కిషోర్-ములాయం భేటీపై షీలా ఆశ్చర్యం | Prashant Kishor meeting Mulayam was surprising: Sheila Dikshit | Sakshi
Sakshi News home page

కిషోర్-ములాయం భేటీపై షీలా ఆశ్చర్యం

Nov 7 2016 2:00 PM | Updated on Aug 25 2018 4:30 PM

కిషోర్-ములాయం భేటీపై షీలా ఆశ్చర్యం - Sakshi

కిషోర్-ములాయం భేటీపై షీలా ఆశ్చర్యం

ప్రశాంత్‌ కిషోర్... ములాయం సింగ్ యాదవ్ తో భేటీ కావడం పట్ల షీలా దీక్షిత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్... సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో భేటీ కావడం పట్ల ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'ఈ సమావేశం నాకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించింది. ఈ భేటీ ద్వారా ప్రశాంత్ కిశోర్ ఏం చేయదలుచుకున్నారో తెలియద'ని షీలా దీక్షిత్ అన్నారు.

నవంబర్ 1న ములాయంతో ప్రశాంత్ కిశోర్ సమావేశమయ్యారు. అమర్ సింగ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పడే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే మహాకూటమి గురించి కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయని, తామింకా నిర్ణయం తీసుకోలేదని షీలా దీక్షిత్ తెలిపారు.

ప్రశాంత్‌ కిషోర్ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా అని ప్రశ్నించగా... 'ఆయన మా పార్టీకి సలహాదారు, వ్యూహకర్త. ఆయన పనితీరు పట్ల సంతృప్తికరంగా ఉందా, లేదా అనే విషయం సెక్రటరీలకు తెలుసు. నాకు తెలియద'ని ఆమె సమాధానం ఇచ్చారు. ప్రశాంత్‌ కిషోర్ పనితీరుపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన పనితీరుపై కాంగ్రెస్ వర్గాలు రెండు చీలిపోయినట్టు వార్తలు  వస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement