
అఖిలేశ్ సక్సెస్ కోసం ఆ నలుగురు
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఒకరినిమించి మరొకరు ప్రచారంతో ప్రజల మధ్యకు దూసుకెళ్లేందుకు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా మోదీ ఎంతటి విస్తృత ప్రచారం చేస్తారో తెలియని విషయం కాదు.
ఇప్పుడు యూపీ రెండో దశ ఎన్నికల కోసం వారు పూర్తి స్థాయిలో పనిచేయనున్నారు. ఇందులో భాగంగా వాళ్లు తొలుత ప్రారంభించనున్న తొలి అంశంపై ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్. ఇప్పటి నుంచి రెండో దశ ఎన్నికల వరకు మొత్తం 300 ర్యాలీల్లో అఖిలేశ్ పాల్గొననున్నారు. వీటన్నింటిని ఫేస్బుక్ లైవ్ ద్వారా అందించేందుకు మొత్తం పదిమందితో కూడిన టీం సిద్ధమైంది. వీరిలో గతంలో బీబీసీలో పనిచేసిన ఆశిష్ యాదవ్ ఇన్చార్జ్గా ఉండగా మనోజ్ యాదవ్ అనే వ్యక్తి ప్రచారానికి కావాల్సిన పాటలు రాసే పనికి దిగాడు.
గోజూప్ సీఈవో అహ్మద్ అఫ్తాబ్ నఖ్వీ డిజిటల్ వ్యూహకర్తగా ఉన్నాడు. ఇక హర్వార్డ్ యూనివర్సిటీకి చెందిన అన్షుమాన్ శర్మ రీసెర్ఛ్ వింగ్ను చూసుకోనున్నాడు. ఇప్పటికే వాట్సాప్ ద్వారా 25లక్షలమందితో ప్రతి రోజు కాంటాక్ట్లో ఉన్నారంట. అంతేకాదు, సోషల్ మీడియా విభాగాలైన యూట్యూబ్, ఇన్స్టాగ్రమ్, ఇతర వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లువంటి వాటితో కూడా ఒప్పందాలు కుదుర్చుకొని ముందుకెళుతున్నట్లు తెలిసింది. అచ్చం డోర్ టూ డూర్ టూర్లాగే సోషల్ మీడియా ద్వారా అఖిలేశ్ ప్రచారాన్ని, ఆయన కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళుతున్నామని వారు చెప్పారు.