యూపీ ఎన్నికల్లో బంధువులకే పెద్ద పీట | party tickets for relatives in up coming up assembly elections | Sakshi
Sakshi News home page

Jan 29 2017 7:18 AM | Updated on Mar 20 2024 3:13 PM

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్న పాలకపక్ష సమాజ్‌వాది పార్టీ, భారతీయ జనతా పార్టీల అభ్యర్థుల ఎంపికలో బంధుప్రీతి స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని 403 సీట్లకుగాను భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు 371 మంది పేర్లను ప్రకటించగా, వారిలో 39 మంది నేతల సమీప బంధువులే ఉన్నారు. అంటే ప్రకటించిన అభ్యర్థుల్లో పది శాతానికి పైగా టిక్కెట్లు బంధువులకే వెళ్లాయన్నమాట. అభ్యర్థుల పేర్లను పరిశీలించినట్లయితే ఎవరి పలుకుబడి కారణంగా వారికి టిక్కెట్లు లభించాయో సులభంగానే గ్రహించవచ్చు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement