ప్రధానిపై రాష్ట్రపతి ప్రశంసలు
ముంబై: కొత్త విషయాలను ప్రధాని మోదీ నేర్చుకునే తీరు తనను ఆకట్టుకుందని రాష్ట్రపతి ప్రణబ్ వ్యాఖ్యానించారు. ముంబైలో ఇండియాటుడే సదస్సులో పాల్గొన్న రాష్ట్రపతి.. ‘పలు అంశాలను మోదీ తనదైన శైలిలో చక్కబెడతారు. తక్కువ కాలంలోనే ఈ స్థాయికి ఎదిగిన మోదీని ప్రశంసించకుండా ఉండలేం’ అని అన్నారు. ‘చరణ్ సింగ్ నుంచి చంద్రశేఖర్ వరకు అందరు ప్రధానులూ పార్లమెంటులో అనుభవం ఉన్నవారే. కానీ ఓ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మోదీ.. విదేశీ వ్యవహారాలు, సంక్లిష్టమైన ఆర్థిక అంశాలపై పూర్తి పట్టు సాధించారు. అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య, ఆంక్షలపై పనిచేసే జీ–20 గ్రూపుపై తన చాతుర్యంతో ప్రభావం చూపారు’ అని ప్రశంసించారు. యూపీ ఎన్నికల్లో విజయంతో వినమ్రతతో పనిచేయాలన్న మోదీ మాటలు హర్షించదగ్గవన్నారు.
అధికారంలో ఉన్న వాళ్లు ఆధిక్యతావాదానికి వ్యతిరేకంగా సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. పార్లమెంటు తరచూ వాయిదా పడటంపై ప్రణబ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కులం, మతం, ప్రాంతం, రాజకీయాల పేరుతో విభేదాలు పెట్టుకున్నన్ని రోజులూ.. దేశం అభివృద్ధి పథంలో పయనించటం కష్టం. ఐకమత్యంతో ఉంటేనే గెలుస్తాం.’అని ప్రణబ్ సుతిమెత్తగా హెచ్చరించారు. ఇద్దరు ప్రధానులు మన్మోహన్, మోదీ నుంచి తను చాలా నేర్చుకున్నట్లు ఆయన తెలిపారు. విపక్ష పార్టీల నాయకులతో వ్యక్తిగతంగా సత్సంబంధాలున్న గొప్ప వ్యక్తి అని మాజీ ప్రధాని వాజ్పేయిని పొగిడారు.
చిన్న చిన్న పార్టీలను కలుపుకుని ఆరేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపిన ఘనత వాజ్పేయికే దక్కుతుందన్నారు. ఇందిరా గాంధీని తన గురువుగా చెప్పుకున్న ప్రణబ్.. ఆమె ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన తప్పులనుంచి రాజకీయ నాయకులు చాలా నేర్చుకోవచ్చన్నారు. ఒక వ్యక్తి హీరోగా ఉండటం కంటే బలమైన ప్రతిపక్షం ఉండేదే అసలైన ప్రజాస్వామ్యమని నెహ్రూ బలంగా నమ్మి ఆచరణలో పెట్టారన్నారు. తాను ప్రజలనుంచే పుట్టానని వారిలోనే కలిసిపోతానని ప్రణబ్ అన్నారు. ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేస్తానన్నారు.కాగా, యూపీ ఎన్నికల్లో ఖబరస్తాన్పై శ్మశానం విజయం సాధించిందని మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
విద్యాసంస్థల్లో అసహనానికి తావులేదు
విద్యాసంస్థలో అసహనం, విద్వేషాలకు తావుండకూడదని.. అవి భిన్నాభిప్రాయాలకు వేదికలుగా ఉండాలని ముంబై వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ప్రణబ్ అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాక మాట్లాడారు. దేశాభివృద్ధిలో విద్యారంగం కీలకపాత్ర పోషిస్తుందని.. విద్యాకోర్సులు పరిశ్రమల అవసరాలను తీర్చేలా ఉండాలని సూచించారు.
మోదీ నేర్చుకునే తీరు అద్భుతం
Published Sat, Mar 18 2017 4:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement