అప్పటివరకు అంతా బాగానే ఉందనుకున్నారు.. పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తానని శివపాల్ చెప్పారు. అన్నయ్య నిర్ణయమే అంతిమం అని.. దాన్ని ఎవరూ కాదనలేరని కూడా అన్నారు. 2017 ఎన్నికల్లో అఖిలేశ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అన్నయ్య నిర్ణయిస్తే.. దానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా ఆయన తెలిపారు. కాసేపటి తర్వాత.. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇంటికి వెళ్లారు.. అక్కడ ఇద్దరి మధ్య 20 నిమిషాల పాటు సమావేశం జరిగింది. పెద్దాయన చెప్పాడు కాబట్టి.. అబ్బాయి కాస్త మెత్తబడతాడని అనుకున్నాడు. కానీ, ఆ 20 నిమిషాల భేటీలో ఇద్దరి మధ్య ఏం చర్చలు జరిగాయో, ఏ స్థాయిలో జరిగాయో తెలియదు. రాత్రి 9 గంటల సమయంలో శివపాల్ ఇంటికి తిరిగొచ్చారు. తెల్ల కాగితాలు తీసుకుని పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఒక లేఖ, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మరో లేఖ రాసేశారు. తన వ్యక్తిగత సహచరుడు ఒకరిని పిలిచి.. వాటిలో ఒకటి ములాయం సింగ్ యాదవ్కు, మరొకటి అఖిలేష్కు ఇచ్చి రమ్మని చెప్పారు. కొద్ది నిమిషాల్లోనే మీడియాలో ఈ విషయం భారీగా ప్రచారం అయ్యింది. శివపాల్ ఎందుకు రాజీనామా చేశారో ఎవరికీ తెలియలేదు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. ములాయం తనవైపే మొగ్గు చూపించారు కాబట్టి, తన నుంచి తీసేసిన ముఖ్యమైన మంత్రిత్వశాఖలను అఖిలేష్ మళ్లీ ఇస్తారని శివపాల్ భావించారు. కానీ అలా జరగలేదు. ఆ పదవులను గనక తిరిగిస్తే శివపాల్ ఉండేవారని, అలా జరక్కపోవడంతో ఆయన అహం దెబ్బతిని అన్నింటికీ రాజీనామా చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేవలం మంత్రిపదవికి మాత్రమే రాజీనామా చేసి ఉంటే.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడానికి ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని అంతా అనుకునేవారు. తద్వారా పార్టీకి.. అన్నయ్యకు కట్టుబడి ఉంటారని భావించేవారు. కానీ, ఇప్పుడు రెండు పదవులకూ రాజీనామా చేయడం ద్వారా ఆయన మళ్లీ బంతిని ములాయం కోర్టులోకి నెట్టేసినట్టయింది.
గురువారం అర్ధరాత్రికే ఈ విషయం శివపాల్ మద్దతుదారుల్లో దావానలంలా వ్యాపించింది. ఒక్కసారిగా అంతా లక్నో వీధుల్లోకి చేరుకున్నారు. కాళిదాస్ మార్గ్లోని ఆయన ఇంటి ముందు భారీ ఎత్తున అనుచరులు సంఘీభావంగా చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రానికల్లా శివపాల్ తన అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలో తలెత్తిన ఈ సంక్షోభాన్ని ములాయం ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముందునుంచి పార్టీలో పట్టున్న శివపాల్ను దూరం చేసుకోలేరు, అలాగని యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న అఖిలేష్ను కూడా బలిపెట్టలేరు.. రెండు కళ్లలో ఒకదాన్ని వదులుకోవాలంటే ఎలా అని మధన పడుతున్నట్లు సమాచారం.
సీఎం ఇంట్లో అసలు ఏమైంది?
Published Fri, Sep 16 2016 8:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement