దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి.
న్యూఢిల్లీ: బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపాయి. 403 స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు చేయడానికి కావల్సిన మేజిక్ ఫిగర్ 202. ఎన్నికల పోలింగ్ కౌటింగ్ ఈనెల 11న జరగనుంది.
కాంగ్రెస్ తో పొత్తు అధికార సమాజ్ వాదీ పార్టీకి పెద్దగా కలిసి రాలేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎస్పీ-కాంగ్రెస్ కూటమి రెండో స్థానంలో నిలుస్తాయని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించనుందని పేర్కొన్నాయి. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ మూడో స్థానానికి పరిమితం కానుంది.
చానల్ | ఎస్పీ-కాంగ్రెస్ | బీజేపీ | బీఎస్పీ | ఇతరులు |
ఎన్డీటీవీ | 120 | 193 | 78 | 12 |
ఇండియా టీవీ-సీ ఓటర్ | 135-147 | 155-167 | 81-93 | 08-20 |
టైమ్స్ నౌ- వీఎమ్మార్ | 110-130 | 190-210 | 57-74 | 08 |
ఏబీపీ న్యూస్-లోక్ నీతి | 156-169 | 164-176 | 60-72 | 02-06 |
ఇండియాన్యూస్-ఎమ్మార్సీ | 120 | 185 | 90 | 08 |