పట్నా: బిహార్లోని పట్నా పరిధిలోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక రాజకీయం వేడెక్కింది. జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత నితిన్ నబీన్కు అలాగే బీజేపీకి బహిరంగ సవాల్ విసిరారు. ‘దమ్ముంటే ఎవరి మద్దతూ లేకుండా ఒంటరిగా పోరాడి చూడండి’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పట్నాలోని బాంకీపూర్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను తిప్పికొట్టేలా ఆయన నేరుగా ఎన్నికల రణక్షేత్రంలోకి దూకారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా ఆయన ఈ సవాల్ విసిరారు. ఈ రాజకీయ సవాల్తో బీహార్ రాజకీయాల్లో మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ప్రధాన రాజకీయ కేంద్రంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ దూకుడుతో అధికార, ప్రతిపక్ష శిబిరాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: పెరూలో భూకంపం.. ఆరుగురు మృతి


