'ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చడం సరికాదు' | pcc chief uttam kumar reddy slams bjp over UP elections | Sakshi
Sakshi News home page

'ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చడం సరికాదు'

Oct 19 2016 4:58 PM | Updated on Mar 29 2019 9:31 PM

'ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చడం సరికాదు' - Sakshi

'ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చడం సరికాదు'

భారత సైన్యాన్ని ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చడం సరికాదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ చెప్పారు.

హైదరాబాద్ : భారత సైన్యాన్ని ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చడం సరికాదని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పెద్ద మనుషులే ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 47 మంది ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ కొనుగోలు చేసి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రజలను మతల పరంగా చీల్చడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. అందుకే అయోధ్య వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చిందని ఉత్తమ్ మండిపడ్డారు.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement