగగా, కాంగ్రెస్కు చెందిన 19మంది ఎమ్మెల్యేల ఆస్తులు సగటున రూ. 2 కోట్ల మేర పెరిగాయి. -
నిరాశ నిశిలో ఆశల ఆరాటం
జాతిహితం తూర్పు యూపీ ప్రధాన సమస్య అర్థికపరమైన వలసలేనని మోదీ మాట్లాడారు. ఎక్కడో దూర ప్రాంతాలకు పోయేకంటే మీ యువత మీ సొంత తాలూకాలోనే ఉద్యోగాలు కావాలని అనుకోవడం లేదా? ముసలి తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలని ఏ యువకుడు అనుకోడు? ఈ ప్రశ్నలు అడిగి ఆయన శ్రోతల స్పందన కోసం ఆగారు. అంత నిశ్శబ్ద ప్రతిస్పందనను చూసి ఆయన ఆశ్చర్యపోయి ఉంటే ... పూర్వాంచల్ యువత పోరాడాలనిగాక, పారిపోవాలని ఎంత బలంగా అనుకుంటోందో అర్థం కాలేదనే. అమెరికన్లు బేస్బాల్ క్రీడా మైదానాన్ని బాల్పార్క్ అన్నట్టే పనికిరాని బీడుభూములను బ్యాడ్ల్యాండ్స్ అనడం పరిపాటి. ఉత్తరప్రదేశ్లోని చాలా ప్రాంతాలు ఆ వర్ణనకు సరిపోయేవిగా ఉంటాయి. బుందేల్ఖండ్లోని యమున, ఛంబల్ నదుల వెంబడే నిస్సారమైన, ఒరుసుకుపోయిన లోయల ప్రాంతం, ఇటావా సరిగ్గా ఆ అభివర్ణనకు సరిపోతాయి. బ్యాడ్ల్యాండ్స్ అనే దానికి ముక్కస్య ముక్క అర్థం చెప్పుకుని చెడ్డ భూములు అన్నా లేదా ప్రజా ప్రాచుర్యం పొందిన అరాచక ప్రాంతాలు అన్నా సరిగ్గా సరిపోతుంది. ఇంకా తూర్పునకు పోతే ప్రకృతి చిత్రం మారిపోతుంది. క్రమబద్ధమైన, సాధారణ నీటి కాలువలు, వాటి ఒడ్డున నీటితో తడిచి కళకళలాడే మరింత సారవంత మైన నేలలు కనిపిస్తాయి. కానీ జీవన నాణ్యతతో పాటే, అంతే వేగంగా చట్ట బద్ధపాలన కూడా క్షీణించిపోతుంది. ఏ కప్పూ లేక బహిరంగంగా, పొంగిపొర్లే మురుగునీటి కాలువలు, మురుగు నీటి గొట్టాలు, పైన వదులుగా వేలాడే వైర్లు, గాలిలోని శాశ్వత దుర్గంధం, గుంతలు, దురాక్రమణలు, గిడసబారిన పిల్లలు, దవడలు పీక్కుపోయిన పెద్దలు, వారిలో వందలాది మంది ఏటేటా జపనీస్ ఎన్సెఫాలిటిస్ శిక్షకు గురై బలైపోయేవారూ కనిపిస్తారు. రోడ్డు పక్క పాదచారుల బాటలు పూర్తిగా చెత్తతో నిండి పేవ్మెంట్ల అవతారమెత్తు తాయి. అర్థరాత్రి మాత్రం రోడ్లు మధ్యలో మాత్రం శుభ్రంగా తుడిచి ఉంటాయి. కనీసం గోరఖ్పూర్లోని ‘పోష్’ (విలాస) ప్రాంతాల్లో, ఆ చుట్టు పక్కలనైనా ఇది కనిపిస్తుంది. మనం మరచిన యూపీ గోరఖ్పూర్, యూపీలోని అత్యంత నిరాశాజనక ప్రాంతమైన తూర్పు యూపీకి దాదాపుగా రాజధాని వంటిదే. దానికి ఉత్తరాన నేపాల్తో నిర్ని బంధ సరిహద్దుంది. పశ్చిమ బిహార్ను ఆనుకుని మిట్టపల్లాలుగా ఉండే తూర్పు జిల్లాలున్నాయి (కుశీనగర్సహా బౌద్ధుల ముఖ్య ప్రాంతాలు ఉన్నది అక్కడే). దక్షిణాన ఉన్నవి మరింత గందరగోళంగా ఉండే దియోరియా, అజామ్గర్, బాలియా, జునాపుర్ తదితర జిల్లాలు. మన కంటికి కనిపించని, ఆలోచనల్లోకి రాని విస్మృత ప్రాంతంగా ఈశాన్య భారతాన్ని మనం ఎన్నడో ఆమోదించాం. తూర్పు యూపీకి, ప్రత్యేకించి గోరఖ్పూర్కు వచ్చి చూడండి. మీకు అలాంటి అనుభవమే కలుగుతుంది. మీరు ఎక్కడ చూస్తారనే దాన్ని బట్టి.. కిందికా, పైకా లేక నేల మీది నుంచా, ఆకాశం నుంచా అనే దాన్ని బట్టి.. గోరఖ్పూర్పై మీకు రెండు అభిప్రాయాలు ఏర్పడవచ్చు. మీ కాళ్ల కింద చెత్త, బురద ఉంటే మీ దృష్టిని అక్కడి నుంచి పైకి, రోడ్ల కూడలి కుడి ఎడమలకు, ముందుకు చూడండి. ప్రైవేటు ఉన్నత విద్య, ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు గత 15 ఏళ్లుగా దేశ ప్రధాన భూభాగంలో వేగంగా వృద్ధి చెందాయని గోడల మీది రాతలు చాటుతాయి. 1991 సంస్కరణల తర్వాత మన దేశంలోని చిన్న పట్టణాలలో విద్య అత్యంత జనా దరణగల వినియోగ వస్తువుగా మారింది. తూర్పు యూపీ లేదా పూర్వాం చల్లో అది పూర్తిగా విభిన్నమైన, అవాస్తవిక ప్రమాణాలకు హైదరాబాద్ లోని టాలీవుడ్ సినిమా హోర్డింగులంత పెద్ద ప్రకటనలు ఇక్కడికి సుదూ రంలో ఎక్కడో దొరికే ఉద్యోగానికి టికెట్ను అమ్మజూపుతుంటాయి. సివిల్ లైన్స్ ప్రాంతంలోనూ, ఆ చుట్టుపక్కలా అర్ధరాత్రి నడకకుపోయి 200 హోర్డింగులను లెక్కించాను. వాటిలో 170కు పైగా విద్య, శిక్షణ, పోటీ పరీక్షలకు కోచింగ్, స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులకు సంబంధించినవే. ‘‘మీకు ఇంగ్లిష్ భాషా నైపుణ్యం అక్కర్లేదని మీరు నిజంగానే అనుకుంటున్నారా?’’ అని పెద్ద పెద్ద అక్షరాలతో హిందీలో రాసి ఉన్న ప్రకటన మిమ్మల్ని వెక్కి రించేలా ఉంటుంది. పీఎంటీ కోచింగ్ సెంటర్ ద్వారా ‘‘గత 18 ఏళ్లలో 1,012 మంది డాక్టర్లను సృష్టించిన’’ డాక్టర్ రాహుల్ రాయ్ను మరో హోర్డింగ్ పరిచయం చేస్తుంది. ఆశల దీవికి ఎగిరిపోవాలి తక్కువ నిరాశాజనకమైన, అవకాశాలు కొన్నయినా ఉన్న ప్రాంతానికి వెళ్లగల గడానికి మించి పూర్వాంచలీ యువత కోరుకునేది ఏదీ లేదు. ఆకాంక్షా భరితమైన ఆ పోటీలో నెగ్గుకురాగలిగేది అతికొందరే. మిగతా వారంతా రిక్షాలు లాగుతూ, నిర్మాణ కూలీలుగా పనిచేస్తూ, తోపుడు బళ్లపై పళ్లు, కూర గాయలు అమ్ముకుంటూ, చిన్న చాయ్ దుకాణాలు పెట్టుకుని కుళ్లిపోతున్న మన మెట్రో సబర్బన్, మురికివాడలను నింపుతారు. ఆరు కోట్ల భారతీయు లున్న ఈ విస్మృత ప్రాంతాన్ని ‘ఉడ్తా పూర్వాంచల్’ అని కీర్తించాలని ఏ సినీ నిర్మాతా అనుకోడు. అయినా అక్కడి యువతకంతటికీ ఉన్నది చాలా వరకు ఒకే ఒక్క ఆకాంక్ష: ఎక్కడికో ఎగిరిపోవాలి. ప్రధాని నరేంద్ర మోదీకి శ్రోతలను కూడా తన ఉపన్యాసంలో భాగస్వా ములను చేయడంలో అసాధారణ ప్రతిభ ఉంది. దాన్ని వర్ణించడానికి ఆయనో అద్భుత వక్త అంటే సరిపోదు. శ్రోతలు ఏమి, ఎప్పుడు, ఏ స్థాయిలో వినాలని కోరుకుంటున్నారో ఆయనకు తెలుసు. సరైన సమయాన్ని ఎంచు కోవడం, మధ్యలో ఆగడం, హావభావ విన్యాసాలు, రెండు చేతులూ చాచి వలయంలా ఊపడం, ఏదైనా మంచి విషయం చెప్పానని అనుకున్నప్పుడు ఒక అరచేతిని మరో చేతిపై తడుతూ వేచి చూడటం తదితర విషయాల్లో ఆయనది సహజ చాతుర్యం. అందుల్లనే దాదాపు లోపరహితమైన ఆయన పకడ్బందీ ప్రచారంలో దియోరియాలోఒక అపస్వరం వినిపించడం ఆశ్చర్యం కలిగించింది. రాహుల్ గాంధీ గత ప్రచార కార్యక్రమాల్లో దొర్లినట్టుగా అది స్థానిక పరిస్థితిని అర్థం చేసుకోవడంలోని పొరబాటు కావడం మరింత వైచిత్రి. 2012 రాష్ట్ర ఎన్నికల్లో రాహుల్ లాగే నేడు మోదీ కూడా ఆ ప్రాంతపు ప్రధాన సమస్య అర్థికపరమైన వలసలేనని మాట్లాడారు. ఎక్కడో దూర ప్రాంతాలకు పోయేకంటే మీ యువత మీ సొంత తాలూకాలోనే ఉద్యోగాలు కావాలని అనుకోవడం లేదా? ముసలి తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలని ఏ యువ కుడు అనుకోడు? ఈ ప్రశ్నలు అడిగి ఆయన శ్రోతల స్పందన కోసం ఆగారు. ఆ స్పందన అంత నిశ్శబ్దంగా ఉన్నదేమని ఆయన ఆశ్చర్యపోయి ఉంటే ... పూర్వాంచల్ యువత పోరాడాలనిగాక, పారిపోవాలని ఎంత బలంగా అను కుంటోందో అర్థం కాలేదనే. ఇక్కడ సమస్య కేవలం విద్యో, ఉద్యోగాలో కాదు. అభిలషణీయమైన దానికంటే తక్కువ స్థాయి నాణ్యతగల జీవితాలను అను భవించేలా శాపగ్రస్తులు కావడం. వర్షాకాలం వస్తే మురుగు కాలువలు పెద్ద కాలువలుగా మారిపోతాయి. గాలి దుమ్ముతో నిండి ఉంటుంది. ఇక దోమల సంగతి చెప్పనవసరమే లేదు. దారిన నడుస్తూ నడుస్తూ ఫోన్లో మాట్లాడితే కొన్ని దోమలను మీరు మింగేయనూవచ్చు. ప్రధాని సైతం ఆ ప్రాంతపు సామాజికాభివృద్ధి సూచికలు నిరుపేద ఆఫ్రికా దేశాల స్థాయిలో ఉన్నాయ న్నారు. అంటే అది పూర్వాంచల్ గురించి మాట్లాడటమే అవుతుంది. ఆ ప్రాంతం ఇలా శాపగ్రస్తమైనది కావడానికి భౌగోళికత కొంతవరకు కారణం. ఎక్కడి నుంచి చూసినాగానీ గోరఖ్పూర్ మరీ సుదూర ప్రాంతం. దేశంలోని ప్రధాన రైలు లేదా రోడ్డు వ్యవస్థలతో అది అనుసంధానమై లేదు. ఇటీవలి వరకు అది మీటర్ గేజ్ రైల్వే లైన్ల ప్రాంతంగానే ఉండేది. ఆ ప్రాంత ప్రజలు ఎప్పడూ ప్రతిభావంతులు, కష్టించేవారు, తిరగబడేవారే. గోరఖ్పూర్ నుంచి దియోరియాకు మధ్య దారిలో చౌరీ చౌరా ఉంది. 1922లో ప్రజలు పోలీస్ స్టేషన్కు నిప్పుపెట్టి 23 మంది పోలీసులను హతమార్చినది అక్కడే. మార్షల్ లా విధించి బ్రిటిష్వారు అక్కడ సృష్టించిన భయోత్పాతానికి నిరసన తెలపడానికి అక్కడి వచ్చిన నెహ్రూను అరెస్టు చేశారు. ఆయన అంత దూరం ఎలా వచ్చారో 94 ఏళ్ల తర్వాత ఇప్పుడు మీరే ఊహించుకోండి. గోరఖ్పూర్ జైలులో ప్రముఖ విప్లవకారుడు రామ్ప్రసాద్ బిస్మిల్ను ఉరితీశారు. అయినా ఆ ప్రాంతం ఇంకా అంత దూరంగానే ఉంది. పూర్వాంచల్ దిశగా నాటి విప్లవకారుల స్థానంలో మాఫియా సభ్యులు వచ్చారు. బ్రాహ్మణ, రాజ పుత్ర మాఫియాల మధ్య రక్తసిక్త ప్రతీకార హత్యాకాండలు నేడు లేవు. కానీ పెద్ద సంఖ్యలో చిన్న చిన్న ముఠాలున్నాయి. నగరాలలో ఎప్పుడు సుపారీ హత్యలు జరిగినా సాధారణ అనుమానితులు ఇక్కడివారే అయి ఉంటారు. విశాల్ భరద్వాజ్ చిత్రం ‘ఇష్కియా’లో పారిపోతున్న నసీరుద్దీన్ షా, అర్షాద్ వార్సీలు గోరఖ్పూర్ దగ్గర్లోనే దాక్కుంటారు. ఆ సన్నివేశంలో వార్సీ, నసీరు ద్దీన్ షాతో మరువలేని ఈ మాటలంటాడు :‘‘కాలికి బుద్ధి చెప్పి ఇక్కడి నుంచి వెంటనే ఉడాయిద్దాం. మన భోపాల్లోనైతే షియాలు, సున్నీలే కొట్లాడుకుం టారు. ఇక్కడ బ్రాహ్మణులు, ఠాకూర్లు, యాదవ్లు, జాట్లు అందరికీ (ప్రైవేటు) సేనలున్నాయి.’’ కాబట్టి పూర్వాంచల్ కూడా బ్యాడ్ల్యాండ్స్ అనే పదబంధం జనప్రాచుర్యం పొందిన అర్థ పరీక్షలో నెగ్గుతుంది. గోరఖ్పూర్లో రాజ్యం చలాయిస్తున్నది భూస్వాములో లేక సంప్రదా యక మాఫియా ముఠాలో కాదు. అంగబలం ఉండి, సుస్పష్టంగా మాట్లాడ గలిగిన, కాషాయాంబరధారి యోగీ ఆదిత్యనాథ్. శక్తివంతమైన గోరఖ్పూర్ మఠా నికి ఆయన వారసత్వ అధిపతి. ఆయన ఐదుసార్లు గెలిచారు. ఈసారి ఆయన బీజేపీకి ఆ జిల్లాలోని ఎక్కువ స్థానాలను సాధించిపెడతారని ఆశిస్తు న్నారు. ఆయన గుడి, మఠం రెండూ ఆ ప్రాంతానికి ప్రామాణిక చిహ్నాలు. అంతేకాదు అత్యంత పరిశుభ్రమైనవి కూడా. ఈ ఎన్నికల్లో బీజేపీ ముస్లింలను ఎవరినీ ఎందుకు నిలపలేదు? అని అడిగాం. గెలవడం మాత్రమే లెక్కలోకి వస్తుంది అని ఆయన అన్నారు. బీజేపీ జాబితాలో ముస్లింలు లేకపోతేనేం, ఇక్కడ ఎన్నడూ మత కల్లోలాలు జరగవు అన్నారు. ఎందుకని అడిగాం. ‘‘మేం అందించే మంచి పాలన, భయం’’. భయం ఎందుకు, ఎవరంటే భయం అని అడిగాం. మా ప్రశ్నను ఆయన పట్టించుకోలేదు. యూపీని చిన్న రాష్ట్రాలుగా విభజించే విషయం ప్రస్తావనకు వచ్చిన ప్పుడు ఆయన కళ్లు వెలిగాయి. వాటిలో ఒకటి పూర్వాంచల్ అవుతుంది. ఈ ఎన్నికలు అందుకు సమయం కాదు. అయితే ఆ విషయాన్ని ఆయన ముందు ముందు పట్టించుకుంటారని, కొత్త రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని తానేనని ఆయన అనుకుంటున్నారనేది స్పష్టమే. జరగనున్న ఈ అనివార్య పరిణామం గోడ మీద కనిపిస్తుండగా ఇష్కియా చిత్రంలోని అర్షాద్ వార్సీ సలహాను ఎవరు మాత్రం పాటించరు? కాళ్లకు బుద్ధి చెప్పి వెంటనే ఇక్కడి నుంచి పలాయనం చిత్తగిద్దాం. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
‘బురఖా తనిఖీకి మహిళా పోలీసులను పెట్టండి’
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోనకిలీ ఓట్లను అరికట్టడంలో భాగంగా బురఖా ధరించి వచ్చే ఓటర్లను తనిఖీ చేసేందుకు మహిళా పోలీసులను ఏర్పాటు చేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. సమస్యాత్మక పోలింగ్ బూత్ల వద్ద పారా మిలిటరీ దళాలను కూడా మోహరించాలంది. ఈ మేరకు ముఖ్య ఎన్నికల అధికారి నజీం జైదీకి బీజేపీ ఒక వినతిపత్రం సమర్పించింది. దీనివల్ల నకిలీ ఓట్లు పడవని బీజేపీ తెలిపింది. ఉత్తరప్రదేశ్లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుండగా ఇప్పటికే ఐదు దశలు పూర్తయ్యాయి. మరో రెండు దశలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న నిరాశ, నిస్పృహతోనే బీజేపీ ఇలాంటి ఫిర్యాదులు చేస్తోందని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న శివసేన ఆక్షేపించింది. -
కాదేదీ గుర్తులకనర్హం!
న్యూఢిల్లీ: బెంచీలు, బెలూన్లు, బేబీ వాకర్లు, బెల్టులు.. వీటన్నింటికీ ఉన్న సంబంధం ఏంటో తెలుసా? తమ వద్ద నమోదై గుర్తింపు పొందని రాజకీయ పార్టీల కోసం ఎన్నికల సంఘం విడుదల చేసిన 164 గుర్తుల్లో ఇవి ఉన్నాయి. ఎన్నికల గుర్తుల ఉత్తర్వులు (రిజర్వేషన్, కేటాయింపులు)–1968 ప్రకారం ఈ గుర్తులను ఏదో ఒక పార్టీకి రిజర్వ్ చేయవచ్చు. ఈసీ జనవరి 11న విడుదల చేసిన నోటిఫికేషన్లో ఇంకా అల్మారా, బ్లాక్ బోర్డు, గ్యాస్ పొయ్యి, సిలిండర్, గ్రామ్ఫోన్, ద్రాక్ష, టై, నెయిల్ కట్టర్, అగ్గిపెట్టె, నూడిల్ బౌల్, ప్రెషర్ కుక్కర్, రోడ్ రోలర్ వంటి గుర్తులున్నాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం 1,837 నమోదై గుర్తింపు పొందని పార్టీలున్నట్లు ఈసీ తెలిపింది. -
పెళ్లిపెద్దపై నిప్పులు చెరిగిన డింపుల్ యాదవ్
తనకు అఖిలేష్ యాదవ్తో దగ్గరుండి పెళ్లి చేయించిన పెళ్లిపెద్ద అమర్సింగ్ మీద సీఎం భార్య డింపుల్ యాదవ్ నిప్పులు చెరిగారు. అలాంటి మనుషుల మాటలను తాను లెక్కచేసేది లేదని స్పష్టం చేశారు. కనీసం తన పిల్లలను టీవీలో కూడా అమర్ సింగ్ ముఖం చూడనిచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలుస్తుందని తాను ఒకసారి ములాయం సింగ్ యాదవ్కు చెప్పినట్లు అమర్ సింగ్ అన్న విషయాన్ని ప్రస్తావించగా, అలాంటి మనుషులను తాను పట్టించుకోనని, టీవీలో ఆయన ముఖం వస్తే వెంటనే టీవీ కట్టేస్తానని, తన పిల్లలకు కూడా ఆయన ముకం టీవీలో చూపించబోనని డింపుల్ అన్నారు. అఖిలేష్ యాదవ్కు, ఆయన తండ్రి ములాయంకు మధ్య తగాదాలకు అమర్ సింగే ప్రధాన కారణమన్న వాదన ఒకటి ఉంది. అమర్ను మళ్లీ పార్టీలోకి తీసుకోవడాన్ని అఖిలేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాతే పార్టీలో ముసలం మొదలైంది. మైనర్పై సామూహిక అత్యాచారం చేశారన్న ఆరోపణలున్న గాయత్రీ ప్రజాపతిని కాపాడేందుకు సమాజ్వాదీ పార్టీ ప్రయత్నిస్తున్న విషయాన్ని ఆమెను అడగ్గా.. అది వాస్తవం కాదని, తాము చట్టాన్ని గౌరవిస్తామని, నేరం చేసినవాళ్లు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. -
వారికి భంగపాటు తప్పదు: ఒవైసీ
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎస్పీ, బీజేపీలకు భంగపాటు తప్పదని ఎఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఎస్పీ, కేంద్రంలో బీజేపీ మూడేళ్ల పాలనలో పాలనతో పాటు మతసామరస్యం, ఉద్యోగ కల్పనలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం బీఎస్పీతో ఎంఐఎం కలిసి పనిచేస్తుందా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడేమీ చెప్పలేమని వ్యాఖ్యానించారు. మార్చి 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరమే ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుందన్నారు. -
బేరసారాల కోసం కొత్త ఆట
ఓటమి తప్పదని ఎస్పీ, బీఎస్పీకి అర్థమైంది ► అందుకే హంగ్ రావాలని కోరుకుంటున్నాయి ► హంగ్ వస్తే అధికారం కోసం బేరసారాలు ఆడాలనేది వారి ఆలోచన ► ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మావు(యూపీ): ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ముందుగానే ఊహించిన ఎస్పీ, బీఎస్పీ కొత్త ఆటకు తెర తీశాయని, యూపీలో హంగ్ రావాలని కోరుకుంటున్నాయని, తద్వారా అధికారంకోసం బేరసారాలు ఆడొచ్చనేది వారి ఆలోచన అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. ‘‘యూపీలో మూడో దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎస్పీ, బీఎస్పీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశాలు లేవని అర్థమైపోయింది. దీంతో వారు కొత్త ఆట, సరికొత్త ఎత్తుగడను ప్రారంభించారు. ఒకవేళ తాము ఓడిపోయినా.. లేదా సీట్ల సంఖ్య తగ్గినా.. ఎవరికీ మెజారిటీ రాకూడదని కోరుకుంటున్నాయి’’ అని చెప్పారు. సోమవారం యూపీలోని మావు పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఎస్పీ, బీఎస్పీ నాయకులకు నేను చెప్పేదొకటే. బీజేపీని ఓడించడానికి మీరు ఏమైనా చెయ్యండి. దానితో ఎటువంటి సమస్యా లేదు. కానీ యూపీ భవిష్యత్తుతో మాత్రం ఆటలాడొద్దు. యూపీ ఇప్పటికే చాలా కష్టాలను ఎదుర్కొంది. హంగ్ అసెంబ్లీ వస్తే బేరసారాలు ఆడేందుకు అవకాశం వస్తుందని మీరు ఆలోచిస్తున్నారేమో.. కానీ యూపీ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఇచ్చిన విషయాన్ని మరిచిపోవద్దు. ఈ ఎన్నికల్లో కూడా యూపీ ప్రజలు బీజేపీకి ఘన విజయాన్ని కట్టబెడతారు’’ అని చెప్పారు. ఎన్నికల ప్రకటన వెలువడగానే ఎస్పీ అధికారం పోతుందనే ఆందోళనతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుందని, అయితే కాంగ్రెస్ మునిగిపోయే పడవ అని, దానితో పాటు ఎస్పీ కూడా మునిగిపోతుం దని, కాంగ్రెస్, ఎస్పీ కలసి మీడియా కవరేజీతో ప్రజలను ఏమార్చాలనుకుంటే కుదరదని చెప్పారు. ప్రజలకు పాలను.. నీటినీ ఎలా వేరు చేయాలో తెలుసన్నారు. ఎన్నికలు ప్రారంభమైన తర్వాత తమకు మూడింట రెండొంతుల మెజారిటీ వస్తుందని కాంగ్రెస్–ఎస్పీ నేతలు చెప్పారని, కానీ మూడో దశ పూర్తయ్యేసరికి వారికి వాస్తవం అర్థమైందని, మెజారిటీ మాట పక్కన పెట్టి తమకు మరో అవకాశం ఇస్తే.. తప్పులను సరిచేసుకుంటామని చెపుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు పూర్తి మెజారిటీ వచ్చినా సరే మిత్రపక్షాలను కలుపుకునే యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం వల్లే ప్రపంచం మొత్తం భారతదేశాన్ని కీర్తిస్తోందని, ఇదే విధంగా యూపీలోనూ బీజేపీకి పూర్తి మెజారిటీ ఇస్తే దేశం మొత్తం యూపీని కీర్తించేలా చేస్తామని హామీ ఇచ్చారు. -
గణాంకాలు కీలకం
జీడీపీ, పీఎంఐ గణాకాలు ⇒ వాహన విక్రయ వివరాలు ⇒ యూపీ ఎన్నికలపై ఇన్వెస్టర్ల ఆసక్తి న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), సేవల, తయారీ రంగానికి సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్ను నడిపిస్తాయని విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు, డాలర్తో రూపాయి మారకం, విదేశీ పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడల ప్రభావం కూడా మార్కెట్పై ఉంటుందని వారంటున్నారు. విలీనాలు, షేర్ల బైబ్యాక్ ప్రకటనలు, వివిధ రంగాల వారీ వార్తల ప్రభావం స్టాక్మార్కెట్పై ఉంటుందని జైఫిన్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నేవ్గి చెప్పారు. మంగళవారం జీడీపీ గణాంకాలు 2016 డిసెంబర్ క్వార్టర్(క్యూ3) జీడీపీ గణాంకాలు ఈ మంగళవారం(ఫిబ్రవరి 28) కేంద్రం వెల్లడిస్తుంది. అదే రోజు కీలకమైన ఎనిమిది పరిశ్రమల పనితీరుకు సంబంధించిన గణాంకాలు కూడా వస్తాయి. ఇక బుధవారం(మార్చి 1న) ఫిబ్రవరి నెల వాహన విక్రయాల గణాంకాలు వెలువడతాయి. దీంతో వాహన షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. ఫిబ్రవరిలో భారత తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలను మార్కిట్ ఎకనామిక్స్ సంస్థ బుధవారం వెలువరించనున్నది. ఇక భారత సేవల రంగం పీఎంఐ గణాంకాలను ఈ సంస్థ శుక్రవారం(మార్చి3న) వెల్లడిస్తుంది. ఇంధన ధరల సవరణ నేపథ్యంలో బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓఎల్ వంటి ప్రభుత్వ రంగ మార్కెటింగ్ కంపెనీల షేర్లు, జెట్ ఎయిర్వేస్, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, స్పైస్జెట్వంటి విమానయాన కంపెనీల షేర్లు వెలుగులోకి రావచ్చు. యూపీపై దృష్టి... దేశీయంగా ఎలాంటి ప్రధాన సంఘటన లేనందున ఈ వారం మార్కెట్ నిస్తేజంగా ఉండొచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా అంచనా వేస్తున్నారు. అందుకని ప్రధానంగా అంతర్జాతీయం సంకేతాల ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్టాక్ సూచీల్లో కరెక్షన్ జరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఇన్వెస్టర్లు ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపై దృష్టిపెట్టారని వివరించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తే, మార్కెట్లో ర్యాలీ వస్తుందని పేర్కొన్నారు. మార్కెట్ భవితవ్యాన్ని తేల్చడానికి ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అబ్నిష్ కుమార్ సుధాంశు చెప్పారు. యూపీతో పాటు జరిగిన ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 11న వస్తాయి. నిఫ్టీ 9,016 పాయింట్ల నిరోధాన్ని దాటగలిగితే మరింతగా ముందుకు వెళుతుందని, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్(రిటైల్ రీసెర్చ్) దీపక్ జసాని చెప్పారు. ఒకవేళ 8,809 మద్దతు కోల్పోతే బలహీనపడుతుందని వివరించారు. విదేశీ పెట్టుబడులు ఎట్రూ.14,638 కోట్లు పన్ను అంశాల్లో స్పష్టత కారణంగా ఈ నెలలో విదేశీ పెట్టుబడులు జోరుగా ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) మన క్యాపిటల్ మార్కెట్లో నికరంగా రూ.14,638 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఈ నెలలో మరో రెండు ట్రేడింగ్ సెషన్లు మిగిలిఉన్నందున పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలో ఇప్పటిదాకా ఎఫ్పీఐలు మన స్టాక్స్లో రూ.9,359 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.5,279 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు. -
దూషణలపర్వంలో కొత్త రికార్డు
లక్నో: ఉత్తరప్రదేశ్లో అయిదో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు తమ నోటికి పనిచెప్పారు. వ్యక్తిగత దూషణల్లో తామెవరికీ తక్కువ కాదని నిరూపించారు. యూపీలో మొత్తం 11 జిల్లాల్లోని 51 నియోజకవర్గాలకు శనివారంతో ఎన్నికల ప్రచారం పూర్తైంది. ఈ నెల 27న పోలింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ నుద్దేశించి ‘గుజరాత్ గాడిదలకు ప్రచారం చేయకండి’ అని పరోక్షంగా మోదీని విమర్శించడంపై మండిపడ్డ కమలనాథులు గాడిదలకున్నంత విశ్వాసం అఖిలేశ్కు లేదని మండిపడ్డారు. బహ్రీచ్ బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ గాడిదలంటే అఖిలేశ్కు భయమెందుకో? అని చురకలంటించారు. 125 కోట్ల దేశ ప్రజలే తన యజమానులనీ, వారికోసం గాడిదలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తానని మోదీ ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీలను ‘కసబ్’గా అభివర్ణించడంతో, అమిత్ షా కంటే పెద్ద కసబ్ (ఉగ్రవాది) దేశంలోనే లేరని బీఎస్పీ చీఫ్ మాయావతి కౌంటరిచ్చారు. అఖిలేశ్ కూడా కసబ్లో ‘క’ అంటే పావురమనీ (కబూతర్), ఈ ఎన్నికల్లో బీజేపీ పావురాన్ని ప్రజలు వదిలించుకుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
యూపీలో నాలుగో దశ పోలింగ్ ప్రారంభం
లక్నో: ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న నాలుగోదశ సాధారణ ఎన్నికల పోలింగ్పై ఉత్కంఠ నెలకొంది. నాలుగో విడతలో మొత్తం 53 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలైంది. దాదాపు 1.84 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదే ప్రాంతాల్లో 2012 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరు నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపొందింది. ఈసారి సమాజ్వాదీ పార్టీతో జతకట్టిన కాంగ్రెస్ మరిన్ని సీట్లు తమ ఖాతాలో వేసుకోవడానికి సాయశక్తులా ప్రచారకార్యక్రమాలు నిర్వహించింది. -
సుప్రీం తీర్పును ఉల్లంఘించిన మాయావతి
లక్నో/గోండా: కులమతాల పేరుతో ఓట్లు కోరడం చట్టవిరుద్ధమన్న సుప్రీం కోర్టు తీర్పును బీఎస్పీ చీఫ్ మాయావతి ఉల్లంఘించారు. ముస్లింలు ఎస్పీకి కాకుండా తమ పార్టీకి ఓటేయాలని మంగళవారం ఎన్నికల సభల్లో కోరారు. ‘మీరు ఎస్పీకి ఓటేస్తే అది వ్యర్థం కావడమే కాకుండా పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూర్చే అవకాశముంది’ అని అన్నారు. యూపీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ, ప్రధాని మోదీ కులమతాల రంగు పులిమారని ఆమె ఓ ప్రకటనలో ఆరోపించారు. ప్రతి గ్రామంలో ఖబరస్తాన్, శ్మశానం ఉండాలన్న మోదీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ ఏర్పాటు చేసి, తర్వాత యూపీ గురించి మాట్లాడాలని అన్నారు. -
‘గాడిదలకున్న విశ్వాసం నీకు లేదుగా’
లక్నో: గుజరాత్ గాడిదలకోసం ప్రచారం చేయొద్దంటూ ప్రధాని నరేంద్రమోదీపై పరోక్షంగా విమర్శలు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్పై గుజరాత్కు చెందిన బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం కన్నతండ్రి సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్పైనే అఖిలేశ్ తిరగబడ్డారని విమర్శించారు. గాడిదలు అఖిలేశ్ యాదవ్ మాదిరిగాకాదని, అవి చాలా విశ్వసనీయమైనవని, అలాంటి జంతువుల నుంచి అఖిలేశ్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని గుజరాత్ బీజేపీ చీఫ్ జితు వాఘని అన్నారు. గుజరాత్ పర్యాటకం కోసం బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారాన్ని ఉటంకిస్తూ గుజరాత్ గాడదలకోసం ప్రచారం ఆపేయండంటూ అఖిలేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సంబంధిత వార్తలకై చదవండి.. ‘గుజరాత్ గాడిదలకు ప్రచారం ఆపండి' -
ములాయంపై అమర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
లక్నో: సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్పై అమర్సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సమాజ్వాది పార్టీ సంక్షోభం అంతా కూడా ములాయం సింగ్ ఆడిన ఓ డ్రామా అని వ్యాఖ్యానించారు. కొడుకు అఖిలేశ్ను ముఖ్యమంత్రిని చేసేందుకే ఆ డ్రామా అడారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాది పార్టీ పొత్తుకు కారణం ములాయం సింగే అని కూడా ఆయన ఆరోపించారు. అంతేకాదు, ములాయం సింగ్ పెద్ద స్క్రిప్ట్ రైటర్ కూడా అంటూ చతుర్లు విసిరారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల ముందు సమాజ్వాది పార్టీలో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తాను అసలు పదవినే ఆశించనని, పోటీ కూడా చేయననే ములాయం తనకు గుండెలాంటివాడని ఆయన ఏం చెబితే అది చేస్తానంటూ చెప్పిన అమర్ సింగ్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
కుంటి సాకులు వెతికేందుకే బీజేపీపై బురద
దిగ్విజయ్ వ్యాఖ్యలను ఖండించిన లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్–సమాజ్వాదీలను ఓడించేందుకు మజ్లిస్ పార్టీని బీజేపీ ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్సింగ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఖండించారు. బీజేపీ కోసమే ఎంఐఎం పోటీ చేస్తోందని దిగ్విజయ్ ఆరోపణలు చూస్తుంటే యూపీలో సమాజ్వాదీ–కాంగ్రెస్ కూటమి ఓటమిని అంగీకరిం చడమేనని, కుంటి సాకులు వెతికేందుకే బీజేపీపై బురద చల్లుతున్నారని విమర్శించారు. గత ఆరు దశాబ్దాలుగా మజ్లిస్ను, ఆ పార్టీ దౌర్జన్యాలను, హింసను ఎదుర్కొం టూ ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ చరిత్ర రాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలుసని, మజ్లిస్తో మున్సిపల్ కార్పొరేషన్ మొదలుకుని పార్లమెంట్ ఎన్నికల వరకు గత 60 ఏళ్లుగా పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న విషయం అందరికీ తెలుసన్నారు. -
‘గుజరాత్ గాడిదలకు ప్రచారం ఆపండి'
-
మోదీ దెబ్బకు రేప్ ఆరోపణల మంత్రి మాయం
అమేథి: ప్రధాని నరేంద్రమోదీ చేసిన విమర్శలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్పై వెంటనే ప్రభావం చూపించాయి. సోమవారం అమేథిలో ప్రచారానికి వెళ్లిన అఖిలేశ్ లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రి ప్రజాపతి ఉన్న వేదికను పంచుకోలేదు. అంతేకాదు, ప్రచారంలో ఆయన పేరును కూడా ఉపయోగించకుండానే ప్రజలను ఓట్లు అడిగారు. తొలుత సభావేదికపైనే గాయత్రి ప్రజాపతి ఉన్నప్పటికీ అఖిలేశ్ వచ్చే సమయంలో మాత్రం అక్కడి నుంచి మాయమయ్యారు. ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళతాయనే కారణంతోనే అఖిలేశ్ ఆయనను దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది. తనపై, తన మైనర్ కూతురుపై ప్రజాపతి ఆయన సమూహం లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ కేసులు పెట్టింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసులు పెట్టేందుకు నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. అనంతరం కోర్టు ఆదేశించిన తర్వాతే కేసు నమోదు చేశారు. ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. అంతకుముందు అక్రమ మైనింగ్లకు పాల్పడ్డాడని కూడా ప్రజాపతిపై ఆరోపణలు ఉన్నాయి. రేపిస్టులను స్వేచ్ఛగా వదిలేశారు. న్యాయంకోసం మహిళలు సుప్రీంకోర్టు తలుపులు తడుతున్నారు. మీరు ఏం పనిచేస్తున్నారు అఖిలేశ్ జీ?మీ మంత్రి(ప్రజాపతి) లైంగిక దాడి కేసులో ఉన్నాడు. మీరు వెళ్లి ఆయన తరుపున ప్రచారం చేస్తున్నారు. ఇది చేయాల్సిన పని కాదు’ అని ప్రధాని మోదీ ఘాటుగా విమర్శించారు. ఈ నేపథ్యంలో సోమవారంనాటి ప్రచారంలో అఖిలేశ్ తన మంత్రిని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. -
‘గుజరాత్ గాడిదలకు ప్రచారం ఆపండి'
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం పీక్ స్టేజ్కు వెళుతోంది. ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతలనే టార్గెట్ చేసుకుంటూ వెళుతున్న ప్రచారాలు ఏకంగా ప్రాంతాల వారిగా వెళుతోంది. గుజరాత్ గాడిదలకు ప్రచారం ఆపేయండంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు సూచించారు. ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేసే ఉద్దేశంతో అఖిలేశ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గుజరాత్ గాడిదల కోసం ఓ వాణిజ్య ప్రకటన ఉంది. ఆ ప్రకటనలో నటించి గొప్ప బాలీవుడ్ నటుడు(అమితాబ్ బచ్చన్)కి నేనొక విన్నపం చేసుకుంటున్నాను. గుజరాత్ గాడిదలకు ప్రచారం కల్పించకండి’ అని ఉత్తరప్రదేశ్లోని ఎన్నికల ర్యాలీలో కాస్తంత వివాదాస్పదంగా సూచించారు. రాష్ట్ర అటవీ జంతు సంపదకు సంబంధించి గుజరాత్ టూరిజం శాఖ అమితాబ్ బచ్చన్ను నటుడుగా తీసుకొని వాణిజ్య ప్రకటనలు తీసుకొంది. గుజరాత్లోని రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలోని వణ్యమృగ ప్రాణుల సంరక్షణతోపాటు పర్యాటనకు ఆహ్వానిస్తూ అమితాబ్ ఇందులో నటించారు. ఆ జంతువుల్లో గాడిదలు కూడా ఉన్నాయి. గత కొద్ది రోజులగా మోదీపై విసురుగానే విమర్శలు చేస్తున్న అఖిలేశ్ ఈ ప్రకటన ఆధారంగా మరోసారి మోదీపై పరోక్షంగా విమర్శలు చేశారు. అయితే, గుజరాత్ ఆస్తులకు బచ్చన్ ప్రచారం చేయొద్దని చెప్పడమే తన ఉద్దేశం అని మరోసారి మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది. మరో విశేషమేమిటంటే అమితాబ్ బచ్చన్ భార్య జయాబచ్చన్ సమాజ్వాది పార్టీలో సభ్యురాలు. -
యూపీలో బీజేపీ గెలిచే పరిస్థితులు స్వల్పమే!
సాక్షితో సీపీఐ నేత అజీజ్ పాషా సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిచే పరిస్థితులు స్వల్పం గానే ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ అజీజ్ పాషా అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, దాని పర్యవసానాల ప్రభావం ఈ ఎన్ని కలపై తప్పక పడుతుందని పేర్కొన్నారు. తమ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా యూపీలో పర్యటిస్తున్న అజీజ్ పాషా అక్కడి నుంచే సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. వామపక్షాలుగా సీపీఐ 69 సీట్లలో, సీపీఎం 31 సీట్లలో, ఎస్యూసీఐ, ఇతర పక్షాలు మరో 30 సీట్లు కలుపుకుని మొత్తం 130 సీట్లలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో సీపీఐకి 7, 8 సీట్లలో విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. -
‘అనుమానం వద్దు.. అఖిలేశే సీఎం’
-
అఖిలేశ్కు భయం పట్టుకుంది!
ఫతెపూర్: ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలను కాపాడటంలో సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్లో గూండారాజ్ నడుస్తున్నదని, సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకొని ఒక మంత్రిని రేప్ కేసులో బుక్ చేయించిందని ఆయన పేర్కొన్నారు. మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతిపై ఎఫ్ఆర్ఐ నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫతేపూర్ సభలో ఆయన మాట్లాడుతూ యూపీ సీఎం అఖిలేశ్పై విరుచుకుపడ్డారు. ’అఖిలేశ్ ముఖం కళ తప్పింది. ఆయన స్వరం బలహీనపడింది. ఆయన భయపడుతున్నారు. మీడియాతో మాట్లాడేటప్పుడు సరైన పదాల కోసం తడబడుతున్నారు’ అని మోదీ పేర్కొన్నారు. అఖిలేశ్ ఇప్పటికే ఓటమిని అంగీకరించారని చెప్పారు. ప్రజల మానప్రాణాలకు భద్రత కల్పించే ప్రభుత్వానికి ఓటు వేయాలంటూ ఆయన ఓటర్లను కోరారు. -
‘అనుమానం వద్దు.. అఖిలేశే సీఎం’
లక్నో: ఉత్తరప్రదేశ్కు మళ్లీ అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని, ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాల్లేవని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ మూడో దశ ఎన్నికల సందర్భంగా సఫాయ్ నియోజకవర్గంలో తన కోడలు అపర్ణాయాదవ్తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మళ్లీ అఖిలేశ్ సీఎం అన్నారు. తన సోదరుడు శివపాల్ యాదవ్ కూడా భారీ మెజార్టీతో గెలుస్తాడంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. మరోపక్క అఖిలేశ్ కూడా తాజా ఎన్నికలపై స్పందిస్తూ ఈసారి కూడా విజయం తమకే వస్తుందని చెప్పారు. ఎస్పీ-కాంగ్రెస్ కూటమి భారీ విజయం సాధించనుందని అన్నారు. బీజేపీ దెబ్బతినడం ఖాయమని తెలిపారు. తన తండ్రి ములాయం ఆశీస్సులు తనకు నిండుగా ఉన్నాయని, మళ్లీ అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. -
యూపీ రెండో దశలో 65% పోలింగ్
-
యూపీ రెండో దశలో 65% పోలింగ్
ఉత్తరాఖండ్లో రికార్డు స్థాయిలో68% లక్నో: ఉత్తరప్రదేశ్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఒకే విడత ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. యూపీలో తాజా విడతలో 65 శాతం పోలింగ్, ఉత్తరాఖండ్లో రికార్డు స్థాయిలో 68 శాతం పోలింగ్ నమోదైంది. యూపీలోని బిజ్నోర్, మొరాదాబాద్, రాంపూర్, బరేలీ తదితర 11 జిల్లాల్లోని 67 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి, ఎస్పీ నేత ఆజం ఖాన్, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద సహా మొత్తం 721 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తల్లి కాజ్మీ(115) కుటుంబ సభ్యులతో కలసి బరేలీలో ఓటు వేశారు. ఈ నెల 11న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 64.2 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తరాఖండ్లో 2 శాతం ఎక్కువ.. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో నమోదైన 68 శాతం పోలింగ్ 2012 ఎన్నికల నాటి పోలింగ్(66 శాతం) కంటే రెండు శాతం ఎక్కువ. రాష్ట్ర చరిత్రలో ఇదే భారీ పోలింగ్. రాష్ట్రంలోని మొత్తం 70 అసెంబ్లీల స్థానాలుండగా కర్ణప్రయాగ్ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి చనిపోవడంతో 69 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కర్ణప్రయాగ్లో మార్చి 9న ఎన్నికలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ రెండు స్థానాల(హరిద్వార్ రూరల్, కిచ్చా) నుంచి బరిలోకి దిగారు. ఓటు సరిగ్గా పడినట్లు ఓటరుకు ధ్రువీకరణ పత్రాలిచ్చే వీవీపీఏటీ యంత్రాలను తొలిసారి రాణిపూర్, ధరమ్పూర్, రుద్రపూర్లలో వినియోగించారు. -
అఖిలేశ్ సక్సెస్ కోసం ఆ నలుగురు
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఒకరినిమించి మరొకరు ప్రచారంతో ప్రజల మధ్యకు దూసుకెళ్లేందుకు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా మోదీ ఎంతటి విస్తృత ప్రచారం చేస్తారో తెలియని విషయం కాదు. ఇప్పుడు అఖిలేశ్ కూడా అదే మార్గంలో మరింత వేగంగా ముందుకెళ్లాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా ఓ యువబృందాన్ని సిద్ధం చేశారు. వారు ఇప్పటికే అమెరికా వెళ్లి హిల్లరీ ఎలాంటి ప్రచార వ్యూహాలకు దిగారు వాటిని అధ్యయనం చేసి తిరిగొచ్చారు. ఇప్పుడు యూపీ రెండో దశ ఎన్నికల కోసం వారు పూర్తి స్థాయిలో పనిచేయనున్నారు. ఇందులో భాగంగా వాళ్లు తొలుత ప్రారంభించనున్న తొలి అంశంపై ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్. ఇప్పటి నుంచి రెండో దశ ఎన్నికల వరకు మొత్తం 300 ర్యాలీల్లో అఖిలేశ్ పాల్గొననున్నారు. వీటన్నింటిని ఫేస్బుక్ లైవ్ ద్వారా అందించేందుకు మొత్తం పదిమందితో కూడిన టీం సిద్ధమైంది. వీరిలో గతంలో బీబీసీలో పనిచేసిన ఆశిష్ యాదవ్ ఇన్చార్జ్గా ఉండగా మనోజ్ యాదవ్ అనే వ్యక్తి ప్రచారానికి కావాల్సిన పాటలు రాసే పనికి దిగాడు. గోజూప్ సీఈవో అహ్మద్ అఫ్తాబ్ నఖ్వీ డిజిటల్ వ్యూహకర్తగా ఉన్నాడు. ఇక హర్వార్డ్ యూనివర్సిటీకి చెందిన అన్షుమాన్ శర్మ రీసెర్ఛ్ వింగ్ను చూసుకోనున్నాడు. ఇప్పటికే వాట్సాప్ ద్వారా 25లక్షలమందితో ప్రతి రోజు కాంటాక్ట్లో ఉన్నారంట. అంతేకాదు, సోషల్ మీడియా విభాగాలైన యూట్యూబ్, ఇన్స్టాగ్రమ్, ఇతర వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లువంటి వాటితో కూడా ఒప్పందాలు కుదుర్చుకొని ముందుకెళుతున్నట్లు తెలిసింది. అచ్చం డోర్ టూ డూర్ టూర్లాగే సోషల్ మీడియా ద్వారా అఖిలేశ్ ప్రచారాన్ని, ఆయన కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళుతున్నామని వారు చెప్పారు. -
ఆరు నెలల్లో కటకటాల్లోకి...
అధికారంలోకి వస్తే అసాంఘిక శక్తుల్ని అణచివేస్తాం ► అధికారంతో అఖిలేశ్ కళ్లు మూసుకుపోయాయి.. ► ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ లఖింపూర్ ఖేరి: కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని అఖిలేశ్ చూడలేకపోతున్నారని, అధికారంతో ఆయన కళ్లు మూసుకుపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి అధికారమిస్తే ఆరు నెలల్లో అసాంఘిక శక్తుల్ని అణచివేస్తామని హామీనిచ్చారు. యూపీలోని లఖింపూర్ ఖేరిలో సోమవారం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ... గత ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారో అఖిలేశ్ చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ‘మన్ కీ బాత్’ను పరోక్షంగా విమర్శిస్తూ... ‘కామ్ కీ బాత్’ (ఉపయోపడే అంశం) గురించి మోదీ ఎప్పుడు మాట్లాడతారని అఖిలేశ్ ప్రశ్నించడాన్ని ప్రధాని తిప్పికొట్టారు. ‘ఆయన (అఖిలేశ్) అధికార గర్వంతో కళ్లు మూసుకుపోయి కేంద్రం చేసిన అభివృద్ధిని చూడలేకపోతున్నారు’ అని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దయనీయ స్థితిలో ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని, జైళ్ల నుంచే గ్యాంగ్లు కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. ‘కిడ్నాపులు, అల్లర్లు కూడా ఎక్కువయ్యాయి. ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి?’ అని ప్రశ్నించారు. పొత్తుతో పాపాలు కడుక్కోలేరు.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక అవకాశమివ్వాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘మాకొక అవకాశమివ్వండి... కత్తులు, పిస్తోలు వాడేవారిని ఆరు నెలల్లో కటకటాల్లోకి నెడతాం. చెరకు రైతుల బకాయిలు 14 రోజుల్లోగా చెల్లిస్తాం’ అని హామీనిచ్చారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని చేసిన పాపాల్ని ఎస్పీ ప్రభుత్వం కడిగేసుకోలేదన్న విషయం మొదట దశ ఎన్నికల సరళిని బట్టి చూస్తే స్పష్టమైందన్నారు. బీఎస్పీ హయాంలో కుంభకోణాలపై విచారణ జరుపుతామన్న అఖిలేశ్ హామీలు ఏమయ్యాయని మోదీ ప్రశ్నించారు. మెట్రోపై తప్పుదారి పట్టిస్తున్నారు.. సోషలిస్టు నేతలు రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్లు జీవితాంతం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడారని, ఇప్పుడు ఆ పార్టీతో జతకలసి వారిని అవమానించారని మోదీ పేర్కొన్నారు. లక్నో మెట్రో ప్రాజెక్టుపై అఖిలేశ్ ప్రచారాన్ని విమర్శిస్తూ...‘మెట్రో స్టేషన్ ఇంకా నిర్మాణంలో ఉండగా ఏ రైలైనా నడుస్తోందా? ఇది ప్రజల్ని తప్పుదారి పట్టించడమే’నని చెప్పారు. వారి తీరుతో విసిగిపోయారు: అమిత్ షా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీఎం అఖిలేశ్ల తీరుతో యూపీ ప్రజలు విసిగిపోయారని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా విమర్శించారు. సంభాల్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ‘ఒకరితో అతని తల్లి నిరాశచెందితే... మరొకరు తండ్రిని ఇబ్బందిపెట్టారు’ అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. రేడియో అద్భుత సాధనం: మోదీ న్యూఢిల్లీ: సమాజంతో సంభాషించేందుకు, నేర్చుకునేందుకు, సంబంధాలు కొనసాగించేందుకు రేడియో ఓ అద్భుతమైన సాధనమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సోమవారం ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధాని ట్విటర్లో స్పందించారు. ‘రేడియో ప్రేమికులకు శుభాకాంక్షలు. ఈ రంగంలో పనిచేసేవారు రేడియోను పునరుజ్జీవింపచేసేందుకు మరింత గొప్పగా ముందుకెళ్లేందుకు ప్రయత్నించాలి. సమాజంతో అనుసంధానమయ్యేందుకు రేడియో గొప్ప సాధనం. మన్ కీ బాత్ కార్యక్రమంలో రేడియో ద్వారానే భారతీయులకు దగ్గరవుతున్నాను’ అని రెండు వేర్వేరు ట్వీట్లలో మోదీ తెలిపారు. -
రూ.20 కోట్ల నగదు, రూ.14 కోట్ల లిక్కర్ సీజ్
లక్నో: అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న ఏడు దశల ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ శనివారం ముగిసింది. నేడు జరిగిన తొలిదశ పోలింగ్లో 63 శాతం మంది ప్రజలు తమ ఓటింగ్ హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి దశ 73 నియోజకవర్గాలు ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. ఈ తొలి దశ పోలింగ్ నేపథ్యంలో పట్టుబడ్డ నగదు, బంగారం, డ్రగ్ వివరాలను కూడా ఎన్నికల సంఘం మీడియాకు విడుదల చేసింది. మొత్తం రూ.19.56 కోట్ల నగదు, రూ.96.93 లక్షల విలువైన డ్రగ్, రూ.4.44 లక్షల లీటర్ల లిక్కర్, రూ.14 కోట్ల బంగారం, వెండిని సీజ్ చేసినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. అదేవిధంగా 13 పెయింట్ న్యూస్ కేసులను గుర్తించినట్టు పేర్కొంది. ఈ ఎన్నికల నేపథ్యంలో 3,888 డిజిటల్, వీడియో కెమెరాలను ఎన్నికల సంఘం ఏర్పాటుచేసింది. 2,8577 ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ను చేపట్టింది. -
దిశ చూపే ‘పశ్చిమం’!
కీలకంగా తొలి దశ పోలింగ్ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ నిర్ణయాత్మకమైనది. పశ్చిమ యూపీలోని 15 జిల్లాల్లో 73 సీట్లకు శనివారం జరిగే తొలి విడత పోలింగ్ సరళి ప్రభావం మిగిలిన దశల పోలింగ్పై ఉంటుందని రాజకీయపక్షాలు, విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న పశ్చిమ యూపీకి కొన్ని ప్రత్యేకతలున్నాయి. రాష్ట్రంలో ముస్లింల జనాభా 18 శాతం ఉండగా, ఇక్కడ అది 26 శాతం. మాజీ ప్రధాని చరణ్సింగ్, ఆయన కొడుకు ఆరెల్డీ నేత అజిత్సింగ్ వంటి నేతల జాట్ సామాజికవర్గం ఉన్నదీ ఇక్కడే. రైతుల విషయంలో పాలకపక్షం విధానాలు ఇక్కడి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. నరేంద్ర మోదీ గాలి వీచిన 2014 ఎన్నికల్లో ఇక్కడి మొత్తం పది లోక్సభ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రాంతీయపక్షాలు ఎస్పీ, బీఎస్పీలకు 24 సీట్ల చొప్పున దక్కగా, బీజేపీ 11 సీట్లతో సరిపెట్టుకుంది. జాట్ల ఓట్లే పునాదిగా ఉన్న ఆరెల్డీకి 9, కాంగ్రెస్కు 5 సీట్లు లభించాయి. గతంలో ఎస్పీకి లాభం.. 2012లోనూ యూపీ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు ఈ ప్రాంతంలోనే జరిగాయి. ఆ దశలో ఓట్లు సమాజ్వాదీ పార్టీకి పడ్డాయంటూ జరిగిన ప్రచారం మిగతా విడతల పోలింగ్పై కనిపించిందని విశ్లేషకులు నిర్ధారించారు. ఎస్పీ మిగిలిన దశల్లో మరింత బాగా పుంజుకుని రికార్డు స్థాయిలో 224 స్థానాలు కైవసం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ‘పశ్చిమ’ ఓటు ప్రభావం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందనేది కీలకాంశంగా మారింది. నవంబర్, డిసెంబర్లో ఎస్పీ యాదవ పరివారంలో జరిగిన కీచులాటలు చివరికి సుఖాంతమవడంతో ఈ పార్టీకి జనాదరణ పెరుగుతోందని వార్తలొస్తున్నాయి. ‘అఖిలేశ్ మంచివాడేగాని, చివరి రెండేళ్లలోనే బాగా పనిచేశాడు’అ ని ఈ ప్రాంతంలో కొందరంటున్నారు. తగ్గిన బీజేపీ హవా..: ప్రస్తుతం ఇక్కడ బీజేపీకి అంత జనాదరణ కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్తో తొలిసారి చేతులు కలిపిన ఎస్పీ, ఒంటరిగా బరిలో ఉన్న బీఎస్పీ బలాన్ని వారు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. బీసీల్లో ప్రధాన వర్గమైన యాదవుల జనాభా పశ్చిమ యూపీలో నామమాత్రం కావడంతో ఎస్పీకి విజయావకాశాలు తక్కువ. బీఎస్పీకి పునాదివర్గమైన దళితుల్లోని చమార్లు(జాటవ్లు) ఈ ప్రాంతంలో ఎక్కువ. రాష్ట్రంలోని మొత్తం దళితుల్లో ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు. ఈ పార్టీ చీఫ్ మాయావతి తల్లిదండ్రులు ఇక్కడి ఘజియాబాద్ జిల్లాకు చెందినవారు. 2013లో జరిగిన ముజఫర్నగర్ మతఘర్షణల వల్ల పార్లమెంటు ఎన్నికల్లో జాట్లతోపాటు మెజారిటీ హిందూ ఓటర్లు కమలానికి ఓటేశారు. జాట్లకు బీసీ హోదా దక్కకపోవడం, రైతు సమస్యలు తీరకపోవడంతో గ్రామీణులు బీజేపీకి దూరమయ్యారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘మార్చి 11న వారి పాలనకు శుభంకార్డే’
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే మార్చి 11న సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వంశపరిపాలనకు శుభం కార్డు పడుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జోస్యం చెప్పారు. శుక్రవారం ఎతవాహ్లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ పరిపాలన చేపట్టి ఏడాదిలోనే తాము యూపీని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఎస్పీ, బీఎస్పీ విఫలమయ్యాయని ఆరోపించారు. రాకుమారులు(అఖిలేశ్, రాహుల్ గాంధీ) అన్ని తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని, ఇప్పటికే యూపీలో సర్వం దోచారని, ప్రతి రంగంలో అవినీతి పేరుకుపోయిందని మండిపడ్డారు. ఉత్తరభారతంలో హత్యలు ఎక్కువగా జరిగే రాష్ట్రం యూపీనే అని, శాంతిభద్రతలు పూర్తిగా ఇక్కడ నశించాయని, ఒకే వంశ పాలనకు త్వరలోనే ముగింపు రానుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారం వస్తుందనే నమ్మకం లేకనే కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్నారని, ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే రైతులనుంచి నేరుగా విత్తనాలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. -
‘పెళ్లి చేస్తారంట.. నా లైఫ్కు ఇదే చివరి ఫైట్’
లక్నో: ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కనిపించడం అరుదు.. అది కూడా శాంతియుత వాతావరణం ఉన్న ప్రాంతాల్లో అలా బ్యాలెట్ పేపర్లో నామమాత్రంగా కనిపిస్తుంటారు. అయితే, వారు గెలుపొందిన సందర్భాలు లేకపోలేదు.. అచ్చం అలాంటి భావనతోనే ఇటీవల కాస్తంతా ఆలోచన ఉన్న యువత ప్రత్యర్థులు ఎంతటి బలవంతులైనా భయపడకుండా స్వశక్తితో ముందడుగేయడం, ఇండిపెండెంట్గా పోటీచేయడం చేస్తున్నారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో కూడా అలాంటి పరిస్థితి దర్శనం ఇచ్చింది. పెళ్లి చేసి తమ బాధ్యతలు తీర్చుకోవాలనుకుంటున్న తల్లిదండ్రుల వాదనతో పక్కకు జరిగి ప్రస్తుత ఎన్నికల్లో ఓ యువతి ఇండిపెండెంట్గా బరిలోకి దిగింది. కేవలం ఇంట్లో ఓ పది వేలు తీసుకెళ్లి నామినేషన్ వేసింది. తన ఆస్తులు 32వేలు అని అఫిడవిట్లో పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. వందన శర్మ(25) అనే యువతి ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగింది. వాస్తవానికి ఆమె అలా చేయడంపై తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే, వారు కూడా ఆమెకు మద్దతివ్వడం లేదు. అయితే, ఆమె సోదరుడు మాత్రం తనతో ఉన్నాడు. చుట్టుపక్కలవారు ఆమె చైతన్యాన్ని చూసి ముచ్చటపడుతున్నారు. ఈ నేపథ్యంలో వందనను ఓ మీడియా కలవగా ‘నా తల్లిదండ్రులు పెళ్లి చేసి వారి బాధ్యత తీర్చుకోవాలని అనుకుంటున్నారు. నాకు మాత్రం ఇదే చివరి ప్రయత్నం. నన్ను నేను నిరూపించుకోవాలని అనుకుంటున్నాను. మా గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు లేవు. కాలేజీలు దగ్గర్లో లేవు. ఇప్పటికీ అమ్మాయిలకు తోడుగా పురుషులు వెళ్లాల్సిందే. ఆరు దాటితే బయటకొచ్చే పరిస్థితి లేదు. ఇది 21వశతాబ్దం. ఈ పరిస్థితి మారాలి’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
ద్వేషపూరిత నేరాలకు ప్రత్యేక చట్టం
యూపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ లక్నో: విద్వేషపూరిత నేరాల కట్టడికి నూతన చట్టం తీసుకొస్తామని బుధవారం విడుదల చేసిన యూపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అలాగే మహిళలు, ఓబీసీలు, మైనారిటీలపై కూడా వరాల జల్లు కురిపించింది. విభజన శక్తులను ఎదుర్కొనేందుకే కాంగ్రెస్–ఎస్పీ కూటమిగా ఏర్పడ్డాయని పేర్కొంది. ఎస్పీతో పొత్తు పెట్టుకోవడాన్ని దేశ రాజకీయ చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా అభివర్ణించింది. బీజేపీ విద్వేష, విభజనపూరిత ఎజెండా ప్రతి ఎన్నికల్లోనూ స్పష్టమౌతోందని పేర్కొంది. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు.. కులం, మతం పేరుతో ఘర్షణలు రేపే వారికి కఠిన శిక్షలు విధించేలా ప్రత్యేక చట్టం. పోలీస్ అంబుడ్స్మన్ నియామకం. బాలికలకు స్కాలర్షిప్లు ఇవ్వడంతో పాటు 18 ఏళ్లు వచ్చే నాటికి రూ.50 వేల– రూ.లక్ష అందించేలా ‘కన్య సశక్తికరణ్ యోజన’ అమలు. పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. రైతులకు, చేనేతలకు రుణాలు. 50 లక్షల మంది యువతకు ఉద్యోగాలు. -
సమాజ్వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ
లక్నో: అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా పార్టీకి సంబంధించిన అన్ని పదవుల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు తన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ములాయంసింగ్ యాదవ్లకు పంపినట్లు ట్విటర్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆయన అధికార ప్రతినిధి పదవితోపాటు పార్టీ జాతీయ లీగల్ సెల్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, రాజీనామాకు గల కారణాలను భాటియా పేర్కొనలేదు. పార్టీ ఆశయాలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదంపై రాజీ పడలేక పోతున్నట్లు తెలిపారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని భాటియా స్పష్టం చేశారు. ‘నా తండ్రి దివంగత వీరేంద్ర భాటియా.. సమాజ్వాదీ పార్టీకి, ప్రభుత్వానికి ఎంతో సేవ చేశారు. నాకు నేతాజీ(ములాయం), అఖిలేశ్ ఇద్దరూ ముఖ్యమే. వారిద్దరికీ నా రాజీనామా లేఖలు పంపాన’ని గౌరవ్ తెలిపారు. -
అలక తుస్.. ఇక ప్రచార హోరులో పెద్దాయన
న్యూఢిల్లీ: అనుకున్నదే అయింది. సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అలక పూర్తిగా పోయింది. చిన్నచితక అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. రేపటి నుంచి ప్రచార రంగంలోకి ఆయన దూకుతున్నారు. అది కూడా పూర్తి సంతృప్తితో.. తమ పార్టీ పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ విషయంలో కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ‘ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మా కూటమి విజయం సాధిస్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. కూటమి గెలిస్తే అఖిలేశ్ సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి’ అని ములాయం సోమవారం పార్లమెంటులో చెప్పారు. ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ ఎస్పీతో విభేదించి ఎన్నికల తర్వాత కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న అంశంపై ప్రశ్నించగా ‘అతను ఎలా కొత్త పార్టీ పెడతారు? ఒక వేళ మాట్లాడి ఉంటే ఏదో కోపంలో అనుంటాడు. పార్టీని విడిచి పెట్టి నాసోదరుడు ఎక్కడికీ వెళ్లడు. నేను కూడా రేపటి నుంచి ప్రచారంలోకి దిగుతాను’ అని స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్-ఎస్పీ కూటమి విషయంలో ములాయం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన ప్రచారంలోకి కూడా వెళ్లకపోవచ్చని వార్తలు వచ్చాయి. అయితే, వాటన్నంటికీ ముగింపు పలుకుతూ ములాయం తాజా నిర్ణయం ప్రకటించారు. -
'ఎన్నికలయ్యాక తలాక్పై కీలక నిర్ణయం'
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత త్రిపుల్ తలాక్పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఆయన ఓ పత్రికా సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ తలాక్ వ్యవస్థ ముస్లిం మహిళల గౌరవానికి విలువ ఇవ్వడం లేదని, దానిని రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 'ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత తలాక్ విధానంపై కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది' అని ఆయన అన్నారు. సమాజంలో దుశ్చేష్టలకు ముగింపు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మూడు పాయింట్లపై కేంద్రంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. ఈ విషయానికి మతానికి సంబంధం లేదని, ఇది ఒక మహిళ గౌరవానికి సంబంధించిన విషయం అని తేల్చి చెప్పారు. అన్ని వర్గాల విశ్వాసాలను, నమ్మకాలను కేంద్రం గౌరవిస్తుందని, ఆ పేరిట చేసే దుశ్చర్యలకు మాత్రం అనుమతించబోదని అన్నారు. -
‘యూపీ విధ్వంసానికే యువరాజులు’
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్వాది పార్టీ అధినేత ములాయం కుమారుడు సీఎం అఖిలేశ్పై విమర్శల దాడి ఎక్కుపెట్టారు. ఈ ఇద్దరు యువరాజులు ఉత్తరప్రదేశ్ను ధ్వంసం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. గతంలో ఒకరు దేశాన్ని దోచేశారని(కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ), మరొకరు రాష్ట్రాన్ని దోచేశారని (ఎస్పీని ఉద్దేశిస్తూ) ఆ పార్టీలకు చెందిన వీరిద్దరు(రాహుల్, అఖిలేశ్) ఇప్పుడు ఉత్తరప్రదేశ్పై పడ్డారని, ఈ ఒక్కసారి మాత్రం వారిని పక్కకు పెట్టేసి బీజేపీకి అధికారం అప్పగించాలని ఆయన యూపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీరట్లో రెండు కిలో మీటర్ల పొడవునా సాగిన రోడ్ షోలో అమిత్షా మాట్లాడారు. మరోపక్క, ఈ రోజే ఎస్పీ, కాంగ్రెస్ కూటమి ఆగ్రా నుంచి 240 కిలోమీటర్ల మేర రోడ్షో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్షా స్వల్పవ్యవధిలో మాట్లాడుతూ అటు ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు బీఎస్పీపై మాటల దాడికి దిగారు. ‘సీఎం అఖిలేశ్, ఆయన కూటమి ఉత్తరప్రదేశ్లో నెలకొన్న అశాంతి పరిస్థితులకు సమాధానం చెప్పాలి. వారేం యూపీని అభివృద్ధి పథాన తీసుకెళ్లేందుకు ముందుకెళ్లడం లేదు. ఇప్పటి వరకు దేశాన్ని లూటీ చేశారు.. ఇప్పుడు యూపీపై పడ్డారు. ఇంకా చెప్పాలంటే వారు యూపీని ధ్వంసం చేయాలనుకుంటున్నారు’ అని అమిత్షా ఆరోపించారు. ఈసారి సైకిల్ను బద్ధలు కొట్టేయాలని, బీఎస్పీ నుంచి యూపీని కాపాడాలని ఆయన కోరారు. -
యూపీలో రగులుతున్న అసమ్మతి!
టికెట్ పంపకాలపై బీజేపీలో అసంతృప్తి.. ఆరెస్సెస్ గుస్సా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో టికెట్ పంపకాలపై బీజేపీలో అసమ్మతి రగులుతోంది. టికెట్ పంపకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందంటూ బీజేపీ, ఆరెస్సెస్లోని ఓ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య దిష్టిబొమ్మలు తగలబెట్టడం, లక్నోకు వస్తుండగా షా వాహనాన్ని అడ్డుకోవడం, ఫైజాబాద్ బీజేపీ ఎంపీని, జిల్లా అధ్యక్షుడిని అయోధ్యలో కార్యకర్తలు గృహనిర్బంధం చేయడం.. ఈ అసమ్మతి సెగలకు తిరుగులేని సాక్ష్యంగా నిలుస్తోంది. పార్టీ శ్రేణుల నుంచి ఇంతటి తిరుగుబాటు చర్యలను ఎప్పుడూ చూడలేనది పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆరెస్సెస్కు యూపీలో ఆరు రాష్ట్ర యూనిట్లు ఉన్నాయి. ఇందులో నాలుగు యూనిట్లు టికెట్ల పంపకాల్లో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర అసమ్మతి వ్యక్తం చేసినట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో పనిచేసే పార్టీ శ్రేణులను విస్మరించి.. ఇతర పార్టీలనుంచి వచ్చిన బయటి వ్యక్తులకు, నేతల బంధుగణానికే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చారంటూ ఆరెస్సెస్ గుస్సా అవుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్లాల్, ఆరెస్సెస్-బీజేపీ సమన్వయ ఇన్చార్జి కృష్ణగోపాల్ అసమ్మతి వర్గాలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నా.. అది సఫలం కావడం లేదని తెలుస్తోంది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ గెలుపునకు కృషి చేయాలని వారు చెప్తున్నా.. ఆ వర్గాలు వినే ప్రసక్తి లేదని సమాచారం. తూర్పు యూపీ ఆరెస్సెస్ క్షేత్ర ప్రచారక్ శివ్ నారాయణ్ బీజేపీ అభ్యర్థులతో సమావేశానికి నిరాకరిస్తున్నట్టు సమాచారం. ఆయన పరిధిలో 263 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన రీటా బహుగుణ జోషీ తన నియోజకవర్గంలో సహకరించాల్సిందిగా కసోరుతూ శివ్నారాయణ్ను కలిసేందుకు ప్రయత్నించినా ఆయన నిరాకరించినట్టు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపులో బీజేపీ తమ సలహాను తీసుకున్నా.. దానిని ఏమాత్రం పాటించలేదని, మొదట పార్టీ శ్రేణులకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యమిస్తామని, ఆ తర్వాత బయటి వ్యక్తులకు, నేతల బంధుగణాలకు టికెట్లు ఇస్తామని చెప్పిన ఆ పార్టీ.. చివరకు దానికి పూర్తి విరుద్ధంగా పనిచేసిందని ఆరెస్సెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆరెస్సెస్ నుంచి, బీజేపీలోని అసమ్మతి వర్గాల నుంచి ఇలా నిరసనజ్వాలలు ఎగిసిపడుతుండటంతో బీజేపీ అధినాయకత్వానికి కొంత తలనొప్పిగా మారింది. ఈ అసమ్మతిని చల్లార్చేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. -
ములాయం చిన్న కోడలి సంపదెంతో తెలుసా!?
లక్నో: సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ తొలిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడిన సంగతి తెలిసిందే. లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఆమె మూడో దఫా ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. సోమవారం ఆమె సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. తనకు, తన భర్త ప్రతీక్ యాదవ్కు మొత్తం రూ. 22.95 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. తమ ఆస్తుల్లో రూ. 5.23 కోట్లు విలువచేసే అత్యంత ఖరీదైన లాంబోర్గినీ వాహనం కూడా ఉందని వెల్లడించారు. ఇది తన భర్త పేరిట ఉందని, తనకు వ్యక్తిగతంగా ఎలాంటి వాహనం లేదని పేర్కొన్నారు. తనకు రూ. 1.88 కోట్ల విలువచేసే నగలు ఉన్నాయని తెలిపారు. ఇక తన భర్త ప్రతీక్ రూ. 4.5 కోట్ల రుణాన్ని గోమతినగర్కు చెందిన యూనియన్ బ్యాంక్ ఇండియా శాఖ నుంచి తీసుకున్నారని పేర్కొన్నారు. తన పేరిట ఎలాంటి పెట్టుబడులు, పోస్టల్ సేవింగ్స్, బీమా పాలసీలు లేవని, కానీ తన భర్త రూ. 7.96 లక్షల విలువచేసే బీమా పాలసీలు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి దంపతులిరువురు ఆదాయపన్ను చెల్లించినట్టు తెలిపారు. ఎస్పీలో తలెత్తిన ములాయం అంతర్గత కుటుంబపోరుతో అపర్ణ యాదవ్ ప్రముఖంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. శివ్పాల్ యాదవ్ వర్గం వ్యక్తిగా పేరొందిన అపర్ణ ఎస్పీని తన చేతుల్లోకి తీసుకొని ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని కలలు కంటున్నట్టు కథనాలు కూడా వచ్చాయి. ఆమె ఈసారి బలమైన అభ్యర్థి రీటా బహుగుణ జోషీ (బీజేపీ)ని లక్నో కంటోన్మెంట్ స్థానంలో ఎదుర్కొంటుండటంతో అందరి చూపు ఇక్కడి పోటీపైనే నెలకొని ఉంది. -
ప్రియాంక రాక తప్పదా?
సాక్షి నాలెడ్జ్ సెంటర్ : ‘రాజకీయాలపై నాకు పెద్ద మోజేమీ లేదు. వాటి జోలికిపోకుండానే ప్రజలకు మేలు చేయగలను’ అని కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ జనాకర్షక నేత ప్రియాంకా గాంధీ అన్నారు. అయితే మారిన పరిస్థితుల్లో ఆమె రాజకీయాల్లోకి రావడమే కాదు, క్రియాశీలంగానూ పనిచేయనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆశించినన్ని సీట్లు రాని ప్రతిసారీ ‘ప్రియాంకా లావో, కాంగ్రెస్కో బచావో’ కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతూనే ఉన్నారు. తెర వెనుక రాజకీయం! యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుతో దెబ్బతిని పల్చన కాకుండా కాంగ్రెస్ను కాపాడడానికి 4 నెలల క్రితమే ప్రియాంక క్రియాశీల పాత్ర స్వీకరించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధతపై అక్టోబర్లో జరిగిన కాంగ్రెస్ సమీక్షా భేటీకి అధ్యక్షత వహించారు. మాజీ క్రికెటర్, బీజేపీ మాజీ ఎంపీ నవజోత్సింగ్ సిద్ధూను జనవరి 15న కాంగ్రెస్లో చేర్పించడంలో ఆమె కీలకపాత్ర పోషించారని వార్తలొచ్చాయి. తర్వాత వారం తిరగకుండానే యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీపార్టీ(ఎస్పీ)తో కాంగ్రెస్కు సీట్ల సర్దుబాటు కుదర్చడంలోనూ ఆమె ముఖ్య భూమిక పోషించారు. ఆమె కనౌజ్ ఎంపీ, యూపీ సీఎం అఖిలేశ్ భార్య డింపుల్తో, సీఎంతో మాట్లాడి కాంగ్రెస్కు 105 సీట్లిచ్చేలా ఒప్పించారని కాంగ్రెస్ నేతలే మీడియాకు తెలిపారు. సోనియా అనారోగ్యం వల్ల 2019 పార్లమెంటు ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ప్రియాంక పోటీచేస్తారని వార్తలొస్తున్నాయి. ఇందిర రూపం! ముక్కు, జుట్టు విషయంలో ఇందిరతో ప్రియాంకకు పోలికలున్నాయని అంటారు. ఇందిర గొప్ప వక్త కాదు. ప్రియాంక కూడా బాగా ఆకట్టుకునేలా మాట్లాడకపోయినా, కాంగ్రెస్ను, తన కుటుంబాన్ని, భర్త వ్యాపార లావాదేవీలను సమర్ధిస్తూ చక్కగా ప్రసంగించిన సందర్భాలున్నాయి. 1999 ఎన్నికల్లో తొలిసారి పోటీచేసిన తల్లికి మద్దతుగా ప్రియాంక అమేథీలో తొలిసారి ప్రచారం చేశారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో రాయ్బరేలీలో తల్లి సోనియా తరఫున, అమేథీలో సోదరుడు రాహుల్ తరఫున ప్రచార బాధ్యత భుజానవేసుకున్నారు. 2014 ఎన్నికల్లో రాహుల్ లక్షా ఏడు వేల ఓట్ల తేడాతోనైనా గెలవడం ప్రియాంక వల్లే సాధ్యమైందని తేలింది. ముందున్న అడ్డంకులు ప్రియాంక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికున్న అడ్డంకులేంటి? భర్త రాబర్ట్ వాద్రా యూపీఏ అధికారంలో ఉన్నకాలంలో గాంధీ కుటుంబం అధికారం ఉపయోగించుకుని స్థిరాస్తి వ్యాపారంలో లబ్ధిపొందారనే చెడ్డపేరు తెచ్చుకున్నారు. ప్రియాంక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే, భర్తపై వచ్చిన అభియోగాలను గుదిబండలా మోయక తప్పదు. రాజకీయాల్లో క్రియాశీల పాత్రతో ప్రియాంక నిలదొక్కుకున్నాక మరో సమస్య తలెత్తే ప్రమాదముంది. భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వం, పార్టీ నాయకత్వాలను అన్నాచెల్లెళ్లు పంచుకోవడం కూడా అనుకున్నంత తేలిక కాదు. ఇద్దరి మధ్య పోటీ తప్పకపోవచ్చు. ప్రియాంక కుటుంబ సభ్యులు ప్రధానులుగా దేశాన్ని ఏలిననాటి పరిస్థితులు ఇప్పుడు దేశంలోనూ, యూపీలోనూ లేవు. నిరంతర పోరాటం, పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే వివేకం, వ్యక్తిగత కృషితోనే ఏ నేతయినా పైకి రావాల్సిన స్థితి. ఈ నేపథ్యంలో ఎస్పీ–కాంగ్రెస్ కూటమికి అధికారం, కాంగ్రెస్కు తగినన్ని సీట్లు వచ్చేలా చేయగలిగితేనే ప్రియాంక అనే రాజకీయ ‘కార్డు’కు గుర్తింపు. ఆ స్థానాల్లో పోటీ: ములాయం లక్నో: ఉత్తరప్రదేశ్లో ఎస్పీ–కాంగ్రెస్ పొత్తుపై ములాయం సింగ్ యాదవ్ ఆగ్రహం కొనసాగుతోంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్కు కేటాయించిన 105 స్థానాల్లో పోటీ చేయాలంటూ తన అనుచరులకు ములాయం సోమవారం పిలుపునిచ్చారు. ‘ఆ 105 స్థానాల్లోని సమాజ్వాదీ కార్యకర్తలేమైపోవాలి? పార్టీ ఇలా నాశనం కావడాన్ని నేను చూస్తూ ఉండలేను. కాంగ్రెస్కు పోటీగా ఎస్పీని నిలిపేందుకు జీవితకాలం కృషి చేశాను. ఈ పొత్తు వల్ల సమాజ్వాదీ పార్టీ నాశనం అవుతుంది’ అని ములాయం వ్యాఖ్యానించారు. -
ఉత్తరప్రదేశ్లో...
బీజేపీదే గెలుపు! టైమ్స్ నౌ–వీఎంఆర్ సర్వే న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 202 సీట్లు ౖకైవసం చేసుకోగలదని టైమ్స్ నౌ–వీఎంఆర్ సర్వేలో తేలింది. ఎన్నికల్లో 34% ఓట్లు బీజేపీకి దక్కుతాయని సర్వే పేర్కొంది. ఇక, ఎస్పీ–కాంగ్రెస్ కూటమి కేవలం 147 సీట్లు గెలుచుకోగలదని, కూటమికి 31శాతం ఓట్లుపడతాయని సర్వే వెల్లడించింది. ముస్లిం ఓట్లపై ఆశలుపెట్టుకున్న మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి కేవలం 47సీట్లు వస్తాయంది. బీఎస్పీకి 24శాతం ఓట్లు దక్కుతాయని పేర్కొంది. అజిత్సింగ్కు చెందిన రాష్ట్రీయ లోక్దళ్, ఇతర పార్టీలకు ఏడు సీట్లు దక్కుతాయని తెలిపింది. అత్యంత పాపులారిటీ ఉన్న సీఎంగా అఖిలేశ్ యాదవ్ తొలిస్థానంలో నిలిచారు. 39% మంది అఖిలేశ్కు మద్దతుపలికారు. 23% మంది మద్దతుతో మాయావతి రెండోస్థానం పొందారు. ఎస్పీ కూటమిదే! ది ఏబీఎన్–సీఎస్డీఎస్ సర్వే న్యూఢిల్లీ: యూపీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ–కాంగ్రెస్ కూటమి 187–197 సీట్లు సాధించగలదని ది ఏబీఎన్ న్యూస్–సీఎస్డీఎస్–లోక్నీతి తాజా ఒపీనియన్ పోల్ ఫలితాల్లో తేలింది. ఈ కూటమికి 35శాతం ఓట్లుపడతాయంది. ఈ సర్వే ఫలితాల ప్రకారం.. కాబోయే సీఎం అర్హత ఉన్న వ్యక్తిగా 26% మద్దతుతో అఖిలేశ్ మందునిలిచారు. ఇక 118–128సీట్లు బీజేపీకి దక్కే వీలుందని సర్వే చెబుతోంది. నోట్ల రద్దు అంశం రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వెల్లడైంది. నోట్లరద్దు నిర్ణయానికి మద్దతు గత నెలరోజుల్లో 35శాతం నుంచి 41శాతానికి చేరింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 76–86సీట్లు రావచ్చు. బీజేపీకి మద్దతుపలికే 21శాతం మంది సంప్రదాయ ఓటర్లు సైతం ఈసారి ఎస్పీ–కాంగ్రెస్ కూటమికీ ఓట్లేసే వీలుంది. -
రాజకీయాల్లో ఇక ప్రియాంక క్రియాశీలం?
'రాజకీయాలంటే నాకు పెద్ద మోజు లేదు. జనమంటే ఇష్టం. నేను రాజకీయాల్లో లేకుండానే ప్రజలకు మేలు చేయగలను'అంటూ కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ యువ నేత ప్రియాంకా గాంధీ వాద్రా అన్న మాటలు అప్పటికి సబబే అనిపిస్తాయి. భారత రాజకీయాల్లో 'మొదటి కుటుంబం' అయిదో తరం సభ్యురాలిగా ప్రియాంకకు ఉన్న ఆకర్షణ శక్తిని కాంగ్రెస్ వారితోపాటు మీడియా వ్యాఖ్యాతలు 20 ఏళ్లుగా ప్రస్తావిస్తూనే ఉన్నారు. అయినా ఆమె రాజకీయాల్లోకి లాంఛనంగా చేరలేదు. 1999 నుంచీ లోక్సభ ఎన్నికల్లో తల్లి, సోదరుడి నియోజకవర్గాలు రాయ్బరేలీ, అమేధీలో క్రమం తప్పకుండా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తూనే ఉన్నారు. దేశంలో, యూపీలో కాంగ్రెస్కు ఆశించినన్ని సీట్లురాని ప్రతిసారీ 'ప్రియాంకా లావో, కాంగ్రెస్కో బచావో' అని నెహ్రూగాంధీ కుటుంబం పుట్టినిల్లు అలహాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. తెర వెనుక రాజకీయం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుతో దెబ్బతిని జనంలో పల్చన కాకుండా కాంగ్రెస్ను కాపాడడానికి నాలుగు నెలల క్రితమే ప్రియాంక క్రియాశీల పాత్ర స్వీకరించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధతపై అక్టోబర్ చివరి వారంలో జరిగిన కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఆరు నెలల క్రితం బీజేపీకి రాజీనామా చేసి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎటుపోవాలో తేల్చుకోలేక గందరగోళంలో ఉన్న మాజీ క్రికెటర్, అమృత్సర్ మాజీ ఎంపీ నవజ్యోత్సింగ్ సిద్ధూను జనవరి 15న కాంగ్రెస్లో చేర్పించడంలో ప్రియాంక కీలకపాత్ర పోషించారని వార్తలొచ్చాయి. తర్వాత వారం తిరగకుండానే యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ నేతత్వంలోని సమాజ్వాదీపార్టీ(ఎస్పీ)తో కాంగ్రెస్కు సీట్ల సర్దుబాటు కుదర్చడంలో కూడా ఆమె ముఖ్య భూమిక పోషించారు. ఆమె కనౌజ్ ఎంపీ, యూపీ సీఎం అఖిలేశ్ భార్య డింపుల్తో, సీఎంతో మాట్లాడి కాంగ్రెస్కు 105 సీట్లిచ్చేలా ఒప్పించి, పొత్తును కాపాడారని కాంగ్రెస్ నేతలే మీడియాకు తెలిపారు. రాయ్బరేలీ, అమేధీలోని పది అసెంబ్లీ స్థానాలకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా, కుదిరితే డింపుల్తో కలిసి ప్రచారంలో ప్రియాంక పాల్గొంటారని కూడా చెబుతున్నారు. తల్లి సోనియాకు 70 ఏళ్లు నిండడమేగాక, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా 2019 పార్లమెంటు ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ఆమె పోటీచేస్తారని వార్తలొస్తున్నాయి. ప్రియాంక ఇష్టం.... ముత్తాత జవహర్లాల్ నెహ్రూ, నాయనమ్మ ఇందిరాగాంధీ ఇద్దరూ పదిహేనేళ్ల చొప్పున ప్రధాని పదవిలో ఉన్నారు. 40 సంత్సరాలకే ప్రధాని అయిన తండ్రి హత్యకు గురైన కారణంగా ఆయన ఐదేళ్లే ఉన్నత పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 2004లో ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తల్లి సోనియా పదవి తీసుకోవడానికి నిరాకరించారు. అప్పటి నుంచీ రాహుల్ మన్మోహన్సింగ్ కేబినెట్లో మంత్రిగా చేరతారని అనుకున్నారు. ఎందుకో యూపీఏ మొదటి హయాంలో ఆయన ఆ పనిచేయలేదు. యూపీఏ–2లోనూ మంత్రి పదవి వద్దనుకున్న రాహుల్ తల్లి తీవ్ర ఆనారోగ్యం వల్ల కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి తీసుకున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ను ప్రధాని పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించకున్నా ఆయనే పార్టీ ప్రచారానికి నాయకత్వం వహించారు. ప్రియాంక ఎప్పటిలా అమేథీ, రాయ్బరేలీకే పరిమితమయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 సీట్ల అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాక, మళ్లీ కాంగ్రెస్లో ప్రియాంక పాట మొదలైంది. దానిపై, ‘కాంగ్రెస్ క్రియాశీల రాజకీయాల్లోకి రావడం, రాకపోవడం ప్రియాంక ఇష్టం. పిల్లలను పెద్దచేసే పనిలో ఉన్న ఆమెను బలవంతంగా రాజకీయాల్లోకి లాగడం సబబు కాదు’’ అంటూ సోనియా, రాహుల్తోపాటు పార్టీ సీనియర్ నేతలు పలు సందర్భాల్లో చెప్పారు. ఇందిర రూపం! 1997 ఫిబ్రవరిలో 25 ఏళ్ల వయసులో మొరాదాబాద్(పశ్చిమ యూపీ) వ్యాపారి రాబర్ట్ వాద్రాతో ఢిల్లీలో పెళ్లవక ముందు నుంచే ప్రియాంకలో ఇందిర పోలికల గురించి కాంగ్రెస్ నేతలు, మీడియా మాట్లాడడం మొదలైంది. ముక్కు, జుట్టు విషయంలో ఇందిరతో ప్రియాంకకు పోలికలున్నాయని అంటారు. ఇందిర గొప్ప వక్త కాదు. ప్రియాంక కూడా బాగా ఆకట్టుకునేలా మాట్లాడకపోయినా, కాంగ్రెస్ను, తన కుటుంబాన్ని, భర్త వ్యాపార లావాదేవీలను సమర్ధిస్తూ చక్కగా ప్రసంగించిన సందర్భాలున్నాయి. 5 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న ఈమెను స్ఫురద్రూపిగానే అందరూ అంగీకరిస్తారు. 1999 ఎన్నికల్లో తొలిసారి పోటీచేసిన తల్లికి మద్దతుగా ప్రియాంక అమేధీలో మొదటిసారి ప్రచారం చేశారు. మళ్లీ 2004లో రాయ్బరేలీ(సోనియా), అమేథీ(రాహుల్)లో, తిరిగి 2009లో ప్రియాంక ప్రచార బాధ్యత భుజానవేసుకోవడమేగాక, నియోజకర్గ ప్రజల పనులు చేయించడానికి తరచు రెండు చోట్లా పర్యటించేవారు. 2014 ఎన్నికల్లో అమేథీలో రాహుల్పై బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన నటి స్మతి ఇరానీ ముందు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆమె రాయ్బరేలీ వదలి అమేథీపైనే ఎక్కువ శ్రద్ధపెట్టి ప్రచారం చేశారు. అంతకు ముందు రెండుసార్లూ దాదాపు మూడు లక్షల మెజారిటీతో గెలిచిన రాహుల్ ఈసారి లక్షా ఏడు వేల ఓట్ల తేడాతోనైనా గెలవడం ప్రియాంక వల్లే సాధ్యమైందని తేలింది. ఇందిరకు లేని అడ్డంకులు ప్రియాంకు ఏమున్నాయి? తండ్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత 47 ఏళ్లకే కేంద్ర మంత్రి పదవి చేపట్టిన ఇందిర పోలికలున్న ప్రియాంకకు ఇప్పుడు 45 ఏళ్లు. మరి ప్రియాంక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికి ఉన్న అడ్డంకులేంటి? ప్రియాంక భర్త రాబర్ట్ యూపీఏ అధికారంలో ఉన్నకాలంలో గాంధీ కుటుంబం అధికారం ఉపయోగించుకుని స్థిరాస్తి వ్యాపారంలో లబ్ధిపొందారనే చెడ్డపేరు తెచ్చుకున్నారు. ప్రియాంక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే, భర్తపై వచ్చిన అభియోగాలను గుదిబండలా మోయక తప్పదు. రాజకీయాల్లో క్రియాశీల పాత్రతో ప్రియాంక నిలదొక్కుకున్నాక మరో సమస్య తలెత్తే ప్రమాదముంది. భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వం, పార్టీ నాయకత్వాలను అన్నా చెల్లెళ్లు పంచుకోవడం కూడా అనుకున్నంత తేలిక కాదు. నెహ్రూ కాలంలో ఆయన పెద్ద చెల్లెలు విజయలక్ష్మీ పండిత్ వివిధ దేశాల్లో భారత రాయబారిగా, చివరిగా మహారాష్ట్ర గవర్నర్గా మాత్రమే పనిచేశారు. కాంగ్రెస్ గెలుపులో తన పాత్రను నిరూపించుకున్నాక ప్రియాంక పైన చెప్పినట్టు విజయలక్ష్మ్రి పండిత్లా అలంకారప్రాయమైన పదవులకే పరిమితం కావడం కూడా కష్టమే. 1980లో ఇందిర చిన్న కొడుకు సంజయ్ మరణించాక, ఆయన స్థానాన్ని కోడలు మేనకకు ఇందిర ఇవ్వలేదు. ఫలితంగా 2009 నుంచీ లోక్సభలో నెహ్రూ–గాంధీ కుటుంబసభ్యులు ఇద్దరు(సోనియా, రాహుల్) కాంగ్రెస్కు, మిగిలిన ఇద్దరు(మేనక, ఫిరోజ్ వరుణ్) బీజేపీకి ప్రాతినిధ్యం వహించే పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్కు పూర్వవైభవం వస్తే రాహుల్, ప్రియాంక మధ్య ఎంత వద్దనుకున్నా పోటీ తప్పకపోవచ్చు. ఇందిర భర్త, ప్రఖ్యాత పార్లమెంటేరియన్ ఫిరోజ్గాంధీతో ప్రియాంక భర్త రాబర్ట్ను పోల్చలేము. ఎన్నోరకాల వ్యాపారాలున్న రాబర్ట్ కార్యకలాపాలు, జీవనశైలి భార్యను తప్పక ఇబ్బంది పెడతాయి. ఇతర పార్టీల నేతలు కూడా అన్నా చెల్లెళ్లను ఒకేలా చూస్తారని కూడా కాంగ్రెస్ ఆశించకూడదు. ఎస్పీ నేత ములాయంసింగ్ సోమవారం విమానంలో లక్నో నుంచి ఢిల్లీ వస్తూ తనతో మంచి సంబంధాలు లేని రాహుల్ గురించి ఒక్క మాట చెప్పలేదు. పియాంక ప్రస్తావన తెచ్చి ‘‘ఆమె చాలా తెలివైనది. నన్నెంతో గౌరవిస్తుంది.’’ అని ములాయం కితాబిచ్చారు. ఇలాంటి సందర్భాలు ఇక ముందు చాలా ఎదరౌతాయి. ప్రియాంక కుటుంబ సభ్యులు ప్రధానులుగా దేశాన్ని ఏలిననాటి పరిస్థితులు ఇప్పుడు దేశంలోనూ, యూపీలోనూ లేవు. నిరంతర పోరాటం, పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే వివేకం, వ్యక్తిగత కృషితోనే ఏ నేతయినా పైకి రావాల్సిన స్థితి. ఈ నేపథ్యంలో మొదట ఎస్పీ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసి తన పార్టీకి కనీసం మూడో వంతు సీట్లు(35), కూటమికి మెజారిటీ వచ్చేలా చేయగలిగితేనే ప్రియాంక అనే రాజకీయ 'కార్డు'కి గుర్తింపు లభిస్తుంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
యూపీ ఎన్నికల్లో బంధువులకే పెద్ద పీట
-
'వారు ఏజెంట్లుగా ఉండే ప్రమాదం.. తీసేయండి'
లక్నో: ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్న కొంతమంది సీనియర్ అధికారులను తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కొంతమంది సీనియర్ అధికారులను తొలగించాలని కేంద్రమంత్రి, బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో ఆయన శుక్రవారం ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి టీ వెంకటేశ్ను కలిశారు. యూపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, డీజీపీని తొలగిస్తే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని అందరికీ హామీ ఇచ్చినట్లవుతుందని అన్నారు. గత ఐదేళ్లుగా ఈ ఇద్దరు అధికారులు, ఇంకొంతమంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కింద పనిచేస్తున్నారని, వీరుంటే ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉండకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే వెంటనే వారిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే అధికార పార్టీకి ఏజెంట్లుగా పనిచేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నలుగురు సీనియర్ అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బందిగా వ్యవహరిస్తున్న వారిని అనుమానిస్తూ ఆయన వినతిపత్రం ఇచ్చారు. -
యూపీ ఎన్నికల్లో బంధువులకే పెద్ద పీట
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్న పాలకపక్ష సమాజ్వాది పార్టీ, భారతీయ జనతా పార్టీల అభ్యర్థుల ఎంపికలో బంధుప్రీతి స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని 403 సీట్లకుగాను భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు 371 మంది పేర్లను ప్రకటించగా, వారిలో 39 మంది నేతల సమీప బంధువులే ఉన్నారు. అంటే ప్రకటించిన అభ్యర్థుల్లో పది శాతానికి పైగా టిక్కెట్లు బంధువులకే వెళ్లాయన్నమాట. అభ్యర్థుల పేర్లను పరిశీలించినట్లయితే ఎవరి పలుకుబడి కారణంగా వారికి టిక్కెట్లు లభించాయో సులభంగానే గ్రహించవచ్చు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ బంధువు అనితా లోధి రాజ్పుత్, సందీప్ సింగ్లు అభ్యర్థుల్లో ఉన్నారు. కొడుకులకు, కూతుళ్లకు టిక్కెట్లు అడగవద్దని ఇటీవల ముగిసిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే పది శాతానికిపైగా బంధువులకు అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. నరేంద్ర మోదీని సంప్రదించకుండానే యూపీ అభ్యర్థులను ఎంపిక చేశారని అనుకోలేం. బంధువుల టిక్కెట్లకు ఆయన ఆమోదం తెలపడానికి నాయకుల ఒత్తిడికి తలొగ్గారా లేదా అట్లయితేనే యూపీ లాంటి రాష్ట్రంలో పార్టీ గెలుస్తుందని మోదీ భావించరా? అన్నది ఇక్కడ ముఖ్యం. పెద్ద నోట్ల రద్దు ప్రతికూల ప్రభావాన్ని చూపిన నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు ఒత్తిడికి మోదీ తలొగ్గే అవకాశం కూడా ఉంది. ఇక పాలకపక్ష సమాజ్వాది పార్టీ విషయానికొస్తే అసెంబ్లీ టిక్కెట్ల విషయంలో వారికి ముందుగా బంధువులు ముఖ్యం. ముందు నుంచి తాను వ్యతిరేకిస్తున్న బాబాయ్ శివపాల్ యాదవ్కు అఖిలేష్ యాదవ్ టిక్కెట్ ఇవ్వడమే కాకుండా పార్టీ బలంగా ఉన్న ఇటావా జిల్లా జశ్వంత్ నగర్ నుంచి నిలబెట్టడం విశేషం. ములాయం రెండో భార్య కుమారుడైన ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్గోపాల్ యాదవ్ మేనల్లుడు అంశూల్ యాదవ్కు టిక్కెట్ ఇచ్చారు. ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్లు కాకుండా ఇప్పటికే ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఇప్పటికే పార్టీ రాజకీయాల్లో ఉన్నారు. అలాగే పార్టీ సీనియర్ నాయకుడు ఆజమ్ ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజమ్, నరేష్ అగర్వాల్ కుమారుడు నితిన్ అగర్వాల్లకు ఇచ్చారు. మొత్తం జాబితాలో పార్టీ సీనియర్ నాయకులకు చెందిన 22 మంది బంధువులకు టిక్కెట్లు ఇచ్చారు. కోట్ల రూపాయలకు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని పార్టీలు విమర్శిస్తున్న బహుజన సమాజ్ పార్టీ సుప్రీం మాయావతి బంధుప్రీతికి దూరంగా ఉన్నారు. అందకు కారణం ఆమె రాజకీయ గురువు కాన్షీరామ్ బోధనల ప్రభావం కావచ్చు. ఆయనెప్పుడు తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లో ప్రోత్సహించలేదు. పైగా తన రాజకీయాల కోసం కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకున్నారు. ఆమె పార్టీలో 15 మంది అభ్యర్థులు మాత్రమే పార్టీ సీనియర్ నాయకుల బంధువులు ఉన్నారు. -
మోదీ కోసం కాంగ్రెస్ వేసిన స్కెచ్ ఇదే!
యూపీ ఎన్నికల కోసం వ్యూహం సిద్ధం లోకల్ కుర్రాళ్లు వర్సెస్ బయటి మోదీ ఇదే ఎస్పీ-కాంగ్రెస్ నినాదం లక్నో: అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. 'అప్నే లడ్కే, బహ్రీ మోదీ' (మన కుర్రాళ్లు వర్సెస్ బయటి మోదీ) నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించింది. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ బాస్ రాహుల్గాంధీలను స్థానిక కుర్రాళ్లుగా.. మోదీని బయటి వ్యక్తిగా అభివర్ణిస్తూ.. ఎన్నికల్లో బీజేపీని ఢీకొనాలని కాంగ్రెస్ స్కెచ్ వేసింది. యూపీలోని వారణాసి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్రమోదీ ఛరిష్మాపైనే బీజేపీ ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఎస్పీలో అంతర్గత కుటుంబపోరు ముగిసిన తర్వాత.. మంతనాలు, చర్చల అనంతరం ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల యువనేతలు ప్రధాన ఆకర్షణగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అంతేకాకుండా ఎస్పీ-కాంగ్రెస్ పొత్తుతో యూపీలో 18శాతం ఉన్న ముస్లింల ఓట్లు పూర్తిగా తమవైపు మొగ్గుతాయని ఆశాభావంతో ఉంది. ప్రచారంలో రాహుల్, అఖిలేశ్ కలిసి ప్రచారం చేసే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తున్న ఎస్పీ వర్గాలు.. ప్రియాంకగాంధీ, అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ కలిసి ప్రచారం చేసే అంశాన్ని మాత్రం కొట్టిపారేయడం లేదు. ప్రియాంక- డింపుల్ జోడీ 'నారీశక్తి'గా ప్రచారంలో కీలకంగా వ్యవహరించే అవకాశముంది. గత ఏడాది ఎన్నికల సమయంలో ఉచిత ల్యాప్టాప్లు, ఉద్యోగాలు, ఉచిత విద్య వంటి హామీలతో అధికారంలోకి వచ్చిన అఖిలేశ్ ఈసారి ఉచిత ప్రెషర్ కుక్కర్లు, స్మార్ట్ఫోన్లు వంటి హామీలతో మహిళలపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. యూపీ మహిళలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రియాంక-డింపుల్ ప్రచారం బాగా కలిసి వస్తుందని, ఇటు రాహుల్-అఖిలేశ్ లోకల్ ముద్ర కూడా బీజేపీకి చెక్ పెడుతుందని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా బరిలో కీలక పోటీదారుగా ఉన్నా మోదీ, బీజేపీ లక్ష్యంగానే ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ప్రచారం నిర్వహించనుందని తెలుస్తోంది. -
‘ఫ్యామిలీ డ్రామాతో వాటిని దాచలేరు’
వాస్కో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. మూడొంతుల మెజారిటీ తెచ్చుకుంటామని చెప్పారు. గోవాలోని వాస్కోలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సమాజ్ వాదీ పార్టీ పాలనకు చరమగీతం పాడేందుకు యూపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దుర్మార్గపు, అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలన్న ఉద్దేశంతో సమాజ్ వాదీ పార్టీలో ‘ఫ్యామిలీ డ్రామా’కు తెర తీశారని ఆరోపించారు. ‘అఖిలేశ్ యాదవ్ కు ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఫ్యామిలీ డ్రామాతో భూకబ్జాలు, గూండారాజ్, మాఫియా రాజ్, అవినీతిని దాచిపెట్టాలేరు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మూడొంతుల మెజారిటీతో బీజేపీ విజయం సాధిస్తుంద’ని అమిత్ షా పేర్కొన్నారు. కుంభకోణాలు, అసమర్థ పాలనతో ఉత్తరప్రదేశ్ వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు అదుపుతప్పాయని.. పేదల భూములు బలవంతంగా లాక్కున్నారని.. మహిళలకు భద్రత లేకుండా పోయిందని, రైతులు చితికి పోయారని ధ్వజమెత్తారు. -
అందులో శివపాల్ పేరు లేదు
సమాజ్వాద్ పార్టీలో తండ్రికొడుకుల మధ్య నెలకొన్న సైకిల్ సమరానికి సోమవారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రకటనతో తెరపడింది. కొడుకు అఖిలేష్కే సైకిల్ గుర్తు ఇస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించడంతో, ఇక నేతాజీ సైతం ఎన్నికల సంఘం నిర్ణయానికి తలొగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసీ ప్రకటన అనంతరం రెండో సారి తండ్రితో భేటీ అయిన ఎస్పీ చీఫ్, కొడుకు అఖిలేష్కు, ములాయం 38 అభ్యర్థులతో కూడిన ఓ జాబితాను సమర్పించినట్టు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో కొడుకుకు ఇష్టంలేని తన తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్ పేరును ములాయం చేర్చలేదని వెల్లడవుతోంది. కొడుకు వ్యతిరేకతతో తీవ్రంగా మనస్తాపం పొందిన సమయంలో నేతాజీకి వెన్నంటే ఉన్న శివ్పాల్ పేరును ములాయం తన అభ్యర్థుల జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. అయితే శివ్ పాల్ కొడుకు ఆదిత్య యాదవ్ పేరును మాత్రం నేతాజీ తన జాబితాలో చేర్చారు. అంతేకాక, ములాయం వారసత్వం కోసం పాకులాడుతున్న ఆయన చిన్న కోడలు అపర్ణ యాదవ్, ఓం ప్రకాశ్ సింగ్, నారద్ రాయ్, షదాబ్ ఫాతిమా, గాయత్రి ప్రసాద్ ప్రజాపతిలకు ములాయం తన జాబితాలో ప్రత్యేక స్థానం కల్పించినట్టు తెలుస్తోంది. అఖిలేష్కు వ్యతిరేకంగా పోటీకి దిగుతానని ఫైర్ అయిన ములాయం సింగ్, ఇక కొడుకు అభ్యర్థనకు తలొగ్గినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. సైకిల్ గుర్తు అఖిలేష్కే కేటాయిస్తు ఎన్నికల సంఘం ప్రకటించిన అనంతరం అఖిలేష్ తండ్రితో భేటీ అయి ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం మంగళవారం కూడా వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. రాష్ట్రంలో మరోసారి ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే తమ లక్ష్యమని అఖిలేష్ చెప్పారు. ప్రతిఒక్కర్ని తనతో కలుపుకుని పోటీ చేస్తామని పేర్కొన్నారు. నేతాజీని కూడా కలుపుకుని పోటీ చేస్తామని, తమ బంధుత్వం ఎన్నటికీ విడదీయరానిదని అఖిలేష్ అన్నట్టు తెలిసింది. -
ఆ పార్టీ ప్రచార బరిలో సినీ దిగ్గజాలు!
రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సినీ గ్లామర్ తోడయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ సినీస్టార్లను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా మంగళవారం బాలీవుడ్ ప్రముఖులు అర్జున్ రాంపాల్, జాకీష్రఫ్ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద కనిపించారు. ఈ ఇద్దరు నటులు కూడా పార్టీ కార్యాలయం బీజేపీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. అనంతరం బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయ నాయకుడిని కాదని, బీజేపీలో చేరే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశం కోసం మంచి పనులు చేస్తున్నదని, వాటికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రధాని మోదీ పథకాలైన స్వచ్ఛభారత్, పెద్దనోట్ల రద్దుకు తాను గట్టిగా మద్దతునిస్తున్నట్టు తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు తాను సిద్ధమేనంటూ సంకేతాలు ఇచ్చారు. -
యూపీ ఎన్నికల్లో మైనారిటీ మంత్రం
-
యూపీలో కాంగ్రెస్ ఒంటరి పోరు..!
-
యూపీ ఎన్నికలు : బీజేపీ నేతపై కేసు నమోదు
కుటుంబ రాజకీయాలతో సతమతమవుతున్న సమాజ్వాద్ పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న ఉత్తరప్రదేశ్లో ఎన్నికల్లో అప్పుడే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నేతలు సిద్ధమయ్యారు. ఓటర్లను ప్రలోభపెడుతూ గేదెలు, యెడ్ల బండ్లు, దుప్పట్లను పంచిపెడుతున్న కుందర్కి నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత రామ్వీర్ సింగ్పై ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్నికల ప్రవర్తన నియామవళిని ఉల్లంఘించి రామ్వీర్ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ అదే నియోజకవర్గానికి చెందిన ఎస్పీ అభ్యర్థి హజీ రిజ్వాన్ ఆయనపై కేసు నమోదుచేశారు. ఎన్నికల కమిషన్ గత వారం వెల్లడించిన పోలింగ్ షెడ్యూల్తో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తన నియామళి అమల్లోకి వచ్చింది. బీజేపీ నేత పంచిపెడుతున్న గేదెలు, బండ్లు చిత్రాలు సోషల్ మీడియాలో సైతం హల్ చల్ చేస్తున్నాయి. దుప్పట్లతో పాటు రోజువారీ వాడక వస్తువులను సింగ్ పంచిపెడుతున్నట్లు రిజ్వాన్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తాము విచారణ చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా పబ్లిక్ మీటింగ్ పెట్టడం, ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేయడంపై ఎస్ఐ రత్నేష్ కుమార్ ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు పోలీసులు చెప్పారు. అయితే ఈ ఆరోపణలపై రామ్వీర్ సింగ్ ఎలాంటి స్పందన తెలుపడం లేదు. ఈ బీజేపీ నేత పార్టీ టిక్కెట్ కోసం ఎంతగానో శ్రమిస్తున్నాడు. -
'అఖిలేశ్.. నీకెందుకీ మొండిపట్టుదల?'
-
'అఖిలేశ్.. నీకెందుకీ మొండిపట్టుదల?'
లక్నో: అందరం కలిసి ఉండేందుకు తాము ఏం చేసేందుకైనా సిద్ధం అని సమాజ్ వాది పార్టీ నేత, ఎస్పీ కుటుంబంలో చిచ్చురేగడానికి కారణమైన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమర్ సింగ్ అన్నారు. ఎస్పీ కుటుంబం ఎప్పటికీ కలిసే ఉండాలని, అందుకోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా, బలిదానానికైనా తాను సిద్దంగా ఉన్నానని పరోక్షంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ను వేడుకుంటూ అమర్ సింగ్ చెప్పారు. దాదాపు చీలిపోయిన ఎస్పీ భవితవ్యం రేపు ఎన్నికల కమిషన్ ముందు తేలనున్న నేపథ్యంలో అమర్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'నేను, ములాయం సోదరుడు శివపాల్ మట్టిలాంటి వాళ్లం. మమ్మల్ని శిల్పాలుగా తీర్చిదిద్దింది ములాయం సింగ్ యాదవ్. మేమిద్దరం ఆయనకు రెండు భుజాలలాంటివాళ్లం. అలాంటి నామీద, సోదరుడు శివపాల్ యాదవ్ మీద విషం చిమ్మారు. మనిద్దరివీ అద్దాల మేడలే. నేనూ ఆలోచిస్తా.. నువ్వు కూడా ఆలోచించాలి. ఇలాంటి సమయంలో నీ చేతిలో ఆ రాళ్లెందుకు? ఎందుకీ మొండి పట్టుదల? అసలు నువ్వెందుకు అలిగావు? ఇంట్లోని నిప్పువల్లే ఇంటికి మంట అంటుకుంది. మేం కలిసే ఉండాలనుకుంటున్నాం. నేను చేతులు జోడించి వేడుకోవాలనుకుంటున్నా.. ఇంకేం తీసుకోవాలనుకుంటున్నావు? రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. శివపాల్ యాదవ్ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకోడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కుటుంబం విడిపోకూడదని, మనమంతా ఒక్కటిగానే ఉండేందుకు మేం అన్నిరకాల త్యాగాలు, బలిదానాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను రాజీనామా చేయడానికి ప్రయత్నించాను. ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నాను. అన్నిరకాల బలిదానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను' అంటూ అఖిలేశ్కు మీడియా ద్వారా అమర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. మరోపక్క, ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ కూడా స్పందిస్తూ 'ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది నేతాజీ పుణ్యమే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన వెంటే ఉంటాను' అని అన్నారు. -
బలప్రదర్శనకు దిగిన ములాయం.!
-
ఎస్పీకి ఓటేస్తే బీజేపీకి లాభం
లక్నో: ‘సొంత ఇల్లు చక్కబెట్టుకోలేని సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ సంక్షేమానికి ఏం చేయగలదు?’ అని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు.ఎస్పీకి ఓటేసి పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూర్చొద్దని ప్రజలకు చెప్పాలని తన పార్టీ శ్రేణులను కోరారు. కాగా, బీఎస్పీ యూపీ ఎన్నికల కోసం 24 మంది ముస్లింలు సహా వందమందికిపైగా అభ్యర్థుల పేర్లతో మూడో జాబితా ప్రకటించింది. -
ఎస్పీ మాదే: అఖిలేశ్ వర్గం
న్యూఢిల్లీ: యూపీలో ఎన్నికల గుర్తుగా సైకిల్ను సొంతం చేసుకునే ప్రయత్నాల్లో సీఎం అఖిలేశ్ వర్గం ముందడుగేసింది. అఖిలేశ్కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు సంతకాలు చేసిన అఫిడవిట్లను రామ్గోపాల్ యాదవ్ ఎన్నికల సంఘానికి అందజేశారు. రాంగోపాల్ మాట్లాడుతూ ఎస్పీ లోని 90 శాతం మంది అఖిలేశ్ పక్షాన ఉన్నారు కాబట్టి తమదే అసలైన ఎస్పీ అనీ, ఎన్నికల గుర్తుగా సైకిల్ను తమకే కేటాయించాలని కోరారు. పార్టీకున్న 229 మంది ఎంఎల్ఏల్లో 200 మందికి పైగా, 68 మంది ఎంఎల్సీల్లో 56 మంది, 24 మంది ఎంపీల్లో 15 మంది అఖిలేశ్కు మద్దతు తెలుపుతున్నారన్నారు. కాగా, తమ మద్దతుదారుల సంతకాలతో కూడిన అఫిడవిట్లను ములాయం వర్గం సోమవారం ఈసీకి సమర్పించే వీలుంది. -
యూపీలో బీజేపీ చిత్తుగా ఓడిపోతుంది!
క్లియర్ మెజారిటీ సమాజ్వాదీ పార్టీకే బీఎస్పీ కన్నా బీజేపీకి తక్కువ స్థానాలు వస్తాయ్ జస్టిస్ మార్కండేయ కట్జూ విశ్లేషణ న్యూఢిల్లీ: రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ చిత్తుగా జోడిపోతుందని సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ జోస్యం చెప్పారు. యూపీ ఎన్నికల్లో సీఎం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)కి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఆయన అంచనా వేశారు. ఎస్పీకి మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చినా ఆశ్చర్యపోవడానికి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కన్నా తక్కువ సీట్లు వస్తాయని ఆయన అన్నారు. రానున్న యూపీ ఎన్నికలను విశ్లేషిస్తూ కట్జూ ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టారు. 'యూపీ సహా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు కులం, లేదా మత ప్రాతిపదికన జరుగుతాయి. ఏదైనా ప్రభంజనం ఉంటే అందుకు మినహాయింపు ఇవ్వవచ్చు. ఉదా: 2014 లోక్సభ ఎన్నికల్లో మోదీ ప్రభంజనం నడిచింది. ఇప్పుడు యూపీలో ఎలాంటి గాలి వీయడం లేదు. కాబట్టి దాదాపుగా 90శాతం ఓటింగ్ కులం, మతం ఆధారంగా నమోదవుతుంది. ప్రభంజనం కోసమే పెద్దనోట్లను రద్దు చేసినప్పటికీ అది విజయవంతంకాలేదు. నిజానికి నోట్ల రద్దు వల్ల బీజేపీకి హాని జరిగే అవకాశముంది. ఈ నిర్ణయం వల్ల సామాన్యులు, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, రైతులు బాగా దెబ్బతిన్నారు' అని కట్జూ పేర్కొన్నారు. -
యూపీలో బీజేపీ కాదు.. ఆ పార్టీకి మెజారిటీ?
భిన్నమైన ఫలితాలను ప్రకటించిన ఓపినియన్ పోల్స్ బీజేపీకి ఇండియా టుడే సర్వే.. ఎస్పీకి ఏబీపీ న్యూస్ సర్వే మెజారిటీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వెలువడిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలు నిట్టనిలువునా చీలిపోయాయి. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ వస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే అంచనా వేయగా.. ఈ అంచనాతో ఏబీపీ న్యూస్-లోక్నీత్-సీఎస్డీఎస్ సర్వే విభేదించింది. యూపీలో పోటీ హోరాహోరీగా ఉంటుందని, ఎస్పీకి మెజారిటీ స్థానాలు రావొచ్చునని పేర్కొంది. ఫిబ్రవరి 11 నుంచి ఏడు దశలుగా ఎన్నికలు జరగనున్న యూపీ (403)లో బీజేపీ 206 నుంచి 216 అసెంబ్లీ స్థానాలు గెలుపొందుతుందని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే అంచనా వేసింది. కుటుంబ పోరుతో సతమతమవుతున్న ఎస్పీకి 92-97 స్థానాలు, బీఎస్పీకి 79-85 స్థానాలు రావొచ్చునని పేర్కొంది. కాంగ్రెస్ 5-9 నుంచి స్థానాలతో సరిపెట్టుకుంటుందని తెలిపింది. పెద్దనోట్ల రద్దుకు ముందు బీజేపీకి యూపీలో 31శాతం ఓట్లు వచ్చే అవకాశముండగా.. నోట్లరద్దుతో మరింతగా కలిసివచ్చిందని, ఆ పార్టీకి వచ్చే ఓటుషేర్ డిసెంబర్లో 33శాతం పెరిగిందని ఈ సర్వే పేర్కొంది. ఇక ఏబీపీ న్యూస్-లోక్నీత్-సీఎస్డీఎస్ సర్వే ఉత్తరప్రదేశ్లో బీజేపీ- ఎస్పీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని అంచనా వేసింది. అయితే, అధికార పార్టీ ఎస్పీకి ఎక్కువ సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఎస్పీకి 141-151 సీట్లు, బీజేపీకి 129-139 సీట్లు, బీఎస్పీకి 93-103 సీట్లు, కాంగ్రెస్కు 13-9 సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఇక పంజాబ్ విషయంలోనూ సర్వేల ఫలితాల్లో పోలిక లేదు. ఏబీపీ న్యూస్-లోక్నీత్-సీఎస్డీఎస్ సర్వే పంజాబ్లో అధికార శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ)-బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహారీ ఉంటుందని, ఎస్ఏడీ-బీజేపీ మిత్రపక్షాలకు 50-58 సీట్లు, కాంగ్రెస్కు 41-49 సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఆప్ 12-18 సీట్లు గెలుచుకోవచ్చునని పేర్కొంది. అయితే ఇండియా టుడే యాక్సిస్ సర్వే మాత్రం కాంగ్రెస్-ఆప్ మధ్య పోటీ ఉంటుందని, కాంగ్రెస్కు 49-55 సీట్లు, ఆప్కు 42-46 సీట్లు వస్తాయని, ఎస్ఏడీ-బీజేపీకి 17-21 సీట్లు వచ్చే అవకాశముందని పేర్కొంది. ఇక ఉత్తరాఖండ్లోని 70 స్థానాలలో బీజేపీ 35-45 స్థానాలతో అధికారంలోకి రావొచ్చునని, అధికార కాంగ్రెస్కు 22-30 సీట్లు వస్తాయని పేర్కొంది. -
యూపీ పోల్ సర్వే ఏం చెప్పిందంటే?
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీ పాగా వేయనుందా..! ఎస్పీని, బీఎస్పీని, కాదని ఆ రాష్ట్ర ప్రజలు బేజేపీని ఆహ్వానిస్తారా! అంటే అవుననే సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీకి ఉత్తరప్రదేశ్లో చాలా స్పష్టమైన మెజార్టీ వస్తుందని, అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని తమ సర్వేలో తెలిసినట్లు ఇండియా టుడే తెలిపింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంతో ఇండియా టుడే తాను అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో యూపీలో ఒపీనియన్ పోల్ సర్వే నిర్వహించగా ఈసారి ఉత్తరప్రదేశ్ సింహాసనాన్ని బీజేపీ అధిష్టించనుందని తేలింది. ప్రధాని నరేంద్రమోదీ తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బీజేపీకి ఓట్ల శాతాన్ని పెంచుతుందని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో బీజేపీకి మద్దతు పెరుగుతూ వచ్చిందని ఈ సర్వే వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముందు అక్టోబర్ నెలాఖరులో బీజేపీకి 31శాతం ఓట్లు వాటా ఉండగా అది డిసెంబర్నాటికి 33శాతానికి పెరిగిందని, సీట్ల వారిగా చూస్తే బీజేపీకి 206 నుంచి 216 సీట్లు వస్తాయని తెలిపింది. 2012 బీజేపీకి 15శాతం ఓట్ల వాటా ఉందని, 47 సీట్లు వచ్చాయని గుర్తు చేసింది. రెండో పెద్ద పార్టీగా 26శాతం ఓట్ల షేరింగ్తో సమాజ్ వాది పార్టీ నిలుస్తుందని 92నుంచి 97 సీట్లు వస్తాయని, ఇక బీఎస్పీ కూడా ఎస్పీ అంత స్థాయి ఓట్లను పొంది 79 నుంచి 85 సీట్లు గెలుస్తుందని సర్వే వెల్లడించింది. -
నేను సీఎం అభ్యర్థిగా తప్పుకుంటా!
లక్నో: సీఎం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమని ఆ పార్టీ సీఎం అభ్యర్థి షీలా దీక్షిత్ స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్-ఎస్పీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరితే.. పార్టీ సీఎం అభ్యర్థిగా తాను తప్పుకొనేందుకు సిద్ధమని అన్నారు. హిందుత్వ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కొనేందుకు లౌకికవాద భావసారూప్యమున్న పార్టీలు ఏకం కావాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్- ఎస్పీ మధ్య పొత్తు కుదుర్చుకునేందుకు ఇప్పటికే తెరవెనుక మంతనాలు కొనసాగుతున్నట్టు సమాచారం. అయితే, అధికార సమాజ్వాదీ పార్టీలో కుటుంబ అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరడంతో ఈ పొత్తు చర్చలు ఒక కొలిక్కి రాలేదని సమాచారం. ఉత్తరప్రదేశ్లో పెద్దగా రాజకీయ అవకాశాలు లేని కాంగ్రెస్ పార్టీ ఎస్పీతో పొత్తు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ పొత్తు ద్వారా కనీసం వంద సీట్లైనా అడుగాలని ఆ పార్టీ కోరుకుంటోంది. -
చీలిపోనున్న సమాజ్ వాదీ పార్టీ?
-
చీలిపోనున్న సమాజ్ వాదీ పార్టీ?
లక్నో: సమాజ్ వాదీ పార్టీ రెండుగా చీలిపోనుందా?. తాజా పరిణామాలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్ధుల్లో ముఖ్యమంత్రి అఖిలేశ్ వర్గానికి చెందిన వారికి మొండిచేయి ఎదురవడంతో ఆయన వారందరిని రెబెల్స్ గా బరిలోకి దిగాలని కోరారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్ధుల్లో 325 మంది పేర్లను ములాయం సింగ్, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ లు బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ములాయం విడుదల చేసిన లిస్టులో ప్రస్తుత మంత్రులు అరవింద్ సింగ్ గోప్, పవన్ పాండే, రామ్ గోవింద్ చౌదరిలకు కూడా స్ధానం దక్కలేదు. దీంతో గురువారం తన అనునూయులతో సమావేశమైన అఖిలేశ్ పార్టీ అభ్యర్ధులుగా ఎంపిక కానీ నాయకులందరూ రెబల్స్ గా బరిలోకి దిగాలని పేర్కొన్నారు. పార్టీ టిక్కెట్లు దక్కనివారిలో అత్యధికులు ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా పని చేస్తున్నవారే. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే 78 స్ధానాల్లో అభ్యర్ధులను ములాయం ప్రకటించకుండా వదిలేశారనే ప్రచారం జరుగుతోంది. -
44 తీవ్ర నేరాలు.. పార్టీ టికెట్ ఖరారు
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం సమాజ్ వాది పార్టీ నుంచి బరిలోకి దిగనున్న అభ్యర్థుల్లో నేర చరిత్ర ఉన్నవాళ్లు ఎక్కువమందే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 403 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బుధవారం సమాజ్ వాది పార్టీ అధినేత తొలి జాబితాగా 325మంది అభ్యర్థుల వివరాలను ప్రకటించారు. మరో 78 మంది జాబితా విడుదల చేయాల్సి ఉంది. తొలి జాబితాలో ములాయం కుమారుడు అఖిలేశ్కు చోటు లేకపోగా ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ కు మాత్రం ఈ జాబితాలోనే అవకాశం ఇచ్చారు. అయితే, ములాయం విడుదల చేసిన తొలి జాబితాలో అతిక్ అహ్మద్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఈయనపై 44 అతి తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఇందులో హత్య కేసులు కూడా మినహాయింపు కాదు. అయితే, ఇతడిని ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించగా శివపాల్ యాదవ్ మాత్రం గట్టి మద్దతిచ్చారు. అహ్మద్కు సీటు ఇవ్వాల్సిందేనంటూ ములాయంకు ప్రతిపాదించారు. ఆయన కూడా శివపాల్ మాటనే వింటూ అతడికి సీటు ఇచ్చారు. దీనిపై అఖిలేశ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క అతిక్ మాత్రమే కాకుండా నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు పదుల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. -
కొడుక్కి ములాయం ఝలక్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయం రంజుగా మారింది. ఆ రాష్ట్ర రాజకీయాల్లో సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ మరోసారి తన మార్క్ చూపించారు. ఎవరెన్ని తగువులాడుకున్నా తానే ఫైనల్ అని మరోసారి స్పష్టం చేశారు. కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్కు ఝలక్ ఇచ్చారు. సోదరుడు శివ్పాల్యాదవ్ను వెనుకేసుకొచ్చారు. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ములాయం సింగ్ తొలి జాబితాను విడుదల చేశారు. 325 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించారు. ఇందులో 176మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. ఈ జాబితాలో పూర్తి ప్రభావం ములాయమే చూపించినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సింగ్ పేరు లేకపోవడం పార్టీ వారికి విస్మయాన్ని కలిగించింది. అదే సమయంలో, ములాయం సోదరుడు శివపాల్ యాదవ్కు మాత్రం జశ్వంత్ నగర్ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తున్నట్లు ములాయం తొలిజాబితాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ములాయం మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాతే ఎమ్మెల్యేలు సీఎంను ఎన్నుకుంటారని అన్నారు. నోట్ల రద్దుపై బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, అఖిలేశ్ యాదవ్, శివపాల్ యాదవ్ కలిసి వేర్వేరు జాబితాలు రూపొందించినట్లు తెలిసింది. ఇందులో అఖిలేశ్ 403మంది అభ్యర్థులతో జాబితాను సిద్ధం చేయగా ములాయం మాత్రం సోదరుడు శివపాల్ జాబితానే ఫైనల్ చేస్తున్నట్లు సమాచారం. తొలి జాబితాలో అఖిలేశ్ పేరు లేకపోవడంపై ప్రశ్నించగా ఆయన ముఖ్యమంత్రి అని, ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయాన్ని ఆయనే నిర్ణయించుకుంటారని, తామెలా చూపించగలమంటూ శివపాల్ యాదవ్ అన్నారు. -
మా పార్టీ పరువు తీయడానికే..
కేంద్రం అధికార దుర్వినియోగం చేస్తోంది: మాయావతి లక్నో: తమ పార్టీ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బీఎస్పీ ఖాతాలో రూ. 104 కోట్ల డిపాజిట్లను ఈడీ కనుగొన్న తర్వాత ఆమె కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం, పార్టీ నియమాల ప్రకారం డిపాజిట్లు ఉన్నాయని, నోట్ల రద్దుకు ముందరే ఆ డబ్బు సేకరించామని తెలిపారు. ఆ డబ్బును తామిప్పుడు విసిరివేయాలా అంటూ ప్రశ్నించారు. బీజేపీ దళిత వ్యతిరేకి అని, ఓ వర్గం మీడియాను ఉపయోగించుకుని యూపీ ఎన్నికల ముందు తమ పార్టీ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆ డబ్బు దేశ వ్యాప్తంగా పార్టీ సభ్యత్వం తీసుకున్న వారి నుంచి సేకరించినదని, మారుమూల ప్రాంతాల నుంచి తరలించాడానికి, బ్యాంకులో జమచేయడానికి సులువుగా ఉంటుందని పెద్దనోట్లుగా మార్చడం జరిగిందని వివరించారు. బ్యాంకులో జమచేసిన ప్రతీ రూపాయికీ లెక్కుందన్నారు. -
పొత్తుల సమస్యే లేదు
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకునేది లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రాజ్బబ్బర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయగల సత్తా తమకుందని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోమని ఆయన అన్నారు. రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తే భారీ మెజారిటీ ఖాయమని ఇంతకుముందు సీఎం అఖిలేష్ యాదవ్ చెప్పిన విషయం తెలిసిందే. కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు కాంగ్రెస్ యూపీ చీఫ్ మాట్లాడటం గమనార్హం. ఇక పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని రాజ్బబ్బర్ తీవ్రంగా విమర్శించారు. కేవలం కొద్దమంది తన స్నేహితులకు మేలు చేయడానికే ఆయనిలా చేశారని అన్నారు. నోట్ల రద్దు వల్ల దేశం మొత్తం ఇబ్బంది పడుతోందని, దేశంలో స్వైపింగ్ సామ్రాజ్యం నడుపుతున్న కొద్దిమందికి దీనివల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. సమాజంలో ప్రతి వర్గానికీ పెద్దనోట్ల రద్దు వల్ల సమస్యలు ఎదురయ్యాయన్నారు. -
'ప్రజలు మావెంటే.. పవర్ మాదే..'
లక్నో: ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని కైవసం చేసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లక్నోలో ఓ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళుతున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లో పరివర్తన్ ర్యాలీతో బీజేపీ మార్పునకు పునాది వేసిందని చెప్పారు. ప్రజలు కూడా తాము ఆ రాష్ట్రంలో వేగవంతమైన మార్పును తీసుకొస్తామని నమ్ముతున్నారని అన్నారు. పెద్ద నోట్ల రద్దుకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని, ఆ అంశంతో ముడిపెట్టి చూడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు ఎన్నికల్లో సాధించే గెలుపో, ఓటమో కాదని, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. అవినీతిని తగ్గించడం, నల్లడబ్బును నిర్మూలించి దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే పెద్ద నోట్ల రద్దు నిర్ణయ ఉద్దేశమని చెప్పారు. -
బాబాయి, అబ్బాయిల మధ్య మరో కొత్త పోరు
లక్నో: సమాజ్వాదీ పార్టీ ఇంట నెలకొన్న రాజకీయ సంక్షోభం ఇంకా సద్దుమణగట్లేదు. తాజాగా మరో కొత్త యుద్ధానికి తెరతీశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపకంపై ఎస్పీలో ప్రతిష్టంభన నెలకొన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బాబాయ్ శివ్పాల్ యాదవ్తో కలిసి ఐక్యంగా ప్రచారం చేస్తారా అనే ప్రశ్నకు సీఎం అఖిలేష్ యాదవ్ ఇచ్చిన సమాధానమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ''చాచా నాతో ఉన్నా లేకున్నా.. ప్రజలు నాతో ఉన్నారు. అది చాలు'' అంటూ అఖిలేష్ చెప్పారు. దీంతో ఈ కుటుంబంలో సమస్యలు ఇంకా క్లియర్ కాలేదని తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్ష హోదాలో శివపాల్ యాదవ్, టిక్కెట్ పంపకంలో వివక్ష చూపుతున్నారని సీఎం అఖిలేష్ వాదిస్తున్నారు. తనను సంప్రదించకుండానే మాపియా నుంచి రాజకీయాలోకి వచ్చిన ఆతిక్ అహ్మద్ను అభ్యర్థుల జాబితాలో శివ్పాల్ చేర్చడంపై అఖిలేష్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన కారాలు మిరియాలు నూరుతున్నారు. గత నెల అలహాబాద్లో జరిగిన పార్టీ పంక్షన్లో ఆతిక్ అహ్మద్, అఖిలేష్కు చేరువ కావడానికి ప్రయత్నించినప్పుడు ఆయన్ను కనీసం దగ్గరకు కూడా రానీయకుండా చూశారట. నేరారోపణలు కల్గినవారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వకూడదనే అఖిలేష్ అభిప్రాయానికి వ్యతిరేకంగా శివ్పాల్ యాదవ్ వ్యవహరిస్తున్నారని సీఎం క్యాంప్ అఫీసులోని ఓ వ్యక్తి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి కూడా అభ్యర్థులను శివ్పాల్ ప్రకటిస్తున్నారంటూ ఆయన పేర్కొన్నారు. మరోవైపు అఖిలేష్ వర్గాన్ని శివ్పాల్ అస్సలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. లక్నోలో జరిగిన పార్టీ రజతోత్సవాలలో అఖిలేష్కు సన్నిహితుడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సలహాదారు జావెద్ అబ్దిని శివ్పాల్ స్టేజ్ మీదకు రానీయకుండా చేశారంట. అఖిలేష్కు ఇష్టంలేని వ్యక్తులను, మంత్రి పదవుల నుంచి తొలగించిన సన్నిహితులను శివ్పాల్ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. శివ్పాల్ గత వారంలో విడుదల చేసిన 23 అభ్యర్థుల జాబితాలో అఖిలేష్ మంత్రి పదవి నుంచి తొలగించిన రాజ్ కిషోర్ సోదరుడు, బ్రిజ్ కిషోర్ సింగ్ లాంటి వాళ్లు ఉన్నారు. రాజ్ కిషోర్ సింగ్ను మంత్రి పదవి నుంచి బహిష్కరించిన అనంతరం ఆయన పలుమార్లు అఖిలేష్కు వ్యతిరేకంగా మాట్లాడిన సంగతి తెలసిందే. అయితే టిక్కెట్లు కేటాయించినప్పటికీ, పోలింగ్ తేదీలు ప్రకటించిన తర్వాత కూడా మళ్లీ అభ్యర్థుల జాబితాను పునఃసమీక్షిస్తామని అఖిలేష్ కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. ఓ వైపు బాబాయి, మరోవైపు అబ్బాయి పోరు అభ్యర్థుల ఎంపికతో మరో కొత్త రగడకు దారితీస్తుందని తెలుస్తోంది. -
రంగంలోకి ప్రియాంక గాంధీ
-
ప్రచారంలోకి ప్రియాంక
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ కీలక పాత్ర పోషించనున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. యూపీ ఎన్నికల్లో ప్రచారం చేయాలన్న తమ వినతిని ప్రియాంక అంగీకరించారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రాజ్బబ్బర్ చెప్పారు. ఆమె సేవలను పార్టీ వినియోగించుకుం టుందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూలును ప్రకటించిన వెంటనే ప్రియాంక ఎన్నికల ప్రచారంపై స్పష్టత వస్తుందన్నారు. ప్రియాంక రాక వల్ల పార్టీ కార్యకర్తల్లోనే గాక, రాష్ట్రప్రజల్లోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, కొత్త ఉత్సాహం నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. -
రంగంలోకి ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తారు. తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ, అమేథీ లోక్సభ నియోజకవర్గాలతో పాటు యూపీలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రియాంక విస్తృతంగా ప్రచారం చేస్తారని యూపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాజ్ బబ్చర్ చెప్పారు. ప్రియాంక ప్రచారం చేయడం వల్ల పార్టీ నాయకుల్లో, రాష్ట్ర ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రియాంక ప్రచారం చేస్తారని, కీలక పాత్ర పోషిస్తారని ఆ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ కూడా చెప్పారు. ప్రచారం చేయాలన్న తమ విన్నపాన్ని ప్రియాంక అంగీకరించారని యూపీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ అయిన సంజయ్ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రియాంక ప్రచార కార్యక్రమ తేదీలను ఖరారు చేస్తామని చెప్పారు. -
నోట్ల రద్దు.. పొలిటికల్ గేమ్
-
నోట్ల రద్దు.. పొలిటికల్ గేమ్ : విమలక్క
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా చలామణిలోకి తెచ్చిన రూ. 2 వేల నోటును తక్షణమే నిషేదించాలని.. అవనీతిని మరింతగా పెంచి పోషించేందుకు మోదీ ప్రభుత్వం రూ. 2 వేల నోటు తీసుకొచ్చారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఆరోపించారు. యూపీ ఎన్నికల పొలిటికల్ గేమ్లో భాగంగానే ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని.. దీని వల్ల సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. -
కిషోర్-ములాయం భేటీపై షీలా ఆశ్చర్యం
న్యూఢిల్లీ: తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్... సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో భేటీ కావడం పట్ల ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'ఈ సమావేశం నాకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించింది. ఈ భేటీ ద్వారా ప్రశాంత్ కిశోర్ ఏం చేయదలుచుకున్నారో తెలియద'ని షీలా దీక్షిత్ అన్నారు. నవంబర్ 1న ములాయంతో ప్రశాంత్ కిశోర్ సమావేశమయ్యారు. అమర్ సింగ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పడే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే మహాకూటమి గురించి కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయని, తామింకా నిర్ణయం తీసుకోలేదని షీలా దీక్షిత్ తెలిపారు. ప్రశాంత్ కిషోర్ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా అని ప్రశ్నించగా... 'ఆయన మా పార్టీకి సలహాదారు, వ్యూహకర్త. ఆయన పనితీరు పట్ల సంతృప్తికరంగా ఉందా, లేదా అనే విషయం సెక్రటరీలకు తెలుసు. నాకు తెలియద'ని ఆమె సమాధానం ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ పనితీరుపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన పనితీరుపై కాంగ్రెస్ వర్గాలు రెండు చీలిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. -
వారందరూ కొట్లాటలో బిజీగా ఉన్నారు
-
వారందరూ కొట్లాటలో బిజీగా ఉన్నారు
ఉత్తరప్రదేశ్లో అధికార పార్టీ అభివృద్ధిని పక్కన పెట్టి, ఒక్కరినొక్కరూ కొట్టుకోవడంలో బిజీగా ఉన్నారని బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. ఓ వైపు బాబాయ్ శివపాల్ యాదవ్, మరోవైపు అబ్బాయ్ అఖిలేష్ యాదవ్లు కొట్టుకుంటుంటే, బహుజన సమాజ్ పార్టీ సుప్రిం మాయావతి దుర్వినియోగాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ 2017 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆయన భారతీయ జనతా పార్టీ పోల్ క్యాంపెయిన్ 'పరివర్తన యాత్ర'ను సహారన్పూర్లో ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా యాదవ్ ప్యామిలీ, బీఎస్పీ అధినేత మాయవతిపై అమిత్షా విరుచుకుపడ్డారు. ఎస్పీ, బీఎస్పీలు ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలను మెరుగుపరచడంలో విఫలమవుతున్నాయని, కేవలం బీజేపీ మాత్రమే యూపీలో దౌర్జన్యాలను అరికడుతుందన్నారు. యూపీని అభివృద్ధి పథంలో ముందజంలో నిలిపేందుకు కేవలం ఒక్క బీజేపీ పార్టీనే ఎంతగానో శ్రమించిందని, ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. త్రిపుల్ తలాక్ రద్దును సమర్థించిన ఆయన, ముస్లిం మహిళలు తమ హక్కులను పూర్తిగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. మహిళల హక్కులపై ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలను ఆయన హెచ్చరించారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్పై, మాజీ సైనికోద్యోగి రామ్ కిషన్ ఆత్మహత్యపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పెండింగ్లో పెట్టిన ఈ విధానాన్ని బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని గుర్తుచేశారు. జవాను మృతిచెందడాన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం నిజంగా చాలా అసహ్యకరంగా ఉందని విమర్శించారు.అమిత్ షా నిర్వహించిన ఈ యాత్రలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్, కల్రాజ్ మిశ్రా, కేశల్ ప్రసాద్ మౌర్య, సంజీవ్ బల్యాన్, సంగీత్ సోమ్లతో పాటు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
మాయావతికి ముస్లింల మద్దతు తప్పనిసరి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అధికార పక్షమైన సమాజ్వాది పార్టీలో ఏర్పడిన అంతర్గత కలహాలను బహుజన సమాజ్వాది పార్టీ సుప్రీం నాయకురాలు మాయావతి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటివరకు సమాజ్వాది పార్టీతోనే ఉన్న ముస్లింలను తమ పార్టీవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో బలపడుతున్న భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే తమ పార్టీనే గెలిపించడమే ప్రత్యామ్నాయమని ఆమె ముస్లింలను కోరుతున్నారు. 2007 ఎన్నికల తర్వాత వరుసగా ప్రతి ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని కోల్పోతున్న బీఎస్పీ వచ్చే ఏడాదిలో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ముస్లింల మద్దతు తప్పనిసరి. రాష్ట్రంలో 22 శాతం దళితులు ఉండగా, 18 శాతం మంది ముస్లింలు ఉన్నారు. 2007జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ కేవలం 30.4 శాతం ఓట్లతోనే అధికారంలోకి వచ్చింది. ఈసారి ఈ రెండు వర్గాలు కలిస్తే అప్పటికంటే ఎక్కువ శాతం ఓట్లతో గెలిచే అవకాశం ఉంటుంది. సమాజ్వాది పార్టీలో బాబాయి–అబ్బాయిల మధ్య ఏర్పడిన సంక్షోభ పరిస్థితులు ఇలాగే కొనసాగినట్లయితే ముస్లింలు బీఎస్పీ వైపు తిరిగే అవకాశం ఉంది. ఒకవేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ములాయం సింగ్ యాదవ్ జాతీయ ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసినట్లయితే ఇక ముందు కూడా సమాజ్వాది పార్టీతోనే ముస్లింలు వెళ్లాల్సి వస్తుంది. 2007లో అగ్రవర్ణమైన బ్రాహ్మణుల ఓట్లను కూడా సాధించడం వల్ల బీఎస్పీ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్ల శాతం 27 శాతానికి పడిపోయింది. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25 శాతం, 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 19 శాతానికి పడిపోయింది. ఈసారి బ్రాహ్మణులెవరూ మాయావతి పార్టీకి ఓట్లు వేసే అవకాశం లేదు. వారంతా బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ముస్లింలను తమ పార్టీ వైపు తిప్పుకోవడం మాయావతికి తప్పనిసరి. 2017లో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యనే చతుర్ముఖ పోటీ ఉంటుంది. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ములాయం అధ్వర్యంలో జాతీయ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడినట్లయితే దానికి అనుకూలంగా రాష్ట్రంలో కూడా ఎన్నికల పొత్తులు చోటుచేసుకునే అవకాశాలు ఉంటాయి. -
ములాయంకు ఊహించని షాక్!
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహాకూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు ఊహించని షాక్ తగిలింది. అఖిలేశ్ యాదవ్ ను సీఎం అభ్యర్థిగా పెడితేనే చేతులు కలుపుతామని భాగస్వామ్య పార్టీలు స్పష్టం చేయడంతో ములాయం ప్రయత్నాలకు ఆరంభంలోనే హంసపాదు ఎదురైంది. సమాజ్ వాదీ పార్టీలో ముసలం రేగడంతో ములాయం.. కొడుకుని కాదని సోదరుడు శివపాల్ యాదవ్, ప్రాణమిత్రుడు అమర్ సింగ్ పక్షం వహించారు. సమాజ్ వాదీ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా అఖిలేశ్ పేరును ఖరారు చేస్తేనే ఉమ్మడి పోరుకు అంగీకరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చాయి. ములాయం మహాకూటమి ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా తన కుటుంబంలో రేగిన కలహాలను పరిష్కరించుకోవాలని ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ సూచించినట్టు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వెల్లడించారు. పరి'వార్' తర్వాత ములాయం కంటే అఖిలేశ్ కు ప్రజాదరణ పెరిగిందని ఒక సర్వేలో వెల్లడైన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. కాగా, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ కలిసి వస్తేనే మహాకూటమి సాధ్యమన్న అభిప్రాయాన్ని జేడీ(యూ) నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యక్తం చేశారు. గతేడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికప్పుడు మహాకూటమి నుంచి చివరి నిమిషంలో ములాయం తప్పుకుని నితీశ్ కు షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ములాయంతో చేతులు కలిపే విషయంలో నితీశ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 5న జరగనున్న సమాజ్ వాదీ పార్టీ రజతోత్సవాలకు హాజరుకాకూడదని నితీశ్ నిర్ణయించుకున్నారు. కాగా, సమాజ్ వాదీ పార్టీలో అంతర్గత సంక్షోభం యాదవ్, ముస్లిం ఓట్లపై బాగా ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
అఖిలేశ్ ‘రథయాత్ర’ షురూ
ప్రారంభించిన ములాయం.. హాజరైన శివపాల్ లక్నో: ఉత్తరప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అగ్రనేతలు గురువారం కలహాలను పక్కనబెట్టి ఒకే వేదికను పంచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి అఖిలేశ్ చేపట్టిన రథయాత్ర ప్రారంభ సభకు ఎస్పీ జాతీయాధ్యక్షుడు ములాయం, రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ హాజరయ్యారు. తమ కుటుంబం, పార్టీ ఐకమత్యంతోనే ఉందనే సంకేతాలను ప్రజల్లోకి పంపే యత్నం చేశారు. కొన్ని రోజులుగా అఖిలేశ్, శివపాల్ల మధ్య విభేదాలు ఉండటం..కొడుకు అఖిలేశ్ను కాదని తమ్ముడు శివపాల్కు ములాయం మద్దతు ఇస్తుండటం తెలిసిందే. తాజాగా అఖిలేశ్, శివపాల్ల మధ్య ములాయం సంధి కుదిర్చినట్లు సమాచారం. లక్నోలో ములాయం యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. కీలకమైన 2017 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా నిలువరించడమే తమ లక్ష్యమన్నారు. ఎన్నికల్లో పొత్తుల గురించి విలేకరులు అఖిలేశ్ను ప్రశ్నించినపుడు మాత్రం వారి మధ్య సమాచారలోపం బట్టబయలైంది. పొత్తులు ఎవరితో పెట్టుకుంటున్నారు? ప్రస్తుతం ఏం చర్చిస్తున్నారు? తదితర విషయాలేవీ తనకు తెలియవని అఖిలేశ్ చెప్పారు. రేపటి నుంచి బీజేపీ యాత్ర న్యూఢిల్లీ: బీజేపీ కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల కసరత్తులో భాగంగా పరివర్తన యాత్రలు నిర్వహిస్తోంది. మొత్తం నాలుగు యాత్రలను నవంబరు 5-9 తేదీల మధ్య ప్రారంభిస్తోంది. ఈ యాత్రల్లో పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు. తొలి యాత్ర నవంబరు 5న సహరాన్పూర్ నుంచి మొదలవుతుంది. మిగతావి ఝాన్సీ నుంచి 6వ తేదీన, సోన్భద్ర నుంచి 8న, బాలియా నుంచి 9న ప్రారంభమవుతాయి. ఇవన్నీ డిసెంబరు 24న లక్నోకు చేరి ముగుస్తాయి. ప్రధాని మోదీ ఆరు సభల్లో ప్రసంగిస్తారు. -
అఖిలేశ్ కు అపశకునం
-
అఖిలేశ్ కు అపశకునం
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఎన్నికల ప్రచారానికి ఆరంభంలోనే ఆటంకం ఎదురైంది. వికాస్ రథయాత్ర పేరుతో గురువారం ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ జెండా ఊపి రథయాత్ర ప్రారంభించారు. యాత్ర కిలోమీటర్ కూడా సాగకుండానే బ్రేక్ పడింది. అఖిలేశ్ ప్రయాణిస్తున్న అత్యాధునిక మెర్సిడెస్ బస్సు మొరాయించడంతో యాత్ర కొద్దిసేపు ఆగిపోయింది. సాంకేతిక లోపంతో బస్సు నిలిచిపోయింది. తర్వాత అఖిలేశ్ కారులో యాత్ర కొనసాగిసాంచారు. రథయాత్ర కోసం భారీగా సొమ్ము వెచ్చించి తయారు చేయించుకున్న హైటెక్ బస్సు ఆరంభంలోనే మొరాయించడంతో అఖిలేశ్ అసంతృప్తికి గురయ్యారు. ఇప్పటికే బాబాయి శివపాల్ యాదవ్ తో విభేదాలతో సతమవుతున్న 'అబ్బాయి'కి హైటెక్ బస్సు అపశకునంలా మారింది. ఈ బస్సును కోటి రూపాయలతో స్పెషల్ గా తయారు చేయించుకున్నారు. ప్రచారం కోసం అఖిలేశ్ యాదవ్ హైటెక్ బస్సులు వాడటం ఇది మొదటిసారేమీ కాదు.. ఇంతకుముందు 2012 ఎన్నికల సమయంలో కూడా ఆయన 'క్రాంతి రథం' ఉపయోగించారు. -
సీఎం బస్సు.. ఎంత హైటెక్కో!
లక్నో : అభివృద్ధి నుంచి విజయం దిశగా..' ఇదీ యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నవంబర్ మూడో తేదీ నుంచి మొదలుపెట్టబోతున్న రథయాత్ర పేరు. ఇందుకోసం ఆయన అత్యాధునిక బస్సు ఒకదాన్ని సిద్ధం చేయించుకున్నారు. దాంట్లో ఉన్న సదుపాయాలు చూస్తే కళ్లు తిరగాల్సిందే. వచ్చే సంవత్సరం జరగబోతున్న ఎన్నికల కోసం ఈ బస్సును అఖిలేశ్ ఎప్పుడో రెడీ చేయించారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దగ్గరున్న వ్యానిటీ వ్యాన్ కంటే కూడా ఇది చాలా పెద్దది. వాస్తవానికి ఈ వ్యాన్లో అఖిలేశ్ ఈ నెల 3 నుంచే ప్రచారం ప్రారంభించాలనుకున్నారు గానీ.. యాదవ్ కుటుంబంలో చెలరేగిన చిచ్చు కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక పార్టీలోను, కుటుంబంలోను ఉన్న అంతర్గత తగాదాలను కాసేపు పక్కన పెట్టి.. ప్రచారం సంగతి చూసుకుందామని సిద్ధమవుతున్నారు. వచ్చే నెల మూడో తేదీన లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఎదురుగా ఉన్న లా మార్టినెర్ స్కూలు గ్రౌండ్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. తొలి రెండు రోజులు యాత్ర పూర్తయ్యాక వెంటనే మళ్లీ లక్నో వచ్చి.. పార్టీ రజతోత్సవాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇంతకు ముందున్న నాలుగు చక్రాల బస్సులు, ట్రక్కులలా కాకుండా సీఎం విజయరథాన్ని అత్యాధునికంగా రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి, తమకు కావల్సిన సదుపాయాలన్నింటినీ అందులో కల్పించుకున్నారు. మామూలుగా అయితే రూ. 50 లక్షల వరకు ఖర్చయ్యే ఈ బస్సుకు.. మేకోవర్ తర్వాత దాదాపు కోటి రూపాయల వరకు అయినట్లు సమాచారం. ప్రచారం కోసం అఖిలేశ్ యాదవ్ హైటెక్ బస్సులు వాడటం ఇది మొదటిసారేమీ కాదు.. ఇంతకుముందు 2012 ఎన్నికల సమయంలో కూడా ఆయన 'క్రాంతి రథం' ఉపయోగించారు. అయితే అప్పట్లో దాన్ని తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ నుంచి తీసుకున్నారు. అప్పట్లో కూడా ఆయన రాష్ట్రం మొత్తం ఒక్కరే తిరిగారు. పార్టీలో మిగిలిన సీనియర్లంతా వేదికల మీద నుంచి ప్రసంగిస్తే.. అఖిలేశ్ మాత్రం ఆ ర్యాలీలు వేటిలోనూ పాల్గొనకుండా నేరుగా బస్సులోంచే తన యువదళం మద్దతుతో ప్రచారం చేశారు. తాజాగా అఖిలశ్ యాదవ్ చేపట్టే యాత్ర మార్గం ఇంకా నిర్ణయించాల్సి ఉంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఆ పని పూర్తవుతుందని అఖిలేశ్ మంత్రివర్గ సహచరుడు రాజేంద్ర చౌదరి తెలిపారు. ఐదో తేదీన రాజధాని లక్నోలో జరిగే పార్టీ రజతోత్సవాలలో పాల్గొని, మళ్లీ తన యాత్రను సీఎం పునరుద్ధరిస్తారన్నారు. కాగా గతంలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ఎన్నికల ప్రచారం కోసం అన్ని హంగులతో కూడిన లగ్జరీ బస్సులను ప్రత్యేకంగా చేయించుకున్న విషయం తెలిసిందే బస్సులో ఉన్న సౌకర్యాలు ఇవీ... ఇది పది చక్రాల మెర్సిడెస్ బస్సు బస్సు మొత్తం పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ ప్రజలనుద్దేశించి అఖిలేష్ మాట్లాడేందుకు వీలుగా హైడ్రాలిక్ లిఫ్టు హై ఫిడెలిటీ సౌండ్ సిస్టమ్ వీడియోలు చూపించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు వెనక్కి సులభంగా వాలే మెకనైజ్డ్, హైడ్రాలిక్ కుర్చీలు బస్సులోనే రెస్ట్ రూం, వంటగది, ప్లష్ వాష్రూం వై-ఫై సదుపాయం, వై-ఫై అనుసంధానం ఉన్న టీవీ అత్యాధునిక ఏసీ సిస్టమ్, గాలిశుద్ధి పరికరాలు -
రాహుల్ గాంధీతో అఖిలేష్ పొత్తు?
న్యూఢిల్లీ: సమాజ్వాది పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయన్న అంశంపై వివిధ వర్గాల రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ వర్గం తన బాబాయ్ శివపాల్ యాదవ్ వర్గాన్ని కాదని, లేదా కాలదన్ని స్వతంత్య్రంగా పోటీ చేయాల్సి వస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుపెట్టుకుంటారన్న విషయంలో అప్పుడే చర్చ మొదలైంది. ఎప్పుడూ తన రాజకీయ మిత్రుడిగానే భావించే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో అఖిలేశ్ యాదవ్ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాహుల్ గాంధీని పలుసార్లు బహిరంగంగా ప్రశంసించిన అఖిలేష్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘ఖూన్ కీ దళాయి’ అంటూ రాహుల్ చేసిన విమర్శలను కూడా సమర్థించారు. ‘కాంగ్రెస్ పార్టీతో నాకు సంబంధం లేదుగానీ రాహుల్తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మోదీ గురించి రాహుల్ చేసిన విమర్శలు సమంజసమేనని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ అనాలోచితంగా ఎలాంటి వమర్శలు చేయరు’ అని అఖిలేశ్ వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. రాహుల్తో అఖిలేష్ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారని, మున్ముందు రాజకీయంగా ఆయనతో పొత్తు పెట్టుకునే అవకాశాన్ని వదులుకోరాదనేదే అఖిలేష్ ఉద్దేశమని ఆయన సన్నిహితులు తెలిపారు. సమాజ్వాది పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చలు జరిపింది. ఈ సమావేశానికి ప్రియాంక గాంధీ హాజరవడం మరో విశేషం. ఎన్నికలకు ముందే రాజకీయ పొత్తులు పెట్టుకుంటే మంచిదనే విషయాన్ని కొంత మంది రాష్ట్ర నాయకులు ప్రియాంక గాంధీకి సమావేశంలో సూచించారట. అయితే ఆమె దానికి ఎలాంటి సమాధానం చెప్పలేదట. సమాజ్వాది పార్టీ నుంచి అఖిలేశ్ వర్గం విడిపోయిన పక్షంతో అ పక్షంతో పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదన కూడా సమావేశం ముందుకు వచ్చిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడే తొందర పడి నిర్ణయానికి రాకూడదని, పరిణామాలను మరింత క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడినట్లు తెలిసింది. అటు మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్వాది పార్టీని, మరోపక్క బలపడుతున్న భారతీయ జనతా పార్టీని సమర్థంగా ఎదుర్కొవాలన్నా... ప్రభుత్వ వ్యతిరేక ఓటును తప్పించుకోవాలన్నా బాబాయ్ వర్గాన్ని వదిలేసి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే ఉత్తమమని రాజకీయ విశ్లేషకులు అఖిలశ్శ్ కు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. -
యూపీ కాంగ్రెస్ వ్యూహాత్మక భేటీలో ప్రియాంక
న్యూఢిల్లీ: అధికార ఎస్పీలో అంతర్గత సంక్షోభం నెలకొన్న తరుణంలో యూపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ సోమవారం నిర్వహించిన సమావేశానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ హాజరయ్యారు. గులాంనబీ ఆజాద్ ఏర్పాటుచేసిన ఈ భేటీలో పీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్, సీఎం అభ్యర్థి షీలా దీక్షిత్, ఎన్నికల ప్రచార వ్యూహకర్త సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. గంటసేపు సాగిన చర్చల్లో ప్రియాంక వీరందరితో మాట్లాడారు. ఆర్ఎల్డీ, పీస్ పార్టీ లాంటి చిన్న పార్టీలతో పొత్తులుపెట్టుకోవాలని కొందరు సూచించారు. -
సమాజ్వాదీలో పరివార్
పార్టీ సమావేశంలో వీధికెక్కిన కుటుంబ విభేదాలు - ములాయం, అఖిలేశ్, శివ్పాల్ల మధ్య మాటల తూటాలు - నాన్న ఆదేశిస్తే తప్పుకుంటా, కొత్త పార్టీ ఎందుకు పెట్టాలి?: అఖిలేశ్ - నీ సామర్థ్యమెంత? ఎన్నికల్లో గెలవగలవా? అమర్ సోదరుడితో సమానం : ములాయం - సీఎం పగ్గాలను ములాయం చేపట్టాలి: శివ్పాల్ లక్నో: సమాజ్వాదీ పార్టీలో కుటుంబ కలహాలు సోమవారం రోడ్డెక్కాయి. పార్టీ నేతలు, కార్యకర్తల సాక్షిగా బాబాయ్, అబ్బాయ్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఒక దశలో ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. తండ్రి ములాయం, కొడుకు అఖిలేశ్, బాబాయ్ శివపాల్లు మాటల తుటాలతో తలపడ్డారు. తండ్రి ఆదేశిస్తే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని అఖిలేశ్ స్పష్టం చేయగా... తమ్ముడు శివపాల్, స్నేహితుడు అమర్సింగ్ల పక్షాన నిలిచిన ములాయం... ‘నువ్వెంత? నీ సామర్థ్యమెంత? గీత దాటితే సహించన’ంటూ కొడుకును తీవ్రంగా హెచ్చరించారు. సీఎంను మార్చే ఉద్దేశం లేదనీ స్పష్టం చేశారు. మరోవైపు కార్యకర్తలు సైతం రెండు వర్గాలుగా విడిపోయి పార్టీ భేటీలో, వెలుపల నినాదాలతో హోరెత్తించారు. మూడు నెలల అంతర్గత కుమ్ములాటలకు ముగింపు పలికేందుకు ఎస్పీ జాతీయ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ లక్నోలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన భేటీ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించింది. అఖిలేశ్, శివ్పాల్లు వేదికపైనే గొడవపడడంతో రాజీ లేకుండానే భేటీ అర్ధంతరంగా ముగిసింది. సమావేశానికి అఖిలేశ్ హాజరై అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు ఆవేశంగా ప్రసంగించారు. ములాయం కోరితే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని, కొత్త పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. ‘ఎవరు నిజాయతీ పరులని ములాయం భావిస్తే వారిని సీఎంగా నియమించండి. నేనేందుకు కొత్త పార్టీ పెట్టాలి?’ అని ప్రశ్నించారు. తండ్రే నాకు గురువు.. అఖిలేశ్: ‘నా తండ్రే నాకు గురువు... చాలా మంది మా కుటుంబంలో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఏదైనా తప్పు జరిగితే ఎలా ఎదుర్కోవాలో సొంతంగా నేర్చుకున్నా’ అంటూ అమర్పై పరోక్ష విమర్శలు చేశారు. అక్టోబర్లో భారీ మార్పు జరుగుతుందంటూ అతను(అమర్) ముందే చెప్పాడని వెల్లడించారు. పార్టీ రజతోత్సవాలకు సీఎం రాకపోవచ్చని అందరూ భావించగా. ‘నా రథయాత్ర కొనసాగుతుంది... వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటాం’ అని స్పష్టం చేశారు.తన పరిధి దాటి ఏదైనా మాట్లాడి ఉంటే క్షమించాలని కోరారు. శివ్పాల్ కృషిని మర్చిపోలేను: ములాయం ఎస్పీ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటోందని, పార్టీ సభ్యులు ఒకరితో ఒకరు గొడవపడొద్దని ములాయం సూచించారు. ‘అమర్, శివ్పాల్కు వ్యతిరేకంగా మాట్లాడితే సహించను. నేను జైలుకు వెళ్లకుండా అమర్ నన్ను కాపాడారు. అతను నాకెంతో సాయం చేశారు. అమర్ నాకు సోదరుడితో సమానం. కేవలం ఎర్ర టోపీ పెట్టుకుంటే సమాజ్వాదీ సభ్యులు కారు. కొందరు మంత్రులు భజనపరులు. శివపాల్ కృషిని నేను మర్చిపోలేను. శివ్పాల్ ప్రజానేత.పార్టీ బలోపేతానికి నేనెంతో కష్ట్టపడ్డా. లోహియా సిద్ధాంతాల్ని అనుసరించి పేదలు, రైతుల కోసం పోరాడాను’ అని పేర్కొన్నారు. ఒక దశలో అఖిలేశ్ను ఉద్దేశించి... ‘నీ సామర్థ్యం ఎంత? నువ్వు ఎన్నికల్లో గెలవగలవా? విమర్శల్ని సహించలేనివారు నేతలు కాలేరు. విమర్శ సరైనదైతే, అభివృద్ధి చెందేందుకు అవకాశముంటుంది’ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అమర్లో నాలుగో వంతు చేయవు: శివ్పాల్ అఖిలేశ్పై తొలిసారి బాబాయ్ శివపాల్ బహిరంగంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్త పార్టీ పెడతానని సీఎం నాతో చెప్పారు. అలాగే కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటానన్నారు. ఈ విషయంలో గంగాజలంపై ప్రమాణం చేస్తా. ఉత్తరప్రదేశ్ పాలనా పగ్గాలు చేపట్టమని అన్నయ్యను కోరుతున్నా’ అని ఉద్వేగంతో అన్నారు. ‘నీ విలువ అమర్లో నాలుగో వంతు కూడా చేయదు’ అని అఖిలేశ్ను పరోక్షంగా తప్పుపట్టారు. మాఫియా డాన్ ముక్తార్ అన్సారీకి చెందిన క్యూఈడీ పార్టీ ఎస్పీ విలీన అంశంపై స్పందిస్తూ.. అ న్సారీని పార్టీలోకి ఎప్పుడూ తీసుకోలేదన్నారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులు సులువుగా గెలిచేందుకు విపక్ష ఎమ్మెల్యేల మద్దతుకు ఎంతో కృషి చేశానని తెలిపారు. ‘ప్రభుత్వ ఏర్పాటులో నా పాత్ర ఏమీ లేదా? నా ఆధ్వర్యంలోని శాఖలు సమర్థంగా పనిచేయలేదా? విపక్ష నేతలూ నా పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. నేను ఏది సరిగా చేయలేదో సీఎం చెప్పాలి. నన్ను ఆహ్వానించకపోయినా... నేను సీఎం ఇంటికి వెళ్లేవాడిని’ అని అన్నారు. అఖిలేశ్, శివపాల్ వర్గాలకు చెందిన కార్యకర్తలు తామేం తీసిపోలేదంటూ లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పరస్పరం నినాదాలు చేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. అఖిలేశ్కు నా ఆశీస్సులు: అమర్సింగ్ తనపై ఆరోపణలు, ప్రశ్నలకు కొన్నిసార్లు మౌనం మంచి సమాధానం అవుతుందని అమర్ సింగ్ అన్నారు. అఖిలేశ్ తమ అధినేత కుమారుడని, అతనికి తన ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు. మళ్లీ సయోధ్య? ములాయంతో అఖిలేశ్, శివ్పాల్ భేటీ సాక్షి, న్యూఢిల్లీ: అఖిలేశ్, శివపాల్ల మధ్య సోమవారం గొడవ అనంతరం తాత్కాలిక సంధి కోసం ములాయం పావులు కదిపారు. సీఎంగా అఖిలేశ్ కొనసాగుతారని, పార్టీ బాధ్యతలు శివ్పాల్ చూసుకుంటారనే ఒప్పందాన్ని ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై ఇక మాట్లాడేది లేదని, తన ఆరోగ్యం సరిలేదని ములాయం స్పష్టం చేశారు. ఇరు వర్గాలు కొంత మేర శాంతించాయని, త్వరలోనే సంధి కుదిరే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే సోమవారం రాత్రి అఖిలేశ్, శివపాల్లు ములాయంతో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో ఎక్కువ పార్టీ టికెట్లు తమ వర్గీయులకే ఇప్పించుకునే క్రమంలో ఈ కుమ్ములాటలు మొదలయ్యాయని భావిస్తున్నారు. సీఎంకు అనుకూలంగా ఉన్నవారికి టికెట్లు ఇస్తే పార్టీ ఓటమి తప్పదని శివ్పాల్ వాదన. తమ వర్గీయులకు టికెట్లు రాకుండా అడ్డుపడుతున్నారనేది అఖిలేశ్ ఆరోపణ. పార్టీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలో తానే నిర్ణయిస్తానని ములాయం వారిద్దరికీ స్పష్టం చేశారు. పార్టీ క్లిష్ట పరిస్థితులలో ఉందని, ఈ సమయంలో ఆధిపత్యం కోసం గొడవ అవివేకమని ములాయం చెప్పారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఈ కుమ్ములాటలతో పలు వర్గాలతో పాటు ప్రత్యేకించి మైనార్టీలకు పార్టీ దూరమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్పీ తగాదాలతో బహుజన్ సమాజ్ పార్టీ లబ్ది పొందే అవకాశం ఉందనేది వారి విశ్లేషణ. అఖిలేశ్ సీఎంగా ఉన్నా.. పాలనలో ములాయం జోక్యం కొనసాగుతూనే ఉం ది. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న అనితాసింగ్ ద్వారా వ్యవహారాల్ని ములాయం చక్కబెట్టేవారు. ఈ విషయంలో అఖిలేశ్ అసంతృప్తిగా ఉన్నారు. అలాగే కీలక శాఖలైన నీటి పారుదల, పీడబ్ల్యూడీ(ప్రజా పనులు) శివ్పాల్ ఆధ్వర్యంలో ఉండడం తో భారీ ప్రాజెక్టులు ఆయన కనుసన్నల్లో నడిచేవి. ఆ శాఖలకు సంబంధించి తన మాట చెల్లుబాటు అవ్వకపోవడం అఖిలేశ్కు ఆగ్రహం తెప్పించింది. -
మోదీపై ములాయం అనూహ్య వ్యాఖ్యలు
లక్నో: బీజేపీ నాయకుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సమయం వచ్చినప్పుడల్లా విరుచుకుపడే ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తాజాగా అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అఖిలేశ్-శివ్పాల్ యాదవ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ సంక్షోభాన్ని చల్లార్చేందుకు ములాయం లక్నోలో పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రధాని మోదీని చూడండి. అకింతభావం, అకుంఠిత శ్రమతో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన తన తల్లిని వీడబోనని ఎప్పుడూ చెప్తూ ఉంటారు' అని ములాయం ప్రశంసించారు. అదేవిధంగా తాను తమ్ముడు శివ్పాల్ యాదవ్ను, సీనియర్ నేత అమర్సింగ్ను వీడబోనని స్పష్టం చేశారు. "అమర్ సింగ్ నాకు సోదరుడు లాంటివాడు. కష్టసమయాల్లో ఎన్నోసార్లు నాకు అండగా నిలిచాడు. శివ్పాల్ ప్రజానాయకుడు. నా కోసం, పార్టీ కోసం శివ్పాల్ చేసిన కృషిని నేను ఎప్పటికీ మరువను. వారిద్దరినీ వదులుకోలేను' అని ములాయం అన్నారు. అమర్ సింగ్ చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోయాయని, ఆయనను తప్పుబట్టడానికి ఏమీ లేదని చెప్పారు. -
మీ కన్నా నేనే పెద్ద గూండాను!
లక్నో: సమాజ్వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం నేపథ్యంలో కొడుకు అఖిలేశ్ యాదవ్ను ఉద్దేశించి పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న యువత కన్నా తానే పెద్ద గూండానని తేల్చిచెప్పారు. కొడుకు అఖిలేశ్, బాబాయి శివ్పాల్ యాదవ్ మధ్య ఆధిపత్యం కోసం ఎస్పీలో తీవ్రస్థాయిలో రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా శివ్పాల్తోపాటు ఆయన సన్నిహిత మంత్రులపై సీఎం అఖిలేశ్ వేటు వేయగా.. అఖిలేశ్ సన్నిహితుడు రాంగోపాల్ యాదవ్ను పార్టీ నుంచి శివ్పాల్ యాదవ్ గెంటేసిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ శివ్పాల్-అఖిలేశ్ మధ్య నిట్టనిలువుగా చీలిపోయింది. ఈ నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ఎస్పీ అత్యవసర భేటీని ములాయం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఊహించినట్టుగానే అఖిలేశ్పై పరోక్ష వ్యాఖ్యలతో ములాయం విరుచుకుపడ్డారు. అదేసమయంలో ఈ సంక్షోభానికి కారణమైనట్టు భావిస్తున్న తమ్ముడు శివ్పాల్, సీనియర్ నేత అమర్సింగ్కు మద్దతు పలికారు. ఆయన ఏమన్నారంటే.. పార్టీలో ప్రస్తుత పరిస్థితి ఎంతో క్లిష్టమైనదని నాకు తెలుసు. పార్టీలో ఇలాంటి విభేదాలు రావడం బాధ కలిగిస్తోంది ఎంతో కష్టపడి మేం ఈ పార్టీని స్థాపించాం. మేం యువతకు ప్రాధాన్యం ఇచ్చాం. యువత పార్టీలో ఎక్కువసంఖ్యలో చేరేవిధంగా పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేశాం. కానీ ఈ పార్టీలో చేరిన యువ నాయకులు తమకుతాము గూండాలం అనుకుంటున్నారు. కానీ నేను వారి కన్నా ఇంకా పెద్ద గూండాను. ఇది నేను స్థాపించిన పార్టీ. ఈ రోజుకూ నేను బలహీన వ్యక్తిని కాదు. యువత నా వెంట లేరని ఎంతమాత్రం అనుకోకండి. విమర్శలను చెవికెక్కించుకోలేని వారు నాయకుడిగా ఎదగలేరు కొంతమంది మంత్రులు భజనపరులుగా మారిపోయారు. పెద్ద మనసుతో ఆలోచించలేనివారు మంత్రులు కాలేరు. పార్టీలోని బలహీనతలపై పోరాడాల్సిన సమయంలో మనలో మనం పోరాడుకుంటున్నాం. భజనపరులతో, నినాదాలతో పార్టీని నడిపించలేం. -
కన్నీళ్లు పెట్టిన అఖిలేశ్ యాదవ్
లక్నో: సమాజ్ వాదీ పార్టీలో చీలిక దిశగా వెళుతోందన్న సంకేతాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మౌనం వీడారు. తన తండ్రితో ఎటువంటి విభేదాలు లేవని, కొత్త పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. లక్నోలో పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. నేతాజీ(ములాయం సింగ్ యాదవ్) కోరితే సీఎం పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లో అఖిలేశ్ ముఖ్యమంత్రి కాదని అమర్ సింగ్ గత నవంబర్ లో చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని చెప్పారు. రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యలు చేయకపోయినా ఆయనపై చర్య తీసుకున్నారని వాపోయారు. 'నేను కొత్త పార్టీ పెడతానని కొంత మంది అంటున్నారు. కొత్త పార్టీ ఎవరు పెడుతున్నారు. నేనైతే పార్టీ పెట్టడం లేద'ని అఖిలేశ్ అన్నారు. అయితే అఖిలేశ్ కు భిన్నమైన వాదన వినిపించారు శివపాల్ యాదవ్. కొత్త పార్టీ పెడతానని తనతో అఖిలేశ్ స్వయంగా చెప్పాడని వెల్లడించారు. పార్టీ సమావేశంలో శివపాల్ యాదవ్ ప్రసంగించేందుకు లేవగానే అఖిలేశ్ వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అఖిలేశ్ జోక్యం చేసుకున్నారు. 'ఇక్కడ చాలా మంది అయోమయాన్ని సృష్టిస్తున్నారు. ముందుగా ములాయం, శివపాల్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి. ప్రతి ఒక్కరూ ములాయం బాటలో నడుస్తున్నారు. ఆ మార్గంలో వీలైనన్ని విజయాలు సాధించాను. అన్యాయాన్ని ఎదుర్కొమని నా తండ్రి నాకు బోధించారు. ములాయం ఆదేశాలను శిరసావహించాను. పార్టీలో జరిగిన కుట్రపై తప్పకుండా విచారణ జరిపిస్తా. ములాయం కోరితేనే ప్రజాపతిని మంత్రి పదవి నుంచి తొలగించాను. ఆయన మనసులో ఏముందో తెలుసుకోవాలని కార్యకర్తలు కోరుకుంటున్నార'ని అఖిలేశ్ యాదవ్ అన్నారు. -
త్వరలో అఖిలేశ్ కొత్త పార్టీ?
ఎస్పీ కీలక భేటీకి సీఎం డుమ్మాతో బలపడుతున్న అనుమానాలు లక్నో: యూపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార సమాజ్వాదీ పార్టీని సమస్యలు చుట్టుముడుతున్నాయి. మెజారిటీ వస్తే ఎమ్మెల్యేలే సీఎంను ఎన్నుకుంటారని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇటీవల ప్రకటించటం, బాబాయ్ శివ్పాల్తో విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో సీఎం అఖిలేశ్ కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎస్పీలో చీలిక తప్పదని.. త్వరలోనే ‘జాతీయ సమాజ్వాదీ పార్టీ’ లేదా ‘ప్రగతిశీల్ సమాజ్వాద్ పార్టీ’ పేరుతో కొత్త కుంపటి పెట్టేందుకు అఖిలేశ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగానే అంతా పూర్తి చేసి మోటార్ సైకిల్ గుర్తుతో ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాలు రచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మొన్నటివరకు ఉమ్మడి కుటుంబంగా ఉన్న యాదవ్ ఫ్యామిలీ నుంచి విడిపోయిన అఖిలేశ్.. ఇటీవలే సీఎం అధికారిక నివాసానికి మకాం మార్చారు. నవంబర్ 5న పార్టీ రజతోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగానే.. 3నుంచి ‘వికాస్ రథయాత్ర’ చేపట్టాలని నిర్ణయించారు. ఇవన్నీ పార్టీలో చీలిక తప్పదనే సంకేతాలను బలపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎస్పీ ముఖ్యనేతలతో శుక్రవారం జరిగిన సమావేశానికి అఖిలేశ్ గైర్హాజరయ్యారు. ఈ భేటీ పూర్తయ్యాక ఆ నాయకులతోనే సీఎం తన నివాసంలో వేరుగా సమావేశమై నవంబర్ 3నుంచి జరగనున్న ‘వికాస్ రథయాత్ర’ గురించి మాట్లాడారు. అఖిలేశ్ కొత్త పార్టీ యత్నాలపై వార్తల నేపథ్యంలో.. ఎస్పీలో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే.. అఖిలేశ్ సీఎం అవుతారని శివ్పాల్ శుక్రవారం తెలిపారు. -
'సీఎంకు చేతబడి చేయించింది!'
లక్నో: రోజుకో మలుపు తిరుగుతున్న యాదవ్ పరి'వార్'లో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. 'సవతి కొడుకు ఎదుగుదలను చూడలేని ఆ మారుతల్లి మా ముఖ్యమంత్రికి చేతబడి చేయించింది' అని అఖిలేష్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ సింగ్ విమర్శించారు. ఈ మేరకు పార్టీ చీఫ్ ములాయం కు రాసిన లేఖలో ఉదయ్ వీర్ సంచలన ఆరోపణలు చేశారు. శివపాల్ యాదవ్ తో కుమ్మక్కైన సాధన.. సీఎం అఖిలేష్ ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, చేతబడి కూడా చేయించారని ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ లేఖలో రాశారు. ములాయం సింగ్ తన పదవి నుంచి వైదొలిగి పార్టీ బాధ్యతలు అఖిలేష్ కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, అంతర్గతంగా రాసిన ఈ లేఖ మీడియాకు ఎలా బహిర్గతమైందో తెలియదని ఉదయ్ వీర్ అంటున్నారు. ఈ లేఖపై అగ్గిమీద గుగ్గిలమైన ములాయం వర్గీయులు.. 'ఇలాంటి లేఖలు కనీసం 500 ఓట్లను కూడా రాలవని, ఇంకోసారి నేతాజీ(ములాయం)ని తప్పుకోవాలనంటే తాట తీస్తామ'ని అఖిలేష్ వర్గాన్ని హెచ్చరించారు. ఎవరీ సాధన యాదవ్? సాధనా గుప్తా యాదవ్.. సమాజ్ వాదీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య. 2007లో ములాయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటి నుంచి యాదవ్ పరివారంలో సాధన 'ఫస్ట్ లేడీ'గా కొనసాగుతున్నారు. ములాయం మొదటి భార్య ముల్తీ యాదవ్ 2003లో కన్నుమూశారు. ఆమె చనిపోవడానికి చాలా ఏళ్ల ముందే ములాయం సాధనను రహస్యంగా పెళ్లిచేసుకున్నారు. మొదట్లో సమాజ్ వాది కార్యకర్తగా పనిచేసిన సాధనను ములాయం పలు సందర్భాల్లో కలుసుకోవడం, ఇద్దరి మధ్యా చనువు పెరగడంతో ఒక శుభ దినాన పెళ్లాడారు. అయితే ఎక్కడ పెళ్లిచేసుకున్నారనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఈ ఇరువురికీ (1988లో)జన్మించిన ప్రతీక్ యాదవ్ ప్రస్తుతం యూపీలో బడా రియల్టర్. రెండో పెళ్లి విషయాన్ని చాలా కాలం దాచే ప్రయత్నం చేసిన ములాయం.. రాజకీయ విమర్శల నేపథ్యంలో 2007లో ఆ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న అంతర్గత సంక్షోభంలో సాధన తన భర్త ములాయం వర్గానికి అనుకూలంగా, మారు కొడుకు అఖిలేఖ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు ఇటీవలి కాలంలో విమర్శలు ఎక్కువయ్యాయి. -
తండ్రి వర్సెస్ తనయుడు..!
లక్నో: అధికార సమాజ్వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు మరోసారి భగ్గుమంది. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. పార్టీలో రగులుతున్న అంతర్గత ఆధిపత్య పోరును మరోసారి బట్టబయలు చేస్తూ తాజాగా తండ్రి ములాయంకు అఖిలేశ్ లేఖ రాశారు. రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరిస్తూ వచ్చేనెల మూడు నుంచి "సమాజ్వాదీ వికాస్ రథయాత్ర' ప్రారంభిస్తానని అఖిలేశ్ ఈ లేఖలో స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ రథయాత్ర ఈ నెల 3న జరగాల్సి ఉండగా.. అనుకోని కారణాలు, అంతర్గత విభేదాల కారణంగా వాయిదా పడింది. అయితే, వచ్చేనెల 5న సమాజ్వాదీ పార్టీ రజతోత్సవం జరగనుంది. ఈ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా జరపాలని ములాయం వర్గం భావిస్తుండగా.. దానికన్న ముందే అఖిలేశ్ ప్రచార పర్వానికి తెరలేపుతుండటం గమనార్హం. దీంతో ఎస్పీ పాతికేళ్ల ఉత్సవాన్ని బహిష్కరించాలని అఖిలేశ్ భావిస్తున్నారని, అందుకే అంతకన్నా రెండు రోజుల ముందే ప్రచార రథయాత్రకు శ్రీకారం చుడుతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారపర్వాన్ని ప్రారంభించాయని, కాబట్టి అధికార పార్టీ ఎస్పీ కూడా ప్రచారాన్ని ప్రారంభించాల్సిన అవసరముందని, ఇందుకు అనుమతి ఇవ్వాలంటూ తండ్రి ములాయంకు ఈ లేఖలో అఖిలేశ్ విజ్ఞప్తి చేశారు. ఈ లేఖలో బాబాయిలు శివ్పాల్ యాదవ్, రాంగోపాల్ యాదవ్ల పేర్లను కూడా ప్రస్తావిస్తూ.. వారికి కూడా పంపడం గమనార్హం. బాబాయి శివ్పాల్-అబ్బాయి అఖిలేశ్ మధ్య ఎస్పీలో ఆధిపత్య పోరుకు తెరలేచిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కొడుకు అఖిలేశ్ కన్నా తమ్ముడు శివ్పాల్కే ములాయం మద్దతు పలికారు. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న శివ్పాల్ యాదవ్కు ములాయం పూర్తి అధికారాలు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో గుర్రుగా ఉన్న అఖిలేశ్ వర్గం ప్రచారంలో పైచేయి సాధించాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. కాగా, అఖిలేశ్ లేఖను శివ్పాల్ వర్గం తీవ్రంగా తప్పుబడుతున్నది. -
'ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చడం సరికాదు'
హైదరాబాద్ : భారత సైన్యాన్ని ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చడం సరికాదని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పెద్ద మనుషులే ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 47 మంది ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ కొనుగోలు చేసి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రజలను మతల పరంగా చీల్చడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. అందుకే అయోధ్య వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చిందని ఉత్తమ్ మండిపడ్డారు. -
'నమో' కంటే మంచి బ్రాండా? నో చాన్స్!
అయోధ్య: ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అనేదానిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. 'ఈ ఎన్నికల్లో బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించబోదు'అని యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ మౌర్య స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ(నమో) బ్రాండ్ తోనే ఎన్నికల్లో తలపడతామని పేర్కొన్నారు. 'కులసమీకరణాల చిక్కుముడులకు కొదువలేని యూపీలో ఏదో ఒక కులానికి చెందిన అభ్యర్థిని ప్రకటించి, మిగతా వారిని అసంతృప్తికి గురిచేసేకంటే సీఎం అభ్యర్థి లేకుండా ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నాం' అని యూపీ బీజేపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ వినయ్ కటియార్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం చేస్తోన్న అభివృద్ధి పనులను వివరించి ఓట్లు అడుగుతామని, గెలిచిన తర్వాత అందరిలోకి సమర్థుడైన నాయకుడిని ముఖ్యమంత్రిగా పార్టీనే నిర్ణయిస్తుందని కటియార్ అన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ చాలా కాలం కిందటే షీలా దీక్షిత్ ను తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. బీఎస్సీకి మాయవతి ఎలాగూ ఉన్నారు. ఇక అధికార సమాజ్ వాది పార్టీ సీఎం అభ్యర్థి ప్రకటనపై మల్లగుల్లాలు పడుతోంది. బీజేపీ నమో బ్రాండ్ తోపాటు రామబాణాన్ని సైతం సంధించే ప్రయత్నంలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అయోధ్యలో 'రామాయణ మ్యూజియం' నిర్మించతలపెట్టింది. మ్యూజియం ప్రతిపాదిత ప్రాంతాన్ని మంగళవారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. అయోధ్యలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకే మ్యూజియం నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ఈ నిర్ణయానికి, యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లాగే అయోధ్యలోనూ కొత్త పర్యాటక ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పారు. అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమికి 15 కిలో మీటర్ల దూరంలో 25 ఎకరాల స్థలంలో నిర్మించనున్న 'రామాయణం మ్యూజియం'లో వాల్మికి రామాయణానికి సంబంధించిన అనేక రూపాలను పొందుపర్చనున్నారు. -
అన్నయ్యా.. చరిత్ర ఎవ్వరినీ క్షమించదు!
- ఎన్నికల్లో 100 సీట్లైనా గెలవకుంటే బాధ్యుడివి నువ్వే - ఎస్పీ చీఫ్ ములాయంకు తమ్ముడు రాంగోపాల్ ఘాటులేఖ లక్నో: 'అన్నయ్యా.. కొడుకును కాదని నీకు ప్రీతిపాత్రుడైన తమ్ముణ్ణి(శివపాల్ యాదవ్ను)వెనకేసుకొస్తున్నావ్. మంచిది. వచ్చే ఎన్నికల్లో మన పార్టీ కనీసం 100 సీట్లు కూడా గెలుచుకోలేకపోతే దానికి బాధ్యుడివి నువ్వే. ఇంత చేస్తున్న నువ్వు అసలు చరిత్రను ఒక్కసారైనా పరికించావా? చరిత్ర.. చాలా క్రూరమైనది. ఏ ఒక్కరినీ క్షమించదు' అంటూ సమాజ్ వాది పార్టీ ముఖ్యనేత రాంగోపాల్ యాదవ్.. తన పెద్దన్న, పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కు శనివారం ఘాటు లేఖ రాశారు. 2017 ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సీఎం అభ్యర్థి కాబోడంటూ ఇటీవల ములాయం చేసిన వ్యాఖ్యలపై రాంగోపాల్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. చాలా కాలంగా కొడుకు అఖిలేష్, తమ్ముడు శివపాల్ ల మధ్య నడుస్తోన్న ఆధిపత్య పోరును సమం చేయాలని ములాయం భావిస్తున్నారని, ఆ క్రమంలో పెద్దాయన తమ్ముడివైపు మొగ్గుతున్నారని రాంగోపాల్ యాదవ్ తన లేఖలో ఆక్షేపించారు. తన అద్భుతమైన పరిపాలనతో సీఎం అఖిలేష్ యూపీ ప్రజల మన్ననలు పొందారని, 2017 ఎన్నికల్లోనూ అఖిలేష్ నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని, లేకుంటే దారుణమైన ఫలితాలు చవిచూడాల్సి వస్తుందని రాంగోపాల్ అభిప్రాయపడ్డారు. మొదటి నుంచి సోదరుడు శివపాల్ యాదవ్ ను వ్యతిరేకిస్తోన్న రాంగోపాల్ యాదవ్.. ఆధిపత్య పోరులో సీఎం అఖిలేష్ పక్షాన నిలబడ్డారు. ప్రస్తుతం అఖిలేష్ టీంలో ప్రధాన వ్యూహకర్త రాంగోపాలే. ఆధిపత్యం కోసం ఇప్పటిదాకా జరిగిన పోరులో అఖిలేష్ వర్గం ఏనాడూ పార్టీ సుప్రీం ములాయంను నేరుగా విమర్శించలేదు. ఇప్పుడా కొరత తీర్చుతూ రాంగోపాల్.. ములాయంపై ఘాటులేఖాస్త్రాన్ని సంధించారు. దీనిపై వైరిపక్షం స్పందించాల్సిఉంది. -
'అభినందించాల్సింది సైన్యాన్ని.. మంత్రిని కాదు'
లక్నో: భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడుల ద్వారా బీజేపీ పొలిటికల్ మైలేజీ పొందాలనుకుంటోందని బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత మాయావతి అన్నారు. గౌరవం, సన్మానం దక్కాలంటే అది ఒక్క భారత జవాన్లకు మాత్రమే దక్కాలని రక్షణమంత్రికో ప్రధానికో కాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సర్జికల్ దాడులు ఉపయోగించుకొని బీజేపీ రాజకీయంగా మరింత ఎదగాలని భావిస్తోందని చెప్పారు. సర్జికల్ దాడులపై ఇష్టమొచ్చినట్లుగా ప్రకటనలు చేయొద్దని తమ పార్టీ నేతలకు, మంత్రులకు చెప్పినప్పటికీ చెవిటి వాళ్లలాగే అలాగే ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. హోర్డింగులు పెట్టొద్దని, పోస్టర్లు వేయొద్దని, ఎలాంటి ప్రకటనలు చేయొద్దని బీజేపీ తమ వాళ్లకు చెప్పినా రాజకీయంగా లబ్ధిపొందేందుకు అదే దోరణితో వ్యహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా మోదీ రెచ్చగొట్టే అంశాలను భాగా ప్రోత్సహిస్తారని, వాటి ద్వారా మేలు పొందాలని ఆయన ముందునుంచే ఆలోచించేవారని, తాజాగా పాక్-భారత్ మధ్య ఘర్షణను కూడా అలాగే ఉపయోగించుకుంటున్నారని మరోసారి స్పష్టమైందంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. -
భార్య హంతకుడికి అసెంబ్లీ టికెటా: సీఎం
సమాజ్వాదీ పార్టీలో మళ్లీ ముసలం మొదలైనట్లే కనిపిస్తోంది. బాబాయ్ - అబ్బాయి మధ్య పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ రాజీ చేసినా.. గొడవలు మాత్రం ఏమాత్రం తగ్గినట్లు లేవు. భార్యను చంపిన కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటున్న అమన్మణి త్రిపాఠీ అనే వ్యక్తికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ ప్రకటించిన కొద్దిసేపటికే.. అసలు అతడికి టికెట్ ఇచ్చినట్లే తనకుతెలియదని సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. త్రిపాఠీ తల్లిదండ్రులు మాజీ మంత్రి అమర్మణి, ఆయన భార్య మధుమణి త్రిపాఠీ కూడా హత్యకేసులలో దోషులే. అలాంటి వ్యక్తికి మహరాజ్గంజ్ జిల్లా నౌతన్వా నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చారు. త్రిపాఠీ భార్య రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే, ఆయనే ఆమెను చంపేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఆరోపించడంతో దీనిపై సీబీఐ విచారణకు ఇంతకుముందు సీఎం అఖిలేష్ యాదవ్ ఆదేశించారు. ఇలాంటి కేసులో ఉన్న త్రిపాఠీకి పార్టీ టికెట్ ఇవ్వడంపై నిజాయితీగా సమాధానం ఇవ్వాలని మీడియా గట్టిగా అడిగింది. దానికి సీఎం స్పందిస్తూ.. ''ఇది పార్టీ అంతర్గత వ్యవహారం. నా అభిప్రాయం ఏంటో మీకు ఇంతకుముందే తెలుసు. నేను కొన్ని అలవాట్లు మార్చలేను. నాకు ఈ విషయం గురించి తెలియదు. నేను ఏదో కార్యక్రమ ప్రారంభంలో ఉన్నాను'' అని ఆయన సమాధానం చెప్పారు. సమాజ్వాదీ పార్టీ నుంచి నేర చరితులను పూర్తిగా తరిమేసి.. పార్టీకి 'క్లీన్' ఇమేజి తేవాలన్నదే తన ఉద్దేశమని అఖిలేష్ పలు సందర్భాల్లో చెప్పారు. మాఫియా నాయకుడిగా ఉండి, రాజకీయాల్లో్కి వచ్చిన ముఖ్తార్ అన్సారీ స్థాపించిన ఖ్వామీ ఏక్తా దళ్ను సమాజ్వాదీలో విలీనం చేయాలని శివపాల్ యాదవ్ సహా పలువురు ప్రతిపాదించినప్పుడు అఖిలేష్ తీవ్రస్థాయిలో దాన్ని వ్యతిరేకించారు. దాంతో ఆ నిర్ణయం వెనక్కి వెళ్లింది. -
రైల్వే బడ్జెట్ విలీనానికి ఓకే
-
రైల్వే బడ్జెట్ విలీనానికి ఓకే
ఫిబ్రవరి 1నే సాధారణ బడ్జెట్ - యూపీ ఎన్నికల తేదీల ఆధారంగా 2017-18 ఏడాది బడ్జెట్ తేదీ ప్రకటన - వివేక్ దేవ్రాయ్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం - ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం విధానానికీ చెల్లుచీటి న్యూఢిల్లీ: దాదాపు శతాబ్దకాలంగా(92 ఏళ్లుగా) అమల్లో ఉన్న విధానానికి తెరదించుతూ.. వేరుగా ఉండే రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్తో కలిపి ప్రవేశపెట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం.. కేంద్ర బడ్జెట్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు.. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల విధానానికి స్వస్తి చెప్పాలని దీని ద్వారా బడ్జెట్ను మరింత సరళతరం చేయాలని నిర్ణయించింది. కేబినెట్ భేటీ వివరాలను మీడియాకు వెల్లడించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఫిబ్రవరి నెల చివరి రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలనే విధానాన్ని పక్కన పెట్టి.. ఈ తేదీని ఫిబ్రవరి 1కి మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఏ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారనే అంశాన్ని వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా వెల్లడిస్తామన్నారు. ఒకే బడ్జెట్ వల్ల దేశ ఆర్థిక స్థితిని సమగ్రంగా ఆవిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడైన వివేక్ దేవ్రాయ్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విలీనంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విలీనం ద్వారా రైల్వేల గుర్తింపు పోకుండా వ్యవహరిస్తామన్నారు. రైల్వేలకు లాభమే: సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ విలీనం వల్ల రైల్వే శాఖకు ఎలాంటి నష్టమూ రాదని ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. అంతే కాకుండా రైల్వేల మూలధన వ్యయం పెంచుకోవచ్చన్నారు. ఆర్థిక, రైల్వే శాఖల మధ్య మరింత సమన్వయం ఏర్పడుతుందన్నారు. రైల్వేలు ప్రభుత్వానికి డివిడెండు చెల్లించనక్కర్లేదన్నారు.అయితే ప్రస్తుతానికి 7వ వేతన కమిషన్ అమలు చేసేందుకు రైల్వేలపై రూ. 40వేల కోట్లు, ప్రయాణికులకు సబ్సిడీల రూపంలో మరో రూ. 35వేల కోట్ల భారాన్ని రైల్వే శాఖ మోయాల్సిందే. ‘నమామి గంగే’ వేగవంతం: ‘నమామి గంగే’ అమలుకోసం కార్యాచరణను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జాతీయ గంగానది బేసిన్ అథారిటీ స్థానంలో గంగానది జాతీయ కౌన్సిల్ ఏర్పాటు చేయనుంది.కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి ఈ టాస్క్ఫోర్స్కు అధ్యక్షురాలిగా ఉంటారు. గంగానది నీటిని కలుషితం చేసేవారిపై చట్టపరంగా శిక్ష తీసుకునేలా.. స్వచ్ఛ గంగా జాతీయ మిషన్కు అథారిటీ హోదా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు.. ► స్వాతంత్య్ర సమరయోధులకిచ్చే పింఛనును కేంద్రం గణనీయంగా పెంచింది. అండమాన్తోపాటు భారత్ వెలుపల జైళ్లలో శిక్ష అనుభవించినవారి బంధువుల(భార్య, పిల్లలు) పింఛన్ను రూ. 5వేలు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సమరయోధుల పింఛను (అన్నిరకాల), పొందుతున్న వారికి అదనంగా 20 % పెంపును కల్పించనున్నట్లు తెలిపింది. ఈ పెంపు(డియర్నెస్ రిలీఫ్) 2016 ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. ► పప్పుధాన్యాలు, నూనెలు, నూనె గింజల నిల్వ విషయంలో వ్యాపారులు, దళారులపై విధించిన నిల్వ పరిమితిని మరో ఏడాది కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నెలాఖరుతో ఈ పరిమితి గడువు ముగియనుంది. ► నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన అడిమిరల్టీ(షిప్పింగ్ వివాదాల్లో న్యాయ పరిధి, ఒప్పందం, తీరప్రాంత సమస్యలు) బిల్లు, 2016ను కూడా ఆమోదించింది. ► అండమాన్ నికోబార్ దీవుల్లో టెలికం సేవలను విస్తరించేందుకు రూ. 1,102.38 కోట్లతో చెన్నై నుంచి అండమాన్కు కేబుల్ లింక్ ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2018 కల్లా ఈ ప్రాజెక్టు పూర్తికావాలని ఆదేశించింది. సపర్యాటక రంగ పురోగతి కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో గుర్తించిన 26 దీవులను (తొలివిడతగా)వేగంగా అభివృద్ధి చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. కాగా, బడ్జెట్ల విలీనం వల్ల రైల్వేల స్వయం ప్రతిపత్తికి భంగం కలుగుతున్నందని, ఇది సరైన నిర్ణయం కాదని మాజీ రైల్వే మంత్రి, బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. -
కొడుక్కి ఝలక్ ఇచ్చిన ములాయం
లక్నో: కొడుకు అభ్యంతరాలను తోసిరాజని సమాజ్ వాదీ పార్టీ అధినాయకుడు ములాయం సింగ్ యాదవ్ తనకు అత్యంత సన్నిహితుడైన అమర్ సింగ్ కు ప్రమోషన్ ఇచ్చారు. ఆయనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇటీవల పార్టీలో తలెత్తిన సంక్షోభానికి అమర్ సింగ్ కారణమంటూ పరోక్షంగా అఖిలేశ్ యాదవ్ విమర్శలు చేసినా ములాయం పట్టించుకోలేదు. ‘మిమ్మల్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించాం. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడానికి పాటు పడాల’ని అమర్ సింగ్ కు రాసిన లేఖలో ములాయం పేర్కొన్నారు. క్లుప్తంగా హిందీలో రాసిన లేఖపై ములాయం సంతకంతో కూడిన ప్రకటన ఆయన యూపీ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ ఈ-మెయిల్ నుంచి మీడియాకు అందింది. 2010లో పార్టీ నుంచి బహిష్కృతుడైన అమర్ సింగ్ ఇటీవల సొంతగూటికి తిరిగొచ్చారు. ఆయన పునరాగమనాన్ని పార్టీలోని సీనియర్ నాయకులు వ్యతిరేకించినా ములాయం లెక్కచేయకుండా రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు. ఇప్పుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి కుమారుడికి ఝలక్ ఇచ్చారు. ‘బయటి వ్యక్తి’ కారణంగానే తమ పార్టీలో ఇటీవల సమస్యలు తలెత్తాయని అఖిలేశ్ పరోక్షంగా అమర్ సింగ్ పై విమర్శలు చేశా -
ఫ్యామిలీ మొత్తం రాజీనామా.. కానీ!
సమాజ్వాదీ పార్టీలో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. అది ఓ కొలిక్కి రాలేదు. పైకి అంతా సమసిపోయినట్లే కనిపిస్తున్నా, ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. పార్టీ పదవులు, ఇతర పదవులకు శివపాల్ యాదవ్, ఆయన భార్య, కుమారుడు అందరూ రాజీనామాలు చేశారు. కానీ వాటిని ఇంకా ఎవరూ ఆమోదించలేదు. మరోవైపు తాజాగా పార్టీ కార్యాలయం నుంచి అధినేత ములాయం సింగ్ యాదవ్ ఒక ప్రకటన చేశారు. సమాజ్వాదీ పార్టీ మొత్తం ఒక కుటుంబం లాంటిదని, తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన తెలిపారు. మంత్రిపదవికి శివపాల్ చేసిన రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు అఖిలేష్ ప్రకటించినా, శివపాల్ మాత్రం ఆమోదించాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. శివపాల్ కుమారుడు ఆదిత్య యాదవ్ తన ప్రాదేశిక సహకార సమాఖ్య చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అఖిలేష్ చర్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన శివపాల్ వెళ్లిపోతానని చెప్పినా, పార్టీ.. ప్రభుత్వం రెండింటిలోనూ ఆయన పాత్ర ఉండాల్సిందేనని పెద్దన్న ములాయం సింగ్ యాదవ్ పట్టుబట్టారు. పార్టీలో గట్టిపట్టున్న శివపాల్ లాంటి నాయకులు వెళ్లిపోతే.. అది చీలికకు దారితీస్తుందన్నది పెద్దాయన భయంలా కనిపిస్తోంది. నిమిషానికో రకంగా మారుతున్న యూపీ రాజకీయాలు ఇక మీదట ఏమవుతాయో చూడాల్సి ఉంది. -
సీఎం ఇంట్లో అసలు ఏమైంది?
అప్పటివరకు అంతా బాగానే ఉందనుకున్నారు.. పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తానని శివపాల్ చెప్పారు. అన్నయ్య నిర్ణయమే అంతిమం అని.. దాన్ని ఎవరూ కాదనలేరని కూడా అన్నారు. 2017 ఎన్నికల్లో అఖిలేశ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అన్నయ్య నిర్ణయిస్తే.. దానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా ఆయన తెలిపారు. కాసేపటి తర్వాత.. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇంటికి వెళ్లారు.. అక్కడ ఇద్దరి మధ్య 20 నిమిషాల పాటు సమావేశం జరిగింది. పెద్దాయన చెప్పాడు కాబట్టి.. అబ్బాయి కాస్త మెత్తబడతాడని అనుకున్నాడు. కానీ, ఆ 20 నిమిషాల భేటీలో ఇద్దరి మధ్య ఏం చర్చలు జరిగాయో, ఏ స్థాయిలో జరిగాయో తెలియదు. రాత్రి 9 గంటల సమయంలో శివపాల్ ఇంటికి తిరిగొచ్చారు. తెల్ల కాగితాలు తీసుకుని పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఒక లేఖ, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మరో లేఖ రాసేశారు. తన వ్యక్తిగత సహచరుడు ఒకరిని పిలిచి.. వాటిలో ఒకటి ములాయం సింగ్ యాదవ్కు, మరొకటి అఖిలేష్కు ఇచ్చి రమ్మని చెప్పారు. కొద్ది నిమిషాల్లోనే మీడియాలో ఈ విషయం భారీగా ప్రచారం అయ్యింది. శివపాల్ ఎందుకు రాజీనామా చేశారో ఎవరికీ తెలియలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ములాయం తనవైపే మొగ్గు చూపించారు కాబట్టి, తన నుంచి తీసేసిన ముఖ్యమైన మంత్రిత్వశాఖలను అఖిలేష్ మళ్లీ ఇస్తారని శివపాల్ భావించారు. కానీ అలా జరగలేదు. ఆ పదవులను గనక తిరిగిస్తే శివపాల్ ఉండేవారని, అలా జరక్కపోవడంతో ఆయన అహం దెబ్బతిని అన్నింటికీ రాజీనామా చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేవలం మంత్రిపదవికి మాత్రమే రాజీనామా చేసి ఉంటే.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడానికి ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని అంతా అనుకునేవారు. తద్వారా పార్టీకి.. అన్నయ్యకు కట్టుబడి ఉంటారని భావించేవారు. కానీ, ఇప్పుడు రెండు పదవులకూ రాజీనామా చేయడం ద్వారా ఆయన మళ్లీ బంతిని ములాయం కోర్టులోకి నెట్టేసినట్టయింది. గురువారం అర్ధరాత్రికే ఈ విషయం శివపాల్ మద్దతుదారుల్లో దావానలంలా వ్యాపించింది. ఒక్కసారిగా అంతా లక్నో వీధుల్లోకి చేరుకున్నారు. కాళిదాస్ మార్గ్లోని ఆయన ఇంటి ముందు భారీ ఎత్తున అనుచరులు సంఘీభావంగా చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రానికల్లా శివపాల్ తన అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలో తలెత్తిన ఈ సంక్షోభాన్ని ములాయం ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముందునుంచి పార్టీలో పట్టున్న శివపాల్ను దూరం చేసుకోలేరు, అలాగని యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న అఖిలేష్ను కూడా బలిపెట్టలేరు.. రెండు కళ్లలో ఒకదాన్ని వదులుకోవాలంటే ఎలా అని మధన పడుతున్నట్లు సమాచారం. -
సైకిల్ టైర్లు మారుస్తున్న సీఎం: రాహుల్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. పాడైపోయిన సైకిల్కు టైర్లు మార్చేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఇప్పటికే దారుణంగా దెబ్బతిన్న తన ప్రభుత్వ ఇమేజిని కాపాడుకోడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న యాత్రలో భాగంగా ఆయన అలహాబాద్ సభలో మాట్లాడారు. అయితే, సైకిల్ రిపేరుకు ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని, నాలుగున్నరేళ్లు అనవసరంగా ఆయన వృథా చేశారని అన్నారు. అఖిలేష్ పాలన దారుణంగా ఉందని చెబుతూ.. ఇక్కడ పాడైన విద్యుత్ వైర్లను ముట్టుకోడానికి కూడా ఎవరూ భయపడరని.. ఎందుకంటే, అసలు ఈ వైర్లలోంచి విద్యుత్ ప్రసరించదని ఎద్దేవా చేశారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికల్లో హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు రైతులు, నిరుద్యోగ యువత అవసరాలను పట్టించుకోకుండా బడా వ్యాపారవేత్తలకు కొమ్ము కాస్తోందన్నారు. పెద్ద వ్యాపారవేత్తలకు సంబంధంచిన రూ.1.1 లక్షల కోట్ల రుణాలను మోదీ ప్రభుత్వం మాఫీ చేసిందని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సర్కారు రూ. 74వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిందన్నారు. -
తమ్ముడికే ములాయం మద్దతు!
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీలో నెలకొన్న కుటుంబపోరుకు తెరదించేందుకు పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్వయంగా రంగంలోకి దిగారు. న్యూఢిల్లీలో ఉన్న ఆయన గురువారం లక్నో బయలుదేరారు. లక్నోలో గురువారం పార్టీ సీనియర్ నేతలతో భేటీ కానున్నారు. అదేవిధంగా తనయుడు, యూపీ సీఎం అఖిలేశ్తోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ అధ్యక్ష పదవి విషయంలో తనయుడు అఖిలేశ్, తమ్ముడు శివ్పాల్ యాదవ్ మధ్య అంతర్గత వర్గ పోరు భగ్గుమన్న సంగతి తెలిసిందే. అఖిలేశ్ను ఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి.. ఆ పదవిని తమ్ముడు శివ్పాల్ యాదవ్కు ములాయం కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ అవమానంతో అఖిలేశ్ రగిలిపోతున్నప్పటికీ ములాయం తమ్ముడికే మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. స్థానిక టీవీ చానెళ్ల కథనం ప్రకారం పార్టీ రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడిగా శివ్పాల్ యాదవ్కు ములాయం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా ఆయన అఖిలేశ్ కేబినెట్లోనూ మంత్రిగా కొనసాగుతారని తేల్చి చెప్పినట్టు సమాచారం. తనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో ప్రతీకార చర్యగా శివ్పాల్ యాదవ్ మంత్రిత్వశాఖలకు కోతపెట్టి.. ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. ములాయంను ఎవరూ సవాల్ చేయకూడదు! అన్న కొడుకు అఖిలేశ్ వ్యతిరేకిస్తున్నప్పటికీ తాను ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతానని శివ్పాల్ యాదవ్ స్పష్టం చేశారు. తనను ఎస్పీ చీఫ్గా నియమిస్తూ ములాయం నిర్ణయం తీసుకున్నారని, ఆయన నిర్ణయాన్ని ఎవరూ కూడా సవాల్ చేయకూడదని మీడియాతో చెప్పారు. పార్టీ ఐక్యంగా ఉందని, 2017లో మరోసారి అధికారాన్ని సాధిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.