United Arab Emirates
-
భారత్కు అండగా ఉంటాం
అబుదాబీ/టోక్యో: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), జపాన్ ప్రకటించాయి. భారత్కు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ అరాచకాలను, ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటాన్ని ప్రపంచ దేశాల నేతలకు తెలియజేయడానికి ఏర్పాటైన అఖిలపక్ష బృందాలు తమ కార్యాచరణ ప్రారంభించాయి. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని బృందం గురువారం యూఏఈ మంత్రి షేక్ నహ్యన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, డిఫెన్స్ కమిటీ చైర్మన్ అలీ అల్ నుయామీతోపాటు ఇతర నేతలతో అబుదాబీలో సమావేశమైంది. జేడీ(యూ) ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలో మరో బృందం జపాన్ రాజధాని టోక్యోలో జపాన్ విదేశాంగ మంత్రి తకాషీ ఇవాయాతోపాటు మరికొందరు నేతలతో భేటీ అయ్యింది. ఉగ్రవాదం అనేది కేవలం ఏదో ఒక దేశానికి పరిమితమైన సమస్య కాదని, మొత్తం ప్రపంచానికి ముప్పుగా మారిందని అలీ అల్ నుయామీ ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొత్తం మానవాళికి ఉజ్వలమైన భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. జపాన్ మంత్రి ఇవాయా మాట్లాడుతూ... ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాసరే అంతం చేయాల్సిందేనని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఉద్ఘాటించారు. మరోవైపు డీఎంకే ఎంపీ కె.కనిమొళి నేతృత్వంలోని మరో అఖిలపక్ష బృందం రష్యాకు బయలుదేరింది. మొత్తం 33 దేశాలకు అఖిలపక్ష బృందాలను పంపించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
యూఏఈ వీసా ఆన్ అరైవల్.. షరతులు వర్తిస్తాయి
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. యూఏఈ ప్రభుత్వం భారత జాతీయుల కోసం నూతనంగా వీసా ఆన్ అరైవల్ విధానాన్ని ప్రకటించింది. అయితే, ఇందుకు ఓ షరతు విధించింది. అమెరికా, యూకే, ఇతర ఏదైనా యూరోపియన్ యూనియన్ దేశం శాశ్వత నివాస కార్డు లేదా వీసా ఉన్న వ్యక్తులే వీసా ఆన్ అరైవల్కు అర్హులు. ఈ విధానం ద్వారా యూఏఈలో అడుగు పెట్టిన వెంటనే వీరికి 14 రోజుల వీసా లభిస్తుంది. అవసరమైన ఫీజు చెల్లించిన పక్షంలో మరో 60 రోజుల వరకు దీనిని పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకుగాను..అమెరికా వీసా, నివాస కార్డు లేక గ్రీన్ కార్డు ఉన్న వారు.. ఏదేని యూరోపియన్ యూనియన్ దేశం లేక యునైటెడ్ కింగ్డమ్ వీసా లేక నివాస ధ్రువీకరణ కార్డు ఉన్నవారు అర్హులు. కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్టు కూడా వీరు చూపాల్సి ఉంటుంది. భారత్–యూఏఈల బంధం బలపడుతున్న వేళ ఈ నూతన విధానం అమల్లోకి రావడం విశేషం. యూఏఈలో ప్రస్తుతం 35 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు. -
T20 WC 2024: పట్టిక తారుమారు.. సెమీస్ బెర్తులు ఖరారు
మహిళల టీ20 ప్రపంచకప్-2024లో సెమీ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాప్-4కు అర్హత సాధించగా.. గ్రూప్-బి నుంచి ఊహించని జట్టు సెమీస్కు దూసుకువచ్చింది. కాగా బంగ్లాదేశ్లో నిర్వహించాల్సిన ఈ మెగా టోర్నీ వేదికను ఐసీసీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు మార్చిన విషయం తెలిసిందే.బంగ్లాలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తలెత్తిన అల్లర్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్లో గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక.. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పోటీపడ్డాయి.టీమిండియాకు కలిసి రాలేదుఅయితే, టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న భారత జట్టు పేలవ ప్రదర్శనతో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో గ్రూప్-ఏలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాప్-4లో సగర్వంగా అడుగుపెట్టాయి. అయితే, గ్రూప్-బి టాపర్గా ఉన్న ఇంగ్లండ్ ఊహించని రీతిలో ఒక్క మ్యాచ్ ఫలితంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.ఒక్క మ్యాచ్తో ఫలితం తారుమారువెస్టిండీస్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో హీథర్ నైట్ బృందం.. విండీస్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో గ్రూప్-బి పాయింట్ల పట్టిక తారుమారైంది. మొదటిస్థానంలో ఉన్న ఇంగ్లండ్ మూడో స్థానానికి, మూడో స్థానంలో ఉన్న వెస్టిండీస్ టాప్లోకి వచ్చింది. ఇరు జట్లు పాయింట్ల పరంగా(6) సమానంగా ఉన్నా.. నెట్రన్రేటులో వెస్టిండీస్(1.536).. ఇంగ్లండ్(1.091) కంటే మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం.ఫలితంగా గ్రూప్-బి నుంచి వెస్టిండీస్ సెమీస్కు వచ్చింది. మరోవైపు.. ఇదే గ్రూపులో ఉన్న సౌతాఫ్రికా కూడా ఆరు పాయింట్లే కలిగి ఉన్నా.. నెట్రన్రేటే(1.382) ఆ జట్టుకూ మేలు చేసి టాప్-4లో చేర్చింది. అలా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా మహిళా టీ20 వరల్డ్కప్-2024లో తమ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.షెడ్యూల్, వేదికలు ఇవే👉మొదటి సెమీ ఫైనల్- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా- అక్టోబరు 17, దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్.👉రెండో సెమీ ఫైనల్- వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, అక్టోబరు 18, షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా.👉రెండు మ్యాచ్లూ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు మొదలవుతాయి.ఆస్ట్రేలియా జట్టుఅలిసా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, యాష్ గార్డనర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, ఫోబీ లిచ్ఫీల్డ్, తహ్లియా మెక్గ్రాత్ (వైస్ కెప్టెన్), సోఫీ మొలినెక్స్, బెత్ మూనీ, ఎలిస్ పెర్రీ, మెగాన్ స్కట్, అన్నాబెల్ సదర్లాండ్, హీథర్ గ్రాహం, జార్జియా వేర్హామ్.సౌతాఫ్రికా జట్టులారా వోల్వార్డ్ (కెప్టెన్), అన్నేక్ బాష్, టాజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నేరీ డెర్క్సెన్, మికే డి రైడర్, అయాండా హ్లూబీ, సినాలో జాఫ్తా, మారిజానే కాప్, అయబోంగా ఖాకా, సునే లూస్, నోన్కులులెకో మ్లాబా, సెష్నీ నాయుడు, తుమీ సెఖుఖున్, క్లోయ్ ట్రియాన్.వెస్టిండీస్ జట్టుహేలీ మాథ్యూస్ (కెప్టెన్), ఆలియా అల్లేన్, షమీలియా కాన్నెల్, డియోండ్రా డాటిన్, షెమైన్ కాంప్బెల్లె (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), అష్మిని మునిసర్, అఫీ ఫ్లెచర్, స్టెఫానీ టేలర్, చినెల్ హెన్రీ, చెడియన్ నేషన్, కియానా జోసెఫ్, జైదా జేమ్స్, కరిష్మా రాంహారక్, మాండీ మంగ్రూ, నెరిస్సా క్రాఫ్టన్.న్యూజిలాండ్ జట్టుసోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇజ్జీ గాజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్, మెలీ కెర్, జెస్ కెర్, రోజ్మేరీ మైర్, మోలీ పెన్ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవే, లీ తహుహు.చదవండి: W T20 WC: ‘హర్మన్పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే’ -
ఇజ్రాయెల్కు సాయం చేయకండి: అరబ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఇరాన్-ఇజ్రాయెల్ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాలస్తీనా, లెబనాన్లపై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే.. ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఈనేపథ్యంలో ఇరాన్ పొరుగున ఉన్న అరబ్ దేశాలకు, అమెరికా మిత్ర దేశాలకు తీవ్ర హెచ్చరికలు చేసింది.తమపై(ఇరాన్) దాడులు జరిపేందుకు ఇజ్రాయెల్కు సాయం చేయవ ద్దని హెచ్చరించింది. అలా కాదని అరబ్ దేశాలు వారి భూబాగాలు, గగనతలాన్ని ఉపయోగించి దాడులకు పాల్పడితే తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఖతార్ వంటి చమురు సంపన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని రహస్య దౌత్య మార్గాల ద్వారా ఈ హెచ్చరికను పంపింది. అయితే ఇవన్నీ యూఎస్ సైనిక దళాలకు ఆతిథ్యం ఇచ్చే దేశాలు.ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా అధినేత నస్రల్లా మృతి అనంతరం ఇరాన్ 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ పెద్దతప్పు చేసిందని, భారీ మూల్యం చెల్లించుకుంటుందని, ప్రతీకార దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. అయితే ఇరాన్లోని అణుస్థావరాలతో పాటు.. చమురు క్షేత్రాలనూ లక్ష్యంగా చేసుకొనే అవకాశం ఉందని ఐడీఎఫ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథయంలోనే ఇస్లామిక్ రిపబ్లిక్పై ఎలాంటి దాడులు జరగకూడదని,అలా జరిగితే ప్రతీకార దాడులకు పాల్పడతామని అరబ్ దేశాలను హెచ్చరించింది. -
భారత్–యూఏఈ మధ్య ‘ఫుడ్ కారిడార్’
ముంబై: భారత్–యునైటెడ్ ఆరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) దాదాపు రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఫుడ్ కారిడార్ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ క్యారిడార్ యూఏఈ ఆహార అవసరాలను తీర్చడంతోపాటు, అంతకుమించి భారతీయ రైతులకు అధిక ఆదాయాన్ని సంపాదించడానికి, దేశంలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతుందని కేంద్ర మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. పెట్టుబడులపై భారత్–యూఏఈ అత్యున్నత స్థాయి టాస్క్ఫోర్స్ 12వ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో గోయల్ ఈ విషయాలు చెప్పారు. ఈ సమావేశానికి గోయల్తో పాటు అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఎండీ షేక్ హమీద్ బిన్ జాయెద్ అల్ నాహ్యాన్ కో–చెయిర్గా వ్యవహరించారు. స్థానిక కరెన్సీలో ద్వైపాక్షిక వాణిజ్యంతో పాటు వర్చువల్ ట్రేడ్ కారిడార్ పనులు, అహ్మదాబాద్లో ఫుడ్ పార్క్ ఏర్పాటు మొదలైన అంశాలపై ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా గోయల్ ఏమి చెప్పారంటే... → రెండు దేశాల మధ్య ఫుడ్ కారిడార్ స్థాపనను ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు– యూఏఈతో కూడిన చిన్న వర్కింగ్ గ్రూప్ కూడా ఇప్పటికే ఏర్పాటయ్యింది. → భారతదేశంలో ఫుడ్ పార్కుల ఏర్పాటు గురించి చర్చించిన అంశాల్లో మరొకటి. ఇప్పటికే ఈ విషయంలో కొంత పురోగతి జరిగింది. రైతులకు అధిక ఆదాయంతోపాటు లక్షలాది మందికి ఫుడ్ ప్రాసెసింగ్లో ఉద్యోగాలు కల్పించడానికి సహాయపడే అంశమిది. అలాగే యూఏఈ ఆహార భద్రతకు కూడా దోహదపడుతుంది. → ఫుడ్ క్యారిడార్ పెట్టుబడి వచ్చే రెండున్నరేళ్ల కాలంలో జరుగుతుందని అంచనా. → యూఏఈకి అనువైన అధిక నాణ్యతా ఉత్పత్తుల లభ్యత కోసం దేశంలో యూఏఈ భారీ పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్ సదుపాయాలను మెరుగుపరచాలన్నది గత ఎంతోకాలంగా చర్చిస్తున్న అంశం. ఇది ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది. → తాజా పరిణామంతో దేశీయ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమతో ఇతర గల్ప్ మార్కెట్లూ అనుసంధానమయ్యే అవకాశం ఉంది. దుబాయ్లో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయంభారత్లో పెట్టుబడులు చేయదల్చుకునే మదుపర్లకు సహాయకరంగా ఉండేలా దుబాయ్లో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు పియుష్ గోయల్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్కి (ఐఐఎఫ్టీ) సంబంధించి విదేశాల్లో తొలి క్యాంపస్ను కూడా దుబాయ్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో (యూఏఈ) నివసించే 35 లక్షల మంది భారతీయులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
ఎంపాక్స్ క్లేడ్ 1బీ తొలి కేసు
న్యూఢిల్లీ: ప్రపంచంలో ‘ఆరోగ్య అత్యయిక స్థితి’కి దారితీసిన ‘క్లేడ్1’ వేరియంట్ ఎంపాక్స్ వైరస్ భారత్లోకి అడుగుపెట్టింది. క్లేడ్ 1బీ పాజిటివ్ కేసు భారత్లో నమోదైందని సోమవారం అధికారిక వర్గాలు వెల్లడించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళకు తిరిగొచి్చన 38 ఏళ్ల వ్యక్తిలో క్లేడ్ 1బీ వైరస్ను గుర్తించామని అధికారులు ప్రకటించారు. మలప్పురం జిల్లాకు చెందిన ఈ రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. క్లేడ్ 1బీ వేరియంట్ కేసులు విజృంభించడతో ఆగస్ట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం తెల్సిందే. విదేశాల నుంచి వస్తూ ఎంపాక్స్ రకం వ్యాధి లక్షణాలతో బాధపడేవారు తక్షణం ఆరోగ్య శాఖకు వివరాలు తెలపాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సూచించారు. కోలుకున్న ‘క్లేడ్2’ రోగి క్లేడ్2 వేరియంట్తో ఢిల్లీలోని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 26 ఏళ్ల రోగి కోలుకుని శనివారం డిశ్చార్జ్ అయ్యాడని ఆస్పత్రి వర్గాలు సోమవారం వెల్లడించాయి. హరియాణాలోని హిసార్కు చెందిన ఈ వ్యక్తి సెపె్టంబర్ ఎనిమిదో తేదీన ఆస్పత్రిలో చేరడం తెల్సిందే. -
యుద్ధ ఖైదీల మార్పిడి
మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్లు శనివారం 103 మంది చొప్పున యుద్ధఖైదీలను పరస్పరం మారి్పడి చేసుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దీనికి మధ్యవర్తిత్వం వహించింది. ‘మావాళ్లు స్వదేశానికి చేరుకున్నారు. రష్యా చెర నుంచి 103 మంది యోధులను విజయవంతంగా ఉక్రెయిన్కు తీసుకొచ్చాం’అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. యుద్ధఖైదీల మారి్పడిలో భాగంగా ఉక్రెయిన్కు చేరిన వారిలో 82 సాధారణ పౌరులు, 21 మంది సైనిక సిబ్బంది ఉన్నారు. ‘కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ బందీలుగా పట్టుకున్న 103 సైనిక సిబ్బంది కీవ్ ఆ«దీనంలోని భూభాగం నుంచి విముక్తులయ్యారు. బదులుగా 103 యుద్ధఖైదీలను ఉక్రెయిన్కు అప్పగించాం’అని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ చెర వీడిన రష్యా యుద్ధఖైదీలు ప్రస్తుతం బెలారస్లో ఉన్నారు. వారికి అవసరమైన వైద్య, మానసిక సహాయాన్ని అందిస్తున్నట్లు రష్యా తెలిపింది. 2022లో రష్యా ఉక్రెయిన్పై దండెత్తిన తర్వాత యూఏఈ మధ్యవర్తిత్వంలో జరిగిన ఎనిమిదో యుద్ధఖైదీల మారి్పడి ఇది. మొత్తం ఇప్పటిదాకా 1,994 మంది ఖైదీలకు తమ చొరవతో చెరవీడిందని యూఏఈ తెలిపింది. రష్యాలోని సుదూర లక్ష్యాల పైకి దాడికి అనుమతించండి రష్యాలోని సుదూర లక్ష్యాల పైకి దాడి చేయడానికి తమను అనుమతించాలని ఉక్రెయిన్ పునరుద్ఘాటించింది. పశి్చమదేశాలు ఉక్రెయిన్కు సుదూరశ్రేణి క్షిపణులను సరఫరా చేసినప్పటికీ.. వాటి వాడకానికి అనుమతివ్వడం లేదు. ‘రష్యా ఉగ్రవాదం వారి ఆయుధాగారాలు, సైనిక విమానాశ్రయాలు, సైనిక స్థావరాల వద్ద మొదలవుతుంది. రష్యా లోపలి ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడులకు అనుమతి లభిస్తే.. పరిష్కారం వేగమంతమవుతుంది’అని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ఆండ్రీ యెర్మాక్ శనివారం వివరించారు. -
ఇంధన రంగంలో సహకరించుకుందాం
న్యూఢిల్లీ: ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్, యూఏఈ మధ్య సంబంధాలతోపాటు ఇరుదేశాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. గాజాలోని తాజా పరిస్థితులతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇంధన రంగంలో సహకారానికి సంబంధించి భారత్, యూఏఈ నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ(అండోక్)– ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్), అండోక్–ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్(ఐఎస్పీఆర్ఎల్) మధ్య దీర్ఘకాలం ఇంధన సరఫరాకు ఒప్పందాలు కుదిరాయి. అలాగే అబుదాబీలోని బరాఖా అణువిద్యుత్ కేంద్రం నిర్వహణ కోసం ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ(ఈఎన్ఈసీ)–న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) మధ్య మరో ఒప్పందం కుదిరింది. అండోక్–ఊర్జా భారత్ మధ్య ప్రొడక్షన్ కన్సెషన్ అగ్రిమెంట్ కుదిరింది. అంతేకాకుండా భారత్లో ఫుడ్పార్కుల ఏర్పాటు కోసం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, అబుదాబీ డెవలప్మెంట్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్సీ మధ్య ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అబుదాబీ యువరాజు భారత పర్యటన కోసం ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం రాజ్ఘాట్ను సందర్శించాయి. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులరి్పంచారు. యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారం ద్వారా భారత్, యూఏఈ మధ్య సంబంధాలు నానాటికీ బలోపేతం అవతుండడం పట్ల రాష్ట్రపతి ఈ సందర్భంగా హర్షం వ్యక్తంచేశారు. -
అక్టోబర్ 6న భారత్, పాక్ పోరు
దుబాయ్: బంగ్లాదేశ్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు తరలి వెళ్లిన మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించి సవరించిన షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరిగే ఈ టోర్నీని యూఏఈలోని రెండు వేదికల్లో (షార్జా, దుబాయ్) నిర్వహిస్తారు. రెండు మ్యాచ్లు ఉంటే... భారత కాలమానం ప్రకారం తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్ రాత్రి గం. 7:30 నుంచి జరుగుతాయి. టాప్–10 దేశాలు పోటీపడుతున్న ఈ టోరీ్నలో మొత్తం 23 మ్యాచ్లున్నాయి. బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్తో టోర్నీ మొదలవుతుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 4న న్యూజిలాండ్తో... అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. అనంతరం అక్టోబర్ 9న శ్రీలంకతో, అక్టోబర్ 13న ఆ్రస్టేలియాతో భారత్ ఆడుతుంది. భారత్ సెమీఫైనల్ చేరుకుంటే అక్టోబర్ 17న దుబాయ్లో జరిగే తొలి సెమీఫైనల్లో ఆడుతుంది. అక్టోబర్ 20న దుబాయ్లో జరిగే ఫైనల్తో టోర్నీ ముగుస్తుంది. ఆ్రస్టేలియా డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. సెమీఫైనల్స్, ఫైనల్కు ‘రిజర్వ్ డే’ కేటాయించారు. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక... గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లున్నాయి. సెపె్టంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు 10 ప్రాక్టీస్ మ్యాచ్లు జరుగుతాయి. -
పసికూనను చిత్తు చేసిన పాక్... సెమీస్ రేసులో
వుమెన్స్ ఆసియా కప్-2024లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసి సెమీస్ రేసులో ముందడుగు వేసింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ ఆసియా టోర్నీలో పాక్ తొలుత భారత్తో తలపడింది. ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన చేతిలో.. నిదా దర్ బృందం ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో తమ రెండో మ్యాచ్లో నేపాల్పై విజయం సాధించి గెలుపు బాటపట్టింది. తాజాగా యూఏఈని పది వికెట్లు తేడాతో ఓడించింది. డంబుల్లా వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన యూఏఈ పాక్ బౌలర్ల ధాటికి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి కేవలం 103 పరుగులే చేసింది. పాక్ స్పిన్నర్లు నష్రా సంధు, సైదా ఇక్బాల్, తూబా హసన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. నిదా దర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది.ఇక యూఏఈ విధించిన 104 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు గుల్ ఫెరోజా(55 బంతుల్లో 62), మునీబా అలీ (30 బంతుల్లో 37) అద్భుత ఆట తీరుతో జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరు కలిసి 14.1 ఓవర్లలో 107 పరుగులు జోడించి పాక్ను గెలిపించారు. ఫలితంగా పాక్ మహిళా జట్టు ఆసియా కప్-2024 సెమీ ఫైనల్ రేసులోకి దూసుకువచ్చింది.కాగా ఆసియా కప్-2024లో ఇండియా, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు గ్రూప్-ఏలో.. శ్రీలంక, థాయ్లాండ్, బంగ్లాదేశ్, మలేషియా గ్రూప్-బిలో ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి రెండూ గెలిచి టాపర్(నెట్ రన్రేటు +3.298)గా ఉంది.పాకిస్తాన్ మూడింట రెండు గెలిచి రెండో స్థానం(నెట్ రన్రేటు + 1.158)లో కొనసాగుతోంది. ఇక గ్రూప్-బి నుంచి శ్రీలంక, థాయ్లాండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక గ్రూప్ దశలో పాక్ తమ మూడు మ్యాచ్లు ఆడేయగా.. భారత్ మంగళవారం నేపాల్తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో ఫలితం తర్వాత సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారవుతాయి.చదవండి: IPL 2025: మెగా వేలం.. రోహిత్ శర్మపై కన్నేసిన ఆ మూడు జట్లు -
యూఏఈతో మ్యాచ్.. భారత జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ
మహిళల ఆసియాకప్-2024లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-యూఏఈ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. యూఏఈ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. భారత జట్టులో మాత్రం ఒక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే వైదొలిగిన స్పిన్నర్ శ్రేయంకా పాటిల్ స్ధానంలో తనుజా కన్వర్ తుది జట్టులోకి వచ్చింది. తనుజా కన్వర్కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం. ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ చేతుల మీదగా భారత టీ20 క్యాప్ను కన్వర్ అందుకుంది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. యూఏఈను కూడా మట్టికరిపించాలని పట్టుదలతో ఉంది.తుది జట్లుభారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, దయాళన్ హేమలత, హర్మన్ప్రీత్ కౌర్(సి), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ సింగ్, తనూజా కన్వర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: ఈషా రోహిత్ ఓజా(కెప్టెన్), తీర్థ సతీష్(వికెట్ కీపర్), రినిత రజిత్, సమైరా ధరణిధర్క, కవిషా ఎగోదాగే, ఖుషీ శర్మ, హీనా హాట్చందానీ, వైష్ణవే మహేష్, రితికా రజిత్, లావణ్య కెనీ, ఇంధుజా నందకుమార్ -
యూఏఈలో అనూహ్య వర్షాలు
దుబాయ్: మాడ పగిలిపోయే ఎండ వేడికి, ఎడారులకు నిలయమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను భారీ వర్షాలు పలకరించాయి. బుధవారం కుండపోత వర్షాలతో యూఏఈ తడిసి ముద్దయింది. భారీ వర్షాలను తట్టుకునే ఏర్పాట్లేవీ పెద్దగా లేకపోవడంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే మొత్తం నీట మునిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్పోర్ట్గా ఖ్యాతికెక్కిన దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్రాంతంలోని కార్లు మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒకటిన్నర సంవత్సరంలో పడాల్సిన వర్షపాతం బుధవారం ఒక్కరోజే నమోదైందని సిటీ వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాల్లో తేలింది. 14.2 సెంటీమీటర్లమేర వర్షపాత నమోదైందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా స్కూళ్లు మూసేశారు. సమీప బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాల్లోనూ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా జరిగిన ఆస్తినష్టాల వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. వర్షాల కారణంగా భారత్ నుంచి దుబాయ్కు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మేఘమథనం వల్లే ఈ వర్షాలు కురిశాయని నిపుణుల అంచనా. -
సహనం, సహజీవనం బాటలో...
యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ ఇచ్చిన 27 ఎకరాల స్థలంలో స్వామినారాయణ సంస్థ అక్కడ భారీ హిందూ దేవాలయాన్ని నిర్మించింది. ముస్లిమేతర విశ్వాసాలను బహిరంగంగా పాటించడానికి కూడా ఒకప్పుడు అనుమతి లేని ఆ దేశంలో ఇది చాలా పెద్ద మార్పు. స్పష్టంగా, బిన్ జాయెద్ ఇస్లాం శాంతి మతం మాత్రమే కాదు, అది ఇతర ఆధ్యాత్మిక అన్వేషణలను అంగీకరిస్తుందని చూపించాలనుకుంటున్నారు. దీనిపై సంప్రదాయ ఉలేమానుండి వచ్చివుండిన వ్యతిరేకతను కూడా ఆయన అధిగమించగలిగారు. యూఏఈ పూర్తి స్థాయి సహనం, సహజీవన మంత్రిత్వ శాఖను కలిగివుంది. ముల్లా ఒమర్ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన మూడు దేశాలలో యూఏఈ ఒకటనే వెలుగులో చూస్తే వారి ఈ ప్రయాణం అద్భుతమైనది. ఫిబ్రవరి 13–14 తేదీలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటన సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అబూ ధాబీలో, బోచాసన్ వాసీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ(బాప్స్) సంస్థ నిర్మించిన హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. యూఏఈ అధ్యక్షుడు, అబూ ధాబీ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నాహ్ యాన్ (ఎంబీజెడ్) ఇచ్చిన 27 ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, స్వామి నారాయణ్ సంస్థ దివంగత అధినేత ప్రముఖ్ స్వామి మహారాజ్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమ సంబంధం ‘తండ్రీ కొడుకుల మాదిరిగానే ఉండేది’ అని చెప్పారు. ‘ప్రముఖ్ స్వామి మహారాజ్ కలను సాకారం చేయడంలో నేను సహాయపడినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను’ అన్నారు. ప్రముఖ్ స్వామి మహా రాజ్ 1997లో యూఏఈని సందర్శించినప్పుడు అబూ ధాబీలో ఒక ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ సహనం, విభిన్న విశ్వాసాల మధ్య అవగాహన, సహజీవనం వంటి ధర్మాలకు కట్టుబడి ఉన్నారు. దుబాయ్లోని జెబెల్ అలీ ప్రాంతంలో పెద్ద హిందూ దేవాలయం, గురుద్వారా నిర్మాణానికి అనుమతించిన దేశ ఉపాధ్యక్షుడు, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా బిన్ జాయెద్ అభిప్రాయాలను గణనీయమైన స్థాయిలో పంచుకుంటు న్నారు. యూఏఈ ప్రభుత్వం పూర్తి స్థాయి సహనం, సహజీవన మంత్రిత్వ శాఖను కలిగి ఉంది. దీనికి జ్ఞానవంతుడైన షేక్ నాహ్ యాన్ బిన్ ముబారక్ అల్ నాహ్యాన్ నేతృత్వం వహిస్తున్నారు. తమ సాంప్రదాయిక సమాజంలో అబ్రహామిక్ విశ్వాసాల ప్రార్థనా స్థలాలను మాత్రమే కాకుండా ఇప్పుడు హిందూ, సిక్కు, బౌద్ధమతాల ప్రార్థనాలయాలను స్థాపించడానికి అనుమతించడంలోనూ ఈ నాయకులు మార్గదర్శకులుగా నిలిచారు. నేను 1979–82 ప్రాంతంలో అబూ ధాబీలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేశాను. ఆ సమయంలో, దుబాయ్లో హిందువులు, సిక్కుల ఆరాధనకు సంబంధించి ఒక చిన్న స్థలం ఉండేది. అయితే, బయటి నుండి దానిని గుర్తించలేరు. హిందువులు, సిక్కులు బహిరంగంగా గుర్తించే విధంగా తమ ప్రార్థనలను, కీర్తనలను చేయకూడదనే అవ గాహనతో అప్పటి దుబాయ్ పాలకుడు షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ దీనిని అనుమతించారు. ఆ రోజుల్లో, ప్రార్థనా స్థలాల నిర్మా ణానికి కాదు కదా, ముస్లిమేతర విశ్వాసాలను బహిరంగంగా పాటించుకోవడానికి కూడా యూఏఈ అనుమతించడం అనేది ఊహకందని విషయం. నిజానికి, ఇప్పుడు కూడా, యూఏఈ ఉదాహరణను ఇతర అరబ్ దేశాలు పూర్తిగా అనుసరించలేదు. సౌదీ అరేబియా యువ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ మహిళల బహిరంగ కార్యకలాపాలపై ఇచ్చిన సామాజిక సడలింపులు పూర్తి భిన్నమైన కోవలోకి వస్తాయి. యూఏఈ 1971 డిసెంబరులో ఏడు ఎమి రేట్లతో కలిసి ఒక దేశంగా ఆవిర్భవిం చింది. అవి: అబూ ధాబీ, దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమా, ఉమ్ అల్ క్వైన్, అజ్మాన్, ఫుజైరా. అప్పటివరకు బ్రిటిష్ రక్షిత ప్రాంతా లుగా ఉంటూవచ్చిన అవి ఒక సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాయి. 1962లో అబూ ధాబీలో భారీ పరిమాణంలో చమురును కను గొన్నారు. కానీ దుబాయ్లో తక్కువ నిల్వలు ఉండేవి. షార్జాలో ఇంకా తక్కువ. మిగతా ఎమి రేట్స్లో అవీ లేవు. 1970వ దశకంలో చమురు ధరల పెరుగుదల యూఏఈ రూపు రేఖలను మార్చింది. అబూ ధాబీ తాను అభివృద్ధి చెందడమే కాకుండా, ఇతరులతో తన ఔదార్యాన్ని పంచుకోవడానికి సిద్ధపడింది. దీంతో భారీ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభ మయ్యాయి. ఇది భారతదేశంతో సహా అనేక దేశాల నుండి ప్రజలను తీసుకువచ్చింది. వారు వివిధ విశ్వాసాలకు చెందినవారు. అప్పటి దుబాయ్ పాలకుడైన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ తన ఎమిరేట్ను వ్యాపారం, షిప్పింగ్, ఫైనాన్స్ కోసం ఒక గొప్ప వాణిజ్య కేంద్రంగా నిర్మించడం ప్రారంభించారు. దీని కోసం, ఆయన పెద్ద సంఖ్యలో విదేశీయుల రాకను ప్రోత్సహించవలసి వచ్చింది. బిన్ రషీద్ దార్శనికతను దుబాయ్ ప్రస్తుత పాలకుడు ముందుకు తీసు కెళ్లారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడం ప్రారంభించారు. పర్యాటకా నికి మహిళలు, ఆహారం, పానీయాలకు సంబంధించిన పాత, కఠిన మైన సామాజిక ఆచారాల సడలింపులు అవసరమయ్యాయి. అయితే, అధికారులు దుబాయ్లో నివసించడానికీ, పని చేయడానికీ వచ్చిన వారి రాజకీయ కార్యకలాపాలను మాత్రం అనుమతించలేదు. అబూ ధాబీ మినహా కొన్ని ఇతర ఎమిరేట్లు దీనిని అనుసరించాయి. ముస్లి మేతర మత కార్యకలాపాలను బహిరంగంగా వ్యక్తీకరించడాన్ని, పర్యవేక్షించడం మరొక అంశం. ఏమైనా విశ్వాసాల విషయంలో వహాబీ, సలాఫీ ఇస్లాం సిద్ధాంతాలు కచ్చితంగా అమలయ్యాయి. ఇక్కడే యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ సహనం, సహజీవనాలను ప్రచారం చేయడంలో చాలా ముందుకు వెళ్లిపోయారు. ఇవి ఇస్లామిక్ విశ్వాసంపై అత్యంత కఠినమైన వ్యాఖ్యానం, అభ్యాసం కోసం పట్టుబట్టే ఇబ్న్ వహాబ్ సాంప్రదాయ బోధనలకు భిన్నమైన పరాయి ఆలోచనలు. సౌదీ రాజకుటుంబం వహాబిజంతో ఒప్పందాన్ని కలిగి ఉంది. అరేబియా ద్వీపకల్పంలోని ఇతర గిరిజన పెద్దలు కూడా దానిని అనుసరించారు. ఇస్లాంకు ఇతర వ్యాఖ్యానాల చెల్లుబాటు తిరస్కరించబడింది. వాస్తవానికి, ఇతర మతాలను, ముఖ్యంగా అబ్రహామిక్ కానివాటిని అంగీకరించే ప్రశ్నే లేదు. ఇక విగ్రహారాధనకు అయితే పెద్ద వ్యతిరేకత ఉంటుంది. స్పష్టంగా, మొహమ్మద్ బిన్ జాయెద్ ఇస్లాం శాంతికి సంబంధించిన మతం మాత్రమే కాదు, అది గౌరవప్రదమైనదనీ, ఇతర ఆధ్యా త్మిక అన్వేషణలను అంగీకరిస్తుందనీ చూపించాలనుకుంటున్నారు. అది ఉదారవాద, జ్ఞానోదయమైన విధానం. తీవ్రవాదం, హింసలను ఇస్లాం ప్రబోధిస్తుందనే అభిప్రాయాన్ని కూడా ఇది తిరస్కరించడానికి ప్రయత్నిస్తుంది. అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్, లష్కర్ ఎ తొయ్యబా, అఫ్గాన్ తాలిబాన్ వంటి గ్రూపులు ఆచరిస్తున్న భావజాలాలు, హింస కారణంగా చాలా ముస్లిమేతర ప్రాంతాలలో ఈ అభిప్రాయం ఏర్పడింది. 1990లలో ముల్లా ఒమర్ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన మూడు దేశాలలో యూఏఈ ఒకటి. మిగిలిన రెండూ సౌదీ అరేబియా. పాకిస్తాన్. ఈ వెలుగులో చూస్తే మొహమ్మద్ బిన్ జాయెద్ పాలనలో సహనం, సహజీవనాలకు చెందిన విధానం, దాని అభ్యాసం అద్భుతమైనవి. అబూ ధాబీలో బోచాసన్వాసీ అక్షర్ పురుషోత్తమ్ స్వామి నారాయణ దేవాలయం వంటి ఇస్లామేతర ప్రార్థనా స్థలాలను అనుమతించడంపై సంప్రదాయ వహాబీ ఉలేమా నుండి కచ్చితంగా వచ్చివుండిన వ్యతిరేకతను బిన్ జాయెద్ అధిగమించగలిగారు. ‘వహాబీ మజబ్’లోనే మార్పు వస్తున్నదని ఇది సూచిస్తున్నదో లేదో అంచనా వేయడం తొందరపాటే అవుతుంది. బిన్ జాయెద్ నిస్సందే హంగా ఇతర దేశాల సంప్రదాయ ఉలేమాల ఆగ్రహాన్ని కూడా ఎదుర్కొంటారు. అయితే సహనం, సహజీవనం పట్ల తన నిబద్ధతను స్పష్టంగా వ్యక్తీకరించడానికి అటువంటి ఒత్తిళ్లను తట్టుకునే సామ ర్థ్యాన్ని ఆయన కలిగివున్నారు. కానీ అది ఎడారి గిరిజనుల స్పృహలోకి ఎంత లోతుగా ప్రవేశించిందో కాలమే చెబుతుంది. - వ్యాసకర్త, విదేశాంగ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) - వివేక్ కాట్జూ -
Viral Video: కోపంతో వెంబడించిన పులి.. భయపడి పరుగు!
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ) దేశానికి చెందినవారి విలాసవంతమైన జీవితాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడీయాలో చాలానే చూసి ఉంటాం. అక్కడి సంపన్న వర్గానికి చెందిన వారు చాలా వరకు.. పులులు, సింహాలు, చీతాలను పెంచుకోవటం గొప్పగా భావిస్తారన్న విషయం తెలిసిందే. అటువంటి జంతువుల కలెక్షన్ వాటిని బీచ్లకు తీసుకువెళ్లడం యూఏఈ సంపన్న కుటుంబాలకు ఓ సరదా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఓ విలాసవంతమైన భవనంలో ఒక పెంపుడు పులి.. ఓ వ్యక్తిని భయంతో పరుగులు తీయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Billionaire Life Style (@billionaire_life.styles) బిలియనీర్స్ లైఫ్ స్టైల్ అనే ఓ ఇన్స్టాగ్రామ్ ఈ వీడియోను పోస్ట్చేసింది. ముందు సరదగా వెంబడిస్తున్నట్లు అనుకున్న ఆ వ్యక్తి.. పులి వేగం పెంచి అదే పనిగా కోపంగా తన వెంటపడటంతో ఆ వ్యక్తి భయపడిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘అందమైన పులి.. ఒక బొమ్మ కాదు’, ‘దాడి చేయడానికి వచ్చిన పులి నుంచి తప్పించుకున్నాడు’, ‘చాలా ఫన్నీగా ఉంది.. ఇది ఖచ్చితంగా బిలియనీర్స్ లైఫ్ స్టైల్!’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వాళ్లను చంపేయండి.. ఇజ్రాయెల్కు గాజా ప్రజల విన్నపం! -
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్రంలోని వలస కార్మికులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఉపాధి కల్పించడానికి ఏడీఎన్హెచ్ కంపాస్ కంపెనీ ఉచిత రిక్రూటింగ్ ప్రక్రియ చేపట్టింది. తెలంగాణ జిల్లాలకు చెందిన 12 వేలమంది వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న కంపెనీ మరి కొంతమంది కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్యాటరింగ్ రంగంలో వలస కార్మికులకు ఆరు రకాలైన పనులు కల్పించనున్నారు. ఉచితంగా వీసా, విమాన టికెట్ సౌకర్యాన్ని కంపెనీ కల్పిస్తుంది. క్యాటరింగ్ సూపర్వైజర్(హాస్పిటాలిటీ క్యాటరింగ్ అనుభవం ఉన్నవారికి), టీం లీడర్(హాస్టల్ నిర్వహణ అనుభవం), హెవీ వెహికల్ డ్రైవర్(యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి), కిచెన్ స్టీవార్డ్స్, క్లీనర్స్, వెయిటర్లకు ఉపాధి కల్పించడానికి వీసాలను జారీ చేయనున్నారు. ఈ నెల 9న ముంబైలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఈ నెల 5, 6 తేదీల్లో ఆర్మూర్, జగిత్యాల్లోని జీటీఎం ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీవారిని కలిసి వివరాలను అందించాలని సంస్థ యజమాని చీటి సతీశ్రావు ‘సాక్షి’కి వివరించారు. 22 నుంచి 35 ఏళ్లలోపు వయసు కలవారు ఈసీఎన్ఆర్ పాస్పోర్టు కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులకు పచ్చ»ొట్టు ఉండకూడదని చెప్పారు. వేతనంతోపాటు ఉచితవసతి, భోజన సదుపాయం కల్పించి ఉపాధి ఇవ్వనున్నారని వెల్లడించారు. ముంబైలో ఇంటర్వ్యూకు వెళ్లేవారి కోసం తక్కువ ఖర్చుతో బస్సు సౌకర్యం కల్పించామన్నారు. -
పేద దేశాలకు ‘వాతావరణ మార్పుల’ నష్టపరిహారం
దుబాయి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయి నగరంలో కాప్–28 సదస్సు గురువారం ప్రారంభమైంది. 12 రోజులపాటు సదస్సు జరగనుంది. తొలిరోజు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. శిలాజ ఇంధనాల వాడకం మితిమీరుతుండడం, తద్వారా పెరుగుతున్న కాలుష్యం, సంభవిస్తున్న వాతావరణ మార్పుల వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాతావరణ మార్పుల్లో ఆయా దేశాల పాత్ర తక్కువే. అయినప్పటికీ నష్టాన్ని మాత్రం భరించాల్సి వస్తోంది. అందుకే వాటికి పరిహారం చెల్లించాలన్న ప్రతిపాదనకు కాప్–28 సదస్సులో ఆమోద ముద్ర వేశారు. -
Bhavana Reddy: ఓ విశ్వవ్యాప్త భావన
‘మెరుపు మెరిసినట్లు ఉంటుందామె నాట్యం. నాట్యానికి ఆమె చేసే న్యాయం అద్భుతంగా ఉంటుంది. భారతీయ శాస్త్రీయ నాట్యానికి ఆమె ప్రత్యేకమైన ఆకర్షణ’. ...ఇవన్నీ భావనారెడ్డి నాట్య ప్రతిభకు అందిన ప్రశంసలు. జాతీయ, అంతర్జాతీయ పత్రికల అక్షర పురస్కారాలు. ఇప్పుడామె కొత్త నాట్యతరంగాలను సృష్టించే పనిలో ఉన్నారు. కూచిపూడి కళాకారిణి భావనారెడ్డి నాట్యాన్ని అధ్యయనం చేశారు, నాట్యంలో పరిశోధన చేశారు. నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నాట్యాన్ని భావితరాలకు అందించడానికి శిక్షణనిస్తున్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్దేశాలలో మన కూచిపూడి అడుగులు వేయిస్తున్నారు. చిన్నారులకు కూచిపూడి అభినయ ముద్రలు నేర్పిస్తున్నారు. నాట్యకళాకారిణి నుంచి నాట్యగురువుగా మారి గురుశిష్యపరంపరకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 26వ తేదీన(ఆదివారం) ఆమెరికా, కాలిఫోర్నియాలో ఆమె శిష్యబృందం ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. కళామతల్లి దక్షిణ ‘‘నాట్యం ఎంతగా సాధన చేసినప్పటికీ ‘ఇకచాలు’ అనే ఆలోచన ఎప్పటికీ రాదు. ఇంకా ఏదో చేయాలనే తపన నేర్చుకున్న అడుగులకు కొత్తదనం అద్దమని పోరుతూనే ఉంటుంది. పౌరాణిక, ఆధ్యాత్మిక, సామాజిక అంశాలను నాట్యం ద్వారా అత్యంత లలితంగా వ్యక్తం చేయగలుగుతాం. అందుకే మన శాస్త్రీయ నాట్యప్రక్రియలు నిత్యనూతనం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళారూపాన్ని నేను మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను. దేశవిదేశాల్లో ప్రదర్శనలిచ్చాను. నా వంతు బాధ్యతగా కొత్త తరాలకు శిక్షణనిస్తున్నాను. ఇది నేను నాట్యానికి తిరిగి ఇస్తున్న కళాదక్షిణ. నాట్యానికి డిజిటల్ వేదిక కూచిపూడిని విశ్వవ్యాప్తం చేయడానికి లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చాను. కళాభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాను. కోవిడ్ కారణంగా ప్రపంచం స్తంభించి పోయింది. దాంతో నాట్య ప్రదర్శనలు ప్రశ్నార్థక మయ్యాయి. అప్పటికే నిర్ణయమైన కార్యక్రమాలు రద్దయ్యాయి కూడా. కరోనా వైరస్ ప్రదర్శననైతే నిలువరించగలిగింది కానీ నాట్యసాధనను కాదు. నా ఇన్స్టాగ్రామ్లో ఫొటోలను చూసి చాలా మంది నాట్యం నేర్పించమని అడిగారు. మన సంప్రదాయాన్ని గతం నుంచి భవిష్యత్తుకు చేర్చే మాధ్యమాలుగా మా కళాకారుల మీద ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మంచి సమయం అనిపించింది. అలా మూడేళ్ల కిందట అమెరికాలో ‘ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కూచిపూడి డాన్స్’ సంస్థను స్థాపించాను. దాదాపు యాభై మందికి కూచిపూడి నాట్యంలో శిక్షణనిచ్చాను. ఈ ప్రదర్శనలో గణనాట్య, పుష్పాంజలి, జతికట్టు, మండూక శబ్దం, దశావతారాల ప్రదర్శనలో మొత్తం 15 మంది చిన్నారులు పాల్గొన్నారు. అమ్మ దిద్దిన వ్యక్తిత్వం నాట్య ప్రక్రియల్లో కాలానుగుణంగా కొద్దిపాటి మార్పులు తోడవుతుంటాయి. కానీ శిక్షణనిచ్చే విధానంలో సంప్రదాయం కొనసాగుతుంది. డాన్స్ క్లాస్ను నాట్యమందిరంగా గౌరవించడంలో ఎటువంటి మార్పూ ఉండదు. రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యారెడ్డి... ఈ ముగ్గురూ కూచిపూడికి ప్రతీకలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారి బిడ్డలుగా అక్క యామిని, నేను ఆ పరంపరను కొనసాగిస్తున్నాం. నన్ను శిల్పంలా చెక్కడంలో, విలువలతో కూడిన వ్యక్తిగా తీర్చిదిద్దడంలో అమ్మ కౌసల్య కృషిని మాటల్లో వర్ణించలేం. నా భర్త డెనిస్ నిల్సన్ది స్వీడన్. ఆయన సంగీతకారుడు. ఇద్దరమూ కళాకారులమే కావడం నా కళాసేవకు మరింతగా దోహదం చేస్తోంది. వారి సొంతదేశం స్వీడన్. మేము అమెరికాలో నివసిస్తున్నాం. మా అబ్బాయికి ఐదు నెలలు. నడకతోపాటు నాట్యం నేర్చుకుంటాడో, మాటలతోపాటు పాటలు నేర్చుకుంటాడో చూడాలి’’ అని నవ్విందామె. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ∙ -
యూఏఈ పర్యటనలో మంత్రి అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు యూఏఈ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యూఏఈ లోని వైఎస్సార్సీపీ ఎన్నారై సలహాదారులు ప్రసన్న సోమిరెడ్డి, సమన్వయకర్త అక్రమ్ భాషా ఆధ్వర్యంలో పార్టీశ్రేణులను కలిశారు. రాబోయే ఎన్నికలను సమాయత్తపరిచే విధంగా దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'చంద్రబాబు అవినీతి కేసు విషయంలో చట్టం, న్యాయం తమ పని చేసుకొని వెళ్తున్నాయని, అన్నిసార్లు అబద్దాలను తమ పచ్చమీడియా ద్వారా ప్రచారం చేయలేరు. సోషల్ మీడియా ముసుగులో పచ్చమీడియా ఏకపక్ష వార్తలను ప్రజలను నమ్మడం లేదని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్ విఫలం అవడంతోనే నిరూపితం అయింది' అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలొ నివాస చౌదరి, ఫహీం, శ్యామ్ సురేంద్ర రెడ్డి, తరపట్ల మోహన్ రావు, బ్రహ్మానంద రెడ్డి, షేక్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. -
అయ్యయ్యో..దుబాయ్ అతిపెద్ద జెయింట్ వీల్ ఆగిపోయింది
Ain Dubai (Dubai Eye) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాలు, రికార్డ్-బ్రేకింగ్ ల్యాండ్మార్క్ నిర్మాణాలకు పుట్టినిల్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ముఖ్యంగా గ్లామ్-హబ్ దుబాయ్పర్యాటకులను ఆకర్షించే అతిపెద్ద ఫెర్రిస్ వీల్ ఐన్ దుబాయ్ (దుబాయ్ఐ) అర్థాంతరంగా నిలిచిపోయింది. దుబాయ్లో రెండేళ్ల కిందట (అక్టోబర్ 21, 2021) అట్టహాసంగా ప్రారంభమైన ఈ ప్రపంచంలోనే అతిపెద్ద జెయింట్ వీల్ హఠాత్తుగా ఆగిపోవడం చర్చకు దారితీసింది. (బంగారం,వెండి ధరలు: ఎలా ఉన్నాయంటే..!) దుబాయ్ అంటే ఆకాశహర్మ్యాలు, షాపింగ్ మాల్స్ షాపింగ్, లగ్జరీ హోటల్స్ తోపాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా గుర్తొస్తాయి. వీటన్నింటికి మించి అట్టహాసంగా ప్రారంభమై పర్యాటకులను విశేషంగా ఆకర్షించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫెర్రిస్ వీల్. ఈ అతిపెద్ద జెయింట్ వీల్ మొరాయిస్తోంది. ప్రస్తుతం ఎల్ఈడీ ఫిక్చర్లు మాత్రమే పనిచేస్తున్నాయట. ఈ విషయాన్ని అధికారిక వెబ్సైట్ స్వయంగా ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఐన్ దుబాయ్ తెరుచుకోదని వెల్లడించింది. గత కొద్ది నెలలుగా జరుగుతున్న పనులను పూర్తి చేయడానికి శరవేగంగా పనిచేస్తున్నామని ప్రకటించింది. దుబాయ్ ఐని ఎపుడు తిరిగి ప్రారంభించేదీ అధికారికంగా వెల్లడించలేదు. (లక్ అంటే ఇదే: ఖరీదైన బ్యాగ్ను ఎయిర్ట్యాగ్ పట్టిచ్చింది!) దుబాయ్ పర్యాటక శాఖ ప్రకారం పుట్టినల్లు దుబాయ్ ఐ 250 మీటర్ల (825 అడుగులు) uత్తులో ఉంది. . ప్రపంచంలోనే అతిపెద్దది. లండన్ ఐ కంటే దాదాపు రెండు రెట్లు ఎత్తు. అంతర్జాతీయ కంపెనీల కన్సార్టియం నిర్మించిన దుబాయ్ఐ, బ్లూవాటర్స్లో ఉంది. ఈఫిల్ టవర్ కంటేఎక్కువ ఉక్కుతో తయారు చేయబడినజెయింట్ వీల్, నామమాత్రంగానే మిగిలిపోవడం పర్యాటక ప్రియులను నిరాశపరుస్తోంది. -
భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫైనాన్షింగ్కు సంబంధించి ఒక కొత్త ఒప్పంద ఖరారుకు పారిస్లో జరుగుతున్న సదస్సులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాల మెరుగుపై దృష్టి సారించారు. ఫ్రాన్స్, బ్రెజిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థికమంత్రులతో ఆమె వేర్వేరుగా చర్చలు జరిపారు. భారత్ ప్రెసిడెన్సీలో కీలక జీ20 దేశాల దృష్టి సారించిన అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను (ఎండీబీ) బలోపేతం చేయడం, రుణ సమస్యల నిర్వహణపై కూడా వీరి సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 22–23 తేదీల్లో జరిగిన ఈసమావేశాలను భారత్, ఫ్రాన్స్, బర్బాడోస్లు నిర్వహించాయి. వాతావరణ మార్పు, జీవవైవిధ్య సంక్షోభం, అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థకు మించిన కొత్త గ్లోబల్ ఫైనాన్సింగ్ ఆర్కిటెక్చర్కు పునాదులు ఏర్పాటు చేయడం ’న్యూ గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్’ శిఖరాగ్ర సమావేశం లక్ష్యం. డీపీఐతో ప్రజా సొమ్ము ఆదా : సీతారామన్ కాగా పన్ను చెల్లింపుదారులు చెల్లించే డబ్బులు చక్కగా వినియోగించుకోవడానికి డిజిటల్ ప్రజా మౌలిక వసతులు (డీపీఐ) ఉపకరిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. భారత సర్కారు నేడు ఎన్నో రకాల ప్రయోజనాలను నేరుగా లబి్ధదారుల బ్యాంకు ఖాతాలకు అందించగలుగుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలో డీపీఐ గొప్ప సమర్థతను తీసుకొచి్చందని, నిధులను మెరుగ్గా వినియోగించడం సాధ్యపడినట్టు తెలిపారు. డీపీఐని ప్రవేశపెట్టిన తర్వాత కేవలం ఒక రాష్ట్రంలోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో రూ.లక్ష కోట్లను ఆదా చేసినట్టు చెప్పారు. మహిళలకు ఇచి్చన రుణ ఖాతాల పనితీరు మెరుగ్గా ఉందన్నారు. నూతన గ్లోబల్ ఫైనాన్సింగ్ ఒప్పందం విషయమై ప్రస్తుతం నిర్మలా సీతారామన్ ప్యారిస్లో పర్యటిస్తున్నారు. -
యూఏఈ నుంచి పెట్టుబడుల వెల్లువ
గతేడాది సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదుర్చుకున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి భారత్కు పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2021–22లో అతి పెద్ద ఇన్వెస్టర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్న యూఏఈ 2022–23 నాలుగో స్థానానికి చేరింది. 2021–22లో 1.03 బిలియన్ డాలర్ల చేయగా గత ఆర్థిక సంవత్సరం దానికి మూడు రెట్లు అధికంగా 3.35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ ఆంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం 2022–23లో 17.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సింగపూర్ అతి పెద్ద ఇన్వెస్టరుగా నిల్చింది. మారిషస్ (6.1 బిలియన్ డాలర్లు), అమెరికా (6 బిలియన్ డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. యూఏఈతో ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులపరమైన సహకారం వేగంగా పటిష్టమవుతుండటం ఇన్వెస్ట్మెంట్ల రాకకు దోహదపడుతోందని శార్దూల్ అమర్చంద్ మంగళ్దాస్ అండ్ కంపెనీ పార్ట్నర్ రుద్ర కుమార్ పాండే తెలిపారు. భారత్లో యూఏఈ ప్రధానంగా సర్వీసెస్, సముద్ర మార్గంలో రవాణా, నిర్మాణం, విద్యుత్ తదితర రంగాల్లో ఉంటున్నాయి. భారత్, యూఏఈ కుదుర్చుకున్న సమగ్ర ఎఫ్టీఏ గతేడాది మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో సుంకాల సమస్య లేకుండా ఒక దేశ మార్కెట్లో మరో దేశం తమ ఉత్పత్తులు, సేవలను విక్రయించుకోవడానికి వీలు లభించింది. అలాగే పెట్టుబడులను పెంచుకునేందుకు నిబంధనలను కూడా సడలించారు. 2000 ఏప్రిల్ నుంచి 2023 మధ్య కాలంలో భారత్కి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్డీఐ) యూఏఈ వాటా 2.5 శాతంగా ఉంది. ఈ వ్యవధిలో యూఏఈ 15.6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. -
పుస్తకాన్ని రాసి ప్రచురించిన నాలుగేళ్ల బాలుడు
అబుదాబి: పిట్ట కొంచెం కూత ఘనం అని సామెత. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన ఈ నాలుగేళ్ల బాలుడిని చూస్తే పిట్ట కొంచెం రాత ఘనం అని సామెత మార్చుకోవాలి. అబుధాబిలో ఉండే సయీద్ రషీద్ అనే నాలుగేళ్ల వయసున్న బాలుడు ఒక పుస్తకాన్ని రాయడంతో పాటు దానిని ప్రచురించి గిన్నీస్ వరల్డ్ రికార్డులకెక్కాడు. ఒక ఏనుగుకి, ఎలుగుబంటికి మధ్య ఏర్పడిన స్నేహానుబంధాన్ని కథగా మలిచాడు. ఆ పుస్తకం వెయ్యి కాపీల వరకు అమ్ముడైంది. గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారులు ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా సయీద్ రికార్డులకెక్కినట్టుగా ప్రకటించారు. సయీద్ ఈ పుస్తకం రాయడానికి ఎనిమిదేళ్ల వయసున్న అతని అక్క అయిధాబీ స్ఫూర్తిగా నిలిచిందని ఖలీజా టైమ్స్ వెల్లడించింది. ఇప్పటికే అయిధాబీ ఒక ప్రచురణ సంస్థను కూడా నడుపుతూ రికార్డులు సాధించింది. మొత్తమ్మీద ఫ్యామిలీలో అందరికీ పుస్తకాలంటే ఎంతో ఇష్టం కావడంతో ఈ అరుదైన ఘనత సాధించగలిగాడు. -
ఆ ఐదుగురినీ విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్, సిరిసిల్లటౌన్: దుబాయి జైల్లో మగ్గుతున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు తెలంగాణ వాసులను విడుదల చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలిని కోరారు. భారత పర్యటనలో భాగంగా అబ్దుల్ నసీర్ సోమవారం హైదరాబాద్ ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దుబాయ్లో శిక్ష అనుభవిస్తున్న వారి వివరాలతో కూడిన వినతిపత్రాన్ని కేటీఆర్ అందజేశారు. నేపాల్కు చెందిన దిల్ప్రసాద్రాయ్ మృతి కేసులో రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేశ్, రవి, నాంపల్లి వెంకటేశ్, దండుగుల లక్ష్మణ్, హనుమంతులు ప్రస్తుతం దుబాయ్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారని రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. యూఏఈ చట్టాల మేరకు రూ.15 లక్షల పరిహారాన్ని బాధితుని కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందని, ఈ మేరకు 2013లో తానే స్వయంగా నేపాల్ వెళ్లి బాధితుడి కుటుంబాన్ని కలిసినట్లు తెలిపారు. బాధిత కుటుంబం నుంచి అన్నిరకాల పత్రాలను 2013లోనే దుబాయ్ ప్రభుత్వానికి అందించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిందని, ఇక దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాభిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని చెప్పారు. ఈ విషయంలో చొరవచూపాలని కోరారు. హైదరాబాద్ భేష్: యూఏఈ రాయబారి ప్రశంసలు కేటీఆర్తో జరిపిన భేటీలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలి ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్లో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం, ఐటీ దాని అనుబంధ రంగాల్లో తెలంగాణ బలం గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడి అవకాశాలు, తెలంగాణ ప్రభుత్వ పాలసీలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా యూఏఈ రాయబారికి వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని స్టార్టప్ ఈకో సిస్టంతో ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లోని వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్నోవేషన్ ఈకో సిస్టం భాగస్వాములు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారని, ఇదే రీతిన యూఏఈలోని వెంచర్ క్యాపిటలిస్టులను టీ హబ్కు పరిచయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యూఏఈ రాయబారి... తమ దేశంలోని ఔత్సాహిక వెంచర్ క్యాపిటలిస్టులను, హైదరాబాద్ ఈకో సిస్టంలోని స్టార్టప్ సంస్థలను అనుసంధానించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. -
అరబ్ ఎమిరేట్స్ అధికారి రేంజ్లో కలరింగ్.. చివరికి బిల్లు కట్టకుండా..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన ప్రభుత్వాధికారిలా నటించి ఓ ఫైస్టార్ హోటల్నే మోసం చేశాడు. ఈఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వాధికారిలా నటించి దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ లీలా హోటల్ ఫ్యాలస్ అనే ఫైస్టార్ హోటల్లో బస చేశాడు. ఆ హోటల్ మేనేజర్ అనుపమదాస్ గుప్తాకి ఒక నకిలీ బిజినెస్ కార్డుని చూపించి దాదాపు మూడు నెలలు పాటు అక్కడే ఉన్నాడు. అతను ఆగస్టు1, 2022 నుంచి నవంబర్ 20, 2022 వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఉన్నటుండి హోటల్ బిల్ చెల్లించకుండా ఆ హోటల్లో ఉన్న విలువైన వస్తువులను దొంగలించి పరారయ్యాడు. అతను సుమారు రూ. 23 లక్షల బిల్లు కట్టకుండా పరారయ్యాడు. దీంతో మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడు గురించి తీవ్రంగా గాలించి అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి కర్ణాటకలోని దక్షిణ కన్నడకు చెందిన 41 ఏళ్ల మహ్మద్ షరీఫ్గా గుర్తించారు. అతను సమర్పించిన చెక్కు కూడా బౌన్స్ అయ్యిందని, అతను ఉద్దేశపూర్వకంగానే హోటల్ని మోసం చేసేందుకు యత్నించినట్లు విచారణలో తేలిందని పోలీసలు వెల్లడించారు. (చదవండి: షాకింగ్ ఘటన: కారుతో ఢీకొట్టి..ఎనిమిది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి...) -
నిజామాబాద్: షార్జాకి తీసుకెళ్లి.. పత్తా లేకుండా పోయి..
మోర్తాడ్(బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని షార్జాలో అల్వాజ్ క్యాటరింగ్ కంపెనీలో పని ఉందని చెప్పి 250 మందిని విడతల వారీగా విజిట్ వీసాలపై పంపించిన ఏజెంట్ పని చూపకుండా చేతులెత్తేశాడు. షార్జాకు మొదట విజిట్ వీసాలపై వెళ్లాలని అక్కడ వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మించిన ఏజెంట్ దాదాపు రూ.2 కోట్ల వరకు వసూలు చేసి ఉడాయించాడు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఆ కార్మికులు షార్జాలోని ఒక హోటల్లో గత నెల రోజులుగా ఉండిపోగా.. కొందరు తమకు తెలిసిన వారి ద్వారా మరో కంపెనీలో పని వెతుక్కున్నారు. మరికొందరు ఇంటిముఖం పట్టారు. ఒక్కొక్కరి నుంచి రూ.75వేలు వసూలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వర్ని మండలం కొత్తపేట్కు చెందిన ఓ వ్యక్తి ట్రావెల్ ఏజెన్సీని కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నాడు. లైసెన్స్ లేకపోయినా ఎంతో మందిని నమ్మకంగా గల్ఫ్ దేశాలకు పంపించాడనే ఉద్దేశంతో వలస కార్మికులు అతనిపై నమ్మకంతో డబ్బులు, పాస్పోర్టులు అందించారు. సదరు వ్యక్తి వివిధ ప్రాంతాల్లో దాదాపు 40 మందిని సబ్ ఏజెంట్లుగా నియమించుకుని వారి ద్వారా షార్జా పంపించడానికి 250 మంది కార్మికులకు విజిట్ వీసాలను జారీ చేశాడు. ఒక్కొక్కరి వద్ద విజిట్ కమ్ వర్క్ వీసాల కోసం రూ.75 వేల నుంచి రూ.85 వేల వరకు వసూలు చేశాడు. అయితే కేవలం విజిట్ వీసాలనే కార్మికులకు అంటగట్టి షార్జా పంపించాడు. అక్కడ వర్క్ వీసా ఇప్పించకుండా పత్తా లేకుండా పోయి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయడంతో ఏజెంట్ మోసం బయటపడింది. కాగా, వలస కార్మికుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో ఏజెంట్ సుమారు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేఎస్ ట్రావెల్స్కి చెందిన చిట్యాల స్వామిపై వలస కార్మికుల కుటుంబ సభ్యులు వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందనేది విచారణ చేస్తున్నాం.. అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు సాక్షికి వెల్లడించారు. -
వస్త్ర ఎగుమతులకు భారత్–యూఏఈ ఎఫ్టీఏ బూస్ట్
న్యూఢిల్లీ: భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) దేశం నుంచి భారీగా వస్త్ర రంగ ఎగుమతుల పురోగతికి దోహదపడుతుందని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్ విభాగం చైర్మన్ అశోక్ రజనీ విశ్లేషించారు. ఈ ఒప్పందం వల్ల సుంకం రహిత మార్కెట్ ఏర్పడుతుందని, ఇది మన ఎగుమతుల్లో యూఏఈ వాటా మరింత పెరగడానికి దోహపడుతుందని ఇక్కడ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. దుబాయ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ అపెరల్ అండ్ టెక్స్టైల్ ఫెయిర్ (ఐఏటీఎఫ్)లో 20 మందికి పైగా దేశీయ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. రెడీమేడ్ దుస్తుల్లో చైనా తర్వాతి స్థానంలో మనమే.. యూఏఈకి రెడిమేడ్ దుస్తులను సరఫరా చేసే దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉందని అశోక్ రజనీ తెలిపారు. ‘‘యూఏఈ సాంప్రదాయకంగా భారత వస్త్ర ఎగుమతులలో అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వామిగా ఉంది. రెండు దేశాలూ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై సంతకం చేయడంతో, భారత వస్త్ర ఎగుమతులకు యూఏఈలోకి సుంకం రహిత ప్రవేశం లభిస్తుంది. దీనితో దేశ వస్త్ర రంగం ఎగుమతులు మరింత పెరుగుతాయని అంచనా’’ అని ఆయన వివరించారు. ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుతూ, విస్తృత శ్రేణి సాంప్రదాయ పత్తి, ఎంఎంఎఫ్ (మాన్ మేడ్ ఫైబర్స్) వస్త్రాలలో తాజా ఫ్యాషన్ పోకడలకు అనుగుణంగా భారతదేశ అత్యుద్భుత దుస్తుల డిజైన్లు, శైలులను ప్రదర్శించాలని మన ఎగుమతిదారులు లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. వివిధ రకాల ముడిసరుకు లభ్యత, ఇతర సానుకూల అంశాల పరంగా మన దేశ గార్మెంట్ పరిశ్రమ పటిష్టతను పరిగణనలోకి తీసుకుని, భారత్ను ఒక సోర్స్గా (మూల ఉత్పత్తి వనరు) మలచుకోడానికి యూఏఈ దుస్తుల బ్రాండ్లకు ఈ ఫెయిర్ భారీ వ్యాపార అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. భారత్ వస్త్ర పరిశ్రమ పటిష్టతను ఆయన వివరిస్తూ, సాంప్రదాయ దుస్తుల విభాగంలో పరిశ్రమ స్థిరపడిన తర్వాత, మరిన్ని విభాగాల్లోకి విస్తరించడానికి వ్యూహ రచన చేస్తోందన్నారు. దేశ దుస్తుల పరిశ్రమ ఇప్పుడు 16 బిలియన్ డాలర్ల సాంకేతిక వస్త్ర విభాగంలో ఎంఎంఎఫ్ కొత్త రంగాలలోకి విస్తరించిందని పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్ విలువలో ఇది దాదాపు 6 శాతమని తెలిపారు. -
Dubai: ప్రపంచంలోనే ఎత్తైన నివాస భవనం
దుబాయ్: ఆకాశ హర్మ్యాలకు కేరాఫ్ అయిన యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్.. మరో ఘనతను దక్కించుకోబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనానికి దుబాయ్ వేదిక కాబోతోంది. దుబాయ్ పరిధిలో ఆర్థిక ప్రాంతంగా పేరున్న ‘బిజినెజ్ బే’లో వంద ఫ్లోర్లతో నిర్మించిన ఈ హైపర్టవర్ గిన్నిస్ రికార్డు ఘనతను సొంతం చేసుకోవడానికి సిద్ధమైంది. అంతకు ముందు ఈ రికార్డు న్యూయార్క్ నగరం(అమెరికా) మాన్హట్టన్ 57వ స్ట్రీట్లోని సెంట్రల్ పార్క్ టవర్ పేరిట ఉంది. ఆ భవనంలో 98 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక.. ఎత్తు 472 మీటర్ల రికార్డును సైతం దుబాయ్ హైపర్టవర్ అధిగమించనుంది. కేవలం ఎత్తులోనే కాదు.. అత్యంత విలాసవంతమైన నివాస భవనంగానూ ఇది రికార్డు సృష్టించడానికి సిద్ధమైంది. సెంట్రల్ పార్క్ టవర్ దుబాయ్లో ఈ హైపర్టవర్ను ప్రపంచ రికార్డు నెలకొల్పే ఉద్దేశంతోనే నిర్మిస్తున్నట్లు నిర్మాణ కంపెనీలు మంగళవారం ప్రకటించాయి. ఎమిరేటి ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ ‘బింఘట్టి’, ప్రముఖ వాచ్మేకర్ కంపెనీ ‘జాకోబ్ అండ్ కో’ సంయుక్తంగా ఈ భవనాన్ని నిర్మించాయి. దీంతో.. ఈ భవనానికి బుర్జ్ బింఘట్టి జాకోబ్ అండ్ కో రెసిడెన్సీగా నామకరణం చేశారు. అగ్రభాగాలు.. డైమండ్ ఆకారంలో ఉండడం ఈ భవనానికి ఉన్న మరో ప్రత్యేకత కాగా, రాత్రిపూట మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుతురులో ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఈ ఆకాశ హర్మ్యం. పూర్తిగా డబుల్, త్రిబుల్ బెడ్ రూంలతో పాటు ప్రత్యేకమైన సదుపాయాలెన్నింటినో ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ. చివరి ఐదు ఫ్లోర్లలో అత్యంత విలాసవంతమైన పెంట్హౌజ్లను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ భవనం ప్రారంభ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇదీ చదవండి: మొట్టమొదటి ఆకాశ హార్మ్యం ఏది? ఎవరు కట్టారో తెలుసా? -
‘విజిట్’కు రప్పించి స్మగ్లింగ్ చేయిస్తున్నారు..
మోర్తాడ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో తక్కువ ధరకు లభించే బంగారాన్ని ఇక్కడికి అక్రమంగా తరలించడానికి స్మగ్లర్ల ముఠాలు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా స్థానిక ముఠాలు, గల్ఫ్ స్మగ్లర్లతో కలసి ఉపాధి పేరుతో నిరుద్యోగ యువతకు గాలం వేస్తున్నాయి. దుబాయ్, షార్జా తదితర ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి తమ దందాకు పావులుగా వాడుకుంటున్నాయి. విజిట్ వీసాలపై యూఏఈ వెళ్లిన తర్వాత వర్క్ వీసాలు ఇప్పిస్తామని స్మగ్లర్లు నమ్మిస్తున్నారు. వారి మాటలు నమ్మి విజిట్ వీసాలపై యూఏఈ వెళ్లిన యువకులకు తమ పథకంలో భాగంగా ఎలాంటి పని చూపకుండా ఖాళీగా కూర్చోబెడుతున్నారు. పని కోసం వేచిచూసి విసిగిపోతున్న యువకులు తాము ఇంటికి వెళ్తామని చెప్పగానే అలాంటి వారికి బంగారం దాచి ఉంచిన సూట్కేసులు, బ్యాగులను ఇచ్చి పంపిస్తున్నారు. ఎయిర్పోర్టులలో పట్టుబడినప్పుడు ఈ స్మగ్లింగ్ వ్యవహారంపై అవగాహన లేని అమాయకులు కటకటాల పాలవుతున్నారు. స్మగ్లర్లు మాత్రం తప్పించుకుంటున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో దుబాయ్ నుంచి వేరువేరు విమానాల్లో వచ్చిన ముగ్గురు యువకుల నుంచి రూ.4 కోట్ల విలువ చేసే బంగారం కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. అంతకు ముందు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెంకు చెందిన అస్లాం అనే 19 ఏళ్ల యువకుడి నుంచి రూ.1.20 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని అతడిని రిమాండ్కు తరలించారు. ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే బంగారం స్మగ్లర్లు తమ దందా కోసం కొత్తగా గల్ఫ్కు వెళ్లాలనుకునే యువతను లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. కంపెనీ వీసాలుంటేనే రండి..: వర్క్ వీసా ఇస్తే కంపెనీలో పని చేసుకుంటారని.. అలా కాకుండా విజిట్ వీసాతో రప్పించి పని చూపకుండా ఖాళీగా ఉంచితే ఇంటికి వెళ్తామని ఆ యువకులే స్వచ్ఛందంగా చెబుతారని స్మగ్లర్లు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లోనే బంగారం స్మగ్లింగ్ గుట్టు బయటపడుతుండగా అనేక సమయాల్లో బంగారం యథేచ్ఛగా అక్రమ రవాణా అవుతోందని తెలుస్తోంది. కాగా, యూఏఈలో విజిట్ వీసాలపై వచ్చిన వారికి పనులు సులభంగా దొరకడం లేదని, కంపెనీ వీసాలు ఉంటేనే రావాలని వలస కార్మికుల సంఘాల నాయకులు సూచిస్తున్నారు. స్మగ్లర్ల మాయమాటలు నమ్మి జైలు పాలుకావద్దని హెచ్చరిస్తున్నారు. -
యూఏఈ ప్రభుత్వం ఖుషీ ఖబర్.. స్పాన్సర్ లేకుండా సొంతంగా వ్యాపారం
మోర్తాడ్ (బాల్కొండ): విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే వలసదారులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం ఖుషీ ఖబర్ అందించింది. వీసా నిబంధనలను సవరిస్తూ యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయంతో ఆ దేశానికి వెళుతున్న వలసదారులకు అనేక రకాల ప్రయోజనాలు కలుగనున్నాయి. యూఏఈ పరిధిలోని దుబాయ్, అబుదాబి, అజ్మన్, షార్జా తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు సొంతంగా వ్యాపారం చేయాలనుకునే విదేశీయులకు ఆ దేశానికి చెందిన వారి ద్వారానే లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇలా స్పాన్సర్ మధ్యవర్తిత్వం ద్వారా వ్యాపారం చేయాలనుకుంటే 51 శాతం స్పాన్సర్ పెట్టుబడి, మిగిలిన 49 శాతం వలసదారుడు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో స్పాన్సర్ పెట్టుబడి పెట్టినా పెట్టకపోయినా వలసదారుడే మొత్తం పెట్టుబడి పెట్టి లాభాల్లో వాటాను పంచిపెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు స్పాన్సర్తో సంబంధం లేకుండా యూఏఈ ప్రభుత్వం అనుమతితో ఎవరైనా ఆ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. విజిట్ వీసా గడువు 60 రోజులకు పెంపు విజిట్ వీసా కాలపరిమితి 30 రోజులే ఉండగా ఇప్పుడు 60 రోజులకు పెంచారు. అనుకోని సందర్భంలో ఉద్యోగం కోల్పోయినవారు వెంటనే ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఆరు నెలల వరకు అక్కడే ఉండి మరో కంపెనీలో పని వెతుక్కుని వీసాను రెన్యువల్ చేసుకోవచ్చు. గతంలో కంపెనీ ఉద్యోగం నుంచి తొలగిస్తే ఇంటికి రావడం లేదా కార్మికునిగా ఉండిపోయి పోలీసులకు దొరికితే కటకటాల పాలైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఐదు సంవత్సరాల మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా ఉన్నవారు వరుసగా మూడు నెలల పాటు యూఏఈలో ఉండవచ్చు. గ్రీన్ వీసా పొందినవారు తమకు ఉన్న పర్మిట్ పూర్తయితే రెన్యువల్ చేసుకోవడానికి ఆరు నెలల గడువును పొడిగించారు. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను కల్పిస్తూ యూఏఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈనెల 3 నుంచి అమలులోకి వచ్చింది. యూఏఈకి వలస వెళుతున్న వారిలో భారతీయుల సంఖ్యనే అధికంగా ఉండటంతో వీసా నిబంధనల సవరణ ప్రయోజనాలు ఎక్కువ శాతం మనవారికే కలుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
Ban Vs UAE: గట్టి పోటీనిచ్చిన యూఏఈ! అఫిఫ్ అద్భుత ఇన్నింగ్స్! బంగ్లాదే పైచేయి!
United Arab Emirates vs Bangladesh, 1st T20I- Dubai: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాటర్ అఫిఫ్ హొసేన్ అదరగొట్టాడు. దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మొదటి మ్యాచ్లో 55 బంతుల్లో అతడు 7 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగతా ఆటగాళ్లంతా విఫలమైన వేళ విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయం అందించాడు. తద్వారా మొదటి టీ20లో గెలుపుతో రెండు మ్యాచ్ల సిరీస్లో బంగ్లాదేశ్ 1-0తో ముందంజలో నిలిచింది. అదరగొట్టిన యూఏఈ బౌలర్లు.. కానీ! ఆదివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. యూఏఈ బౌలర్ల ధాటికి బంగ్లా టాపార్డర్ కుప్పకూలింది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో వచ్చిన బ్యాటింగ్ ఆల్రౌండర్ అఫిఫ్ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడి 77 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది నురుల్ హసన్ బృందం. ఉత్కంఠ పోరులో ఆఖరికి! ఇక లక్ష్య ఛేదనలో యూఏఈ తడబడింది. ఓపెనర్ చిరాగ్ సూరి శుభారంభం అందించినా మిగతా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆఖరల్లో కార్తిక్ మయప్పన్(12), జునైద్ సిద్ధిఖీ(11) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 19.4 ఓవర్లలో 151 పరుగులకు యూఏఈ ఆలౌట్ కావడంతో 7 పరుగుల తేడాతో విజయం బంగ్లాదేశ్ను వరించింది. ఇక ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించిన అఫిఫ్ హొసేన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ దూరంగా ఉండటంతో నరుల్ హసన్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. చదవండి: Rohit Sharma- Virat Kohli: పట్టరాని సంతోషం.. కోహ్లి- రోహిత్ ఆలింగనం.. వీడియో వైరల్ Ind Vs Aus 3rd T20- Rohit Sharma: పంత్ను అందుకే ఆడించలేదు; హైదరాబాద్లో మ్యాచ్ ప్రత్యేకం.. ఎందుకంటే! -
I2U2 Summit: భారత్లో యూఏఈ పెట్టుబడులు
ఐ2యూ2 ఫ్రేమ్వర్క్లో భాగంగా భారత్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా సమీకృత ఫుడ్పార్కుల అభివృద్ధికి 2 బిలియన్ డాలర్లు (రూ.1.60 లక్షల కోట్లు) ఖర్చు చేస్తామని ప్రకటించింది. అలాగే గుజరాత్లో హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుకు ఐ2యూ2 భాగస్వామ్య దేశాలు ఆసక్తి కనబర్చాయి. ఫుడ్పార్కుల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను భారత ప్రభుత్వం సమకూర్చనుంది. ఈ పార్కులతో రైతులను అనుసంధానించనున్నారు. సదస్సు అనంతరం ఐ2యూ2 కూటమి ఒక ప్రకటన జారీ చేసింది. ‘అగ్రికల్చర్ ఇన్నోవేషన్ మిషన్ ఫర్ క్లైమేట్ ఇనీషియేటివ్’పై ఆసక్తి చూపిన భారత్ను అమెరికా, యూఏఈ, ఇజ్రాయెల్ స్వాగతించాయి. -
యూఏఈ నూతన అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్కు కొత్త అధ్యక్షుడిగా అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని శనివారం అక్కడి మీడియా అధికారికంగా ప్రకటించింది. అనారోగ్య సమస్యలతో యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ను ఇప్పుడు అధికారికంగా యూఏఈ అధ్యక్షుడిగా ప్రకటించారు. షేక్ ఖలీఫా పదవిలో ఉన్నప్పటికీ ఆయన అనారోగ్యం కారణంగా.. చాలా ఏళ్ల నుంచి షేక్ మొహమ్మద్ బిన్నే పాలన వ్యవహారాలను చూసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. షేక్ ఖలీఫా మరణంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. షేక్ మొహమ్మద్ను ఎంబీజీగా వ్యవహరిస్తుంటారు. అధ్యక్ష ప్రకటన నేపథ్యంలో.. UAE యొక్క ఏడు ఎమిరేట్స్ పాలకులతో కూడిన ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ సభ్యులను కలుసుకున్నారాయన. ఎన్నో మార్పులు.. ఎడారి సంప్రదాయ దేశం యూఏఈ గడ్డ మీద ఎన్నో సంస్కరణలకు తాత్కాలిక అధ్యక్షుడి హోదాలోనే షేక్ మొహమ్మద్ కారణం అయ్యారు. అంతరిక్షంలోకి యూఏఈ పౌరుడ్ని పంపడం, మార్స్ పరిశోధనలో భాగం కావడం, మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ను ప్రారంభించడం, విదేశాంగ విధానాలను మెరుగు పర్చడం లాంటి ఎన్నో పనులు చేశారు. అమెరికా జోక్యాన్ని తగ్గించడం, ఇజ్రాయెల్తో సంబంధాలు, యెమెన్ యుద్ధంలో పాల్గొనడం లాంటి కీలక పరిణామాలెన్నో చోటుచేసుకున్నాయి కూడా. చదవండి👉🏼: యూఏఈ అధ్యక్షుడి కన్నుమూత! -
ఆస్ట్రేలియా, యూఏఈలతో వ్యాపారాభివృద్ధి
చెన్నై: ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)లతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వ్యాపార ఒప్పందాల (ఎఫ్టీఏ) ద్వారా ఒనగూడే వాణిజ్య అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశీయ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ఆయా దేశాల్లో భాగస్వాములను గుర్తించాలని కూడా పిలుపునిచ్చారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఇక్కడ నిర్వహించిన ‘స్టేక్హోల్డర్స్ అవుట్రీచ్ ప్రోగ్రామ్’లో సీతారామన్ ఈ మేరకు కీలక ప్రసంగం చేశారు. ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ), ఆస్ట్రేలియాతో ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకాలు చేయడంతో, ఇప్పుడు ఆ రెండు దేశాలలో ‘‘తమ జాయింట్ వెంచర్ భాగస్వామి‘ని గుర్తించడం పరిశ్రమలకు కీలకం. ఇది ఆయా దేశాల్లో వ్యాపారావకాశాలను పెంచుతుంది. యూఏఈలో వ్యాపారవేత్తలు భారత్లో 75 బిలియన్ డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టేందుకు సింద్ధంగా ఉన్నారు. ► ఆరేడేళ్ల క్రితం తమిళనాడు పర్యటనకు వచ్చినప్పుడు, భారతదేశం ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశలో ముందడుగు వేయాలని పలు సూచనలు వచ్చాయి. ఈ రోజు భారత్ యూఏఈ, ఆస్ట్రేలియాతో ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ► స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం ఆస్ట్రేలియాతో 10 ఏళ్లకు పైగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఒప్పందం కేవలం 88 రోజుల్లోనే కుదరడం భారత్ ప్రభుత్వం ఈ విషయంలో సాధించిన పురోగతికి నిదర్శనం. ఇండో–పసిఫిక్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్లో ఆస్ట్రేలియా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ► కంపెనీ లేదా ఇతర ఏదైనా సంస్థ తన కార్యకలాపాలలో పారదర్శకంగా ఉండాలి. కంపెనీలోని పెట్టుబడిదారులుసహా అన్ని వివరాలు ‘‘పబ్లిక్ డొమైన్’’లో అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఆయా అంశాలే పరిశ్రమ కార్యకలాపాలకు సంబంధించి పారదర్శకతను పెంపొందిస్తాయి. ► కేంద్రం పరిశ్రమకు తన పూర్తి సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. పన్ను విధానాల్లో ప్రభుత్వం సూచించిన పారదర్శక పద్దతులు పాటిస్తూ, పన్నులు చెల్లిస్తే ఎటువంటి తనిఖీలూ ఉండవు. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున భారత్ పరిశ్రమ ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తగిన అన్ని చర్యలూ తీసుకోవాలి. పరిశ్రమకు ఇది చాలా కీలకం. ► చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చారు. ఈ సమావేశానికి చాలా ఆసక్తితో హాజరు కావడానికి సమయం తీసుకున్నారు. మనం మన కార్యకలాపాలలో పారదర్శకతను తీసుకురావడం, సాంకేతికతను పెంచడం వంటి చర్యల ద్వారా వ్యాపారాన్ని వేగంగా వృద్ధిబాటన నడపగలుగుతాము. ► కంపెనీలు ఇతర దేశాలలో వ్యాపార సంబంధాలు నెరపడానికి గతంలో పలు అవరోధాలను ఎదుర్కొనాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. ఎటువంటి అవరోధాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏ విషయంలోనైనా ప్రభుత్వం తన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. పరిశ్రమకు విద్యుత్ కష్టాలు రానీయకండి...రాష్ట్రాలకు సూచన కాగా, పరిశ్రమలకు విద్యుత్ కష్ట నష్టాలు రానీయద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికమంత్రి విజ్ఞప్తి చేశారు. తగిన రేట్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరాలు చేయాలని ఆమె ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. 24 గంటలై 365 రోజులు పరిశ్రమకు విద్యుత్ అందేలా చర్యలు ఉండాలన్నారు. ఇందుకు తగిన మౌలిక ఇంధన ప్రణాళికను రూపొందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ పురోగతికి ఇది కీలకమని పిలుపునిచ్చారు. ఈ దిశలో రాష్ట్రాలకు కేంద్రం తగిన సహాయ సహకారాలను పూర్తిస్థాయిలో అందిస్తుందని భరోసాను ఇచ్చారు. దేశ మౌలిక రంగం పురోగతికి 2021–22 బడ్జెట్తో పోల్చితే 2022–23 బడ్జెట్లో నిధుల కల్పనను రూ.5.5 లక్షల కోట్ల నుంచి రూ.7.5 లక్షల కోట్లకు పెంచిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం 50 ఏళ్లపాటు రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాన్ని అందజేస్తామని బడ్జెట్లో ప్రకటించామనీ తెలిపారు. -
భారత్లో పెట్టుబడులు పెట్టండి
అబుదాబి: పెట్టుబడులు పెట్టేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వద్ద పుష్కలంగా నిధులు ఉన్నాయని, ఇన్వెస్ట్ చేయడానికి భారత్లో అపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. కనెక్టివిటీ, కృత్రిమ మేధ, కొత్త టెక్నాలజీలు, డేటా అనలిటిక్స్ వంటి వివిధ రంగాల్లో ఇరు దేశాలు పనిచేయగలవని ఆయన పేర్కొన్నారు. ఇండియా–యూఏఈ స్టార్టప్ ఫోరం 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘యూఏఈ వద్ద పెట్టుబడుల సామర్థ్యాలు ఉన్నాయి. భారీ మార్కెట్ రూపంలో భారత్ .. పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా నిలుస్తోంది. కాబట్టి ఇరు దేశాలకు ఒకదానితో మరొకదానికి పోటీ లేదు. రెండూ భాగస్వాములుగా కలిసి పనిచేయవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. అంకుర సంస్థలకు సదుపాయాలు కల్పించడంతో పాటు స్టార్టప్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఉందని, నంబర్ వన్ స్థానానికి చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఆయన పేర్కొన్నారు. దుబాయ్ ఎక్స్పో సందర్భంగా భారత స్టార్టప్లకు మంచి స్పందన లభించిందని.. పలు అంకుర సంస్థలు నిధులను సమీకరించుకున్నాయని, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని గోయల్ చెప్పారు. అంకుర సంస్థలు తమ ఆవిష్కరణ ప్రయోజనాలు .. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా చేరువయ్యేలా చూడాలని ఆయన సూచించారు. -
అక్కడ యాక్సిడెంట్ ఫొటోలు, వీడియోలు తీస్తే జైలుకే!
నేరాలు, ఘోరాలు కళ్లెదుట జరుగుతున్నా, అడ్డుకోవడం సంగతి పక్కనపెడితే.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం తరచూ చూస్తుంటాం. అయితే ఇలాంటి చేష్టలను ఉపేక్షించబోయేది లేదంటూ ప్రకటించింది మిడిల్ ఈస్ట్ కంట్రీ యూఏఈ. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడ్డ వాళ్లను, చనిపోయినవాళ్లను వీడియోగానీ, ఫొటోలుగానీ తీస్తే కఠినంగా శిక్షించే చట్టం తీసుకొచ్చింది. ఇందుకుగానూ శిక్షగా లక్షా యాభై వేల దుబాయ్ దిర్హం నుంచి ఐదు లక్షల దిర్హంల దాకా జరిమానా. లేదంటే ఆరు నెలల జైలు శిక్ష. ఒక్కోసారి రెండూ విధించనున్నట్లు యూఏఈ సైబర్క్రైమ్ చట్టానికి సవరణ తీసుకొచ్చింది. జనవరి 2, 2022 నుంచే ఈ కొత్త చట్టం అమలులోకి వచ్చిందంటూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అధికారులకు మాత్రం సాక్ష్యాల సేకరణలో ఇందుకు మినహాయింపు మాత్రం ఉంటుంది. డిజిటల్ యుగంలో ఇలాంటి చేష్టలను ప్రొత్సహించడం మంచిది కాదు. రోడ్డు ప్రమాదాల్లో బాధితుల ఫొటోలు, వీడియోలు తీయడం, వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, ఇతరులకు ఫార్వార్డ్ చేయడం.. ఏదీ మంచిది కాదనే ఈ చట్టం తీసుకొచ్చాం అని చెబుతున్నారు అక్కడి అధికారులు. ఇంతేకాదు.. అవతలి వాళ్ల అనుమతులు లేకుండా వ్యక్తుల ఫొటోలు, వీడియోలు తీయడం లాంటి చేష్టలపై కూడా కొరడా ఝుళిపించేందుకు చట్టాలన్ని కఠినం చేసింది. ఇలాంటి చేష్టలకు ఏడాది జైలు శిక్షతో పాటు రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల దాకా దిర్హం జరిమానా, లేదంటే రెండూ విధిస్తారు. అలాగే డిజిటల్ స్టాకర్స్ (ఇంటర్నెట్లో వెంటాడి.. వేధించే నిందితులు)కు ఆరు నెలల జైలు శిక్ష, లక్షా యాభై వేల నుంచి ఐదు లక్షల దిర్హం దాకా జరిమానా లేదంటే రెండూ విధిస్తారు. -
భారత్–యూఏఈ బంధం బలోపేతం
న్యూఢిల్లీ: భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టమయ్యే కీలక ఒప్పందం శుక్రవారం జరిగింది. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) పేరుతో జరిగిన స్వేచ్చా వాణిజ్య ఒప్పంద (ఎఫ్టీఏ) పత్రాలపై భారత్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్, యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మరీ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాలను ఒకరికొకరు మార్చుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, ఈ ఒప్పందం వల్ల రెండు దేశాలకూ బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని పేర్కొన్నారు.వస్తువులు, సేవలు, నిబంధనలు, కస్టమ్స్ విధానాలు, ప్రభుత్వ సేకరణ, మేధో సంపత్తి హక్కులు, ఈ–కామర్స్తో సహా పలు అంశాలు తాజా ఒప్పందం పరిధిలోకి వస్తాయని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం రెండు దేశాలు గరిష్ట స్థాయి ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు తగ్గుతాయి. సేవలు, పెట్టుబడులకు సంబంధించి పలు నిబంధనలను సరళతరం అవుతాయి. గత ఏడాది సెప్టెంబర్లో రెండు దేశాలు వాణిజ్య ఒప్పంద చర్చలను లాంఛనంగా ప్రారంభించాయి. కాగా, తాజా ఒప్పందంపై సంతకాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లు ఒక వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ‘‘భారతదేశం–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం: కొత్త హద్దులు, మైలురాయి‘ అనే పేరుతో సంయుక్త విజన్ ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు 60 బిలియన్ డాల ర్లు ఉంటే, ఇది వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ప్రపంచంలోని ఇతర దేశాలకు యూఏఈ ఒక గేట్వేగా ఉండడం మరో కీలక అంశం. స్మారక స్టాంప్ ఆవిష్కరణ: కాగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవడం, యూఏఈ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇరు దేశాల నాయకులు సంయుక్త స్మారక స్టాంప్ను విడుదల చేశాయి. అపార వాణిజ్య అవకాశాలు ఇది ఒక సమగ్ర, సమతౌల్య వాణిజ్య ఒప్పందం. దీనివల్ల రెండు దేశాలకూ అపార వాణిజ్య అవకాశాలు ఏర్పడతాయి. దైపాక్షిక వాణిజ్య సంబంధాలు రెట్టింపు అవుతాయి. – పీయూష్ గోయెల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి -
అదృష్టాన్ని ఊహించగలమా?.. రూ. 44 కోట్లు గెల్చుకున్న లీనా
Kerala woman living in Abu Dhabi wins Big Ticket lottery Worth 44 Crores: నిజంగా అదృష్టాన్ని ఊహించగలమా? అలాంటి నమ్మకమే లేని ఓ యువతి.. సరదాగా తన కొలీగ్స్తో కలిసి టికెట్ కొన్న ఆ భారతీయ యువతికి జాక్పాట్ తగిలింది. అదీ కలలో కూడా ఆమె ఊహించని రేంజ్లో.. ఏకంగా 44 కోట్ల రూపాయల లాటరీ తగిలింది ఆమె టికెట్ మీద!. సౌదీ కంట్రీస్లో భారీ ప్రైజ్ మనీ లాటరీలు సర్వసాధారణం. అలాంటి జాక్పాట్ ఓ కేరళ యువతిని వరించింది. ఫిబ్రవరి 3న బిగ్ టికెట్ అబుదాబీ వీక్లీ డ్రా నిర్వహించారు. అందులో ఏకంగా 22 మిలియన్ల దీరామ్స్(మన కరెన్సీలో 44 కోట్ల 73 లక్షల 52 వేల 598 రూపాయల దాకా) ఆమె టికెట్ గెల్చినట్లు ప్రకటించారు. ఆమె పేరు లీనా జలాల్. లీనా స్వస్థలం కేరళ త్రిచూర్. అంజన్ గడి ప్రాంతానికి చెందిన ఆమె, ఉద్యోగరీత్యా గత నాలుగేళ్లుగా అబుదాబిలో ఉంటోంది. అబుదాబిలో షోయిదార్ ప్రాజెక్ట్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎల్ఎల్ సీ అనే కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తోంది. ఈ మధ్య తన పది మంది ఆఫీస్ సహచరులతో కలిసి Terrific 22 million series 236లో భాగంగా ఆమె టికెట్ కొన్నది. తాజాగా డ్రా తీయగా, లీనా జలాల్ కొనుగోలు చేసిన టికెట్ కు రూ.44 కోట్ల భారీ ప్రైజ్ మనీ దక్కింది. అయితే, ఆ టికెట్ ను ఆమె తనతో పాటు ఆఫీసులో పనిచేసే మరో తొమ్మిది మందితో కలిసి కొనుగోలు చేసింది. దాంతో, ఆ ప్రైజ్ మనీని ఇప్పుడు వారందరూ పంచుకోనున్నారు. అయినప్పటికీ, ఒక్కొక్కరికి రూ.4 కోట్లు దాకా వస్తుంది. దీనిపై లీనా జలాల్ మాట్లాడుతూ.. లాటరీ తగిలిందని చెప్పగానే, తొలుత నమ్మలేకపోయానని వెల్లడించింది. తనకు మాటలు రావడంలేదని, దేవుడికి రుణపడి ఉంటానని తెలిపింది. అయితే, ఈ డబ్బును ఏంచేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని, కుటుంబ సభ్యులను అడిగిన తర్వాత నిర్ణయించుకుంటానని లీనా తెలిపింది. మరో నలుగురూ భారతీయులే.. బిగ్ టికెట్ అబుదాబీ వీక్లీ డ్రాలో లీనా కాకుండా గెలిచిన మరో నలుగురు కూడా భారతీయులే కావడం విశేషం. సెకండ్ ప్రైజ్ను సురాయిఫ్ సురు(2 కోట్ల రూ. పైగా), సిల్జోహ్న్ హోయాన్నన్ (కోటికి పైగా), నాలుగో ప్రైజ్ అన్జర్ సుక్కారియా(యాభై లక్షల రూ.), ఐదో ప్రైజ్ దివ్య (20 లక్షలరూ.) దక్కాయి. బంగ్లాదేశ్కు చెందిన నజీర్ అనే వ్యక్తికి రేంజ్ రోవర్ ఎవోక్యూ దక్కింది. మార్చి 3న ఈ ప్రైజ్మనీని, గిఫ్ట్ను అందించనున్నారు. -
దుబాయ్ దూకుడు.. సాహసోపేత అడుగులు
Dubai Sucessfully Deployed AI Tech In Govt Sectors: ఆయిల్ కంట్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నగరం దుబాయ్.. గత ఏడాది కాలంగా అరుదైన ప్రయోగాలతో ప్రపంచాన్ని అచ్చెరువుకు గురి చేస్తోంది. ఆవిష్కరణల భాండాగారంగా ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తోంది. విప్లవాత్మక సంస్కరణలతో దూసుకుపోతున్న దుబాయ్.. ఇప్పుడు సాహసోపేతమైన అడుగులకు సైతం వెనకాడడం లేదు. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ఈ టెక్నాలజీ అవసరం దాదాపు అన్ని రంగాల్లో అవసరం పడుతోంది. మనకు తెలియకుండానే వాడేస్తున్నాం కూడా!. ప్రైవేట్ రంగాల్లో దాదాపు ఏఐ సహకారం లేకుండా ముందుకు సాగడం లేదు. అయితే ప్రభుత్వ రంగాలు మాత్రం పూర్తిస్థాయిలో ఏఐని ఉపయోగించుకునేందుకు తటపటాయిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం.. భద్రత. ఈ తరుణంలో దుబాయ్ సర్కార్ ఏమాత్రం బెణుకు ప్రదర్శించకుండా ముందుకు సాగుతోంది. ప్రమాదం లేకపోలేదు AI టెక్నాలజీ వాడకం ఇప్పుడు ఎంత ఉధృతంగా నడుస్తోందో.. సమీప-కాలంలో అంతే ఆందోళనను రేకెత్తిస్తోంది. గోప్యత, పారదర్శకత, అసమానత, భద్రత.. ఈ అంశాలు పెను సవాల్గా మారాయి. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీలో పుట్టుకొస్తున్న బెదిరింపులు, ఇతర పోకడలను సైతం గుర్తించింది CSER పరిశోధన. అంతేకాదు AI, డిజిటలైజేషన్, న్యూక్లియర్ వెపన్స్ సిస్టమ్ల తరపున ఎదురయ్యే ముప్పును సైతం ప్రస్తావించింది. ప్రధానమైన అంశాలు కావడం వల్లే అమెరికా లాంటి అగ్రరాజ్యాలు సైతం ఏఐను రక్షణ రంగంలో అన్వయింపజేసేందుకు ముందు వెనకా ఆలోచిస్తుంటుంది. అయితే.. ఎలా అధిగమిస్తోందంటే.. వనరులను, మేధస్సును వాడుకోవడంలో దుబాయ్ నిజంగానే అద్భుతాలు చేస్తోంది. అసలే టెక్నాలజీ కొత్తైన ఈ సిటీ.. అవసరం మేర మాత్రమే ఏఐను ఉపయోగించుకోవడంపై ఫోకస్ చేసింది. ఆరోగ్యభద్రత, విద్య, రవాణా, ప్రజా భద్రత విషయంలో ఏఐ సంబంధిత టెక్నాలజీనే ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టింది. ప్రజల దైనందిన జీవితంలోకి జొప్పించి.. అలవాటు చేయిస్తోంది. స్మార్ట్దుబాయ్ ఆఫీస్ల సహకారంతో ఎన్నో వ్యూహాల నడుమ కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. ఏఐ, బ్లాక్కెయిన్ ద్వారా ప్రభుత్వ సేవల్ని అందించడమే కాకుండా.. జనాల ఫీడ్బ్యాక్ను సైతం తీసుకుంటోంది. తద్వారా ఎదురయ్యే పరిణామాల్ని ఎదుర్కొనేందుకు పటిష్ట వ్యవస్థను సిద్ధం చేసుకుంటోంది. వీటికి తోడు ఎథికల్ టూల్ కిట్స్ ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తోంది. హైలెవల్ సర్వీసులు కావడంతో ఏఐ అల్గారిథమ్ పొరపచ్చాలతో తప్పులు దొర్లే అవకాశమూ లేకపోలేదు. ఇందుకోసం భారీగా ఇంజినీర్లను నియమించుకుంటోంది కూడా. 2030 నాటికి ఏఐ సంబంధిత వ్యవస్థ కోసం 320 బిలియన్ డాలర్ల ఖర్చు పెట్టే యోచనలో ఉన్నాయి మిడిల్ ఈస్ట్ దేశాలు. ఈ అవకాశం అందిపుచ్చుకోవాలనే ఆలోచనలో ఉంది దుబాయ్ మహానగరం. దుబాయ్ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. కానీ, ఆనందం అంటే కేవలం ఎక్కువ డబ్బును కలిగి ఉండడం కాదు. గ్లోబలైజ్డ్ వరల్డ్లో కమ్యూనిటీతో ఎలా పొత్తు పెట్టుకోవాలి? సామాజిక అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎలా పని చేయాలి? అనే విషయాలపైనే దుబాయ్ ఫోకస్ పెట్టింది. అలా దుబాయ్.. ఈ భూమిపై అత్యంత సంతోషకరమైన నగరంగా స్థానం సంపాదించుకునే మార్గం వైపు వెళ్తున్నట్లు కనిపిస్తోందని ఆర్థిక మేధావులు ఒక అంచనాకి వేస్తున్నారు. క్లిక్ చేయండి: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్లో దూసుకుపోతున్న హైదరాబాద్ -
యూఏఈ సంచలన చట్టం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం. దశాబ్దాలుగా సాగుతున్న ‘కుటుంబాల వ్యాపార’ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా కొత్త చట్టం తీసుకురాబోతోంది. ఒకవేళ చట్టం విదేశీ కంపెనీలు నేరుగా అక్కడ వ్యాపారలావాదేవీలు నిర్వహించుకునే అవకాశం కలగనుంది. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. యూఏఈలో చాలాఏళ్లుగా కొన్ని కుటుంబాల చేతుల్లోనే వ్యాపార సామ్రాజ్యం నడుస్తోంది. కమర్షియల్ ఏజెన్సీ అగ్రిమెంట్ల సాయంతో విదేశీ కంపెనీలన్నింటిని ఈ కుటుంబాలే నడిపిస్తూ వస్తాయి . అయితే ఆ అగ్రిమెంట్ల ఆటోమేటిక్ రెన్యువల్కు పుల్స్టాప్ పెట్టేలా యూఏఈ ప్రభుత్వం కొత్త చట్టం తేనుంది. ఇప్పటికే చట్ట రూపకల్పన జరిగిపోయిందని, ఎమిరేట్స్ నాయకత్వం దానిని ఆమోదం తెలపడం మాత్రమే మిగిలిందని ఆ కథనం వెల్లడించింది. అయితే ఎప్పటిలోపు ఆ చట్టం తీసుకురాబోతున్నారన్న విషయంపై మాత్రం స్పష్టత కొరవడింది. ఇదిలా ఉంటే ఈ గల్ఫ్ దేశంలో ఎక్కువ శాతం వ్యాపారాలు, ఇతర కమర్షియల్ యాక్టివిటీస్ కూడా కొన్ని కుటుంబాల చేతుల్లోనే నడుస్తున్నాయి. హోటల్ ఫ్రాంచైజీల దగ్గరి నుంచి కార్ డీలర్షిప్ల దాకా ప్రతీది కొన్ని కుటుంబాలే నడిపిస్తున్నాయి. ఒకవేళ తాజా చట్టం గనుక అమలులోకి వస్తే మాత్రం.. విదేశీ కంపెనీలకు ఊరట కలగనుంది. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే యోచనలో ఉన్నాయి కొన్ని కుటుంబాలు. చదవండి: వీకెండ్ సెలవుల్ని మార్చేసిన యూఏఈ. ఎప్పుడో తెలుసా? -
అరుదైన ఘనత.. చరిత్ర సృష్టించిన దుబాయ్
UAE City Dubai world's first govt to go 100% paperless: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ నగరం దుబాయ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి 100 శాతం పేపర్లెస్ గవర్నమెంట్ ఖ్యాతి దక్కించుకుంది. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల సేవలను, ట్రాన్జాక్షన్స్ను ‘డిజిటల్ ఫార్మట్’లోనే కొనసాగిస్తూ.. ఈ ఘనత అందుకుంది దుబాయ్ నగరం. వంద శాతం ‘పేపర్లెస్’ సాధించిన తొలి ప్రభుత్వంగా దుబాయ్ సిటీ నిలిచింది. ఈ మేరకు ఎమిరేట్స్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. తద్వారా 14 మిలియన్ గంటల మనిషి శ్రమను.. 1.3 బిలియన్ దిర్హమ్(350 మిలియన్ డాలర్లు) ఆదా చేసినట్లు పేర్కొన్నారాయన. ప్రభుత్వానికి సంబంధించి ఇంటర్నల్, బయటి ట్రాన్జాక్షన్స్తో పాటు.. ప్రభుత్వానికి సంబంధించి ప్రతీ సేవలను డిజిటల్ పద్దతిలో.. అదీ ప్రభుత్వ వేదికల మీదుగానే సాగిందని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించుకుంది. మొత్తం 45 ప్రభుత్వ రంగాల్లో 1,800 రకాల డిజిటల్ సేవలను .. అదీ ఆలస్యం అవ్వకుండా డిజిటల్ ఫార్మట్లో ప్రజలకు చేరవేయడం విశేషం. ఈ క్రమంలో నగరవాసులపై ప్రభుత్వం ఏమాత్రం ఒత్తిడి చేయకుండా.. స్వచ్ఛందంగా ఈ ఘనత సాధించింది. పేపర్లెస్ ఘనత ప్రపంచానికి డిజిటల్ క్యాపిటల్గా నిలవడానికి దుబాయ్కు ఎంతో ప్రొద్భలం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు క్రౌన్ ప్రిన్స్. అంతేకాదు మరో ఐదు దశాబ్దాలపాటు అత్యాధునిక వ్యూహాలతో దుబాయ్లో డిజిటల్ లైఫ్ కొనసాగేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారాయన. ఇదిలా ఉంటే అమెరికా(ఖండాలు), యూకే, యూరప్ దేశాల్లో ప్రభుత్వాలు ఈ తరహా విధానానికి మొగ్గు చూపించినప్పటికీ.. సైబర్ దాడుల భయంతో వెనక్కి తగ్గాయి. కానీ, దుబాయ్ మాత్రం ధైర్యం చేసి ముందడుగు వేసి.. ఈ ఫీట్ సాధించింది. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ మూమెంట్తో 336 మిలియన్ పేపర్లను, 1.3 బిలియన్ దిర్హమ్(350 మిలియన్ డాలర్లు) బడ్జెట్ను, 14 మిలియన్ గంటల ఉద్యోగుల శ్రమను మిగిల్చింది దుబాయ్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే ప్రపంచంలో రిచ్చెస్ట్ సిటీల్లో ఒకటిగా ఉన్న దుబాయ్ జనాభా 35 లక్షలు కాగా.. మెట్రో ఏరియాలో జనాభా 29 లక్షలకు పైనే ఉంది. చదవండి: అర్జెంటీనా టు అస్సాం వయా దుబాయ్.. ఖరీదు 20లక్షలకుపైనే! -
వలస కార్మికులకు ఉచిత వీసాలు
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని కొన్ని కంపెనీలు వలస కార్మికులకు తిరిగి స్వాగతం చెబుతున్నాయి. గతంలో వీసాల జారీ కోసం రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు చార్జీలు వసూలు చేసిన ఏజెన్సీలు ప్రస్తుతం ఉచిత రిక్రూటింగ్ను చేపట్టాయి. కరోనా కారణంగా కంపెనీలు భారీ సంఖ్యలో కార్మికులను ఇళ్లకు పంపించేయడంతో అనేక పోస్టులు ఖాళీ అయ్యాయి. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, కంపెనీల కార్యకలాపాలు ఊపందుకోవడంతో ఇప్పుడు వలస కార్మికుల సేవలు అత్యవసరం అయ్యాయి. దీంతో యూఏఈ పరిధిలోని దుబాయ్, అబుదాబి ఎయిర్పోర్టులలో క్లీనింగ్ పని కోసం పలు ఏజెన్సీలు కార్మికులను తరలిస్తున్నాయి. నిజామాబాద్, జగిత్యాల్, ఆర్మూర్లలో ఒక ఏజెన్సీ కొన్ని రోజులుగా ఉచిత రిక్రూటింగ్ను కొనసాగిస్తోంది. కేవలం రూ.5 వేలను సర్వీస్ చార్జీలుగా వసూలు చేస్తూ ఉచిత వీసా, ఉచిత విమాన టికెట్లను ఇచ్చి యూఏఈ పంపిస్తోంది. గతంలో గల్ఫ్ దేశాలకు వలసలు మొదలైన ఐదు దశాబ్దాల కింద ఉచిత రిక్రూటింగ్ జరిగింది. ఇదిలాఉండగా ఇక్కడి వారికి ఉచిత నియామకాలపై అవగాహన లేకపోవడంతో మన ప్రాంతంలో కొనసాగుతున్న ఇంటర్వూ్యలకు పొరుగు రాష్ట్రాల కార్మికులు హాజరవుతుండటం విశేషం. ఇప్పటివరకు ఏపీ, కేరళ రాష్ట్రాలకు చెందిన దాదాపు 2వేల మందిని యూఏఈ తరలించినట్లు ఏజెన్సీ నిర్వాహకులు వివరించారు. -
అఫ్గాన్ బోర్డర్ దాటించడానికి ‘పెళ్లిళ్లు’ చేస్తున్నారు..!
కాబుల్: అఫ్గానిస్తాన్ మహిళల పరిస్థితి రోజుకో మలుపు తిరుగుతోంది. తాలిబన్ల నుంచి తప్పించుకొనేందుకు కుటుంబ సభ్యులు తమ ఇంట్లో ఉన్న యువతులకు వివాహం చేసి మరీ బోర్డర్ దాటించే ప్రయత్నం చేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తరలింపు కేంద్రంలో వెలుగుచూసిన ఈ మానవ అక్రమ రవాణా ఉదంతంపై అమెరికా దౌత్య అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కాబుల్ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో.. అఫ్గాన్ నుంచి పారిపోవడానికి, కొన్ని కుటుంబాలు డబ్బులు చెల్లించీ మరీ పెళ్లి కొడుకుల్ని వెదుకుతున్నారు. వారికి భర్తలను చూసి దేశం దాటించేందుకు యత్నాలు ముమ్మరం చేశారు. చదవండి: Solar Storm: ‘కరోనా’తో పోలిక.. మహా తుపానుతో భారీ డ్యామేజ్!. మనకేం ఫరక్ పడదు ఈ ఘటనలు తాలిబన్ల కిరాతక పాలన నుంచి తప్పించుకోవాలనే అక్కడి మహిళల పరిస్థితికి అద్దం పడుతోంది. అమెరికా దౌత్యాధికారులు ఇటువంటి మానవ అక్రమ రవాణా సంఘటనలను గుర్తించి వారికి సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. కాగా అమెరికా దళాలు ఆగస్ట్ 30న అఫ్గన్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీనితో 20 యేళ్ళ సుదీర్ఘ యుద్ధానికి తెరపడింది. అయితే తాలిబన్ల పాలన ప్రారంభమయ్యాక మహిళల కనీస హక్కులులేని గత తాలిబన్ పాలనను గుర్తుచేసేలా ఉంది. అంతేకాకుండా మగ కుటుంబ సభ్యుడు లేని మహిళల ప్రయాణాలను తాలిబన్లు నిషేధించారు. ఈ పరిస్థితుల్లో కొన్ని పైవేటు గ్రూపులు తాలిబన్లు తమను వెంటాడుతున్నారని తెలిస్తే తప్ప దేశం సరిహద్దులు దాటవద్దని సూచించారు.దాంతో కుటుంబ సభ్యులు తమ పిల్లలకు ఇలా బలవంతంగా వివాహం చేసి మరీ పంపిస్తున్నారు. చదవండి: Hibatullah Akhundzada: అఫ్గాన్ సుప్రీం లీడర్గా అఖుంద్జాదా -
ఘనీ, భుట్టో, శినావత్రా... వీళ్లంతా యూఏఈకే ఎందుకు?!
న్యూఢిల్లీ: తాలిబన్లు అఫ్గనిస్తాన్ను వశం చేసుకోగానే అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ దేశం విడిచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు పారిపోయారు. మానవతా దృక్పథంతో తాము ఘనీకి ఆశ్రయం ఇచ్చినట్లు యూఏఈ ప్రకటించింది కూడా. నిజానికి ఆ దేశం కేవలం ఘనీ ఒక్కరికే కాదు.. ఆయనలా శరణార్థులుగా వచ్చిన ఎంతో మంది దేశాధినేతలకు, ప్రముఖులకు ఆశ్రయం ఇచ్చింది. ఎందుకు వీళ్లంతా యూఏఈనే తమకు సురక్షిత స్థావరమని భావించారు? ఆ దేశం సైతం వారి రాకను స్వాగతించడం వెనుక కారణాలేంటి?! ఎందుకు యూఏఈకే? గల్ఫ్ దేశమైన యూఏఈకి అమెరికాతో సత్సంబంధాలే ఉన్నాయి. ముఖ్యంగా భద్రతాపరమైన విషయాల్లో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంది. అగ్రరాజ్యంతో మెరుగైన ద్వైపాక్షిక బంధాలు ఉండటం యూఏఈకి కలిసి వచ్చే అంశం. కాబట్టి, అక్కడికి వెళ్తే సురక్షితంగా ఉండవచ్చని అమెరికాతో వైరం లేని పెద్దలు భావించడం సహజం. అంతేకాదు, పెద్ద సంఖ్యలో చమురు నిల్వలు కలిగి ఉన్న ఈ గల్ఫ్ దేశంలో అండర్గ్రౌండ్ స్థావరాలు కూడా ఎక్కువే ఉంటాయి. ఎయిర్పోర్టుల్లో కూడా ఐరిస్ స్కానింగ్, భారీ సంఖ్యలో సెక్యూరిటీ కెమెరాలు, 24 గంటల పర్యవేక్షణ వంటి అంశాలు కూడా పారిపోయి వచ్చిన ఒకప్పటి దేశాధినేతలను ఆకర్షించే అంశాలు. ఇక యూఈఏలో విలాసాలకు కొదువ లేదు. అత్యాధునిక ఫైవ్స్టార్ హోటళ్లు, సకల సౌకర్యాలతో కూడిన భవనాలు, ఇతర వినోదాలు పంచే ప్రదేశాలు కోకొల్లలు. దేశం విడిచి వచ్చే సమయంలో తెచ్చుకున్న సొమ్మును ఖర్చు చేసేందుకు, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేందుకు ఇక్కడ అనువైన పరిస్థితులు ఉంటాయని విశ్లేషకుల అభిప్రాయం. తద్వారా ఇటు ఆశ్రయం కల్పించిన యూఏఈకి, అటు శరణుజొచ్చి వచ్చిన వారికి.. ఉభయులకు లాభదాయకమే. యూఏఈకి కలిగే ప్రయోజనమేమిటి? అజ్ఞాతంలో ఉన్న నేతల దశ తిరిగి ఒకవేళ మళ్లీ అధికారం చేపట్టినట్లయితే.. రాజకీయంగా, దౌత్యపరంగా సత్పంబంధాలు కొనసాగే అవకాశం ఉంటుంది. సంక్షోభ సమయంలో ప్రముఖులను ఆదుకోవడం, వారికి భద్రత కల్పించడం ద్వారా తాము నమ్మకమైన భాగస్వామినని నిరూపించుకుంటూ.. తదనంతర ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విషయాల గురించి క్రైసిస్ గ్రుపునకు చెందిన మిడ్ఈస్ట్ అడ్వైజర్ దీనా ఎస్ఫాన్డియరీ ఏపీతో మాట్లాడుతూ.. ‘‘సంక్షోభంలో ఉన్న వారిని ఆదుకునే క్రమంలో ఏ దేశమైనా సరే తనను తాను గొప్ప ఉదారవాదిగా చిత్రీకరించుకోవడం సహజం. ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. ఎవరూ ఇందుకు అతీతం కాదు’’ అని వ్యాఖ్యానించారు. మిత్రదేశమైన అమెరికా సైనిక విన్యాసాలకు, ప్రయాణాలకు అనువైన పరిస్థితులు కల్పించే యూఏఈ.. తాను రిలయబుల్ పార్ట్నర్ అని నిరూపించుకునే క్రమంలో కూడా ఘనీకి ఆశ్రయం ఇచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఘనీకి ముందు వీళ్లు సైతం.. గత కొన్నేళ్లుగా యూఏఈలో అజ్ఞాతవాసం చేస్తున్న మాజీ దేశాధినేతల జాబితాలో ఇప్పుడు అశ్రఫ్ ఘనీ కూడా చేరారు. ఆయన కంటే ముందు.. తోబుట్టువులైన థాయ్లాండ్ మాజీ ప్రధానులు థక్సిన్ శినావత్రా, యింగ్లక్ శినావత్రా యూఏఈలోనే ఆశ్రయం పొందుతున్నారు. పాకిస్తాన్ దివంగత ప్రధాని బేనజీర్ భుట్టో, పాక్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ కూడా ఒకప్పుడు దుబాయ్లో తలదాచుకున్న వారే. స్పానిష్ రాజు జువాన్ కార్లోస్(అవినీతి ఆరోపణలు), యెమెన్ నాయకుడి పెద్ద కుమారుడు అహ్మద్ అలీ అబ్దుల్లా సలేహ్ వంటి వారు కూడా ఈ లిస్టులో ఉన్నారు. కాగా అవినీతి ఆరోపణల నేపథ్యంలో థాయ్ మాజీ ప్రధాని థక్సిన్ శినావత్రా జైలు శిక్ష తప్పించుకునేందుకు యూఈఏ పారిపోగా.. ఆయన సోదరి యింగ్లక్ శినావత్రా సైనిక తిరుగబాటు నేపథ్యంలో 2018, జనవరిలో అక్కడికే వెళ్లారు. చదవండి: Kabul Airport: మరో 3 రోజులే.. రోడ్లన్నీ బ్లాక్ చేస్తున్న తాలిబన్లు! -
ముంబై, చెన్నై పోరుతో...
న్యూఢిల్లీ: భారత్లో మిగిలిపోయిన ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో షెడ్యూల్ ఖరారైంది. దుబాయ్లో సెప్టెంబర్ 19న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో మాజీ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ మ్యాచ్తో ఐపీఎల్–14 పునఃప్రారంభం కానుంది. మొత్తం 31 మ్యాచ్ల్ని 27 రోజుల వ్యవధిలో నిర్వహిస్తామని, ఇందులో ఏడు రోజులు రెండేసి మ్యాచ్లు జరుగుతాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. యూఏఈలోని మూడు వేదికలైన దుబాయ్లో 13, షార్జాలో 10, అబుదాబిలో 8 మ్యాచ్లు జరుగుతాయి. రెండు మ్యాచ్లుంటే తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది. బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య అక్టోబర్ 8న జరిగే మ్యాచ్తో లీగ్ దశ ముగుస్తుంది. అనంతరం 10న దుబాయ్లో తొలి క్వాలిఫయర్, 11న ఎలిమినేటర్తోపాటు 13న రెండో క్వాలిఫయర్ షార్జాలో జరుగుతుంది. అక్టోబర్ 15న దుబాయ్లో జరిగే ఫైనల్తో ఐపీఎల్ ముగుస్తుంది. యూఏఈ ప్రభుత్వం అనుసరిస్తున్న క్వారంటైన్, ప్రొటోకాల్ నిబంధనల్ని ఆటగాళ్లు, నిర్వాహకులు పాటించాలి. కోవిడ్తో ఆలస్యమైన గత సీజన్ మ్యాచులన్నీ యూఏఈలోనే నిర్వహించారు. భారత్లో మొదలైన ఈ సీజన్ మేలో కరోనా కేసుల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
యూఏఈలోనే టి20 ప్రపంచకప్!
ముంబై: మన ‘పొట్టి’ ఆటలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అవుతోంది. కల్లోల కరోనా సమయంలో టి20 ప్రపంచకప్ కూడా భారత్లో ఆతిథ్యమిచ్చే అవకాశం లేకుండా పోయింది. అందుకే యూఏఈ సౌజన్యంతో ఐపీఎల్ లాగే మెగా ఈవెంట్ను కూడా అక్కడే నిర్వహించాలనే నిర్ణయానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వచ్చింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి సమాచారమిచ్చింది. టి20 ప్రపంచకప్ అక్టోబర్ 17న మొదలవుతుంది. నవంబర్ 14న జరిగే టైటిల్ పోరుతో టోర్నీ ముగుస్తుంది. సరిగ్గా ఐపీఎల్ ఫైనల్ (అక్టోబర్ 15) ముగిసిన రెండో రోజే మెగా ఈవెంట్ ప్రారంభవుతుంది. ఓ వార్త సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో జై షా మాట్లాడుతూ ‘దేశంలో కోవిడ్ ఉధృతిని దృష్టిలో ఉంచుకునే టి20 ప్రపంచకప్ను భారత్ నుంచి యూఏఈకి తరలిస్తున్నాం. అన్ని అంశాలను పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రతకే మా ప్రాధాన్యం ఉంటుంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటిస్తాం’ అని అన్నారు. 16 దేశాలు పాల్గొనే మెగా ఈవెంట్ను అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికల్లో నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతుంది. యూఏఈలో సరళమైన క్వారంటైన్ నిబంధనలు... పటిష్టమైన బబుల్, మహమ్మారి కూడా అదుపులో ఉండటం వల్ల విదేశీ ఆటగాళ్లందరూ పాల్గొంటారు. పొట్టి ఆటలో పోటీ రసవత్తరంగా సాగుతుంది. స్పాన్సర్ల ప్రయోజనాలు, బీసీసీఐ ఆర్థిక అవసరాలు కూడా నెరవేరుతాయి. అందుకే బోర్డు యూఏఈకే జై కొట్టింది. నిజానికి యూఏఈ బ్యాకప్ వేదికగా ఉంది. అక్కడే ఎందుకంటే... బోర్డు అంతా ఆలోచించే వేదికను యూఏఈకి తరలించింది. కరోనాతో పాటు ఇతరత్రా కారణాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇన్నాళ్లు కోవిడ్ ఉధృతి తగ్గదా... మన దేశంలో మనం ఘనంగా నిర్వహించుకోలేమా అన్న ధీమాతో బోర్డు ఉండేది. కానీ డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు భారత ప్రభుత్వాన్నే కాదు... బీసీసీఐని కూడా కలవర పెడుతున్నాయి. ప్రమాదకరమైన ఈ వేరియంట్ వ్యాక్సిన్కు తలొగ్గుతుందా లేదా అనే కచ్చితమైన సమాచారం కూడా లేదు. ఇప్పటికే ఈ సీజన్ ఐపీఎల్లో బయో బబుల్ పేలడం... ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు భయాందోళనకు గురవడంతో అర్ధంతరంగా లీగ్ను వాయిదా వేశారు. ఇప్పుడు ప్రతిష్టకు పోయి భారత్లో నిర్వహించి ప్రమాదాన్ని తెచ్చుకోవడం... బుడగ పగిలి ప్రపంచకప్ కూడా వాయిదా పడితే పరువు కూడా పోతుంది. ఇదే జరిగితే భవిష్యత్తులో ఎన్నో క్రికెట్ సిరీస్లపై ఇది పెనుప్రభావం చూపిస్తుంది. పైగా ఈసారి భారత ప్రభుత్వం 2016లో ఇచ్చిన పన్ను మినహాయింపు కూడా ఇవ్వలేదు. యూఏఈలో జరిపితే ఆ ప్రయోజనం కూడా బోర్డుకు దక్కుతుంది. ఇవన్నీ ఆలోచించే వేదికను మారుస్తోంది. -
Mumbai To Dubai: 70 లక్షలు అయ్యేదేమో.. కానీ 18 వేలకే!
వెబ్డెస్క్: ఒక్కరి కోసమే విమానం మొత్తం బుక్ చేసుకోవాలనుకుంటే లక్షలు కుమ్మరించాల్సి ఉంటుంది. అంతేకాదు విలాసవంతమైన సేవలు పొందాలనుకుంటే అదనంగా మరింత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రూ. 18 వేలకే.. 360 సీట్ల సామర్థ్యం ఉన్న బోయింగ్-777 విమానంలో ప్రయాణం చేసే అవకాశం వస్తే.. అది కూడా ఎయిర్హోస్టెస్ మొదలు కమాండర్ వరకు సాదర స్వాగతం పలికి విమానమంతా కలియదిరిగే అవకాశం ఇస్తే.. భలేగా ఉంటుంది కదా. దుబాయ్లో నివసించే భవేశ్ జవేరీ అనే వ్యక్తికి ఈ బంపర్ ఆఫర్ తగిలింది. ముంబై- దుబాయ్ వరకు ఆయన ఒక్కరే విమానంలో ప్రయాణం చేశారు. వివరాలు... కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం తమ పౌరులు, యూఏఈ గోల్డెన్ వీసా కలిగి ఉన్నవారు, దౌత్యవేత్తలకు మాత్రమే తమ దేశానికి అనుమతినిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ముంబై నుంచి దుబాయ్ వెళ్లాలనుకున్న జవేరి... 18 వేల రూపాయలు పెట్టి ఎకానమీ క్లాస్ టికెట్ కొనుగోలు చేశారు. అయితే, ఎయిర్పోర్టులోకి ప్రవేశించగానే టికెట్పై సరైన తేదీ లేని కారణంగా లోపలికి అనుమతించమని అధికారులు తేల్చి చెప్పారు. అస్సలు ఊహించలేదు! వెంటనే జవేరి, ఎమిరేట్స్ సిబ్బందికి ఫోన్ చేయగా సమస్యకు పరిష్కారం దొరికింది. అంతేకాదు, ఆరోజు ఆ విమానంలో ప్రయాణించే వ్యక్తి తానొక్కడినే అని, ఆయన కోసమే ఎదురుచూస్తున్నామని చెప్పడంతో జవేరి ఆశ్చర్యపోయారు. మే 19 నాటి ఈ ఘటన గురించి భవేశ్ జవేరి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘విమానంలోకి అడుగుపెట్టగానే ఎయిర్హోస్టెస్ చప్పట్లు కొడుతూ నన్ను లోపలికి ఆహ్వానించారు. విమానం అంతా తిప్పి చూపించారు. నా లక్కీ నంబర్ 18 అని చెప్పగానే.. ఆ నంబరు గల సీట్లో కూర్చోమన్నారు. కమాండర్ సైతం ఎంతో సరదాగా మాట్లాడారు. ల్యాండ్ అవగానే నవ్వుతూ నాకు వీడ్కోలు పలికారు. నిజానికి ఇలా నేనొక్కడినే అంత పెద్ద విమానం(బోయింగ్ 777 చార్టర్)లో ప్రయాణించాలంటే సుమారు రూ. లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు అత్యంత తక్కువ ధరకే నాకు ఈ అవకాశం లభించింది. ఇప్పటికి దాదాపు 240సార్లు విమానాల్లో(ముంబై- దుబాయ్) ప్రయాణించి ఉంటాను. అంతేకాదు అప్పట్లో తొమ్మిది మంది ప్యాసింజర్లతో దుబాయ్ వెళ్తున్న 14 సీట్ల విమానంలోనూ ప్రయాణం చేశాను. కానీ, ఎప్పుడూ ఇలాంటి అద్భుత అనుభవం ఎదురుకాలేదు. డబ్బుతో ఇలాంటి వాటిని కొనుగోలు చేయలేం. కాలం కలిసి వస్తేనే ఇలా జరుగుతుంది కాబోలు’’ అని సంతోషం వ్యక్తం చేశారు. కాగా భవేశ్ జవేరి గత రెండు దశాబ్దాలుగా యూఏఈలో నివాసం ఉంటున్నారు. ఇక ఇలాంటి ఒంటరి ప్రయాణం కోసం సుమారు 70 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చేదని ఓ ఆపరేటర్ చెప్పినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. చదవండి: నిజాయతీ: చేతికి దొరికిన రూ.7 కోట్లు తిరిగిచ్చేశారు -
యూఏఈ నుంచి ప్రథమ మహిళా వ్యోమగామి
దుబాయ్: అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పంపిన మొట్టమొదటి గల్ఫ్ దేశంగా రికార్డు సృష్టించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. మొట్టమొదటిసారిగా మహిళా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపనున్నట్లు దుబాయ్ పాలకుడు షేక్ మొహ్మమద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. శనివారం ఆయన ప్రకటించిన ఇద్దరు వ్యోమగాముల పేర్లలో ఒకరు మహిళ కావడం విశేషం. తమకు అందిన సుమారు 4వేల దరఖాస్తుల నుంచి నౌరా అల్ మత్రౌషి, మొహమ్మద్ అల్–ముల్లాను ఇందుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. 1993లో జన్మించిన మత్రౌషి అబుధాబిలోని నేషనల్ పెట్రోలియం కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా, అల్–ముల్లా ప్రస్తుతం దుబాయ్ పోలీస్ విభాగంలో పైలట్ శిక్షణావిభాగానికి అధిపతిగా ఉన్నారని పేర్కొన్నారు. వీరిద్దరూ త్వరలో అమెరికాలో టెక్సాస్లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్లో శిక్షణ పొందనున్నట్లు వెల్లడించారు. చదవండి: మార్స్పై బుల్లి హెలీకాప్టర్, దానికి పేరు పెట్టిందెవరో తెలుసా? -
ప్రేయసికి అరుదైన కానుక.. ఇద్దరూ అరెస్టు
దుబాయ్: సాధారణంగా ఇష్టసఖి పుట్టినరోజు అంటే గులాబీలు, చాక్లెట్లు, టెడ్డీబేర్లు ఇచ్చే ప్రేమికుల గురించి విన్నాం. కానీ ఓ వ్యక్తి వీటన్నికంటే భిన్నంగా ఓ అరుదైన బహుమతిని ఇవ్వాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అప్పుడే పుట్టిన ఓ ఒంటె పిల్లను దొంగతనం చేసి ప్రేయసికి కానుక అందించాడు. అతడు చేసిన పనికి ఇద్దరూ కటకటాలపాలయ్యారు. ఈ ఘటన దుబాయ్లో చోటు చేసుకుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. కొన్ని రోజుల క్రితం ఓ జంట తమ ఒంటె పిల్ల కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా దొంగ వెన్నులో వణుకుపుట్టింది. ఈ క్రమంలో ఎక్కడి నుంచైతే ఒంటె పిల్లను ఎత్తుకొచ్చాడో అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో దానిని వదిలిపెట్టి వచ్చాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి తానే దాని జాడను చెప్పాడు. కొన్ని రోజులుగా అక్కడే తచ్చాడుతుందంటూ సమాచారం అందించారు. దీంతో లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. ప్రేమికురాలికి గిఫ్టు ఇచ్చేందుకే ఈ దొంగతనం చేశానని అతడు అంగీకరించాడు. తొలుత తల్లి ఒంటెనే తీసుకువెళ్దామని భావించానని, అయితే అప్పుడే ఓనర్లు రావడంతో దానిని వదిలేసి పిల్లను ఎత్తుకెళ్లినట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో చోరీ చేయడమే కాకుండా తమను తప్పుదోవపట్టించినందుకు నిందితుడు, అతడి ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా అరబ్ దేశాల్లో చాలా కుటుంబాలు పోషణ కోసం ఒంటెల మీద ఆధారపడతాయన్న విషయం తెలిసిందే. పాలు, ఇతర ఆహార ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా కొట్టాలు వేసి వాటిని పెంచుతూ ఉంటారు. మరోవైపు, రేసుల కోసం కూడా కొంతమంది ఒంటెలను కొనుగోలు చేస్తారు. కొన్ని ప్రత్యేక జాతులకు చెందిన ఒంటెలకు అందాల పోటీలు కూడా నిర్వహిస్తారు. చదవండి: ముక్కలు.. ముక్కలైన నవ్వుతున్నాడు..! -
ఏడేడు లోకాల ఎచటనుంటివో రాకుమారీ..!
మూడేళ్లుగా రాజుగారి కుమార్తె కనిపించడం లేదు. ఎక్కడుందో తెలియదు. ఎలా ఉందో తెలియదు. ఏ శత్రుదేశ సైనికులు ఆమెను అపహరించుకుని వెళ్లి ఉంటారు? శత్రుదేశ సైనికులు కాదు. ఏడు రాజ్యాల మహా సామ్రాజ్యాధీశుడే ఆమెను ఏడు లోకాల్లో ఎక్కడో నిర్బంధించాడు. ఆ రాకుమారి షేఖా లతీఫా. ఆ మహా సామ్రాజ్యాధీశుడు మొహమ్మద్ రషీద్. లతీఫా అతడి కుమార్తే. నిర్బంధించించి ఆ తండ్రే! ఇంతకీ ఆమె సజీవంగానే ఉందా? ఆ సంగతిని మొహమ్మద్ రషీదే చెప్పాలని ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషల్’ అంటోంది! ‘పనోరమా’ అని.. బి.బి.సి. ఒక పరిశోధనాత్మక నిజ ఘటనల టీవీ సీరీస్ను ప్రసారం చేస్తుంటుంది. మొన్న మంగళవారం ఆ సీరీస్లో షేఖా లతీఫా తనే విడుదల చేసిన ఒక చిన్న వీడియో క్లిప్లో మాట్లాడుతూ కనిపించారు! ‘ఓ మై గాడ్’ అనుకుంది ప్రపంచం ఒక్కసారిగా ఆమె తెరపై కనిపించగానే. వెంటనే ‘థ్యాంక్ గాడ్’ అని కూడా. ‘ఓ మై గాడ్’ అనుకోవడం ఎందుకంటే.. మూడేళ్ల క్రితం దుబాయ్లోని తన అంతఃపురం నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమై, తండ్రి చేతికి చిక్కాక తిరిగి మళ్లీ ఆమె లోకానికి కనిపించలేదు. మనిషీ లేదు. మాటా లేదు. ఆ మనిషి గురించిన మాట కూడా రాజసౌధం నుంచి చిన్న శబ్దంగానైనా లేదు. ఇప్పుడు ఆకస్మాత్తుగా బి.బి.సి.లో కనిపించినందుకే ఆ ఆశ్చర్యం. అయితే ఆ క్లిప్లో లతీఫా హాయిగా లేదు. నవ్వుతూ లేదు. ప్రశాంతంగా లేదు. బిక్కుబిక్కుమంటూ.. ఎవరూ వినకుండా మాట్లాడినట్లుగా ఉంది. అలసిపోయినట్లుగా ఉంది. అచేతనత్వానికి ప్రారంభ దశలో ఉన్నట్లుగా ఉంది. మొత్తానికి ప్రాణాలతోనైతే ఉందన్న భావనే ప్రేక్షకులు ‘థ్యాంక్ గాడ్’ అనుకోడానికి కారణం. అయితే ఆ క్లిప్ 2019 నాటిదని బి.బి.సి. ప్రకటించగనే అనుమానాలు. లతీఫా బతికే ఉందా?! క్లిప్లో ఆమె బాత్రూమ్లోంచి మాట్లాడినట్లుగా ఉంది. ఆ బాత్రూమ్ ఒక ఆకాÔ¶ హర్మ్యంలో ఉన్నట్లుగా ఉంది. ఆ ఆకాశహర్మ్యం ఏ రాజ్యంలో ఉన్నదో తెలియడం లేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్ (యు.ఎ.ఇ.) ఏడు రాజ్యాల మహాసామ్రాజ్యం. వాటిల్లో ఒకటి దుబాయ్. ఆ దుబాయ్ పాలకుడే లతీఫా తండ్రి మొహమ్మద్ రషీద్. యు.ఎ.ఇ.కి ప్రధాని, ఉపాధ్యక్షుడు కూడా కనుక కూతుర్ని ఆయన ఈ ఏడు లోకాలలో ఎక్కడైనా నిర్బంధించి ఉంచవచ్చని ఆమ్నెస్టీ ఇంటర్నేషల్ సంస్థ అనుమానిస్తోంది. ‘ఒక జైలు లాంటి విల్లాలో ఆమె రెక్కలు తెగిన పక్షిలా పడివున్నారన్నది మాత్రం నిజం’ అని మేరీ రాబిన్సన్ అంటున్నారు. లతీఫా నుంచి తను సంపాదించిన ఆ బాత్రూమ్ క్లిప్తో పాటు, ఐర్లాండ్ మాజీ అధ్యక్షురాలు, యు.ఎన్.హ్యూమన్ రైట్స్ మాజీ హై కమిషనర్ అయిన రాబిన్సన్ ఇంటర్వ్యూని కూడా తన షోలో ప్రసారం చేసింది బి.బి.సి. ‘‘ఈ స్థితిలో ఆమె ఎంతకాలం జీవించి ఉండగలరో తెలియడం లేదు’’ అని ఆ ఇంటర్వ్యూలో రాబిన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ∙∙ ‘‘బయటికి వెళ్లి ఇంత స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి కూడా లేకుండా పోయింది’’ అని బి.బి.సి.కి అందిన క్లిప్లో ఆవేదన చెందుతూ కనిపించారు లతీఫా. ఆ ఎపిసోడ్ ప్రసారం అవగానే.. ‘రాకుమారి ఎలా ఉందో చెప్పండి’ అని ప్రపంచ మీడియా నుంచి దుబాయ్ ప్రభుత్వ మీడియాకు వెళ్లిన ఏ విజ్ఞప్తికీ జవాబు లేదు! ‘‘ఈ నిర్బంధం నుంచి నేను ఎప్పటికి బయటపడతానో, ఏ నిబంధనలను అంగీకరిస్తే నన్ను విడుదల చేస్తారో నాకు తెలియడం లేదు. నా భద్రత గురించి, నా జీవితం గురించీ రోజు రోజుకూ నాలో భయం పెరిగిపోతోంది’’ అని కూడా ఆ వీడియో ద్వారా తెలియజెప్పడంతో లతీఫా ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారన్న దానిపై సందేహాలు మొదలయ్యాయి. మొహమ్మద్ రషీద్కు ఆరుగురు భార్యలు, ముప్పైమంది పిల్లలు. వారందరి సమాచారం ఎంతోకొంత బయటి ప్రపంచం వరకూ వస్తున్నా, గత మూడేళ్లుగా ఏ ఒక్కరి నోటి నుంచీ లతీఫా మాటే రాలేదు! 2018 ముందువరకు ఆమె గురించి తెలిసింది ఒక్కటే.. స్కై డైవింగ్ అంటే ఆమెకు ప్రాణమని! ∙∙ లతీఫా అనుభవిస్తున్న కష్టాలన్నిటికీ కారణం, కుటుంబ ఆంక్షల నుంచి స్వేచ్ఛను పొందేందుకు బయట పడాలని 2018లో ఆమె చేసిన ప్రయత్నమే. తన ఫిన్లాండ్ స్నేహితురాలు టీనా జౌహానియస్, దుబాయ్ పాలకుడి తరఫున పని చేస్తుండే అరవై ఏళ్ల ఫ్రెంచి నిఘా అధికారి హెర్వ్ జాబెర్ట్, మరో ముగ్గురి సహాయంతో రాజప్రాసాదం నుంచి తప్పించుకుని లండన్ పారిపోయే ప్రయత్నంలో వారు ప్రయాణిస్తున్న పడవ మార్చి 20న గోవాలో భారత తీరప్రాంత గస్తీ దళాలకు చిక్కింది. ఆశ్రయం పొందాలని వచ్చామని ఎంత చెప్పినా వినకుండా మన కమాండోలు భారత ప్రభుత్వ ఆదేశాలపై లతీఫాను తిరిగి దుబాయ్కి అప్పగించారు. ఇలా తప్పించుకునిపోడానికి ముందు కూడా మూడేళ్లపాటు వెలుతురే లేని గదిలో ఆమె బందీగా ఉన్నారు. అందుకే స్వేచ్ఛ కోసం అంతగా అలమటించిపోయారు. ఇక లతీఫాను తిరిగి దుబాయ్కి అప్పగించడం వెనుక భారత్ ఆశించిన ప్రయోజనమూ ఉంది. ఆగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో కీలక నిందితుడైన క్రిస్టియన్ మిషెల్ను యు.ఎ.ఇ. ప్రభుత్వం భారత్కు అప్పగిస్తుందన్నదే ఆ ప్రయోజనం. అప్పటికి పందొమ్మిది నెలలుగా మిషెల్ను అప్పగించాలని భారత్ కోరుతున్నా స్పందించని దుబాయ్ ప్రభుత్వం, లతీఫాను వెనక్కి పంపించడంతో ప్రతిఫలంగా అతడిని భారత్ చేతుల్లో పెట్టింది! ఇలా ఏదో ఒక ‘దౌత్య’ కారణంతో ఈనాటికీ లతీఫా నిర్బంధాన్ని ఓ ఇంటి వ్యవహారంలా మాత్రమే దేశాలన్నీ చూస్తున్నాయి. కొన్ని దేశాలు అసలే పట్టనట్లు ఉన్నాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు సైతం ఏమీ చేయలేకపోతున్నాయి. ఘటనల కాలక్రమం రాకుమారి ‘ఎస్కేప్’కి ముందు, తర్వాత ► జూన్–2002 : లతీఫా 16 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయేందుకు తొలి ప్రయత్నం చేశారు. మధ్యలోనే పట్టుకుని మూడేళ్ల, నాలుగు నెలల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. ► 2010: లతీఫా 24 ఏళ్ల వయసులో ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ టీనాతో సన్నిహితంగా ఉండటం చూసి ఆమె ద్వారా విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తుందేమోనన్న అనుమానంతో లతీఫాకు పాస్పోర్ట్ రాకుండా, డ్రైవింగ్ నేర్చుకోకుండా ఆ కుటుంబం జాగ్రత్తపడింది. ► 2018 ఫిబ్రవరి ప్రారంభం : లతీఫా తన 32 ఏళ్ల వయసులో ‘జస్ట్ ఇన్ కేస్’ అని తనపై ఒక వీడియో తీయించుకుని తన నమ్మకస్తులకు మెయిల్ చేశారు. ‘నేను అమెరికా పారిపోతున్నాను. మధ్యలో పట్టుపడితే కనుక ఈ వీడియోను మీడియాకు అందించండి..’ అని అందులో విజ్ఞప్తి చేశారు. ► 24 ఫిబ్రవరి 2018: రాజప్రాసాదం నుంచి తప్పించుకుని, ఇన్ఫ్లేటబుల్ బోట్ (గాలి నింపిన తేలికపాటి పడవ)లో, తర్వాత జెట్ స్కీ లో 24 మైళ్లు అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించి, ఫ్రెంచి అధికారి జాబెర్ట్ సిద్ధంగా ఉంచిన అమెరికన్ యాట్లో ఇండియా చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో అమెరికా వెళ్లి ఆశ్రయం పొందాలని పథకం. అయితే గోవాలో భారత తీర ప్రాంత కమాండోలకు చిక్కడంతో ఆ ప్రయత్నం విఫలం అయింది. ► 5 డిసెంబర్ 2018: లతీఫా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు బి.బి.సి. ప్రత్యేక కథనాన్ని ఇవ్వబోతున్నట్లు తెలియగానే లతీఫా తన ఇంట్లోనే సురక్షితంగా ఉందని దుబాయ్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ► 24 డిసెంబర్ 2018 : యు.ఎన్. మానవ హక్కుల కమిషనర్ మేరీ రాబిన్సన్ కలిసి డిసెంబర్ 15న లంచ్ చేస్తున్న లతీఫా ఫొటోను యూఏఈ విదేశాంగ శాఖ వ్యూహాత్మకంగా విడుదల చేసింది. నాటి నుంచి నేటి వరకు లతీఫా ఆచూకీకి సంబంధించిన ఒక్క వివరమూ లేదు! ► 16 ఫిబ్రవరి 2021: బి.బి.సి. ప్రసారం చేసిన ‘పనోరమా’ షో ఇంటర్వ్యూలో మాట్లాడిన మేరీ రాబిన్సన్.. ‘లతీఫా నాతో కలిసి లంచ్ చేస్తున్న ఫొటోను ప్రపంచానికి చూపి దుబాయ్ పాలకులు తమ గోప్యతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు’ అని వ్యాఖ్యానించారు. స్కై డైవింగ్ ప్రాణం, చిన్న పిల్ల మనసు బి.బి.సి. మంగళవారం ప్రసారం చేసిన వీడియో క్లిప్లో లతీఫా మేరీ రాబిన్సన్తో లతీఫా లంచ్ -
మనకు రెండో ఇల్లు అదే.. కానీ అమెరికానే ఫేవరెట్
సాక్షి, హైదరాబాద్: గత రెండు దశాబ్దాలుగా భారతదేశం నుంచే అత్యధికంగా విదేశాలకు వలస వెళ్తున్నారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశమే అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో భారత్కు విదేశాల నుంచి వలసలు తగ్గిపోయాయి. ఇలా బాగా వలసలు తగ్గిపోయిన దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇతర దేశాల పౌరులతో పోలిస్తే భారతీయులే అత్యధికంగా విదేశాల్లో నివసిస్తున్నారు. దాదాపు 1.8 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తుండగా, ఆ తర్వాత మెక్సికో (1.1 కోట్ల మంది), రష్యా (1.1 కోట్ల మంది), చైనా (1 కోటి మంది), సిరియా (80 లక్షల మంది) జాతీయులు విదేశాల్లో ఉంటున్నారు. కాగా అంతర్జాతీయ వలసలు– 2020 నివేదికను ఐక్యరాజ్య సమితి తాజాగా చేసింది. ఈ నివేదిక ప్రకారం గడిచిన రెండు దశాబ్దాల్లో విదేశాల నుంచి వలసలు అత్యతంగా తగ్గిన దేశాల్లో అర్మేనియా మొదటి స్థానంలో నిలవగా, భారత్ రెండో స్థానంలో ఉంది. అర్మేనియా, భారత్, పాకిస్తాన్, ఉక్రెయిన్, టాంజానియా దేశాలకు విదేశీయుల రాక గణనీయంగా తగ్గినట్లు ఐరాస తెలిపింది. మరోవైపు జర్మనీ, స్పెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ, అమెరికాకు వలసలు భారీగా పెరిగినట్లు వెల్లడించింది. మనకు రెండో ఇల్లు యూఏఈ ప్రవాస భారతీయులకు భారత దేశం తర్వాత మరో ఇల్లుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మారింది. ప్రపంచంలోనే అత్యధికంగా 35 లక్షల మంది ప్రవాస భారతీయులు యూఏఈలో నివాసముంటుండగా, అమెరికాలో 27 లక్షలు, సౌదీ అరేబియాలో 25 లక్షల మంది ఉంటున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్, పాకిస్తాన్, ఖతర్, బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్లో కూడా భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉన్నారు. 2020లో 1,78,69,492 మంది ప్రవాస భారతీయులు విదేశాల్లో నివసిస్తుండగా, భారత్లో 48,78,704 మంది విదేశీయులు నివాసం ఉంటున్నారు. దేశ జనాభాలో వీరి శాతం 0.4 మాత్రమే కాగా, వీరిలో 2,07,334 మంది శరణార్థులున్నారు. అమెరికాయే ఫేవరెట్.. ప్రపంచవ్యాప్తంగా 28.1 కోట్ల వలసదారులు ఉండగా, వీరిలో మూడో వంతు 20 దేశాల్లోనే నివసిస్తున్నారు. ప్రపంచ వలసదారుల ఇష్టమైన దేశంగా అమెరికా నిలిచింది. అత్యధికంగా 5.1 కోట్ల మంది విదేశీయులు అమెరికాలో నివసిస్తున్నారు. అత్యధిక సంఖ్యలో విదేశీయులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల్లో 1.6 కోట్ల మందితో జర్మనీ రెండో స్థానంలో, 1.3 కోట్ల మందితో సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉంది. రష్యాలో 1.2 కోట్లు, బ్రిటన్, నెదర్లాండ్లో 90 లక్షల మంది విదేశీయులు ఉంటున్నారు. ఐరోపాలో అత్యధికంగా 8.7 కోట్ల వలసదారులు నివసిస్తుండగా, ఉత్తర అమెరికాలో 5.9 కోట్లు, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియాలో 5 కోట్ల మంది వలసదారులు ఉంటున్నారు. -
అక్షరాలా రూ. 4,000 కోట్ల ఆదాయం!
ముంబై: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడలు ఆగిపోయాయి. కనీసం చిన్న స్థాయి టోర్నీ కూడా నిర్వహించలేని పరిస్థితి. మన దేశంలోనైతే రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020లో కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణ గురించి ఆలోచించింది. ► సాధారణంగా ప్రతీ ఏటా నిర్వహించే ఏప్రిల్–మే షెడ్యూల్ సమయం గడిచిపోయినా ఆశలు కోల్పోలేదు. కోవిడ్–19 కాలంలో ఎన్నో కష్టాలకోర్చి క్రికెట్ నిర్వహించడం అవసరమా అని ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ► అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలన్నీ ఆలోచించి చివరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో విజయవంతంగా ఐపీఎల్ను నిర్వహించింది. బీసీసీఐ ఎందుకు ఇంతగా శ్రమించిందో తాజా లెక్కలు చూస్తే అర్థమవుతుంది. ► ఐపీఎల్–13 సీజన్ ద్వారా భారత బోర్డుకు ఏకంగా రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చింది. లీగ్ జరపకుండా ఉండే ఇంత భారీ మొత్తాన్ని బోర్డు కోల్పోయేదేమో! తాజా సీజన్ ఐపీఎల్ను టీవీలో వీక్షించినవారి సంఖ్య గత ఏడాదికంటే 25 శాతం ఎక్కువగా ఉండటం విశేషం. –మరోవైపు ఐపీఎల్ సాగిన కాలంలో బోర్డు మొత్తంగా 1800 మందికి 30 వేల (ఆర్టీ–పీసీఆర్) కరోనా పరీక్షలు నిర్వహించడం మరో విశేషం. ఖర్చులు తగ్గించుకొని... సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఎలాంటి అంతరాయం లేకుండా జరిగిన 60 మ్యాచ్ల ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ► ఐపీఎల్ తొలి మ్యాచ్కు దాదాపు రెండు నెలల ముందు ఎగ్జిబిషన్ టోర్నీ సమయంలో వరల్డ్ నంబర్వన్ టెన్నిస్ ప్లేయర్ జొకోవిచ్కు కరోనా రావడంతో మా లీగ్ నిర్వహణపై కూడా సందేహాలు కనిపించాయి. చాలా మంది మమ్మల్ని ముందుకు వెళ్లవద్దని వారించారు. ఎవరైనా క్రికెటర్కు కరోనా వస్తే ఎలా అని వారు అడిగారు. అయితే మేం వాటిని పట్టించుకోలేదు. ∙గత ఐపీఎల్తో పోలిస్తే బీసీసీఐ 35 శాతం నిర్వహణా ఖర్చులు తగ్గించుకుంది. నిర్వహణకు శ్రీలంక నుంచి కూడా ప్రతిపాదన వచ్చినా యూఏఐ వైపు మొగ్గు చూపాం. మూడు నగరాల మధ్యలో బస్సులో ప్రయాణించే అవకాశం ఉండటంతో అలా కూడా ఖర్చు తగ్గించాం. ► సుమారు 40 సార్లు కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా గంటలకొద్దీ చర్చలు సాగాయి. బయో సెక్యూర్ బబుల్ కోసం రెస్ట్రాటా అనే కంపెనీ సహకారం తీసుకున్నాం. బీసీసీఐ అధికారులు ముందుగా వెళ్లి ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. క్వారంటైన్ విషయంలో దుబాయ్ ప్రభుత్వం ఆటగాళ్లకు సడలింపులు ఇచ్చినా... యూఏఈ ప్రభుత్వం ససేమిరా అంది. చివరకు ఎంతో శ్రమించి వారిని కూడా ఒప్పించగలిగాం. ఇంత చేసినా ఆరంభంలోనే చెన్నై బృందంలో చాలా మందికి కరోనా వచ్చినట్లు తేలడంలో ఆందోళన కలిగింది. అయితే ఆ తర్వాత అంతా కోలుకున్నారు. మొత్తంగా యూఏఈ ప్రభుత్వ సహకారంతో లీగ్ సూపర్ హిట్ కావడం సంతోషకరం. చివరకు మాకు రూ. 4 వేల కోట్ల ఆదాయం కూడా వచ్చింది. -
ఐపీఎల్ 2020: బీసీసీఐ ఆదాయం ఎంతంటే!
న్యూఢిల్లీ: క్యాష్ రిచ్ ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కరోనా కాలంలోనూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి సిరులు కురిపించింది. యూఏఈ వేదికగా నిర్వహించిన ఐపీఎల్-13వ సీజన్కు గానూ బోర్డు సుమారు 4 వేల కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఆర్జించింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమల్ ఈ విషయాన్ని వెల్లడించారు. అదే విధంగా గతేడాదితో పోలిస్తే ఈసారి టీవీ వ్యూయర్షిప్ కూడా 25 శాతం మేర పెరిగిందని పేర్కొన్నారు. కాగా మహమ్మారి కరోనా దెబ్బకు క్రీడా ఈవెంట్లన్నీ వాయిదా పడ్డ వేళ ఐపీఎల్ నిర్వహణపై కూడా సందేహాలు తలెత్తిన విషయం తెలిసిందే. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో మార్చి 29న మొదలు కావాల్సిన ఐపీఎల్-2020 సీజన్ను తొలుత వాయిదా వేశారు.(చదవండి: కోహ్లి త్వరలోనే ఆ ఘనత సాధిస్తాడు: భజ్జీ) ఆ తర్వాత జూన్-జులై నెలల్లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేసినా సాధ్యం పడకపోవడంతో.. ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేద్దామని బీసీసీఐ పెద్దలు భావించారు. అయితే టోర్నీ నిర్వహణకు యూఏఈ అనుకూలమని భావించిన బోర్డు.. అక్కడి అధికారులతో సంప్రదించగా సానుకూల స్పందన లభించింది. దీంతో కోవిడ్ నిబంధనల నడుమ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు కొనసాగిన టోర్నీని బీసీసీఐ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత సంపన్న బోర్డుగా పేరొందిన బీసీసీఐ భారీ ఎత్తున ఆదాయం గడించినట్లు అరుణ్ ధుమాల్ తెలిపారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘గతేడాది ఐపీఎల్తో పోలిస్తే ఈసారి 35 శాతం మేర నిర్వహణ ఖర్చు తగ్గింది. కరోనా కాలంలో 4 వేల కోట్ల రూపాయాల ఆదాయం ఆర్జించాం. డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్కింగ్స్ మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్కు విపరీతమైన ఆదరణ లభించింది. టీవీ వ్యూయర్షిప్ 25 శాతం వరకు పెరిగింది. తొలుత మాపై సందేహాలు వ్యక్తం చేసిన వారే ఐపీఎల్ను విజయవంతంగా పూర్తిచేసినందుకు మాకు ధన్యవాదాలు తెలిపారు. ఒకవేళ ఈ సీజన్ నిర్వహించకపోయి ఉంటే క్రికెటర్లు ఓ ఏడాది కాలాన్ని కోల్పేయేవారు’’ అని చెప్పుకొచ్చారు. (చదవండి: యూఏఈకి బీసీసీఐ బంపర్ బొనాంజ!) ఇక కోవిడ్ కాలంలో టోర్నీ నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తల గురించి చెబుతూ.. ‘‘ఈ టీ20 లీగ్లో 53 రోజులపాటు మొత్తంగా 60 మ్యాచ్లు జరిగాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా 1800 మందికి సుమారు 30 వేల మేర కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన పక్షంలో వారు కోలుకునేంత వరకు అన్ని రకాల చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. క్వారంటైన్ కోసం సుమారు 200 గదులు బుక్ చేశాం’’ అని అరుణ్ ధుమల్ పేర్కొన్నారు. కాగా ఐపీఎల్-13వ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్ ట్రోఫీని ఎగురేసుకుపోయిన సంగతి తెలిసిందే. తద్వారా ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టుగా రోహిత్ సేన చరిత్ర సృష్టించింది. -
ఐపీఎల్: యూఏఈకి బీసీసీఐ బంపర్ బొనాంజ!
దుబాయ్: కరోనా అడ్డంకులను దాటుకుని ఐపీఎల్ 13వ సీజన్ సక్సెస్ అయిందంటే కారణం వేదిక యూఏఈ కావడమే! రెండున్నర నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 2020 నిర్వహణకు సంబంధించి యూఏఈకి బీసీసీఐ భారీ మొత్తంలోనే ముట్టజెప్పినట్టు జాతీయ మీడియా తెలిపింది. దాదాపు రూ.100 కోట్ల రూపాయలు యూఏఈకి అందినట్టు సమాచారం. కాగా, ఏప్రిల్-మే నెలల్లో భారత్లో నిర్వహించాల్సిన ఐపీఎల్ 13 వ సీజన్ కరోనా విజృంభణతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అనంతరం జూన్-జులై నెలల్లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేసినా సాధ్యం కాలేదు. దాంతో ఈ ఏడాది ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేద్దామని భావించారు. (చదవండి: సీఎస్కే కెప్టెన్గా అతడికే అవకాశం!) అయితే, టోర్నీ నిర్వహణకు యూఏఈ అనుకూలమని భావించిన బీసీసీఐ అధికారులు.. అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపారు. 2014 ఐపీఎల్కు వేదికైన యూఏఈ.. ఐపీఎల్ 2020కి ఓకే చెప్పడంతో మార్గం సుగమమైంది. బీసీసీఐ, ఐపీఎల్ సిబ్బంది, ఆటగాళ్లు, యూఏఈ అధికారుల సహకారంతో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ తాజా సీజన్ దిగ్విజయంగా కొనసాగింది. ఇదిలాఉండగా.. వచ్చే ఏడాది ప్రారంభంలో స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగనున్న టెస్టు సిరీస్ కూడా యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. (చదవండి: ‘కడక్నాథ్’ కోళ్ల బిజినెస్లోకి ధోని ఎంట్రీ!) -
పుట్టగానే మాస్కు లాగిపడేసింది!
ఒకప్పుడు కేవలం వైద్య సిబ్బంది మాత్రమే అది కూడా ఆస్పత్రిలో, మరీ ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లోనే సర్జికల్ మాస్కులు ధరించే వారు. కర్మాగారాల్లో పని చేసే కార్మికులు కూడా కాలుష్యం నుంచి తమను తాము కాపాడుకునేందుకు మాస్కులు వాడేవారు. కానీ ఎప్పుడైతే మహమ్మారి కరోనా పంజా విసరడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి సామాన్యుల జీవితాల్లోనూ ఇదొక భాగమైపోయింది. ఇప్పుడప్పుడే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే దాఖలాలు లేకపోవడంతో.. ‘‘చికిత్స కన్నా నివారణే మేలు’’అన్న చందంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు ముందుకు సాగుతున్నారు. ప్రాణాంతక కోవిడ్-19 అంతమై, మునుపటి పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. (చదవండి: తల్లిని కాపాడేందుకు ఐదేళ్ల పిల్లాడు..) యూఏఈకి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ సమీర్ చీబ్ కూడా ఈ కోవకు చెందిన వారే. గతంలో ఓ డెలివరీ సందర్భంగా ఆపరేషన్ థియేటర్లో తీసిన ఫొటో ఒకటి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఆయన.. ‘‘త్వరలోనే మాస్కును తొలగించే సమయం ఆసన్నం కావాలంటూ మనమందరం కోరుకుంటున్నాం కదా’’ అంటూ క్యాప్షన్ జతచేశారు. అప్పుడే పుట్టిన చిన్నారి, సమీర్ మాస్కును తన చేతితో లాగిపడేయగా, ఆయన చిరునవ్వులు చిందిస్తున్న ఆ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘‘పుట్టగానే మాస్కు తీసి పడేసింది. 2020లో నేను చూసిన అద్భుతమైన ఫొటో ఇదే. అన్నీ సజావుగా సాగి మనమంతా మాస్కు లేకుండా బయటకు వెళ్లగలిగే రోజులు త్వరలోనే రావాలి. మెరుగైన మన భవిష్యత్తుకు ఈ చిన్నారి ఫొటో ఓ సంకేతంలా కనిపిస్తోంది’’అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘‘మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చినా, అది పూర్తిగా అంతమైపోదని, కాబట్టి మాస్కు ధరిస్తే కరోనాతో పాటు, ఇతర వైరస్లు కూడా సోకకుండా జాగ్రత్త పడవచ్చు’’అంటూ సలహాలు ఇస్తున్నారు. View this post on Instagram We all want sign are we going to take off the mask soon 🙏🏻 #instagram #goodnews #goodvibes #uae🇦🇪 #dubai #instagood #love #photooftheday #cute #babyboy #instmoment @dubaimediaoffice A post shared by Dr Samer Cheaib د سامر شعيب (@dr.samercheaib) on Oct 5, 2020 at 6:02am PDT -
వచ్చే ఐపీఎల్ కూడా యూఏఈలోనే!
దుబాయ్: కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) తరలించిన బీసీసీఐ... వచ్చే సీజన్ విషయంలో కూడా ఇదే తరహాలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2021 ఐపీఎల్ సమయానికి మన దేశంలో కరోనా అదుపులోకి రాకపోతే వరుసగా రెండో ఏడాది కూడా అక్కడే నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మెరుగుపర్చుకోవడం, పరస్పర సహకారంతో టోర్నీల నిర్వహణలో భాగంగా బీసీసీఐ, యూఏఈ క్రికెట్ బోర్డు మధ్య ఒక ప్రత్యేక ఎంఓయూ కుదిరింది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. జై షాతో పాటు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కోశాధికారి అరుణ్ ధుమాల్ కూడా ఇందులో పాల్గొన్నారు. మరోవైపు ఈ ఏడాది చివర్లో ఇంగ్లండ్ జట్టుతో టెస్టు సిరీస్కు భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు దీనిని కూడా యూఏఈలోనే జరిపే అవకాశం కనిపిస్తోంది. ప్రతి ఏటా షెడ్యూల్లాగే ఏప్రిల్–మేలోనే ఐపీఎల్ జరగాల్సి వస్తే యూఏఈనే సరైన వేదికగా భావిస్తున్నట్లు చెప్పిన బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు... ఇంగ్లండ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు కూడా ప్రత్యామ్నాయంగా ఎడారి దేశాన్ని చూసినట్లు చెప్పారు. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత భారత జట్టు యూఏఈలో ఆడేందుకు (2006లో పాక్తో 2 వన్డేల సిరీస్ మినహా) నిరాకరిస్తూ వచ్చింది. అయితే 2014లో కొన్ని ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించిన తర్వాత బీసీసీఐ మెత్తబడింది. 2018లో ఇక్కడే జరిగిన ఆసియా కప్లో కూడా భారత్ పాల్గొంది. -
ఎడారిలో ఒయాసిస్...
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ క్రీడల గురించి కనీసం ఆలోచించలేని పరిస్థితిలో కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ బంగారు బాతును బ్రహ్మాండంగా వాడుకునే ప్రయత్నంలో పడింది. ఎలాగైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాత్రం కచ్చితంగా నిర్వహించాలని పట్టుదల కనబర్చి అందుకు తగినట్లుగా అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. కోవిడ్–19 నేపథ్యంలో అన్ని దేశాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొన్న స్థితిలో కూడా ఒయాసిస్లా ఆశలు రేపుతున్న ఆదాయాన్ని ఆర్జించేందుకు ఎడారి దేశం బాట పట్టింది. కొన్నాళ్ల క్రితం వరకు అసాధ్యం అనుకున్న లీగ్ను ఇప్పుడు సన్నద్ధం చేసి బోర్డు తొలి అడుగును విజయవంతంగా వేసింది. షెడ్యూల్ ప్రకారమైతే ఏప్రిల్–మే నెలలో ఐపీఎల్ జరగాలి. కానీ కరోనా కారణంగా అంతా మారిపోయింది. మార్చిలోనే దక్షిణాఫ్రికా జట్టు తమ వన్డే సిరీస్ను రద్దు చేసుకొని స్వదేశం వెళ్లిపోవడంతో మన దేశంలో క్రికెట్ ఆగిపోయింది. ఇలాంటి సమయంలో బీసీసీఐ కూడా దాదాపుగా చేతులెత్తేసింది. ఐపీఎల్ జరుగుతుందో లేదో అన్నట్లుగానే మొదటి నుంచీ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూనే వచ్చాడు. అయితే బయో బబుల్ సెక్యూరిటీలో జరిగిన ఇంగ్లండ్–వెస్టిండీస్ టెస్టు సిరీస్ బీసీసీఐకు ఒక దారి చూపించింది. ప్రేక్షకులు లేకపోవడం సంగతి తర్వాత... ముందు మ్యాచ్లు జరిగేదెలాగో చూడమన్నట్లుగా ఒక్కసారిగా బోర్డులో కదలిక వచ్చింది. దాని ఫలితమే ఎలాగైనా లీగ్ నిర్వహించాలనే పట్టుదలతో ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించేలా చేసింది. యూఏఈలోనే ఎందుకు... ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని భావిస్తే భారత్లోనే ఐపీఎల్ జరపవచ్చుగా అనేదానిపై ఆరంభంలో బోర్డులో కూడా చర్చ జరిగింది. అయితే దేశంలో కరోనా తీవ్రత ఉండటంతో ఏ నగరం కూడా క్షేమంగా లేదు. ఐపీఎల్ గురించి ప్రణాళికలు రూపొందిస్తున్న సమయంలో ఢిల్లీ, ముంబైలు కరోనా కేసుల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. పైగా ఇలాంటి సమయంలోనూ లీగ్ జరుగుతుంటే పలు విమర్శలు రావడం సహజం. పైగా భారత్లాంటి చోట బయో బబుల్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం అంత సులువు కాదు. ఆటగాళ్లు ఎంత క్రమశిక్షణ పాటించాలని భావించినా... స్థానిక పరిస్థితుల కారణంగా బయటి వ్యక్తులు కూడా భద్రతా నిబంధనలు ఉల్లంఘించడం చాలా సులువు. ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఏదో ఒక సమస్య సగటు అభిమానుల నుంచి ఎదురైనా లీగ్కు దెబ్బ పడవచ్చు. ఇలాంటి కారణాలతో పాటు వసతుల పరంగా చూసినా అత్యుత్తమమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని బీసీసీఐ ఎంచుకుంది. స్థానిక బోర్డు, ప్రభుత్వం కూడా సహకరించేందుకు íసిద్ధం కావడంతో సమస్య లేకుండా పోయింది. యూఏఈలో కూడా కరోనా కేసులు ఎక్కువే (మంగళవారం నాటికి మొత్తం సుమారు 80 వేలు, కోలుకున్నవారు 70 వేలు) ఉన్నాయి. కానీ కఠిన చట్టాల వల్ల నియంత్రణలోనే ఉంది. ఆటగాళ్ల పరిస్థితేంటి... కోవిడ్–19 కారణంగా సుదీర్ఘ కాలం ఇళ్లకే పరిమితమైపోయిన క్రికెటర్ల దృష్టిలో మాత్రం ఇప్పుడు ఐపీఎల్ పెద్ద పండగలా మారిపోయింది. అందుకే వారంతా టోర్నీ కోసం ఉత్సాహంగా సిద్ధమయ్యారు. యూఏఈ రావడానికి ముందు, వచ్చిన తర్వాత విధించిన కఠిన ఆంక్షలు, కరోనా నిబంధనలు ఆరంభంలో కొంత ఇబ్బందికి గురి చేసినా... ఇప్పుడు వారంతా పరిస్థితులకు అలవాటు పడిపోయారని ఆయా జట్ల ప్రాక్టీస్ ఫొటోలు, వీడియోలు చూస్తే తెలుస్తోంది. మాస్క్లు, పీపీఈ కిట్లతో ప్రత్యేక విమానం ఎక్కిన వీరంతా బయో బబుల్లోఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం సానుకూలాంశం. గతంలోలాగా స్వేచ్ఛగా బయట విహరించే అవకాశం లేకపోయినా, సహచర క్రికెటర్లతో మైదానంలో ఆటను ఆస్వాదిస్తున్న కారణంగా ఆ లోటు తెలియకపోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ బృందంలో ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మంది కరోనా సోకి కొంత ఆందోళన రేగింది. అయితే ఇప్పడు పరిస్థితులు చక్కబడగా, ఆ ఉదంతం తర్వాత మళ్లీ ఐపీఎల్లో ‘పాజిటివ్’ మాట వినిపించలేదు. బయో సెక్యూర్ బబుల్లో ఆటగాళ్లు సమర్థంగా నిబంధనలు పాటిస్తున్నారనే దీన్ని బట్టి అర్థమవుతోంది. దాదాపు 80 రోజులు ఈ తరహాలో బందీగా ఉండాల్సి రావడం ఆటగాళ్లపై మానసికంగా ప్రభావం చూపిస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నా... ఇప్పుడైతే అలాంటిది కనిపించడం లేదు. ఒకవేళ టోర్నీ సాగినకొద్దీ తెలుస్తుందని అనుకున్నా... ప్రొఫెషనల్ క్రీడాకారులు అంత బలహీనంగా ఉండరని, తమ ఆటపై మాత్రమే దృష్టి పెడతారని కూడా భావించవచ్చు. మీడియా సమావేశాలు కూడా లేవు కాబట్టి ఆటగాళ్లపై ఆ ఒత్తిడి కూడా తగ్గినట్లే. అభిమానులూ ఇంటినుంచే... కరోనా కష్టకాలంలో ఐపీఎల్ జరుగుతున్నా... ఆటపరంగా లీగ్ ప్రమాణాల్లో ఎలాంటి లోటూ ఉండకపోవచ్చు. అభిమానుల ముందు ఆడే అవకాశం లేకపోవడం కొందరు ఆటగాళ్లను నిరుత్సాహపరిచే అంశం. అయితే అన్ని రకాల పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే క్రికెటర్ల లక్షణం కాబట్టి ఫ్యాన్స్ ప్రోత్సాహం లేకపోవడంవంటివి వారిపై పెద్దగా ప్రభావం చూపవు. ఇక వీరాభిమానులు ఎప్పటిలాగే టీవీల్లో మ్యాచ్లతో వినోదాన్ని పొందవచ్చు. మరోవైపు మొబైల్లో మ్యాచ్లు చూపించే హాట్స్టార్ మాత్రం ఐపీఎల్ కోసం రారమ్మంటూ భారీ ప్రచారం మొదలు పెట్టడంతో పాటు ‘నో సబ్స్క్రిప్షన్ నో ఐపీఎల్’ అంటూ ప్రత్యేకంగా సబ్స్క్రయిబ్ చేసుకోమంటూ ఒక రకమైన హెచ్చరిక పంపించింది. స్పాన్సర్ల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అభిమానులతో సరదా ముచ్చట్లు, ఆటోగ్రాఫ్లు, ఫోటోల సందడిలాంటి మాత్రం ఈసారి పూర్తిగా మిస్. లేట్గా వచ్చినా లేటెస్ట్గానే అన్నట్లు ఐపీఎల్–2020 కూడా క్రికెట్ అభిమానులకు పసందైన విందు భోజనం అందిస్తుందనడంలో సందేహం లేదు. చివరగా... వేదికలు మారాయి, ఏర్పాట్లు, ఇతర ఖర్చులు పెరిగాయి, చైనా దెబ్బతో టైటిల్ స్పాన్సర్షిప్ విలువలో సగం డబ్బులే వచ్చాయి, అనుబంధ స్పాన్సర్లు బేరమాడుతున్నారు.... అయినా సరే బోర్డు మాత్రం లీగ్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అసలు ఐపీఎల్ జరగకపోవడంకంటే ఇలాగైనా నిర్వహిస్తే చాలంటూ ఫ్రాంచైజీ యాజమాన్యాలు కూడా బోర్డుకు మద్దతు పలికాయి. ఆర్థికంగా లాభాలకంటే ఆట జరగడం ముఖ్యమని దీంతో సంబంధం ఉన్న అందరూ భావించడంతో లీగ్ వాస్తవరూపం దాలుస్తోంది. గత 12 సీజన్లతో పోలిస్తే పూర్తి భిన్నంగా జరగబోతున్న ఈ ఐపీఎల్–2020ని ఈ శనివారం నుంచి ఎంజాయ్ చేసేందుకు సిద్ధం కండి. -
దుబాయ్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ పాంటింగ్
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) హెడ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ గురువారం దుబాయ్ చేరుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్–13 కోసం ఆదివారమే డీసీ జట్టు ఇక్కడికి రాగా పాంటింగ్ ఆలస్యంగా జట్టుతో కలిశాడు. నిబంధనల ప్రకారం అతను ఆరు రోజుల క్వారంటైన్కు వెళ్లిపోయాడు. తనకు కేటాయించిన హోటల్ గదికి చేరుకున్న పాంటింగ్ ఆరు రోజుల అధికారిక క్వారంటైన్ ప్రారంభమైందంటూ ట్వీట్ చేశాడు. ఈ సీజన్లో తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ను మన్కడింగ్ చేయనివ్వబోనని వ్యాఖ్యానించి రికీ తాజాగా భారీ చర్చకు తావిచ్చాడు. -
అన్ని జట్లు చేరుకున్నాయి
దుబాయ్: ఐపీఎల్ తాజా సీజన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్లు ఆదివారం దుబాయ్ చేరుకున్నాయి. మిగతా జట్లన్నీ ఇప్పటికే అక్కడికి చేరుకోగా... ఈ రెండు జట్లు మాత్రం కాస్త ఆలస్యంగా యూఏఈ బయలుదేరి వెళ్లాయి. తొలుత హైదరాబాద్, అనంతరం ఢిల్లీ జట్లు దుబాయ్లో అడుగుపెట్టాయి. ఈ విషయాన్ని సన్రైజర్స్ బ్యాట్స్మన్ శ్రీవత్స్ గోస్వామి ట్విట్టర్లో తెలిపాడు. మరోవైపు చాలా కాలం తర్వాత తమ జట్టుతో కలిసిన ఢిల్లీ క్యాపిటల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ధీరజ్ మల్హోత్రా, అసిస్టెంట్ కోచ్ మొహమ్మద్ కైఫ్ హర్షం వ్యక్తం చేశారు. మళ్లీ కుటుంబంతో కలిసినట్లుగా చాలా ఉత్సాహంగా ఉందని ధీరజ్ పేర్కొన్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఈ రెండు జట్లు ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నాయి. ఈ సమయంలో మూడు సార్లు ఆటగాళ్లందరికీ ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్గా తేలిన వారిని మాత్రమే ‘బయో బబుల్’లోకి అనుమతించనున్నారు. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో ఐపీఎల్ 13వ సీజన్ జరుగనుంది. దీంతో లీగ్తో సంబంధమున్న భారత ఆటగాళ్లు, సిబ్బంది యూఏఈ చేరుకున్నారు. ఆర్సీబీతో కలిసిన డివిలియర్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విధ్వంసక ఆటగాడు డివిలియర్స్ దుబాయ్ చేరుకున్నాడు. ఆర్సీబీ జట్టు శుక్రవారమే అక్కడికి చేరుకోగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డేల్ స్టెయిన్, క్రిస్ మోరిస్, డివిలియర్స్ శనివారం జట్టుతో కలిశారు. ‘ఐపీఎల్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. దుబాయ్కి రావడం సంతోషంగా ఉంది. నా దక్షిణాఫ్రికా మిత్రులతో కలిసి ఆర్సీబీ కుటుంబంలో చేరాను. ఇక కోవిడ్–19 పరీక్షకు హాజరు కావాలి’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు. -
సందడి షురూ...
దుబాయ్: అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)– 2020కి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 19నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని మూడు వేదికల్లో లీగ్ జరగనుండగా... సుమారు నెల రోజుల ముందుగానే జట్లు అక్కడికి చేరుకుంటున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లి నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం యూఏఈ గడ్డపై అడుగు పెట్టాయి. మరో రెండు టీమ్లు సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే అక్కడికి వెళ్లాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఆరు రోజుల వరకు అందరికీ క్వారంటీన్ తప్పనిసరి. ఈ సమయంలో ఒక్కొక్కరికి కనీసం మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహి స్తారు. ఆ తర్వాతేనుంచి ఆటగాళ్ల ప్రాక్టీస్, లీగ్ వార్తలు క్రికెట్ ఫ్యాన్స్ను అలరించనున్నాయి. మలింగ మరింత ఆలస్యంగా... శ్రీలంక స్పీడ్స్టర్, ముంబై ఇండియన్స్ ప్రధాన పేసర్ లసిత్ మలింగ కూడా ఆలస్యంగానే యూఏఈ వెళ్లనున్నాడు. దీంతో తొలి దశ మ్యాచ్లకు అతను జట్టుకు అందుబాటులో ఉండడు. కుటుంబ కారణాల వల్లే లంక ఆటగాడు కాస్తా ఆలస్యంగా ఐపీఎల్ ఆడనున్నాడు. ఈ పేసర్ తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు త్వరలోనే సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉండటంతో మలింగ తండ్రి వెంటే ఉండాలనుకుంటున్నాడు. దీంతో సగం మ్యాచ్లు అయ్యాకే అక్కడికి వెళ్లే అవకాశముంది. గతేడాది మలింగ మలుపు తిప్పిన ఆఖరి ఓవర్తోనే ముంబై నాలుగోసారి చాంపియన్ అయ్యింది. 8 పరుగులు చేస్తే చెన్నై గెలిచే ఆ ఓవర్లో అద్భుతంగా కట్టడి చేయడం వల్లే రోహిత్ సేన నెగ్గింది. చెన్నై బౌలర్ హర్భజన్ సింగ్ కూడా వ్యక్తిగత కారణాలతో జట్టుతో పాటే యూఏఈ వెళ్లలేకపోయాడు. -
యూఏఈలో భారత స్వాతంత్ర్య వేడుకలు
అబుదాబీ: 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో నిరాడంబరంగా జరిగాయి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ యూఏఈ ప్రభుత్వం ఇచ్చిన పరమితమైన అనుమతుల మేరకు ఐఎస్సీ యాజమాన్యం మొత్తం వేడుకలను రెండు భాగాలుగా విభజించి నిర్వహించింది. ఉదయం 7.30 నిమిషాలకు ఐఎస్సీ యాజమాన్య కార్యవర్గం, సెంటర్ ఉద్యోగుల సమక్షంలో ఐఎస్సీ అధ్యక్షుడు యోగేష్ ప్రభు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో వీరుల త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ వాయువులని, అందరం దేశ ప్రగతికి తోడ్పడిననాడే వారికి నిజమైన నివాళి అర్పించినవాళ్లమవుతామని తెలిపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సాంకేతిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్షంగా వీక్షిస్తున్న సంఘ సభ్యులు, యూఎన్ఈలో ఉంటున్న ఎంతోమంది భారతీయులందరికీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కరోనా ప్రభావం, ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు ఇలా జరుపుకోవాల్సి వచ్చిందని సంఘ ప్రధాన కార్యదర్శి జోజో అంబూకేన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండో భాగమైన సాంస్కృతిక కార్యక్రమం సాయంత్రం 7.30 నిమిషాల నుంచి రెండు గంటలపాటు జరుపుకున్నారని సాంస్కృతిక కార్యదర్శి జయప్రదీప్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 10 రాష్ట్రాల సాంస్కృతిక సంఘాల పాలు పంచుకున్నాయని దక్షిణ భారత కార్యదర్శి రాజా శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రోగ్రామ్లో తెలుగు వారి తరపున పావని ఆధ్వర్యంలో వర్షిణి, ఆముక్త, కువీర, సంస్కృతి, అక్షర, కవీష్, అభిరామ్ పాల్గొని ప్రేక్షకులను వారి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తెలుగు వారి ప్రదర్శన ఈ కార్యక్రమానికే వన్నె తెచ్చిందని ఉపాధ్యక్షులు జార్జి వర్గీస్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని జూమ్ ద్వారా యూఏఈలో ఉన్న ఎందరో భారతీయులు వీక్షించారని సెంటర్ జనరల్ మేనేజర్ రాజు అన్నారు. అలాగే భారత దౌత్య కార్యాలయం 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిపిన ఆన్లైన్ దేశ భక్తి గీతాల, చిత్ర లేఖన ప్రదర్శనలో కవీష్ పాడిన పాటను కాన్సులేట్ జనరల్ అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన తెలుగు మిత్రులు, వారి కుటుంబ సభ్యులందరికీ రాజా శ్రీనివాసరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
భారత్ కాకుంటే లంక, యూఏఈల్లో...
దుబాయ్: వచ్చే ఏడాది భారత్లో టి20 ప్రపంచ కప్ (పురుషులు) జరగాల్సివుంది. అయితే ప్రతికూల పరిస్థితుల వల్ల కుదరకపోతే శ్రీలంక లేదంటే యూఏఈల్లో నిర్వహించేలా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రత్యామ్నాయ వేదికల్ని ఖరారు చేసింది. నిజానికి ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలకు ప్రత్యామ్నాయ వేదికలను ప్రకటించడం సర్వసాధారణం. ఇది ఎప్పటినుంచో ఉన్న ఆనవాయితీ. ప్రస్తుత కరోనా మహమ్మారి వల్ల ప్రతిపాదించిన కొత్త అంశమేమీ కాదు. అయితే భారత్లో కరోనా ఉధృతి నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే 23 లక్షల (2.3 మిలియన్లు) పైచిలుకు కేసులతో టాప్–3లో ఉంది. దీంతో వచ్చే ఏడాదికల్లా కరోనా నియంత్రణలోకి రాకపోతే మెగా ఈవెంట్ పరిస్థితి ఏంటని సగటు క్రికెట్ అభిమానికి తలేత్తే ప్రశ్న! ఇప్పుడు ఐసీసీ నిర్ణయంతో ఈ ప్రశ్నకు జవాబు దొరికినట్లయింది. ఇప్పటికే ఈ ఏడాది భారత్లో సాధ్యంకానీ ఐపీఎల్ 13వ సీజన్ను యూఏఈలో నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహమ్మారి వల్ల ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 మెగాఈవెంట్ 2022కు వాయిదా పడింది. -
అసలు ఆటగాళ్లతో పాటు...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ లేదా ఐపీఎల్ మ్యాచ్లు ఎక్కడ జరిగినా స్థానిక యువ బౌలర్లు నెట్స్లో వివిధ జట్లకు సహకరించటం పరిపాటి. జట్టు ప్రధాన బౌలర్లపై భారం తగ్గించడంతో పాటు విభిన్న శైలి బౌలర్లను ఎదుర్కొంటే బ్యాట్స్మెన్కు అది మేలు చేస్తుందనే నమ్మకమే అందుకు కారణం. సాధారణంగా ఐపీఎల్ సమయంలో ఆయా వేదికల్లో పెద్ద సంఖ్యలో నెట్ బౌలర్లు స్టార్ క్రికెటర్లకు బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే ఇప్పుడు లీగ్ స్వదేశంలో కాకుండా యూఏఈలో జరుగుతోంది. అక్కడ కూడా జట్టు కోరితే స్థానికంగా బౌలర్లు అందుబాటులో ఉండవచ్చు. అయితే తాజా కోవిడ్–19 పరిస్థితుల్లో ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. అందుకే టీమ్తో పాటు ఇక్కడినుంచే నెట్ బౌలర్లను కూడా తీసుకెళ్లాలని భావిస్తున్నాయి. వీరంతా ‘బయో బబుల్’లో తమతో భాగంగా ఉండాలని, బయటి వ్యక్తులు ఎవరూ రావాల్సిన అవసరం ఉండరాదని కోరుకుంటున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ పది మంది ఆటగాళ్లను ఇందు కోసం తమ జట్టుతో పాటు యూఏఈకి ప్రత్యేకంగా తీసుకెళ్లనున్నట్లు వెల్లడించింది. వీరంతా తమ జట్టుతో పాటే ఉంటారని చెన్నై టీమ్ సీఈఓ కాశీ విశ్వనాథన్ చెప్పారు. ఇదే తరహాలో కోల్కతా నైట్రైడర్స్ కూడా పది మందిని తీసుకెళ్లనున్నట్లు చెప్పింది. కేకేఆర్ అకాడమీ కోచ్ అభిషేక్ నాయర్ వీరిని ఎంపిక చేస్తారు. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆరుగురు బౌలర్లను తమ టీమ్తో పాటు తీసుకెళ్లనున్నట్లు సమాచారం. యూఏఈకి వెళ్లే ఐపీఎల్ ఫ్రాంచైజీ బృందంలో సభ్యుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేకపోవడంతో వారు ఈ తరహా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కలిగింది. సాధారణంగా రంజీ ట్రోఫీ లేదా సీనియర్ స్థాయిలో దేశవాళీ టోర్నీ ఆడిన, అండర్–23, అండర్–19 బౌలర్లు నెట్ బౌలర్లుగా వ్యవహరించే అవకాశం ఉంది. మరో వైపు యూఏఈ పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉండటం, తీవ్ర వేడిమి కారణంగా పొడిబారిన పిచ్లపై వారు ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ప్రతీ జట్టు నెట్ బౌలర్ల బృందంలో ఎక్కువ మంది స్పిన్నర్లు ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 20 నుంచి... ఐపీఎల్ జట్లు ప్రత్యేక విమానాల్లో యూఏఈకి వెళ్లే తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. అందరికంటే ముందుగా ఈ నెల 20న రాజస్తాన్ రాయల్స్ బయల్దేరుతుంది. ఆగస్టు 21న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ వెళతాయి. తర్వాతి రోజు పంజాబ్, ఢిల్లీ జట్లు వెళ్లే అవకాశం ఉంది. ముంబై జట్టులోని కొందరు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది గత వారం రోజులుగా క్వారంటైన్ కేంద్రంలో ఉంటూ కోవిడ్ పరీక్షలకు కూడా హాజరయ్యారు. ధోనిసేన మాత్రం యూఏఈ బయల్దేరడానికి ముందు 15 మందితో చెన్నైలో స్వల్పకాలిక (ఆగస్టు 16 నుంచి 20 వరకు) శిబిరంలో పాల్గొంటుంది. కోహ్లి నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ నెల చివరి వారంలో యూఏఈ వెళుతుంది. ఆగస్టు 23 వరకు ఈ జట్టుకు చెందిన భారత ఆటగాళ్లంతా వారం రోజుల పాటు క్వారంటైన్లో గడుపుతారు. సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఇంకా తమ ప్రయాణ తేదీలు, ఇతర ఏర్పాట్లను ఇంకా ఖరారు చేసుకోలేదు. -
'దుబాయ్' భారం..!
ఎన్ని అవాంతరాలొచ్చినా ఐపీఎల్ సీజన్–13 జరగడం ఖాయమైంది. కరోనా కబళిస్తున్నా... భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నా, ఉన్నపళంగా భారీ ఆర్థిక నష్టం వాటిల్లినా లీగ్ నిర్వహణకే బీసీసీఐ మొగ్గు చూపింది. నిర్వహణపై అమితాసక్తితో ఎదురు చూసిన ఫ్రాంచైజీలకు యూఏఈలో టోర్నీ జరగడం మొత్తం ఆర్థికంగా నష్టపరిచే అంశం. వారి ఆదాయంపై పెద్ద ఎత్తున దెబ్బ పడనుంది. అయితే పూర్తిగా లీగ్ రద్దు కావడంతో పోలిస్తే ఎంతో కొంత ఆదాయం రానుండటం ఊరట కలిగించే అంశం. సాక్షి క్రీడా విభాగం: ఐదేళ్లకు ఏకంగా రూ. 2199 కోట్ల భారీ డీల్... సాలీనా రూ. 440 కోట్ల చెల్లింపులు... ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం వివో 2017లో చేసుకున్న ఒప్పందం ఇది. ఐపీఎల్ రెవిన్యూ షేరింగ్ అగ్రిమెంట్లో ఫ్రాంచైజీలకు టైటిల్ స్పాన్సర్షిప్ అనేది కీలక ఆదాయ వనరు. మొత్తం టైటిల్ స్పాన్సర్షిప్లో సగభాగం (దాదాపు 1000 కోట్లు) లీగ్లోని 8 ఫ్రాంచైజీలకు అందజేస్తారు. అంటే ఏడాదికి రూ. 20 కోట్లకు పైగానే ఫ్రాంచైజీలు ఆర్జిస్తున్నాయి. రాజకీయ కారణాలతో చైనా మూలాలున్న వివో తప్పుకోవడంతో ఆ ప్రభావం ఫ్రాంచైజీలపై పడనుంది. ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ‘వివో’ ఇచ్చే మొత్తాన్నే ఇవ్వగల కొత్త స్పాన్సర్ దొరకడం కష్టమే. మరోవైపు ప్రేక్షకులు లేకుండా మ్యాచ్లు నిర్వహిస్తుండటంతో టిక్కెట్ల విక్రయం ద్వారా లభించే గేట్ రెవెన్యూ కూడా ఫ్రాంచైజీలు కోల్పోనున్నాయి. మీడియా హక్కులే ఆలంబన... ప్రస్తుతం ఫ్రాంచైజీల్ని లీగ్ నిర్వహణ వైపు నడిపిస్తోన్న ఆదాయ వనరు మీడియా హక్కులు. ఈ హక్కుల్ని స్టార్ ఇండియా యాజమాన్యం 2017లో రికార్డు మొత్తానికి సొంతం చేసుకుంది. ఐదేళ్ల కాలానికి రూ. 16,347 కోట్లతో ఈ ఒప్పందం కుదిరింది. క్రికెట్ మీడియా హక్కుల ఒప్పందంలో చరిత్ర సృష్టించిన ఈ భారీ డీల్తో ఫ్రాంచైజీలు ఏటా రూ. 150 కోట్లు ఆర్జిస్తున్నాయి. ఈ మీడియా హక్కుల ఫలితంగా ప్రతి సీజన్కు రూ. 50 కోట్లు లాభం ఉంటుందని అంచనా. ఇతర ఆదాయ మార్గాల్లోనూ కోత! మీడియా హక్కులతో పాటు కిట్, జెర్సీ, హెల్మెట్లకు వేరు వేరు సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తుంటాయి. వీటి ద్వారా ఫ్రాంచైజీలు సీజన్కు రూ. 45–50 కోట్లు ఆర్జిస్తున్నాయి. అయితే గత సీజన్లో ఒక జట్టుకు రూ. 33 కోట్లు ఆదాయాన్ని సమకూర్చిన ఒక ప్రధాన స్పాన్సర్... ఈ సారి అంత మొత్తం ఇవ్వలేమంటూ సంప్రదింపులకు దిగింది. మిగతా జట్లకూ ఇదే అనుభవం ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. కరోనా కారణంగా ఈ సారి ఈ ఆదాయంలో కూడా గండిపడే అవకాశముంది. ఖర్చులు అదనం యూఏఈలో జరిగే టోర్నీ కోసం ఆటగాళ్ల భద్రత దృష్ట్యా చార్టెడ్ ఫ్లయిట్స్ను ఫ్రాంచైజీలు వినియోగించనున్నాయి. లీగ్ జరిగినన్ని రోజులు ఆటగాళ్ల వసతి, వారుండే హోటళ్లలో బయో సెక్యూర్ పరిస్థితుల ఏర్పాటు, రవాణా వీటన్నింటికి భారీగా ఖర్చయ్యే అవకాశముంది. వీటి కోసమే దాదాపు రూ. 10–12 కోట్లు ఖర్చయ్యే అవకాశముందని ఫ్రాంచైజీలు పేర్కొన్నాయి. భారత్లో ఖర్చుతో పోలిస్తే ఇది 50–60 శాతం అదనం. మరో వైపు టికెట్లు అమ్మకపోవడం ద్వారా తాము కోల్పోయే ‘గేట్ రెవెన్యూ’కు నష్టపరిహారం చెల్లించాలంటూ ఫ్రాంచైజీలు చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ నిర్ద్వద్వంగా తిరస్కరించింది. అదే విధంగా ఈ ఏడాది మ్యాచ్లు జరగకపోయినా దేశంలో ఎనిమిది ఐపీఎల్ జట్లకు కేంద్రాలుగా ఉన్న రాష్ట్ర సంఘాలకు ప్రతీ ఏటా ఒక్కో ఫ్రాంచైజీ చెల్లించే రూ. 8 కోట్లు (మొత్తం రూ. 64 కోట్లు) కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని దిగువ స్థాయి క్రికెట్ను ప్రోత్సహిస్తేందుకు ఉపయోగిస్తామని, ఈ డబ్బు లేకపోతే ఆయా సంఘాల్లో క్రికెట్ దెబ్బ తింటుందని బోర్డు అభిప్రాయ పడింది. -
10న ‘ఫైనల్’ చేశారు
ముంబై: గత పుష్కరకాలంగా ఐపీఎల్ నిరాటంకంగా జరుగుతోంది. దక్షిణాఫ్రికాలో జరిగినా... పుట్టింట్లో నిర్వహించినా... విజేత మాత్రం ‘సూపర్ సండే’లోనే తేలింది. కానీ ఈసారి ఆనవాయితీ మారింది. ఫైనల్ ఆదివారం కాకుండా మంగళవారం నిర్వహించనున్నారు. లీగ్ చరిత్రలో తొలిసారి ఈ మార్పు చోటుచేసుకుంది. ఆదివారం ఎక్కడివారక్కడే ఉండి వర్చువల్ పద్ధతిలో జరిగిన ఐపీఎల్ పాలకమండలి (గవర్నింగ్ కౌన్సిల్–జీసీ) సమావేశంలో ఆట కోసం మూడు వేదికల్ని, గరిష్టంగా యూఏఈకి వెళ్లే ఫ్రాంచైజీ ఆటగాళ్లను ఖరారు చేశారు. దుబాయ్, అబుదాబి, షార్జా స్టేడియాల్లో 53 రోజుల పాటు మెరుపుల టి20లు జరుగుతాయి. 24 మంది ఆటగాళ్లతో కూడిన ఫ్రాంచైజీలు అక్కడికి ఈ నెలలోనే బయల్దేరతాయి. ముందుగా అన్నట్లు నవంబర్ 8న కాకుండా నవంబర్ 10న ఫైనల్ నిర్వహిస్తారు. భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా డ్రాగన్ స్పాన్సర్షిప్పై వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ఈ సీజన్లో పాత స్పాన్సర్లనే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ‘వివో ఐపీఎల్–2020’కి సంబంధించిన కీలక నిర్ణయాలను జీసీ వెలువరించింది. యూఏఈలో ఐపీఎల్ టోర్నీ నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి అనుమతి లభించిందని ఆదివారం రాత్రి వార్తలు వచ్చినా... బీసీసీఐ మాత్రం ఇంకా అనుమతి రాలేదని... ఈ వారంలో గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశముందని తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇవీ ప్రధానాంశాలు... ► యూఏఈలో జరిగే ఐపీఎల్–13వ సీజన్ సెప్టెంబర్ 19న మొదలవుతుంది. దీపావళికి (నవంబర్ 14న) నాలుగు రోజుల ముందుగా నవంబర్ 10న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ∙మ్యాచ్ల సమయం మారింది. రాత్రి 8 గంటలకు కాకుండా అరగంట ముందుగా గం. 7.30 నుంచి మ్యాచ్లు ప్రారంభమవుతాయి. 53 రోజుల షెడ్యూల్లో 10 రోజులు మాత్రం ఒకే రోజు రెండేసి మ్యాచ్లను నిర్వహిస్తారు. ∙రెండు మ్యాచ్లు ఉన్న రోజున మాత్రం తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3.30న మొదలవుతుంది. ఐపీఎల్లో పాల్గొనే ఫ్రాంచైజీలు ఈ నెల 26 తర్వాత అక్కడికి బయలు దేరతాయి. ఒక్కో జట్టు గరిష్ట పరిమితి 24 మంది ఆటగాళ్లు. ► కరోనా మహమ్మారి దృష్ట్యా టోర్నీ మధ్యలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆ ఆటగాళ్లను సబ్స్టిట్యూట్లతో భర్తీ చేసుకునే వెసులుబాటు ఉంది. ► మొదట ప్రేక్షకుల్లేకుండానే పోటీలు జరుగుతాయి. కొన్ని మ్యాచ్లు జరిగాక అక్కడి స్థానిక ప్రభుత్వ ఆమోదం లభిస్తే కొంతమందికి ప్రవేశం కల్పిస్తారు. ► భారత స్టార్ ఆటగాళ్లయినా... విదేశీ ప్లేయర్లయినా... అందరూ చార్టెడ్ విమానాల్లోనే యూఏఈకి చేరుకోవాలి. ► నిష్ణాతుల ఆధ్వర్యంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) రూపొందిస్తారు. జీవరక్షణ వలయం (రక్షిత బుడగ) ఏర్పాటు కోసం టాటా గ్రూప్తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ► యూఏఈ హాస్పిటళ్లకు చెందిన స్పెషాలిటీ డాక్టర్లతో కూడిన ఉన్నతస్థాయి వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. ► ఐపీఎల్ స్పాన్సర్లు యథాతథంగా 2020 సీజన్లోనూ కొనసాగుతారు. ► గత ఐపీఎల్ సమయంలో నిర్వహించినట్లుగా ఈసారీ టోర్నీ చివరి దశలో మహిళల టి20 చాలెంజ్ టోర్నీని నిర్వహిస్తారు. యూఏఈలోనే ఈ టోర్నీ జరుగుతుంది. మూడు మహిళల జట్ల మధ్య నాలుగు మ్యాచ్లు (మూడు లీగ్ మ్యాచ్లు, ఒక ఫైనల్) ఉంటాయి. -
అన్నీ చర్చిస్తారా... అంతా చెప్పేస్తారా!
ఇప్పటికే ఈ ఏడాది ఆలస్యమైన ఐపీఎల్ ముందుకు వెళ్లేందుకు రెండు అడుగులు పడ్డాయి. మొదటిది వేదిక. రెండోది షెడ్యూల్. ఇక ఆఖరి అడుగే మిగిలుంది. అదే విధి విధానాలు. ఎందుకంటే ఇన్నాళ్లు భారత్లో జరిగాయి. ఇంటాబయటా పోటీలుండేవి. కానీ ఇది కరోనా కాలం. జరిగేది యూఏఈ వేదికపై! దీంతో పెద్ద కసరత్తే అవసరమైంది. అందుకే నేడు జరిగే పాలకమండలి (గవర్నింగ్ కౌన్సిల్–జీసీ) సమావేశం అత్యంత కీలకమైంది. ఆదివారమే అన్నీ చర్చిస్తారు. అనంతరం అంతా చెప్పేస్తారు. అక్కడికి వెళ్లిన దగ్గరి నుంచి తిరిగి స్వదేశం చేరేదాకా చేయాల్సినవి... చేయకూడనివి అన్నీ కూలంకశంగా చర్చిస్తారు. ఒక్కో ఫ్రాంచైజీలో వెళ్లే ఆటగాళ్ల సంఖ్య, ఆడే మ్యాచ్లు... ఉండే పరిమితులు, ఏర్పాటు చేసే బుడగ, దాటితే వచ్చే సమస్యలు ఇలా ఒకటి రెండు కాదు... అన్నింటికీ సమాధానాలు ఈ సమావేశంలోనే వెల్లడవుతాయి. ముందు కావాల్సింది... ఆమోదం కరోనా వాయిదా వేసినా... వరల్డ్కప్తో కలిసొచ్చిన కాలంతో ఐపీఎల్కు రంగం సిద్ధమవుతోంది. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చకచకా పనులు చక్కబెడుతున్నప్పటికీ భారత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కావాల్సిందే. యూఏఈలో నిర్వహించేందుకు, అక్కడికి భారత ఆటగాళ్లను, సిబ్బందిని చార్టెడ్ ఫ్లయిట్లలో తరలించేందుకు సర్కారు అనుమతి కావాలి. ఇప్పటికైతే కేంద్రం స్పందించలేదు. అయితే కరోనా ప్రొటోకాల్ పాటిస్తే ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత ఉండదు. అందుకే ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ కేంద్ర ప్రభుత్వం ఆమోదం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నేడు జరిగే సమావేశంలో బోర్డు అధ్యక్ష, కార్యదర్శులు సౌరవ్ గంగూలీ, జై షాలతో పాటు కోశాధికారి అరుణ్ ధుమాల్, ఐపీఎల్ జీసీ సభ్యులు, ఫ్రాంచైజీ యజమానులు పాల్గొంటారు. విదేశాల్లో కొత్త కాకపోయినా... ఐపీఎల్ విదేశీ గడ్డపై జరగడం ఇదే తొలిసారి కాదు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండుసార్లు (2009లో పూర్తిగా దక్షిణాఫ్రికాలో, 2014లో మరోసారి పాక్షికంగా యూఏఈలో) ఐపీఎల్ మ్యాచ్లు దేశం బయట జరిగాయి. అలాగని ఇది కూడా అంత సులభమే అనుకుంటే పొరపాటు. ఆ టోర్నీలకు ఇప్పటి టోర్నీకి చాలా తేడా. ఆటగాళ్లు, సిబ్బంది రక్షణే కత్తిమీద సాములా తయారైంది. అయితే ఇంగ్లండ్లో సాఫీగా జరిగిన విండీస్ పర్యటనతో ఎనిమిది ఫ్రాంచైజీలు ఆడే ఐపీఎల్ను పోల్చలేం. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ)లోని నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి. ఈ మీటింగ్ అనంతరం ఫ్రాంచైజీలకు ఎస్ఓపీ బుక్లెట్ను అందజేస్తారు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ దరిచేరకుండా ఏర్పాటు చేసే జీవ రక్షణ వలయంపై చర్చిస్తారు. ఈ బుడగలో ఉంటే సరి... మరి గాయంతోగానీ, పొరపాటుగా కానీ బుడగ దాటితే ఎదురయ్యే పరిణామాలేంటి అనే అంశాలే అన్ని ఫ్రాంచైజీలను వేధిస్తున్నాయి. డివిలియర్స్ కష్టమేనా... దక్షిణాఫ్రికాలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సఫారీ ప్లేయర్లు ఈ సీజన్లో ఆడే అవకాశాలు క్లిష్టమవుతున్నాయి. దీంతో ‘మిస్టర్ 360’ డివిలియర్స్ మెరుపులు ఉండవేమో! అలాగే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, విండీస్ ఆటగాళ్లు తొలి రౌండ్ పోటీలకు అందుబాటులో ఉండరు. ద్వైపాక్షిక సిరీస్లతో బిజీగా ఉండటం వల్లే సెప్టెంబర్లో జరిగే పోటీల్లో ఆడకపోవచ్చు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ వల్ల విండీస్ ఆటగాళ్లు ఆలస్యంగా ఐపీఎల్ ఆడేందుకు వస్తారు. ఆటగాళ్ల వెంట భార్యలను, గర్ల్ఫ్రెండ్స్ను అనుమతించే అంశంపైనే పాలక మండలి తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇది ఒక్కో జట్టులోని గరిష్ట పరిమితికి లోబడి ఉండొచ్చని బోర్డు వర్గాలు తెలిపాయి. -
ప్రేక్షకుల్ని అనుమతిస్తాం!
దుబాయ్: తమ దేశంలో జరిగే ఐపీఎల్–13 మ్యాచ్లు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతిస్తామని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది. ప్రభుత్వ ఆమోదం లభిస్తే... సీటింగ్ సామర్థ్యంలో 30 నుంచి 50 శాతం వరకు ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉందని ఈసీబీ కార్యదర్శి ముబాషిర్ ఉస్మాని చెప్పారు. ఐపీఎల్ తుది షెడ్యూల్ ఖరారు చేశాక లీగ్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ మాట్లాడుతూ... ప్రేక్షకులను అనుమతించే విషయం పూర్తిగా యూఏఈ ప్రభుత్వం, ఈసీబీ పరిధిలోనే ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం బీసీసీఐ... భారత ప్రభుత్వ అమోదం కోసం ఎదురుచూస్తోంది. భారత్ నుంచి అధికారిక ఆమోదం లభించిన వెంటనే యూఏఈ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని ముబాషిర్ తెలిపారు. తమ దేశంలో పూర్తిస్థాయిలో జరిగే ఐపీఎల్లో కచ్చితంగా ప్రేక్షకులు ఉండాలనే కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే పూర్తి సామర్థ్యం ఉండదని 30 నుంచి 50 శాతం మేర అనుమతిస్తామని, దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని ఆయన వెల్లడించారు. యూఏఈ లో కరోనా నియంత్రణలోనే ఉంది. ప్రస్తుతం 6000 కేసులే ఉన్నాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు జరుగుతాయి. -
ఏమిటి.. ఎలా.. ఎందుకు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2020 ప్రకటన ఇప్పటికే వచ్చేసింది... సెప్టెంబర్ 19నుంచి యూఏఈ వేదికగా టోర్నీ జరగడం ఖాయమైంది. ప్రధానంగా టీవీ ద్వారానే వినోదాన్ని పొందే సగటు క్రికెట్ అభిమానికి ఇది ఒక సంబరంలాంటిదే. ఫోర్లు, సిక్సర్ల హోరు... విధ్వంసకర బ్యాటింగ్ గురించి ఇకపై ఎంత చర్చించినా తక్కువే. అయితే అభిమానులకు సంబంధం లేని మరో అంశం ఇప్పుడు ఐపీఎల్ విషయంలో కీలకంగా మారింది. అసలు మైదానంలో దిగే ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉండబోతోంది...ఫ్రాంచైజీలు ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి...కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లీగ్ విజయవంతంగా పూర్తవుతుంది... ఇలాంటి సందేహాలన్నీ నిర్వాహకులు తీర్చాల్సి ఉంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ఖరారు చేసేందుకు బోర్డు ఆదివారం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణలో ఎదురు కానున్న సవాళ్లు ఏమిటి? వీటికి బీసీసీఐ సమావేశంలో సమాధానం లభిస్తుందా అనేది చూడాలి. పాజిటివ్గా తేలితే... ఐపీఎల్లోని ఎనిమిది జట్ల ఆటగాళ్లను బయో సెక్యూర్ బబుల్లో ఉంచడంలో ఫ్రాంచైజీలదే బాధ్యత కానుంది. టోర్నీకి కొద్ది రోజుల ముందునుంచీ వీరందరినీ క్వారంటీన్లో ఉంచుతారా అనేదానిపై స్పష్టత లేదు. ఒక వేళ టోర్నీ జరిగే సమయంలో ఎవరైనా ఒక ఆటగాడు ‘పాజిటివ్’గా తేలితే అప్పుడేం చేయాలని ఫ్రాంచైజీలు మరింత సమాచారం కోరుతున్నాయి. సదరు ఆటగాడి జట్టులోని సహచరులందరినీ మళ్లీ పరీక్షిస్తారా...అదే హోటల్లో మరో జట్టు ఉంటే జట్టు మొత్తాన్ని ఐసోలేట్ చేస్తారా తెలియదు. ఆ జట్టు తర్వాతి రోజు మ్యాచ్ ఆడాల్సి ఉంటే దానిని రద్దు చేస్తారా లేక వాయిదా వేస్తారా చూడాలి. ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ తరహాలో ఎవరైనా ‘బబుల్’ దాటి బయటకు వస్తే అప్పుడేం చేయాలనేది తెలియాలి. ఐపీఎల్ ఆడేవారికి ఎన్ని రోజులకు ఒకసారి టెస్టులు నిర్వహిస్తాలో కూడా నిర్ణయించాల్సి ఉంది. కొన్ని జట్లలోని ప్రధాన ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను కూడా తీసుకొస్తామని ఇప్పటికే ఫ్రాంచైజీలకు చెప్పేశారు. దీనిపై మరింత స్పష్టత అవసరం. అదనపు ఆటగాళ్లు ఎలా... కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఐపీఎల్లో ఆడటంపై సందేహాలు రేకెత్తుతున్నాయి. అదే జరిగితే వారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు ఎలా తీసుకోవాలనే విషయంపై బోర్డుకు స్పష్టత లేదు. ముఖ్యంగా బెంగళూరు జట్టులో గరిష్టంగా 21 మంది మాత్రమే ఉండగా...వారిలో ముగ్గురు సఫారీ ఆటగాళ్లు ఉన్నారు. ఇదే కాకుండా టోర్నీ మధ్యలో ఎవరికైనా గాయమైతే అప్పటికప్పుడు మరో ఆటగాడిని తీసుకునేవారు. ఇప్పుడు అలా చేయాలంటే మళ్లీ అతనికి కోవిడ్ పరీక్షలు, క్వారంటీన్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి. అలా కాకుండా ముందే సన్నద్ధమై పెద్ద సంఖ్యలో జట్టును తీసుకెళ్లే అవకాశం ఇస్తారా చూడాలి. యూఏఈ చేరడం, వసతి... తమ ఆటగాళ్లకు కనీసం మూడు వారాల ప్రాక్టీస్ ఉండాలంటూ, ఇందు కోసం ఆగస్టు 20 వరకే యూఏఈ వెళతామంటూ కొన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐకి సమాచారం అందించాయి. భారత క్రికెటర్లతో పాటు తమ జట్టులోని విదేశీ ఆటగాళ్లకు కూడా ఒకే చోటికి చేరేలా చేయడం కూడా జట్టు యాజమాన్యాలదే బాధ్యత. మ్యాచ్లు మూడు నగరాల్లో ఉన్నా...సౌకర్యాలను బట్టి చూస్తే దుబాయ్లో ఉండటాన్నే అన్ని జట్లు ఇష్టపడుతున్నాయి. కొందరు ఇప్పటికే హోటళ్ల ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే అవే హోటళ్లకు వచ్చే పర్యాటకులు, ఇతర అతిథుల విషయంపై వారూ కొంత ఆందోళనగానే ఉన్నారు. కనీసం 80 రోజులు ఉండాల్సి రావడంతో అన్ని రోజులు హోటళ్లలో సోషల్ డిస్టెన్సింగ్తో కొనసాగడం అంత సులువు కాదు. బయటివారిని అనుమతిస్తారా... ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రధానంగా యూఏఈ దేశపు నిబంధనలను పరిగణలోకి తీసుకుంటూ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్–విండీస్ టెస్టు సిరీస్ తరహాలో క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బంది, హోటల్, భద్రతా సిబ్బంది అంతా కరోనా టెస్టులు నెగిటివ్గా తేలిన తర్వాత బయో బబుల్లోకి వచ్చారు. సిరీస్ ముగిసే వరకు అంతా ఒకే చోట ఉన్నారు. ఇప్పుడు ఐపీఎల్లో ఎనిమిది జట్లతో పాటు ఇతరులంతా సుదీర్ఘ కాలం ఇలా ఉండటం సాధ్యమేనా. ఇంగ్లండ్ సిరీస్లో ఆటగాళ్లను తీసుకువెళ్లే బస్సు డ్రైవర్ కూడా వరుసగా కోవిడ్ పరీక్షలకు హాజరు కావాలని నిబంధన పెట్టడంతోనే ఎవరూ ముందుకు రాలేదని తెలిసింది. అందువల్లే సౌతాంప్టన్ నుంచి మాంచెస్టర్ వరకు వారంతా సొంత కార్లలో ప్రయాణించగా ఆర్చర్ మధ్యలో ఇంటికి వెళ్లిన ఘటన మరచిపోవద్దు! -
ప్రభుత్వ నిర్ణయమే తరువాయి!
దుబాయ్: ఐపీఎల్–13ను యూఏఈలో నిర్వహించడానికి రంగం సిద్ధమవుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పంపిన అంగీకార పత్రం తమకు అందిందని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) జనరల్ సెక్రటరీ ముబాషిర్ ఉస్మాని సోమవారం వెల్లడించారు. ఇక లీగ్ నిర్వహణకు భారత ప్రభుత్వ ఆమోదమే మిగిలి ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా విజృంభణతో ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ టోర్నీ వాయిదా పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్లో లీగ్ నిర్వహించడం కష్టంగా మారింది. దీంతో తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ముందుకు రావడంతో... అందుకు బీసీసీఐ అంగీకరించింది. తాజాగా దానికి సంబంధించిన ‘అంగీకార పత్రాన్ని’ ఈసీబీకి మెయిల్ ద్వారా బీసీసీఐ పంపింది. 13వ సీజన్ పోటీలు సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో జరుగుతాయని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్æ పటేల్ ఇదివరకే ప్రకటించారు. అందుకోసం అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికలను ఎంపిక చేశారు. -
ఇంతకీ ఏం చేద్దాం?
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఆటకు యూఏఈలో ఏర్పాట్లు జరుగుతుండగా... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇక్కడ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)పై సమాలోచనలు చేస్తోంది. ఆటగాళ్ల రక్షణ కోసం ఏర్పాటు చేయబోయే జీవ భద్రత వలయంపై ప్రత్యేకంగా దృష్టిసారించిన బోర్డును అసలు కంటే కొసరు సమస్యే కాస్త తికమక పెడుతున్నట్లుంది. ఆటగాళ్ల సతీమణులు, ప్రియురాళ్లను బుడగలోకి తీసుకురావాలా లేదంటే ఇప్పుడున్న కరోనా ప్రొటోకాల్ పరిస్థితుల్లో అనుమతి నిరాకరించాలా అన్న అంశంపై బోర్డు తర్జనభర్జన పడుతోంది. దీనిపై ఫ్రాంచైజీల నుంచి భిన్నవాదనలు వచ్చినట్లు తెలిసింది. కొన్ని ఫ్రాంచైజీలేమో అసలే బయటి ప్రపంచంతో సంబంధం లేనట్లుగా గప్చుప్గా (ప్రేక్షకుల్లేకుండా) జరిగే ఈవెంట్ కాబట్టి... ఆటగాళ్లతో కనీసం కుటుంబసభ్యుల్ని అనుమతించాలని సూచిస్తున్నాయి. ఇతర ఫ్రాంచైజీలేమో వారిని బుడగలోకి తెస్తే... రెండు, మూడేళ్లున్న పిల్లల సంరక్షణ ఎలా? షాపింగ్కని, వేరే చోటుకని బుడగదాటితే ఎదురయ్యే పరిణామాలేంటని వారిస్తున్నాయి. దీనిపై త్వరలోనే బోర్డు నిర్ణయం తీసుకొని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను ఎనిమిది ఫ్రాంచైజీలకు జారీచేయనుంది. -
క్రికెటర్లకు రోజూ కరోనా పరీక్షలు నిర్వహించాలి
న్యూఢిల్లీ: యూఏఈలో ఐపీఎల్ సజావుగా జరిపేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉండాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని నెస్ వాడియా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆటగాళ్లకు ప్రతీ రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. సెప్టెంబర్ 19 నుంచి అరబ్ ఎమిరేట్స్లో లీగ్ను నిర్వహించాలని భారత బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో నెస్ వాడియా ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఐపీఎల్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ని బీసీసీఐ తయారు చేయనుంది. ‘ఐపీఎల్ జరిగే సమయంలో మైదానంలోనూ, మైదానం బయట కూడా కచ్చితమైన ఆరోగ్య పరిరక్షణ నిబంధనలు పాటించాలి. ఇందులో ఏమాత్రం రాజీ పడరాదు. సాధ్యమైనంత ఎక్కువగా కరోనా పరీక్షలు జరపాలి. సరిగ్గా చెప్పాలంటే ప్రతి రోజూ నిర్వహిస్తే మంచిది. నేనే ఆటగాడినైతే ఎలాంటి అభ్యంతరం చెప్పను. లీగ్లో ఎనిమిది జట్లు ఉంటాయి కాబట్టి ఇంగ్లండ్లో జరుగుతున్న టెస్టు సిరీస్ తరహాలోనైతే బయో సెక్యూర్ వాతావరణం సాధ్యం కాదు. కోవిడ్–19 పరీక్షల విషయంలో యూఏఈ కూడా చాలా బాగా పని చేస్తోంది కాబట్టి బీసీసీఐ అక్కడి ప్రభుత్వానికి సహకరిస్తే చాలు’ అని నెస్ వాడియా వివరించారు. టీవీలో సూపర్ హిట్టవుతుంది... కరోనా కష్టకాలంలో ఐపీఎల్కు స్పాన్సర్లు రాకపోవచ్చనే వాదనను నెస్ వాడియా తిరస్కరించారు. నిజానికి స్పాన్సర్లు అదనపు ప్రయోజనం పొందేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాదని ఆయన అన్నారు. ‘గతంలో ఏ ఐపీఎల్కూ లభించని వీక్షకాదరణ టీవీల్లో ఈసారి లీగ్కు దక్కనుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జనం మ్యాచ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రకంగా స్పాన్సర్లు ముందుకొచ్చేందుకు ఇది సరైన తరుణం’ అని పంజాబ్ యజమాని పేర్కొన్నారు. మరోవైపు ప్రేక్షకులు లేకుండా లీగ్ను ఆడిస్తే తాము టికెట్ల రూపేణా కోల్పోయే నష్టాన్ని బీసీసీఐ ఏదో రూపంలో భర్తీ చేస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
చలో దుబాయ్@ ఐపీఎల్-2020
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరోసారి అరబ్ దేశం చేరింది. దేశంలో కరోనా విజృంభిస్తున్నా సరే... ఎలాగైనా ఐపీఎల్ ఆదాయాన్ని కోల్పోకూడదని పట్టుదలగా ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సరైన వేదికగా కనిపించింది. దాంతో అక్కడే టోర్నీ నిర్వహణకు పచ్చ జెండా ఊపింది. తమ వద్ద లీగ్ నిర్వహించుకోవచ్చంటూ గతంలోనే యూఏఈ ఇచ్చిన ప్రతిపాదనకు భారత బోర్డు సరే అని చెప్పింది. ఇప్పుడు దీనిని గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ కూడా ఖరారు చేశారు. ఇక లీగ్ తేదీలు ప్రకటించడమే తరువాయి. ప్రత్యక్షంగా మ్యాచ్లు చూడలేకపోతున్నా... టీవీ ద్వారా అయినా ఐపీఎల్ వినోదం దక్కనుండటం సగటు క్రికెట్ అభిమానికి సంతోషం. ముంబై: ఐపీఎల్–2020ని యూఏఈలో నిర్వహించడం ఖాయమైంది. టోర్నీ మొత్తం అక్కడే జరపనున్నట్లు లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్, భారత మాజీ క్రికెటర్ బ్రిజేశ్ పటేల్ ప్రకటించారు. వచ్చే వారం జరిగే మరో సమావేశంలో తుది షెడ్యూల్తోపాటు ఇతర వివరాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. టి20 ప్రపంచకప్ వాయిదా కోసం ఎదురుచూస్తూ వచ్చిన బీసీసీఐ ఇప్పుడు ఆ ప్రకటన రాగానే లీగ్ కార్యాచరణకు సిద్ధమైంది. కోవిడ్–19 కారణంగా పలు ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉందని పటేల్ చెప్పారు. షెడ్యూల్ ఎప్పుడంటే... ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 7 వరకు టోర్నీ జరిగే అవకాశం కనిపిస్తోంది. లీగ్ తర్వాత కొద్ది రోజులకే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సిన ఉన్న కారణంగా ఆటగాళ్లకు తగినంత విరామం ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. ప్రత్యేక విమానాల్లో... కోవిడ్–19కు సంబంధించి మన దేశంలో పలు ఆంక్షలు కొనసాగుతున్నాయి. లీగ్ విదేశంలో జరిపినా భారత ప్రభుత్వం నుంచి అనుమతి కావాలి. పైగా విదేశీ ప్రయాణాలపై కూడా నిషేధం ఉంది. దీనిపై ఇప్పటికే బీసీసీఐ అనుమతి కోరింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తనయుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా ఉండటంతో ఇది లాంఛనమే కావచ్చు. భారత క్రికెటర్లు ప్రత్యేక విమానాల్లో వెళితే... విదేశీ ఆటగాళ్లు నేరుగా యూఏఈ చేరుకుంటారు. యూఏఈ ప్రభుత్వ అనుమతి? అక్కడి ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. బీసీసీఐ ఇప్పుడు తమ తరఫు నుంచి స్పష్టతనిచ్చిన తర్వాత నిర్ణయం రావచ్చు. అయితే గతంలో యూఏఈ బోర్డు ఐపీఎల్ను తమ వద్ద నిర్వహించమని స్వయంగా విజ్ఞప్తి చేసింది కాబట్టి ఈ విషయంలో సమస్య ఉండకపోవచ్చని భారత బోర్డు భావిస్తోంది. ఇప్పటికే యూఏఈ అనుమతి కోసం బోర్డు దరఖాస్తు చేసింది. ప్రేక్షకులకు ప్రవేశముందా? ఇది కూడా యూఏఈ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మంగళవారం నాటికి యూఏఈలో సుమారు 57 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కోలుకున్నవారి సంఖ్య కూడా 49 వేలు ఉండటం విశేషం. కాబట్టి అక్కడ కరోనా మహమ్మారి తీవ్రత తక్కువే. అయితే బీసీసీఐ మాత్రం ప్రేక్షకుల విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీవీ, వెబ్ ప్రసారాల ఆదాయమే లక్ష్యంగా ఖాళీ మైదానాల్లోనైనా నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం టికెట్ల ద్వారా వచ్చే ‘గేట్ రెవెన్యూ’ కోల్పోయినా నష్టం లేదని బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. మ్యాచ్ల వేదికలు, ఏర్పాట్లు... దుబాయ్, అబుదాబి, షార్జా వేదికలుగా టోర్నీ జరుగుతుంది. మన దేశంలో 2014లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సమయంలో ఐపీఎల్ తొలి భాగం (20 మ్యాచ్లు) ఇక్కడే జరిగాయి. అన్ని వసతులున్న అత్యాధునిక స్టేడియాలు ఉండటంతో పాటు గతానుభవంతో బీసీసీఐకి ఇక్కడ నిర్వహణ కష్టం కాకపోవచ్చు. లీగ్కు కుదించకుండా పూర్తి స్థాయిలో 60 మ్యాచ్లు జరుపుతామని బ్రిజేశ్ పటేల్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను పాటించాల్సి ఉంటుంది. ఐసీసీ మార్గనిర్దేశకాలు పరిగణలోకి తీసుకొని టోర్నీ జరపాలి. బయో–బబుల్ సెక్యూరిటీలో నిర్వహణ దాదాపు అసాధ్యం. క్వారంటైన్ విషయంలో యూఏఈ ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందే. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఐపీఎల్ జట్లు కనీసం నెల రోజుల ముందుగా ఆ దేశంలో మకాం వేయాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటినవారు (సునీల్ గావస్కర్ తదితరులు) తమ ఇంటినుంచే కామెంటరీ చేసే అవకాశం ఉందో పరిశీలిస్తున్నారు. -
యూఏఈనే ప్రత్యామ్నాయం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నత స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. ఐపీఎలే అజెండాగా చర్చించింది. కానీ... అచ్చూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లాగే ప్రపంచకప్పై ఏ నిర్ణయం తీసుకోనట్లే... లీగ్పై కూడా మన బోర్డు స్పష్టమైన నిర్ణయమేదీ తీసుకోలేదు. అయితే బోర్డు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... దేశంలో మిలియన్ కరోనా బాధితులు (10 లక్షలు) దాటిన నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్ పుట్టింట్లో జరిగే అవకాశాలైతే లేవు. అందుకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోనే లీగ్ మెరుపులు సాధ్యమవుతాయి. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో యూఏఈనే సరైన ప్రత్యామ్నాయమని బోర్డు పెద్దలు అభిప్రాయపడ్డారు. ఇక భారత జట్టు కసరత్తు కోసం మూడు వేదికల్ని పరిశీలించారు. మార్చి నుంచి అసలు మైదానంలోకి దిగని టీమిండియాకు నిర్వహించే శిబిరం కోసం దుబాయ్తో పాటు అహ్మదాబాద్, ధర్మశాల వేదికలపై చర్చ జరిగింది. ఒకవేళ ఐపీఎల్ గనక యూఏఈలో జరిగితే కోహ్లి సేనకు దుబాయ్లో శిబిరం అనివార్యమని బోర్డువర్గాలు తెలిపాయి. -
ప్రత్యేక విమానం.. బోనస్.. గ్రేట్ సర్!
‘‘కష్టసుఖాల్లో నాకు తోడున్న ఉద్యోగులను కాపాడుకోవడం నా బాధ్యత. నా విజయవంతమైన ప్రయాణంలో భాగస్వామ్యమైన వారికి ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పుకొనే అవకాశం లభించింది. మా సంస్థలో పనిచేసే వాళ్లు కూడా మా కుటుంబ సభ్యులే. నిజానికి వాళ్లు బాగుంటేనే సంస్థ బాగుంటుంది. వారు కష్టాల్లో ఉంటే నేనెలా చూస్తూ ఊరుకోగలను. నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను అంతే’’ అంటూ ఆర్. హరికుమార్ అనే వ్యాపారవేత్త పెద్ద మనసు చాటుకున్నారు. లాక్డౌన్ కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో చిక్కుకుపోయిన తన కంపెనీ ఉద్యోగులను ప్రత్యేక విమానంలో భారత్కు పంపించారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లాలనుకున్న వారి ఆకాంక్షను నెరవేర్చారు. (పాక్లో భారత అధికారులు మిస్సింగ్) అంతేకాదు నెల జీతం బోనస్గా ఇవ్వడంతో పాటుగా వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక బహుమతులు కూడా పంపించారు. అదే విధంగా తిరిగి యూఏఈకి వెళ్లేందుకు ఇష్టపడని వాళ్లు తమిళనాడులోని కోయంబత్తూరులో గల ప్లాంట్లో పనిచేసే వీలు కల్పించారు. సంస్థ కోసం శ్రమంచిన తమ కష్టాన్ని గుర్తించి.. వారికి అండగా నిలబడిన హరికుమార్పై ఉద్యోగులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాలు.. కేరళలోని అలప్పుళకు చెందిన హరికుమార్ థియేటర్ ఆర్టిస్టు. 20 ఏళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన ఆయన.. తదనంతర కాలంలో గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగారు. (పిల్ల బంట్లు.. న్యాయపోరాటం) ఈ క్రమంలో భవన నిర్మాణరంగం, ఇతర రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను సొంత మనుషుల్లా భావించే కుమార్.. యూఏఈలో ఉండిపోయిన 120 మంది ఉద్యోగులను కొచ్చి పంపేందుకు ప్రత్యేక విమానం బుక్ చేశారు. కేవలం వారే కాకుండా భారత్కు వెళ్లేందుకు టికెట్లు దొరక్క కష్టాలుపడుతున్న మరో 50 మంది ప్రవాస భారతీయుల కోసం కూడా టికెట్లు కొన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 170 మందితో షార్జా నుంచి బయల్దేరిన విమానం ఆదివారం రాత్రి కొచ్చి ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యింది. -
కరోనా: బుర్జ్ ఖలీఫా..12 లక్షల భోజనాలు!
దుబాయ్ : దుబాయ్లో ఉన్న ప్రపంచంలోనే ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీఫా నిర్వాహకులు వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టారు. కరోనా వల్ల ఇబ్బందులు పడే పేద ప్రజలను ఆదుకునేందుకు విరాళాల సేకరణ ప్రారంభించారు. ఈ ప్రక్రియలో భాగంగా దాతలెవరైనా 10 దిర్హామ్ల విరాళం(ఒక భోజనానికి అయ్యే ఖర్చు) అందిస్తే బుర్జ్ ఖలీఫా భవనం ముందు భాగంలో ఒక లైటు వెలిగించేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటి వరకు మొత్తం 12 లక్షల మంది విరాళాలు అందించడంతో 1.2 మిలియన్ల లైట్లు అమ్ముడుపోయాయని నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా 12 లక్షల లైట్లను వెలిగించి దాతల్లో స్పూర్తి నింపారు. (ఒక్కరోజులో 3,525 కేసులు ) కాగా రంజాన్ సందర్భంగా ఎంబీఆర్జీఐ(ఆర్గనైజింగ్ బాడీ ద మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్) ద్వారా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు దాదాపు 10 మిలియన్ల భోజనానికి సరిపడే నిధులు సమకూర్చేందుకు ఈ విరాళ సేకరణ ప్రక్రియ చేపట్టినట్లు దుబాయ్ పాలకుడు, యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. ఇక కరోనా కారణంగా దుబాయి ఆర్థిక పరిస్థితి విపరీతంగా దెబ్బతింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాలు, పర్యాటక ప్రాంతాలు, వ్యాపారాలు పూర్తిగా కుప్పకూలిపోయాయి. యూఏఈలో ఇప్పటి వరకు 19,881 కరోనా కేసులు నమోదవ్వగా 203 మంది ప్రాణాలు కోల్పోయారు. (పట్టాలెక్కిన రైళ్లు.. ప్రయాణానికి రెడీనా! ) -
గల్ఫ్ కార్మికులకు శుభవార్త..
మోర్తాడ్ (బాల్కొండ): కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల కారణంగా సొంతూళ్లకు వెళ్లిపోవాలనుకుంటున్న వలస కార్మికులకు కువైట్ మినహా అన్ని గల్ఫ్ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలు శుభవార్తను అందించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా, ఒమన్, బహ్రెయిన్, ఖతర్ తదితర దేశాలలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్డౌన్ అమలవుతోంది. దీంతో అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఉద్యోగాలు కోల్పోయిన వేలాదిమంది భారత కార్మికులు తమను స్వదేశానికి రప్పించేలా చూడాలని కోరడంతో గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు వారిని ఆదుకోవడానికి చర్యలు చేపట్టాయి. ఇంటికి చేరుకోవాలనుకునే భారతీయ కార్మికులు మన విదేశాంగ శాఖ వెబ్పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాయబార కార్యాలయాలు తెలిపాయి. -
కరోనా: మీ పౌరులను తీసుకువెళ్లండి.. లేదంటే..
అబుదాబి: కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్న తరుణంలో తమ దేశంలో చిక్కుకుపోయిన పౌరులను స్వదేశాలకు తీసువెళ్లని దేశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హెచ్చరించింది. వర్క్ వీసాలపై ఆంక్షలు కఠినతరం చేస్తామని పేర్కొంది. ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా తమ దేశంలో చిక్కుకుపోయిన ఇతర దేశాల పౌరులకు కరోనా నిరార్ధరణ పరీక్షల్లో నెగటివ్ ఫలితం వస్తే స్వదేశాలకు పంపిస్తామని యూఏఈ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. అన్ని దేశాల రాయబార కార్యాలయాలకు ఈ మేరకు సమాచారం అందించింది. అయితే ఇప్పటి వరకు చాలా దేశాలు ఇందుకు స్పందించకపోవడంతో వర్క్ వీసాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేసింది.(కుప్పలుగా శవాలు.. అక్కడే ఎందుకు ఎక్కువ మరణాలు? ) కాగా దాదాపు 90 లక్షల జనాభా కలిగిన యూఏఈలో చాలా మంది పొట్టికూటి కోసం వచ్చిన వారే ఉన్నారు. ఇక ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న తరుణంలో కరోనా నెగటివ్గా తేలి... స్వదేశాలకు వెళ్లాలని భావిస్తున్న వారిని తమ దేశాలకు పంపుతామని రెండు వారాల క్రితం యూఏఈ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు 25 వేల మంది పాకిస్తానీలు దుబాయ్, అబుదాబిలో చిక్కుకుపోయారని పాకిస్తాన్ యూఏఈ రాయబారి గులాం దస్తగిర్ గల్ఫ్ న్యూస్కు వెల్లడించారు. వారిని స్వదేశానికి తరలించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే మిగతా దేశాల నుంచి సరైన స్పందన రాకపోవడంతో యూఏఈ తాజాగా ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఇక కరోనా ధాటికి ఇప్పటివరకు యూఏఈలో 20 మంది మరణించగా.. 3736 మంది దీని బారిన పడ్డారు. కరోనా వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా మాల్స్, రెస్టారెంట్లు మూసివేసింది. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించింది.(కరోనా: భారత్ నుంచి 444 మంది స్వదేశాలకు) భారత్ నుంచి 1300 మంది వెనక్కి: అమెరికా -
ప్రియురాలిని హత్యచేసి.. శవంతో ప్రయాణం
దుబాయ్: ప్రియురాలి మీద అనుమానంతో దారుణానికి తెగబడ్డాడో యువకుడు. ఆమెను హత్య చేసి ఏకంగా 45 నిమిషాల పాటు శవంతో ప్రయాణించాడు. ఆఖరికి పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. చేసిన నేరానికి త్వరలోనే శిక్ష అనుభవించబోతున్నాడు. గత జూలైలో దుబాయ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానిక కోర్టు ఆదివారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలు న్యాయస్థానానికి వెల్లడించారు. ఈ మేరకు... భారత్కు చెందిన 27 ఏళ్ల యువకుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో భారత్కే చెందిన యువతితో అతడు ప్రేమలో పడ్డాడు. కొన్ని రోజులపాటు సజావుగా సాగిన వీరి బంధంలో అనుమానం చిచ్చు పెట్టింది. తనను కాదని ప్రియురాలు మరో వ్యక్తితో మాట్లాడుతోందని భావించిన సదరు యువకుడు.. తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో కారులో తనను తీసుకువెళ్లి... నచ్చచెప్పేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం ముదిరి... చివరకు వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియురాలి గొంతు కోశాడు. కారు ముందు సీట్లో తన శవాన్ని పెట్టుకుని దాదాపు 45 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఓ హోటల్లో ఆగి భోజనం చేశాడు. అనంతరం డైరాలోని పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో కేసు ఆదివారం విచారణకు వచ్చింది. ఈ విషయం గురించి పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘రక్తం నిండిన దుస్తులతో అతడు పోలీసు స్టేషనులో అడుగుపెట్టగానే నేను షాకయ్యాను. వణుకుతున్న గొంతుతో తన గర్ల్ఫ్రెండ్ను చంపేశానని చెప్పాడు. బాధితురాలి మృతదేహం అతడి కారు ముందు సీట్లోనే ఉంది. గొంతు కోసిన ఆనవాళ్లు కనిపించాయి. వెనుక సీట్లో పెద్ద కత్తిని మేం స్వాధీనం చేసుకున్నాం. తనను మోసం చేసిందనే అనుమానంతో ఈ ఘటనకు పాల్పడ్డట్లు నిందితుడు అంగీకరించాడు’’ అని కోర్టుకు తెలిపారు. అదేవిధంగా బాధితురాలి హత్యకు ముందు తనను చంపేస్తానంటూ ఆమె కుటుంబ సభ్యులకు ఇ-మెయిల్ పంపినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో సదరు యువకుడికి ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ లాయర్ వాదించారు. ఇందుకు సంబంధించిన తీర్పు త్వరలోనే వెలువడనుంది. -
ఇదీ లక్ అంటే: కోట్లు గెలుచుకున్నాడు!
అబుదాబి: అదృష్టమంటే ఇదేనేమో... ఏడాది బుడ్డోడు ఒక మిలియన్ డాలర్(సుమారు ఏడు కోట్ల పైచిలుకు) గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. ఈ అరుదైన ఘటన దుబాయ్లో జరిగింది. రమీస్ రహ్మాన్ అనే కేరళకు చెందిన వ్యక్తి దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ నిర్వహిస్తున్న లాటరీ టికెట్లో తన అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోవాలనుకున్నాడు. వెంటనే తన ఏడాది వయసున్న కొడుకు మహమ్మద్ సాలా పేరు మీద టికెట్ కొనుగోలు చేశాడు. మంగళవారంనాడు లాటరీ సంస్థ నిర్వాహకులు లక్కీడ్రా నిర్వహించగా అందులో తనయుడు మహమ్మద్ పేరు కూడా ఉండటంతో అతని తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. (కోటి రూపాయల లాటరీ.. భయంతో పోలీసుల వద్దకు!) ‘ఇది నిజంగా ఎంతో సంతోషకరమైన వార్త. ఇక నాకు ఎలాంటి ఢోకా లేదు. లాటరీ డబ్బు నా కుమారుడి భవిష్యత్తుకు ఎంతగానో భరోసానిస్తుంది’ అని రమీస్ సంతోషంతో ఉబ్బితబ్బిబైపోయాడు. కాగా గతంలోనూ చాలామంది భారతీయులు లక్కీడ్రాలో తమ అదృష్టాన్ని నిరూపించుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఓ భారతీయ రైతు ఉపాధిని వెతుక్కుంటూ దుబాయ్కు వలస వచ్చాడు. కానీ సరైన ఉపాధి దొరక్కపోవడంతో భారత్కు తిరుగుముఖం పట్టాడు. ఈ క్రమంలో తన దగ్గర చిల్లిగవ్వ లేకపోయినప్పటికీ భార్య దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని మరీ లాటరీ టికెట్ కొనుగోలు చేయగా 4 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. దీంతో అతని దిశే తిరిగిపోయింది. చదవండి: ఎర్రచీరలో ఇరగదీసిన పెళ్లికూతురు చెత్తలో పడేసిన టికెట్.. జీవితాన్నే మార్చేసింది -
దుబాయ్లో ఘోర రోడ్డు ప్రమాదం
అబుదాబి : దుబాయ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన ఓ మహిళ తీవ్రంగా గాయపడగా. నాలుగేళ్ల చిన్నారి అక్కడిక్కడే తనువు చాలించింది. ఈ విషాద ఘటన దుబాయ్కు 35 కి.మీ దూరంలో ఉన్న జెబెల్ అలీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు...యూఏఈలోని ఓ పాఠశాలలో చదువుతున్న తన కూతురుని తీసుకు రావడానికి మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఈ క్రమంలో.. కారులో అధిక వేగంతో దుసుకొస్తున్న ఓ ఆఫ్రికన్ మహిళ వీరిని ఢీకొట్టింది. తన వాహనాన్ని రివర్స్ చేసే క్రమంలో ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు ఇద్దరు కిందపడిపోగా..పక్కనే ఆగి ఉన్న కారుకు, ఎదురుగా వస్తున్న మరో కారుకు మధ్యలో పడి నుజ్జునుజ్జు అయ్యారు. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే మరణించగా, తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న మరో మూడు వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. మరోవైపు షార్జాలోని మువీలా ప్రాంతంలో కొడుకు చేతిలో ఉత్తరప్రదేశ్కు చెందిన మహిళ మృతి చెందారు. వివరాలు..17 ఏళ్ల బాలుడు కారును పార్క్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బ్రేక్ అనుకొని యాక్సిలేటర్ను లాగడంతో సమీపంలో ఉన్న తల్లిని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మహిళను ఆసుపత్రికి చేర్చగా మార్గ మధ్యలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే మైనర్ వ్యక్తికి ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడని, డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని పోలీసులు తెలిపారు. -
38 దేశాల్లో ‘పీఎం నరేంద్ర మోదీ’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘పీఎం నరేంద్ర మోదీ’ని అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తోసహా 38 దేశాల్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ఆనంద్ పండిట్ చెప్పారు. ఒమంగ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. భారత్లో 1,700, ఓవర్సీస్లో 600 స్క్రీన్లలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని ఆనంద్ చెప్పారు. ‘ఈ సినిమా వినోదం సైతం ఉంది. ప్రధానిని పొగుడుతూ, విపక్ష పార్టీలకు కౌంటర్గా సినిమా తీయలేదు. క్రియాశీలక రాజకీయాల్లోకి మోదీ ప్రయాణాన్నే ప్రధానంగా చూపించాం’ అని చెప్పారు. సినిమా హిందీ, తెలుగు, తమిళం భాషల్లో సినిమా విడుదల కానుంది. -
అబు ధాబిలో హిందూ ఆలయం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : ఇస్లాం దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబు ధాబి నగరంలో 26 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఓ హిందూ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం 2015లోనే యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ 16 ఎకరాల స్థలాన్ని ఉచితంగా కేటాయించగా, ఇటీవల యూఏఈ ప్రభుత్వం నిర్వహించిన సర్వమత సమ్మేళనం సందర్భంగా ఆలయంలో పార్కింగ్ ఇతర సౌకర్యాల కోసం మరో పది ఎకరాలు స్థలాన్ని విరాళంగా ప్రకటించారు. అబు ధాబి–దుబాయ్ ప్రధాన రోడ్డు పక్కన నిర్మించనున్న స్వామి నారాయణ్ ఆలయ నిర్మాణానికి ఏప్రిల్ 13వ తేదీన మహంత్ స్వామి మహరాజ్ భూమి పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వామి నారాయణ్ సంప్రదాయానికి చెందిన బ్రహ్మవిహారి స్వామి ఆలయ నిర్మాణ బాధ్యతలు చూస్తారు. అతిపెద్ద షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ మసీదుకు సమీపంలోనే ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2019 సంవత్సరాన్ని టాలరెన్స్ (సహనం) సంవత్సరంగా ప్రకటించడమే కాకుండా టాలరెన్స్ పేరిట ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మత సామరస్యం కోసం ఓ నిధిని కూడా ఏర్పాటు చేసింది. ప్రపంచంలో సహనం శాఖను ఏర్పాటు చేసిన ఏకైక దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చరిత్రలోకి ఎక్కింది. ఈ శాఖ సమన్వయంతో ఇస్లాం మత పెద్దల మండలి ఈ నెల మూడు, నాలుగు తేదీల్లో క్రైస్తవ, ఇస్లాం సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించింది. దీనికి క్రైస్తవుల తరఫున పోప్ ఫ్రాన్సిస్ హాజరుకాగా, ఇస్లాం మతస్థుల తరఫున అల్ అజర్ ఇమామ్ అహ్మద్ అల్ తయ్యబ్ ముఖ్య అతిథిగా హాజరై ఓ సంయుక్త ప్రకటన చేశారు. ‘తూర్పు–పశ్చిమ ప్రాంతాలకు చెందిన క్యాథలిక్కులు, క్యాథలిక్ చర్చి, తూర్పు–పశ్చిమ ప్రాంతాలకు చెందిన ముస్లింలు, అల్ అజర్ అల్ షరీఫ్లు సంయుక్తంగా చేస్తున్న ప్రకటన ఏమిటంటే పరస్పర సహకారం, పరస్పర అవగాహనే ప్రవర్తన నియామావళిగా చర్చలే సరైన మార్గంగా కలసి ముందుకు సాగుతాం’ అన్న డిక్లరేషన్ను పోప్, ఇమామ్లు సంయుక్తంగా విడుదల చేశారు. పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవులు, అరబ్ ప్రపంచంలోని ఇస్లాం మతస్థుల మధ్యన సత్సంబంధాలు నెలకొల్పాలనే లక్ష్యంతోనే ఈ సమ్మేళనాన్ని నిర్వహించినప్పటికీ ప్రపంచంలోని పలు మతాలకు చెందిన ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. భారత ప్రతినిధిగా హాజరైన బ్రహ్మ విహారి స్వామి సమ్మేళనంలో మాట్లాడుతూ ‘నేడు ప్రపంచంలోని అన్ని దేశాలు, అన్ని సంస్కతులు, అన్ని మతస్థుల ముందున్న ముఖ్యమైన అంశం ఒక్కటే. ఐక్యంగా కలిసి ముందుకు వెళితే కలిసి పురోభివృద్ధి సాధిస్తాం. విడిపోయి ముందుకు పోవాలనుకుంటే సర్వనాశనం అవుతాం’ అని చెప్పారు. ఒకప్పుడు కరడుగట్టిన దేశమే! గతంలో యూఏఈ కరడుగట్టిన ఇస్లాం దేశం. భారత దేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడిన దావూద్ ఇబ్రహీం తొలుత యూఏఈలోనే ఆశ్రయం పొందారు. అఫ్ఘానిస్థాన్లో తాలిబన్ ప్రభుత్వాన్ని 1996లో గుర్తించిన మూడవ దేశం యూఏఈ. పాకిస్థాన్, సౌదీ అరేబియా తర్వాత ఈ దేశం అక్కిడి ప్రభుత్వాన్ని గుర్తిస్తూ ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అప్ఘానిస్తాన్’ అని నామకరణం కూడా చేసింది. అలాంటి దేశంలో యువరాజు పట్టాభిషక్తుడైన నాటి నుంచి వివిధ మతాల మధ్య సామరస్యం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. తమ దేశంలో నివసిస్తున్న వివిధ మతాల వారికి ఉదారంగా స్థలాలు కేటాయించారు. అందులో భాగంగా హిందూ దేవాలయం కోసం 26 ఎకరాలు ఇచ్చారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ ప్రస్తుతం జబ్బు పడడంతో ప్రభుత్వ పాలనా వ్యవహారాలను కూడా యువరాజే చూసుకుంటున్నారు. కేవలం 12 శాతం దేశస్థులు, 88 శాతం ప్రపంచ వలసకార్మికులను కలిగిన దేశంలో ఇలాంటి సంస్కరణలు తప్పవనే వారూ ఉన్నారు. యూఏఈలో 26 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరికోసం దుబాయిలో ఓ శివాలయం, కృష్ణుడి ఆలయం ఉండగా, అబుదాబిలో నిర్మించబోయే ఆలయమే మొదటిది. -
ఇస్లాం గడ్డపై కేథలిక్ల బహిరంగ సభ
అబుధాబీ: ఇస్లాం గడ్డపై తొలిసారి పర్యటిస్తున్న క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ చారిత్రాత్మక కేథలిక్ల బహిరంగ సభలో పాల్గొన్నారు. మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానిలోని జాయేద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో జరిగిన ఈ సభకు సుమారు 1.70 లక్షల మంది కేథలిక్లు హాజరయ్యారు. ఓపెన్ టాప్ వాహనంలో వాటికన్ జెండాలను ఎగురవేస్తూ పోప్ స్టేడియంలోకి ప్రవేశించారు. స్టేడియంలో సుమారు 50 వేల మంది కేథలిక్లు ఉండగా.. స్టేడియం బయట ఏర్పాటుచేసిన పెద్ద పెద్ద స్క్రీన్ల ద్వారా పోప్ ప్రసంగాన్ని మరో 1.20 లక్షల మంది వీక్షించారు. సుమారు 4 వేల మంది ముస్లింలకు కూడా సభకు సంబంధించిన టికెట్లను విక్రయించినట్లు స్థానిక చర్చి అధికారులు తెలిపారు. సభకు భారీగా హాజరైన వలస కార్మికులు, శరణార్థులను ఉద్దేశించి పోప్ ప్రసంగించారు. ‘ఇంటిని విడిచిపెట్టి ఇంత దూరంలో జీవనం కొనసాగించడం చాలా కష్టతరమైంది. మిమ్మల్ని ప్రేమించే వారి ఆప్యాయతలను మీరు కోల్పోతున్నారు. అలాగే భవిష్యత్కు సంబంధించిన అనిశ్చితి కూడా మీలో నెలకొని ఉంటుంది. కానీ భగవంతుడు చాలా నమ్మదగినవాడు. తనను నమ్ముకున్న వాళ్లను ఎన్నటికీ విడిచిపెట్టడు’ అని పోప్ వలస కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. యూఏ ఈలో భారత్, ఫిలిప్పీన్స్కు చెందిన కేథలిక్ వలస కార్మికులు అధిక శాతంలో ఉన్నారు. దేశంలో సుమారు 10 లక్షల మంది కేథలిక్లు నివసిస్తున్నారు. అంటే యూఏఈలో ప్రతీ 10 మందిలో ఒకరు కేథలిక్ కావడం గమనార్హం. -
యూఏఈదే పైచేయి
అబుదాబి: అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)... ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీలో భారత్ను 2–0 తేడాతో ఓడించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా రెండు జట్ల మధ్య గురువారం ఇక్కడ జరిగిన పోరులో ఆతిథ్య యూఏఈ తరఫున ఖల్ఫాన్ ముబారక్ (41వ నిమిషం), అలీ మబ్కోత్ (88వ నిమిషం) గోల్స్ చేశారు. ఆటగాళ్లు పాస్లను చక్కగా అందుకోవడంతో బంతి ఎక్కువ శాతం ఆ జట్టు ఆధీనంలోనే ఉంది. సునీల్ ఛెత్రి నేతృత్వంలోని భారత జట్టు ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడుల్లో ఫర్వాలేకున్నా... ఫౌల్స్ ఎక్కువగా చేసింది. పాస్లలోనూ వెనుకబడ్డారు. తొలి భాగం, రెండో భాగం చివర్లో ప్రత్యర్థికి గోల్స్ సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్ను కనీసం ‘డ్రా’ చేసుకున్నా భారత్ నాకౌట్ చేరేది. ప్రస్తుతం 3 పాయింట్లతో గ్రూప్లో రెండో స్థానంలో భారత్... సోమవారం జరిగే చివరి మ్యాచ్లో బహ్రెయిన్ను ఎదుర్కొంటుంది. -
‘మోదీకి నేనంటే కోపం’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో తాను ఎన్నడూ ముచ్చటించలేదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మోదీ సైతం తనతో మాట్లాడలేదని, ఆయన కేవలం హలో అని మాత్రమే అంటారని చెప్పుకొచ్చారు. తన గురించి మోదీ చేసే వ్యాఖ్యలన్నీ తనపై ఆయనకున్న ద్వేషం, కోపం నుంచి పుట్టుకొస్తాయని వ్యాఖ్యానించారు. తాను రాజకీయ కుటుంబం నుంచి వచ్చాననే సత్యాన్ని అంగీకరిస్తానని అన్నారు. తమ కుటుంబంలో జరిగిన విషాద ఘట్టాలను మోదీ గుర్తించలేరని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై నాయనమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీల హింసాత్మక మరణాల ప్రభావాన్ని మోదీ చూడలేరని దుయ్యబట్టారు. ఆ బాధ నుంచి తాము బయటపడిన తీరును, నేర్చుకున్న పాఠాలను మోదీ గుర్తించకపోవడం విచారకరమన్నారు. ఈ నెల 11 నుంచి గల్ఫ్ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో గల్ఫ్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
సీఎం దుబాయ్ టూర్పై కొనసాగుతున్న అస్పష్టత
-
టూర్ ఉన్నట్టా? లేనట్టా..?
సాక్షి, హైదరాబాద్:రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దుబాయ్ పర్యటన విషయంలో అస్పష్టత కొనసాగుతోంది. ఈనెల 6 నుంచి 13వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో జరిగే అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సుకు ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే, ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన దుబాయ్ పర్యటన లేనట్టేనని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేయాల్సి ఉండటంతో సమయాభావం ఏర్పడుతుందని, దీంతో ఆయన దుబాయ్కి వెళ్లకపోవచ్చని అంటున్నారు. దీనిపై సీఎం కార్యాలయ వర్గాలు మాత్రం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. మరోవైపు అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు కావడంతో కనీసం ఒక్కరోజయినా వెళ్లి ఆ సదస్సులో పాల్గొనే ఆలోచన కూడా ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అన్ని అనుమతులు, ఉత్తర్వులు వచ్చాయి వాస్తవానికి, ఈనెలలో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు రావాలని కేసీఆర్కు గత ఏడాదిలోనే ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆ సదస్సుకు హాజరుకావాలని నిర్ణయించుకున్న కేసీఆర్ తన పర్యటనకు అవసరమైన దౌత్యపరమైన అనుమతులు కూడా తీసుకున్నారు. దుబాయ్, అబుదాబిల్లోని పారిశ్రామికవేత్తలతో భేటీతో పాటు దుబాయ్లోని తెలంగాణ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలపై భారత రాయబార కార్యాలయ అధికారులతో చర్చించాలని నిర్ణయించుకున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయనతో పాటు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ, అసెంబ్లీ సమావేశాల సమయంలోనే మంత్రివర్గ విస్తరణకు కూడా అవకాశం ఉండటంతో మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవా లన్న దానిపై తగిన కసరత్తు చేయాల్సి ఉన్నందున కేసీఆర్ దుబాయ్ వెళ్లకపోవచ్చని ప్రగతిభవన్ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఆఖరి నిమిషంలో వెళ్లాలని నిర్ణయించుకుంటే గనుక షెడ్యూల్ ప్రకారం కాకుండా కనీసం ఒక్కరోజు వెళ్లిరావచ్చని తెలుస్తోంది. మొత్తంమీద కేసీఆర్ దుబాయ్ పర్యటనపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నంబర్–1పై ఓయో కన్ను
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద హోటల్ బ్రాండ్గా అవతరించిన ఓయో... ప్రపంచంలోనూ టాప్ హోటల్ బ్రాండ్గా అవతరించాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది. గదుల సంఖ్య పరంగా దేశంలో ఓయో అగ్ర స్థానంలో ఉంది. వచ్చే నాలుగైదేళ్లలో అంతర్జాతీయంగా లక్షలాది హోటల్ గదులను తన నెట్వర్క్ పరిధిలో చేర్చుకోవడం ద్వారా మారియట్ను వెనక్కి నెట్టి ప్రపంచ నంబర్–1 హోటల్ బ్రాండ్గా అవతరించాలనే లక్ష్యం పెట్టుకుంది. ప్రస్తుతం అమెరికాకు చెందిన మారియట్ అంతర్జాతీయంగా అతిపెద్ద హోటల్ సంస్థగా ఉంది. ఈ సంస్థ పరిధిలో 14 లక్షల గదులున్నాయి. 2023కి మారియట్ను అధిగమించాలన్న లక్ష్యాన్ని విధించుకున్నట్టు ఓయో హోటల్స్ వ్యవస్థాపకుడు, సీఈవో రితేష్ అగర్వాల్ తెలిపారు. నాలుగున్నరేళ్లలోనే... ఓయో ఓ స్టార్టప్గా తన ప్రయాణం ఆరంభించిన నాలుగున్నరేళ్లలోనే దేశంలో అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. ఓ హోటల్ బ్రాండ్గా 20 గదులతో ప్రారంభించిన కంపెనీ ప్రస్తుతం భారత్, చైనా, బ్రిటన్ తదితర దేశాల్లో 3,30,000 హోటల్ గదులను నిర్వహించే అంతర్జాతీయ బ్రాండ్గా (ఫ్రాంచైజీ/సొంతంగానూ) అవతరించింది. ‘‘ప్రతి నెలా 50,000 గదులను పెంచుకుంటూ వెళుతున్నాం. దీన్ని బట్టి చూస్తే 2023 నాటికి అదనంగా 25 లక్షల గదుల స్థాయికి చేరతాం. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద హోటల్ చెయిన్ సామర్థ్యంతో పోలిస్తే ఇది రెండు రెట్లు అధికం’’ అని అగర్వాల్ తెలిపారు. ఓయో బడ్జెట్ హోటల్ చైన్గా తన వ్యాపారాన్ని ప్రారంభించగా, ప్రస్తుతం మధ్య స్థాయి, ఉన్నత స్థాయి పర్యాటకులకు సైతం విడిది సేవలు అందిస్తోంది. ప్రధానంగా ఓయోకు భారత్, చైనా మార్కెట్లో ఎక్కువ హోటల్ గదులుండగా, బ్రిటన్, యూఏఈ, ఇండోనేసియా, మలేసియా, నేపాల్కూ కార్యకలాపాలను విస్తరించింది. 2023 నాటికి మరిన్ని దేశాల్లోకీ అడుగుపెట్టాలనుకుంటోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో భాగమైన దుబాయ్, అబు ధాబి, షార్జా వంటి మార్కెట్లలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అగర్వాల్ చెప్పారు. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, యూరప్ మార్కెట్లలో విస్తరించేందుకు ఈ మార్కెట్లు దోహదపడగలవని భావిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, ప్రస్తుతం లావాదేవీల సంఖ్య మూడింతలు పెరిగిందని తెలిపారు. ఆక్యుపెన్సీ 65 శాతంగా ఉందని తెలిపారు. చైనాలో ప్రతి నెలా సుమారు 40,000 పైచిలుకు గదులు ఫ్రాంచైజీ, లీజ్డ్ విధానంలో అందుబాటులోకి తెస్తున్నామని అగర్వాల్ వివరించారు. తమ ప్లాట్ఫాంలో చేరిన తర్వాత ఆయా హోటల్స్లో ఆక్యుపెన్సీ రేటు 25 శాతం నుంచి సుమారు 70 శాతం దాకా పెరిగిందని పేర్కొన్నారు. సాఫ్ట్బ్యాంకు దన్ను కాలేజీ స్థాయి విద్యాభ్యాసాన్ని మధ్యలోనే విడిచిపెట్టిన రితేష అగర్వాల్ 2013లో ఓయోను ప్రారంభించారు. ఓయో వివిధ హోటల్స్తో ఒప్పందాలు కుదుర్చుకుని, సిబ్బందికి తగిన శిక్షణనిస్తుంది. లినెన్ నుంచి బాత్రూమ్ ఫిటింగ్స్ దాకా అన్నింటినీ నిర్దిష్ట ప్రమాణాలకు అప్గ్రేడ్ చేస్తుంది. ఆ తర్వాత ఆయా హోటల్స్ను తమ వెబ్సైట్లో లిస్టింగ్ చేస్తుంది. తమ వెబ్సైట్ ద్వారా జరిగే బుకింగ్స్పై ఆయా హోటల్స్ నుంచి 25 శాతం కమీషన్ తీసుకుంటుంది. సాఫ్ట్బ్యాంకు సహా పలువురు ఇన్వెస్టర్ల నుంచి గత సెప్టెంబర్లో బిలియన్ డాలర్లను (రూ.7,000 కోట్లు) ఓయో సమీకరించింది. దీని ప్రకారం సంస్థ విలువ 5 బిలియన్ డాలర్లు (రూ.35,000 కోట్లు) అని అంచనా. 1.2 బిలియన్ డాలర్లను భారత్, చైనాలో కార్యకలాపాల విస్తరణపైనే కంపెనీ వెచ్చించింది. భారత్లో 180 నగరాల్లో ఓయో 1,43,000 గదులను నిర్వహిస్తోంది. గతేడాది నవంబర్లో చైనాలో కూడా కార్యకలాపాలు ప్రారంభించి.. ప్రస్తుతం 265 నగరాలకు విస్తరించింది. 1,80,000 గదులను నిర్వహిస్తోంది. గదుల సంఖ్యా పరంగా టాప్ టెన్ బ్రాండ్లలో ఓయో కూడా ఒకటి. తన భారీ విస్తరణ కోసం త్వరలో మరిన్ని నిధులను సమీకరించే ఆలోచనతోనూ ఉంది. భారత్తో పోలిస్తే చైనాలో మరింత విస్తరించేందుకు భారీ అవకాశాలున్నాయని అగర్వాల్ తెలిపారు. చైనాలో 3.5 కోట్ల అన్ బ్రాండెడ్ హోటల్ గదులు అందుబాటులో ఉండగా, అదే భారత్లో అందుబాటులో ఉన్న అన్బ్రాండెడ్ గదులు 43 లక్షలేనని పేర్కొన్నారు. ఇండిగో మాజీ ప్రెసిడెంట్ అయిన ఆదిత్యఘోష్ను భారత్, దక్షిణాసియా ప్రాంతాల్లో ఓయో సంస్థకు సీఈవోగా ఇటీవలే నియమించుకున్న విషయం గమనార్హం. చైనా సహా అంతర్జాతీయంగా విస్తరణపై ఘోష్ దృష్టిసారించనున్నారు. -
అరబ్ పంజరం
సాక్షి, హైదరాబాద్: ఉపాధి పేరిట కామాంధులైన అరబ్ షేక్ల దాష్టీకానికి నగర అమ్మాయిలు ఎందరో సమిధలవుతూనే ఉన్నారు. అరబ్ షేక్లు నగరానికి రాకుండా ఇక్కడి అమ్మాయిలను ఉద్యోగాల పేరుతో అక్కడికి పిలిచి కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఈ అక్రమ రవాణాలో ట్రావెల్ ఏజెంట్లు దళారులుగా వ్యవహరించి నిండు జీవితాలను బలిచేస్తున్నారు. ఉపాధి పేరుతో నగర అమ్మాయిల అక్రమ రవాణాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.... నెలకు 20 మంది రవాణా.. కాంట్రాక్ట్ మ్యారేజ్లు, ఖాజీలపై పోలీసుల ఉక్కుపాదంతో అరబ్ షేక్లతో అమ్మాయిల పెళ్లిళ్లు తగ్గాయి. కానీ ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను అరబ్ దేశాలకు తరలించడం ఇంకా సాగుతూనే ఉంది. బ్యూటీషియన్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్లు, సేల్స్గర్ల్, రిసెప్షనిస్టు, ఇంటి పనులు తదితర వీసాలపై అమ్మాయిలను ఏటా వందల సంఖ్యలో గల్ఫ్ దేశాలకు తీసుకెళ్తున్నారు. ట్రావెల్ ఏజెంట్లు అక్కడి దళారులతో కుమ్మక్కై అమ్మాయిలు, వారి తల్లిదండ్రులకు ఉద్యోగాల ఎర వేస్తున్నారు. ఇక్కడైతే ఐదారువేలే సంపాదించవచ్చని.. అరబ్ దేశాల్లో రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఆర్జించవచ్చని మాయ మాటలు చెప్పి వారిని నమ్మిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా కొందరు మహిళలను ప్రతినిధులుగా నియమిస్తున్నారు. చెప్పేదొకటి.. జరిగేది ఇంకోటి.. దళారులు, ఏజెంట్లు ఇక్కడి నుంచి అమ్మాయిలను జాబ్ వీసాపై పంపిస్తారు. అక్కడి వెళ్లిన తరువాత వీసా జారీ చేసిన షేక్కు వారిని అమ్మేస్తారు. పెళ్లి కాని అందమైన అమ్మాయిని రూ.5 లక్షలు, పెళ్లి అయిన మహిళని రూ.3 లక్షలు, వయసు ఎక్కువున్న మహిళను రూ.లక్షకు కొంటున్నారు. కొందరు అక్కడి నరకం భరించలేక బయటికొచ్చి చెప్పుకుంటున్నారు. మరి కొందరు అదే నరకంలో ఉండిపోతున్నారు. నరకం అనుభవించా.. సేల్స్గర్ల్ ఉద్యోగం ఉందని నమ్మించి ఏజెంట్లు నన్ను దుబాయికి పంపించారు. షార్జా ఎయిర్పోర్టుకు వెళ్లిన తర్వాత ఏజెంట్ వచ్చి ఓ ఆఫీస్కు తీసుకెళ్లాడు. ఒక్కో షేక్ వచ్చి శరీరాన్నంతా తడిమి ఎంపిక చేసుకొని తీసుకెళ్లేవాడు. రోజుకో షేక్ రావడం తీసుకెళ్లడం.. నేను వెళ్లనని చెబితే తీవ్రంగా కొట్టేవారు. రూ.3.5 లక్షలకు విక్రయించామని ఏజెంట్ చెప్పాడు. ఆ నరకం భరించలేక మా అమ్మకు విషయం చెప్పాను. దీనిపై కేంద్రానికి ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లాఖాన్ లేఖ రాయడంతో భారత రాయబార కార్యాలయ అధికారులు నన్ను విడిపిం చారు. – అస్మా బేగం, హబీబ్నగర్ నా కూతురిని విడిపించండి బ్యూటీషియన్ వీసా ఉందని నమ్మించి ఏజెంట్ నా కూతుర్ని దుబాయికి పంపాడు. అక్కడికి వెళ్లిన తరువాత నా కూతురిని షేక్ అమ్మేయడంతో, ఇంటి పనితో పాటు పడక పని చేయిస్తున్నారు. నాకు ఫోన్ చేసి.. ఈ నరకం నుంచి రక్షించండి అని వేడుకుంది. – హలీమ్ ఉన్నీసా తల్లి హబీబ్ ఉన్సీసా, వట్టేపల్లి ఎందరినో రక్షించాం ఇమిగ్రేషన్ అధికారుల నిర్లక్ష్యంతో అమ్మాయిల అక్రమ రవాణా సాగుతోంది. ఏజెంట్ల మోసాలపై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదు. అలాంటి దుర్మార్గులపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తేనే అమ్మాయిల రవాణాకు అడ్డుకట్టపడుతుంది. అలాగే ప్రజల్లోనూ ఇలాంటి ఉద్యోగాలపై అవగాహన కల్పించాలి. – అంజదుల్లాఖాన్,ఎంబీటీ అధికార ప్రతినిధి -
బుర్జ్ ఖలీఫా వెలుగు జిలుగుల్లో..
దుబాయ్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా దుబాయ్లోని ప్రఖ్యాత ప్రాంతాలు త్రివర్ణ పతాక రంగులతో కళకళలాడాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ(ఏడీఎన్ఓసీ), ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిక్చర్ ఫ్రేమ్ ‘దుబాయ్ ఫ్రేమ్’లు మన జెండా రంగులతో వెలిగిపోతూ కనువిందు చేశాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను యూఏఈలో భారత రాయబారి ట్విటర్ ద్వారా షేర్ చేశారు. శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలస్తీనా నుంచి యూఏఈ రాజధాని అబుదాబికి చేరుకుంటారు. యూఏఈ పర్యటనలో మోదీ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ఆదివారం దుబాయ్లో జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో మోదీ ప్రసంగిస్తారు. -
ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిన్నారులు మృతి!
యునైటెడ్ ఎమిరేట్స్లో సోమవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిన్నారులు మరణించారు. అనుకోకుండా ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఏడుగురు చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటన దుబాయ్కి దాదాపు 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న దడ్నా గ్రామంలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలతో ఇళ్లంతా దట్టమైన పోగలు అలుముకొని పిల్లలు చనిపోయారని, వారి తల్లి ప్రాణాలతో బయటపడిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపుచేశారు. -
‘డర్టీ డజన్’గ్యాంగ్ ...
► అక్కడికి వెళ్లాక అంగడి బొమ్మలవుతున్న మహిళలు ► షేక్ల సమక్షంలో వేలం పాటలు.. లైంగిక దాడులు ► వారికి ఎదురుతిరిగితే బెదిరింపులు ► వ్యభిచారంలోకి దింపి నరకం చూపుతున్న వైనం ► పురుషులతో వెట్టి చాకిరీ ► 12 మంది నిందితుల్లో ఏడుగురు అరబ్ దేశాల్లో తిష్ట ► ఐదుగురిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు సాక్షి, హైదరాబాద్ : దుబాయ్లో జాబ్ అంటారు.. వేలల్లో జీతమని నమ్మబలుకుతారు.. మాయమాటలు చెప్పి లక్షల్లో గుంజుతారు.. తీరా వారి మాటల్ని నమ్మి వెళ్తే నరకకూపంలో దిగినట్టే! మహిళలు, యువతులు అరబ్ షేక్ల ముందు అంగడి బొమ్మలై ఏళ్లకేళ్లుగా వ్యభిచార కూపంలో మగ్గిపోతారు. పురుషులు బానిస సంకెళ్లలో బందీ అయిపోయి దేశంకాని దేశంలో నానా అగచాట్లు పడతారు. గత పదేళ్లుగా అమాయకులపై ఇలా వల విసిరి మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు రట్టు చేశారు. గ్యాంగ్లోని ఐదుగురిని పట్టుకున్నారు. మరో ఏడుగురు దుబాయ్లో ఉండటంతో వారికోసం విదేశీ మంత్రిత్వ శాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ‘డర్టీ డజన్’గ్యాంగ్ గడిచిన పదేళ్ల కాలంలో దాదాపు 100 మందిని అరబ్ దేశాలకు అక్రమ రవాణా చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ శుక్రవారం వెల్లడించారు. వీరిలో దాదాపు 30 మంది మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. ముఠా నాయకుడు.. దుబాయ్ శ్రీను మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఈ ముఠా సూత్రధారి పోతుల శ్రీనుబాబు అలియాస్ దుబాయ్ శ్రీను. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇతడు అమలాపురం నుంచి వెళ్లి దుబాయ్లో స్థిరపడ్డాడు. ఈ దందా కోసం అక్కడా, ఇక్కడా మొత్తం 11 మంది దళారులను ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రాంతానికే చెందిన మరియమ్మ, అల్ప శ్రీను, సత్యవతి, శ్రీనివాస్ గౌడ్లతో పాటు కేరళకు చెందిన కరీంను శ్రీనుబాబు అరబ్ దేశాలకు పిలిచించుకున్నాడు. వీరిని దుబాయ్, మస్క ట్, కువైట్, ఖతార్ల్లో ఉంచి.. ఆయా చోట్ల మ్యాన్పవర్ కన్సల్టెన్సీలతో సంబంధాలు ఏర్పాటు చేశాడు. ఈ ఏడుగురికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన యు.త్రిమూర్తులు, ఎం.తాతాజీ, పి.దాసు, జి.రామారావు (మరియమ్మ భర్త), ఎస్.మురళి సహకరిస్తున్నారు. వీరంతా తమ చుట్టుపక్కల ప్రాంతా ల్లో చిన్న చిన్న పనులు చేస్తున్న వారిలో అరబ్ దేశాలకు వెళ్లాలన్న ఆసక్తి ఉన్న వారిని గుర్తిస్తారు. వారి వివరాలను దుబాయ్ శ్రీనుకు చేరవేస్తారు. అరబ్ దేశాల్లో ఇంటి సహాయకురాలు, కుక్, క్లీనర్స్, కేర్ టేకర్స్ తదితర ఉద్యోగాలు ఉన్నాయని, నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదించుకోవచ్చని బా« దితులకు ఎర వేస్తారు. అక్కడకు పంపడానికి అన్ని ఖర్చులూ కలిపి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అవుతాయని చెప్పి అందినకాడికి వసూలు చేస్తారు. ఆపై అరబ్ దేశాల్లో ఉన్న మ్యాన్పవర్ కన్సల్టెన్సీల సాయంతో బో గస్ ఉద్యోగ ఆఫర్ లెటర్స్ పంపించి నమ్మిస్తారు. మహిళల వేలం పాట ముఠా సభ్యులు.. తమ మాటల్ని నమ్మి డబ్బు చెల్లించిన వారిలో కొందరికి విజిట్ వీసా, మరికొందరికి జాబ్ వీసాలు ఇప్పిస్తున్నారు. దుబాయ్కి వెళ్లాక పురుషులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఇక మహిళల్ని స్థానికంగా ఉన్న మ్యాన్పవర్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. ఈ ఏజెన్సీలు అరబ్ షేక్లకు అనుబంధంగా పనిచేసే కన్సల్టెన్సీల సహకారంతో వేలంపాట నిర్వహిస్తుంటాయి. అరబ్ షేక్ల సమక్షంలో జరిగే ఈ వేలంపాటల్లో ఆకర్షణీయంగా ఉన్న వారికి గరిష్టంగా రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఇలా ఆ షేక్ల కబంధ హస్తాల్లో చిక్కిన తర్వాత ఆ మహిళల నుంచి పుస్తెలతాడు, మెట్టెలు తీయించేస్తున్నారు. తమ ఇళ్లకు తీసుకువెళ్లి బుర్ఖాలు ధరించాలని ఒత్తిడి చేస్తూ బానిసలుగా చూస్తున్నారు. లైంగిక దాడులకు పాల్పడటమే కాకుండా కొన్ని సందర్భాల్లో వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. పాస్పోర్టులు సైతం షేక్ల అధీనంలోనే ఉండడంతో వారంతా ఆ నరకాల్లో మగ్గుతున్నారు. విజిట్ వీసాతో వచ్చి పని చేస్తున్నందున బయటకెళ్తే పోలీసులు అరెస్టు చేస్తారని బెదిరించి తమ ఇళ్లలోనే బందీ చేస్తున్నారు. ఎవరైనా మరీ గొడవ చేస్తే వారిని తిరిగి ‘దుబాయ్ శ్రీను అండ్ కో’కు అప్పగించేస్తున్నారు. ఆ ముఠా.. ఇక్కడున్న బాధితుల సంబంధీకుల నుంచి మళ్లీ డబ్బు వసూలు చేసి, టికెట్లు కొని పంపిస్తున్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్. చిత్రంలో నిందితులు ఓ జంట ఇచ్చిన ఫిర్యాదుతో.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భార్యాభర్తలు ప్రస్తుతం ఘట్కేసర్లోని అన్నోజీగూడలో నివసిస్తున్నారు. వీరిని సంప్రదించిన త్రిమూర్తులు దుబాయ్ పంపుతానంటూ వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గతేడాది వచ్చిన దుబాయ్ శ్రీను ఈ జంట నుంచి అదనంగా మరో రూ.లక్ష డిమాండ్ చేసి.. రూ.70 వేలు తీసుకున్నాడు. గతేడాది ఫిబ్రవరి 12న భార్యను, పది రోజుల తర్వాత భర్తను దుబాయ్ పంపాడు. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాల్లో పెట్టడంతో పాటు అక్కడున్న పరిస్థితుల్ని గమనించిన వీరు తిరిగి వెళ్లిపోతామంటూ గొడవ చేశారు. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న వీరి బంధువు నుంచి మరో రూ.70 వేలు వసూలు చేసి, ఆ తర్వాత టికెట్లు కొని పంపారు. అక్కడ్నుంచి తిరిగొచ్చిన ఈ జంట గతేడాది జూన్లో ఘట్కేసర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసును దర్యాప్తు చేసిన మల్కాజ్గిరి జోన్ ఎస్వోటీ పోలీసులు త్రిమూర్తులు, తాతాజీ, దాసు, రామారావు, మురళీలను అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.1.6 లక్షల నగదు, వివిధ బోగస్ పత్రాలు, విజిట్ వీసా కాపీలు స్వాధీనం చేసుకుంది. దుబాయ్ శ్రీను సహా పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురిని పట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
అతడికి 64.. ఆమెకు 14
సాక్షి, చాంద్రాయణగుట్ట: అరబ్షేక్ల కామ దాహానికి అమాయక మైనర్ బాలికలు బలవుతున్నారు. బాలికల కుటుంబ ఆర్థికావసరాలను అవకాశంగా తీసుకొని కొందరు దుర్మార్గులు అరబ్షేక్లతో పెళ్లి జరిపిస్తున్నారు. తరువాత వారు పెట్టే హింసను భరించలేక.. వదలిరాలేక నరకం అనుభవిస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులే పడుతోంది పాతబస్తీకి చెందిన ఓ బాలిక. విషయం పోలీసులకు తెలియడంతో శుక్రవారం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ తెలిపిన మేరకు.. కామాటీపురా ప్రాంతానికి చెందిన సల్మాబేగం ఆర్థికావసరాలు గమనించిన బీపాషా బీ, రషేదా బీ, షాహిన్లు ఆమెను కలిశారు. ఆమె 14 ఏళ్ల కుమార్తెకు అరబ్ షేక్తో వివాహం జరిపిస్తే కష్టాలు తీరుతాయని నమ్మించి నాసర్ బిన్ మహమూద్, ఫతే బిన్ మహమూద్ల సహకారంతో అరబ్షేక్(64)తో 2014లో వివాహం జరిపించారు. తరువాత స్వదేశానికి వెళ్లిన షేక్ వీసా పంపాడు. ఆ వీసాతో బాలిక ఒమన్కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తరువాత బాలికకు అసలు విషయంతెలిసింది. అతను ఫకీర్ అని తేలింది. చేసేది లేక రెండేళ్ల పాటు అక్కడే ఉంది. ఆరోగ్యసమస్యతో నగరానికి ఈ ఏడాది మార్చిలో వచ్చింది. దీంతో సదరు షేక్ బాలికను వెంటనే రావాలని బెదిరించాడు. బెదిరింపులు ఎక్కువ కావడంతో సల్మాన్, సాజిద్ అనే ఇద్దరి సహాయంతో వర్క్ వీసాపై జూలైలో దోహ ఖతర్ వెళ్లింది. ప్రస్తుతం అక్కడ కూడా ఆమె ఇంటి యజమాని చేతిలో నరకయాతన అనుభవిస్తోంది. చేసేది లేక బాలిక తల్లి కామాటీపురా పోలీసులను ఆశ్రయింయింది. దీంతో పోలీసులు దళారులైన బీపాషా బీ, రషెదా బీ, నాసర్ బిన్ మహమూద్, ఫతే బిన్ మహమూద్, సల్మాన్లను అరెస్ట్ చేశారు. కాజీ సిద్దిక్ అహ్మద్, దళారీ షాహిన్లు పరారీలో ఉన్నారు. బాలికను రప్పించేందుకు యత్నిస్తామని పోలీసులు తెలిపారు. మరో కేసులో.. యాకుత్పురాకు చెందిన కుల్సుం బేగాన్ని బహ్రేన్ దేశానికి చెందిన మహ్మద్ మహమూద్ అబ్దుల్ రహెమాన్ మహ్మద్, యూసుఫ్ మహ్మద్ అబ్దుల్ రహెమాన్ మహమూద్ ఖైరీ లు ఈ ఏడాది మే 24వ తేదీన కలిశారు. కుల్సుం బేగం రెండో కుమార్తె సమీనా బేగం (29)ను బహ్రేన్ దేశస్థులలో ఒకరైన మహమూద్ అబ్దుల్ రహెమాన్ మహ్మద్ కింగ్ కోఠిలో కాజీ అస్గర్ అలీ రఫాయి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం స్వదేశానికి తీసుకెళ్లాడు. కొన్నాళ్ల అనంతరం విడాకులు ఇవ్వకుండానే ఇంటికి పంపించేశాడు. దీంతోపోలీసులను బాధితురాలి తల్లి భవానీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మళ్లీ వారు వచ్చి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.వారికి ఆశ్రయం కల్పించిన గెస్ట్ హౌజ్ యజమానిని భవానీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
డబ్ల్యూడబ్ల్యూఈలో అరబ్ మహిళ
-
డబ్ల్యూడబ్ల్యూఈలో అరబ్ మహిళ
దుబాయ్: మత కట్టుబాటులు దాటుకోని అర్బ్ మహిళలు ఇప్పుడు ఇప్పుడే క్రీడల వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూ డబ్ల్యూఈ)లోకి ప్రవేశించి ఓ కొత్త అధ్యయానికి తెరతీశారు. జోర్డాన్కు చెందిన మహిళా రెజ్లర్ షాదియా బెసిసో డబ్ల్యూడబ్ల్యూఈతో ఆదివారం ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఆమె డబ్ల్యూ డబ్ల్యూఈ ఒప్పందం కుదుర్చుకున్న తొలి అరబ్ మహిళా రెజ్లర్గా గుర్తింపు పొందారు. ‘అరబ్ అథ్లేట్లకు ఎట్టకేలకు స్వాతంత్ర్యం లభించింది. నచ్చిన క్రీడల్లో అవకాశం రావడం అదృష్టం. మా మతం కూడా సానుకూలంగా భావిస్తుందనుకుంటున్నా. అరబ్ మహిళలకు అవకాశాలు కల్పిస్తే మరిన్ని క్రీడల్లో భాగస్వామ్యాలు అవుతారని’ షాదియా బెసిసో తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూఈ పట్ల అభిమానులకు ఉండే పిచ్చికి నేను ఒక సాక్షినని, రెజ్లింగ్లో రాణించి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ను అవుతానని బెసిసో ఆశాభావం వ్యక్తం చేశారు. తన ఇష్టాన్ని కుటుంబసభ్యులకు చెప్పి ఒప్పించానన్నారు. ఇక బెసిసో ప్రస్తుతం దుబాయ్లోని ఓ టీవీ చానల్ వాయిస్-ఓవర్ ఆర్టీస్ట్గా పనిచేస్తున్నారు. షాదియా బెసిసో కసరత్తు ..వీడియో -
ఆ వివాహాలపై అనుసరిస్తున్న విధానమేంటి?
సాక్షి, హైదరాబాద్: పేద ముస్లిం యువతుల ఆర్థిక నేపథ్యాన్ని ఆసరాగా తీసుకుని వృద్ధ అరబ్ షేక్లు వారిని వివాహం చేసుకుంటున్న ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో హైకోర్టు ఈ విషయంపై దృష్టి సారించింది. విదేశీయులతో ముఖ్యంగా అరబ్ షేక్లతో జరిగే వివాహాల విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ఏమిటో తెలపాలని కేంద్రప్రభుత్వంతోపాటు ఇరు రాష్ట్రాల మైనారిటీ సంక్షేమ శాఖలు, వక్ఫ్బోర్డ్లను ఆదేశించింది. చట్టంలో ఉన్న లోపాల్ని అడ్డంపెట్టుకుని వివాహాలు జరిపించే సమయంలో జరుగుతున్న దుర్వినియోగం, దోపిడీని అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా తెలపాలని కోరింది. ఇందులో భాగంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖతోపాటు తెలంగాణ మైనారిటీ సంక్షేమశాఖ, తెలంగాణ వక్ఫ్బోర్డులను ప్రతివాదులుగా చేర్చింది. ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని యాప్ల ద్వారా వివాహాల్ని రిజిస్టర్ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వక్ఫ్బోర్డులు వాటి రికార్డులను నిర్వహించవచ్చునంటూ.. తద్వారా వివాహాల రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని సమర్థంగా ఉపయోగించుకునే వీలుంటుందని అభిప్రాయపడింది. తాము కోరిన వివరాల్ని తదుపరి విచారణ నాటికి తమ ముందుంచాలని కేంద్రం, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు, వక్ఫ్బోర్డులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. -
మతం కన్నా మానవత్వం గొప్పదని ..
దుబాయ్: మతం కన్నా మానవత్వం గొప్పదని నిరూపించింది ఓ సౌదీ మహిళ. ప్రమాదవశాత్తు రెండు ట్రక్కులు ఢీకొని మంటలు చేలరేగిన ఘటనలో ఆ మహిళా మత కట్టుబాట్లను పక్కన పెట్టి సమయ స్పూర్తిని ప్రదర్శించి ట్రక్కు డ్రైవర్ని రక్షించింది. జవహార్ సైఫ్ అల్ కుమాతీ అనే ముస్లిం మహిళ ఆసుపత్రిలో ఉన్న తన స్నేహితురాలిని కలిసి మరో స్నేహితురాలితో కారులో తిరిగి వస్తుండగా యునైటెడ్ అరబ్ ఎమెరేట్స్లోని రాస్ అల్-ఖైమాహ్ నగరంలో రెండు ట్రక్కులు ఢీకొని మంటలు చేలరేగిన ప్రమాదం కంటపడింది. మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ హర్క్రిత్ సింగ్ కాపాండండి అంటూ చేసిన ఆర్తనాదాలు విన్న జవహార్ తన స్నేహితురాలి బుర్ఖా విప్పించి ఆమెను కారులోనే ఉండమని సూచించింది. ఆ బుర్ఖాతో ఆ డ్రైవర్ ఒంటిపై ఉన్న మంటలను ఆర్పి అతని ప్రాణాలు రక్షించింది. ఈ చర్యతో ఆమె మతం కన్నా మానవత్వమే గొప్ప అని చాటిచెప్పింది. ఇక ట్రక్కు డ్రైవర్లు ఇద్దరు 50 శాతం గాయాలతో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముస్లిం మహిళలు బయటకి వెళ్లినపుడు బుర్ఖా ధరించాలనే నిబంధన ఉన్న విషయం తెలిసిందే. -
ఎందరో ‘రుక్సా’లు..!
► పాతబస్తీలో ఇప్పటికీ కొనసాగుతున్న గల్ఫ్ షేక్ల ఆగడాలు ► ఏజెంట్ల సాయంతో బాలికలతో నిఖా యత్నాలు ► భారీ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సౌత్జోన్ పోలీసులు ► ముంబై చీఫ్ ఖాజీ సహా 20 మంది నిందితుల అరెస్టు ► రుక్సాను వివాహమాడిన ఒమన్ షేక్ కోసం వేట ► ఆమెను భారత్కు రప్పించేందుకు దౌత్యపరమైన చర్యలు సాక్షి, హైదరాబాద్: ఒమన్ షేక్ కామవాంఛకు బలై, పాతబస్తీలో వెలుగులోకి వచ్చిన మైనర్ బాలిక రుక్సా లాంటి వారు మరెందరో ఉన్నారు. రుక్సా కేసు దర్యాప్తులో భాగంగా మరికొందరు ఒమన్, ఖతర్ షేక్ల వ్యవహారాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పాతబస్తీకి చెందిన 12 మంది బాలికలు షేక్ల విషవలయంలో చిక్కకోకుండా దక్షిణ మండల పోలీసులు కాపాడగలిగారు. ఈ కేసులకు సంబంధించి మొత్తం 20 మంది నిందితుల్ని అరెస్టు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి బుధవారం వెల్లడించారు. దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణతో కలసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రుక్సాను భారత్కు రప్పించడానికి దౌత్యపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మైనర్ను వివాహం చేసుకుని, ఒమన్కు తరలించి అఘాయిత్యాలకు ప్రోత్సహించిన ఒమన్ షేక్ అహ్మద్ అబ్దుల్లా అమూర్ అల్ రహ్బీ(61)ని అరెస్టు చేసి భారత్కు తీసుకువచ్చే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రుక్సాను రక్షించేందుకు దౌత్య చర్యలు ఒమన్ వెళ్లిన రుక్సా అక్కడ నరకాన్ని చవి చూసింది. షేక్తో పాటు అతడి బంధువులు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయాలను ఆమె ఫోన్ ద్వారా కుటుంబీ కులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి సైదా ఉన్నిస్సా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఫలక్నుమ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ రుక్సాను భారత్ రప్పించడానికి దౌత్యప రమైన చర్యలు తీసుకుంటూనే నగరంలో వేళ్లూనుకున్న షేక్ల పెళ్ళిళ్ళ వ్యవహారాలకు చెక్ పెట్టడానికి మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు దళారులు, వారికి సహకరిస్తున్న వ్యక్తులపై ఆరా తీశారు. ఇంతలోనే బయటకొచ్చిన మరో బాలిక ఈలోగా ఒమన్, ఖతర్ దేశాల నుంచి వచ్చిన ఎనిమిది మంది షేక్లు కొందరు దళారుల సాయంతో పాతబస్తీలోని పేదింటి మైనర్లకు ఎరవేస్తున్నారు. 60 నుంచి 80 ఏళ్ళ మధ్య వయస్కులైన వీరం తా చాంద్రాయణగుట్ట పరిధిలోని ఎఫ్కే ప్లాజా, గులాబ్ రెసిడెన్సీ, ఎంజే ఆన్స్ గెస్ట్హౌస్, విన్సిటీ డెవలపర్స్ గెస్ట్హౌస్ ల్లో బస చేశారు. పాతబస్తీకి చెందిన కొందరు మైనర్లను బ్రోకర్లు వీరి వద్దకు తీసుకువెళ్ళి చూపించి రావడం ప్రారం భించారు. అలా వెళ్ళిన వారిలో ఓ బాలిక ఎదురు తిరిగింది. హోటల్స్, లాడ్జీల కేం ద్రంగా జరుగుతున్న ఈ చీకటి వ్యవహా రాలపై పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలో దిగిన ప్రత్యేక బృందాలు వరుసదాడులు చేసి మొత్తం 20 మందిని అరెస్టు చేశాయి. వీరిలో రుక్సా, బాలిక ఇచ్చిన సమాచారంతో నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న షేక్లు, ఖాజీలు, దళారులు, లాడ్జి యజమానానులు ఉన్నా రు. వీరిలో కొందరు నిఖాలు చేసుకుంటూ రెడ్హ్యాండెడ్గా దొరికారు. అరెస్ట్ అయ్యింది వీరే అల్ మయహి హబీబ్ అలీ ఇస్సా (మైనర్తో నిఖా చేసుకుంటూ చిక్కాడు), అల్ సాల్హీ తబ్లీ హమేదీ అలీ, అల్ ఉబాయ్దాని జుమ షినూన్, సులాయ్ మాన్, అల్ సాలేహీ నసీర్ ఖలీఫా హమీద్, అల్ ఖుసిమీ హసన్ ముజామిల్ మహ్మద్, (వీరంతా ఒమన్కు చెందిన షేక్లు), ఒమర్ మహ్మద్ సిరాజ్ అబ్దుల్ రెహ్మాన్, హమద్ జబీర్ ఓ అల్ కువారీ, సఫిల్దీన్ మహ్మద్ మొహమ్మద్నూర్ సాలే హ్ (వీరంతాఖతర్కు చెందిన షేక్లు), మహ్మద్ అసిఫ్, మహ్మద్ హబీబ్ ఖాన్ (దళారులు), ఖాజీ హబీబ్ అలీ (రుక్సా నిఖా చేశాడు), అహ్మద్(రుక్సా కేసులో దళారి, అక్రమ వీసా ఏజెంట్), సికిందర్ ఖాన్ (రుక్సా మేనమామ), గౌసియా బేగం(రుక్సా మేనత్త), ఫరీద్(ముంబైకి చెందిన చీఫ్ ఖాజీ), మునావర్ అలీ (చీఫ్ ఖాజీ సహాయకుడు). వీరితో పాటు ఒమ న్, ఖతర్ షేక్లను పరోక్షంగా ప్రోత్స హించిన నలుగురు లాడ్జి యజమానులు అరెస్టు అయ్యారు. రుక్సా కేసు తీగలాగితే కదిలిన డొంక పాతబస్తీలోని నవాబ్సాబ్కుంట ప్రాంతంలో గత నెల 17న వెలుగులోకి వచ్చిన బాలిక రుక్సా ఉదంతం సంచలనం సృష్టించింది. ఒమన్కు చెందిన షేక్ రహ్బీ పాతబస్తీకి చెందిన బ్రోకర్లు అహ్మద్, సికిందర్ ఖాన్ (రుక్సా మేనమామ), గౌసియా బేగం(రుక్సా మేనత్త) సాయంతో రుక్సా తల్లిదండ్రులకు ఎరవేసి మే 16న ఆమెను వివాహం చేసుకున్నాడు. వారం పాటు పాతబస్తీలోని ఓ హోటల్లో బస చేసిన షేక్ ఇక్కడే రుక్సాపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై అతడు స్వదేశానికి వెళ్ళి రుక్సా పేరుతో వీసా పంపించాడు. రుక్సా మైనర్ కావడంతో నకిలీ పత్రాలు సృష్టించడం ద్వారా ముంబైకి చెందిన చీఫ్ ఖాజీ ఫరీద్ అహ్మద్ ఖాన్, ఇతడి సహాయకుడైన మరో ఖాజీ మునావర్ అలీ అక్కడే వివాహమైనట్లు నిఖానామా సృష్టించి.. రుక్సాకు వీసా సంపాదించి ఒమన్కు పంపేశారు. -
పాతబస్తీలో అరబ్ షేక్లు అరెస్ట్
-
పాతబస్తీలో అరబ్ షేక్లు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : పాత బస్తీలో ముస్లిం బాలికలకు కాంట్రాక్టు వివాహాలు జరుపుతున్నారన్న ఆరోపణలపై 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి వివాహాలు జరుగుతున్నాయని తమకందిన సమాచారం మేరకు డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలోని పోలీసుల బృందం తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా ముగ్గురు ఖాజీలు, 8 మంది అరబ్షేక్లు, ఐదుగురు మధ్యవర్తులు, నలుగురు హోటల్ యజమానులను అరెస్టు చేసినట్లు వీరందరిని విచారిస్తున్నట్లు చెప్పారు. -
బంగారం మాత్రలు మింగి బుక్కు...
సాక్షి, చెన్నై : మాత్రల రూపంలో తయారు చేసిన బంగారాన్ని మింగి విదేశాల నుంచి వస్తున్న ఓ వ్యక్తిని చెన్నై విమానాశ్రయం అధికారులు పట్టుకున్నారు. అరబ్దేశం నుంచి వచ్చే విమానంలో బంగారం అక్రమంగా రవాణా అవుతున్నట్లు దిండుక్కల్ జిల్లా కాళికొడువై సమీపంలో ఉన్న కరిప్పూర్ విమానాశ్రయ అధికారులకు శుక్రవారం రహస్య సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమాన ప్రయాణీకులను నిశితంగా గమనిస్తున్నారు. అదే సమయంలో అనుమానాస్పదంగా నడిచి వస్తున్న ఓ యువకుడిని పట్టుకుని విచారణ చేశారు. అప్పుడు అతను పొంతన లేని సమాధానాలు చెప్పటంతో ఎక్స్రే ద్వారా అధికారులు పరిశీలన చేశారు. అప్పుడు అతని కడుపులో ఏదో పదార్ధం ఉండలుగా ఉన్నట్లు తేలింది. అనంతరం అధికారులు ఆ యువకుడిని కోళిక్కాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అనంతరం ఆపరేషన్ చేసి కడుపులో మాత్రల ఆకారంలో ఉన్న బంగారాన్ని బయటికి తీశారు. ఆ మాత్రల విలువ రూ.7లక్షలని లెక్కగట్టారు. విచారణలో నిందితుడిని కోళికొడువై సమీపంలో ఉన్న కొడువళ్లి ప్రాంతానికి చెందిన నావాస్ (34)గా గుర్తించారు. ఈ మేరకు అతనిపై అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
నిఖా.. దగా..
పెళ్లి పేరుతో అమ్మాయిని వంచించిన అరబ్ షేక్ - మరో బాలికతో షేక్ సోదరుడి నిఖా యత్నం - ఇద్దరు షేక్లు, మరో ఇద్దరు మధ్యవర్తుల అరెస్టు సాక్షి, హైదరాబాద్/మైలార్దేవ్పల్లి: నిఖా (పెళ్లి) పేరుతో హైదరాబాదీ అమ్మాయిలను వంచించేందుకు కుట్రపన్నిన ఇద్దరు దుబాయ్ సోదరులతో పాటు మరో ఇద్దరు మధ్యవర్తులను సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దుబాయ్కు చెందిన సలీం ఒబేద్ సయీద్ సల్మాన్ అల్జబీ (52).. ఈ నెల 10న హైదరాబాద్కు వచ్చి చాంద్రాయణగుట్ట బండ్లగూడ పెళ్లిళ్ల దళారి మహమ్మద్ షఫీని సంప్రదించాడు. అందమైన అమ్మాయితో నిఖా జరిపిస్తే రూ.70 వేలు ఇస్తాననడంతో.. మైలార్దేవ్పల్లి అక్బర్ కాలనీకి చెందిన షఫీ అహ్మద్ కూతురు నాజియా బేగంను షఫీ నిఖాకు ఒప్పించాడు. బాధితురాలికి రూ.40 వేలు ముట్టజెప్పి, మిగిలిన రూ.30 వేలు తను తీసుకున్నాడు. అయితే వీరి నిఖాను స్థానిక హాజీతో చేయించాల్సి ఉన్నా.. షఫీ తనకు నమ్మకస్తుడైన, జల్పల్లి ఎర్రకుంటకు చెందిన మహమ్మద్ హబీబ్ అలీతో 6 రోజుల క్రితం జరిపించాడు. ఇందుకోసం హబీబ్ అలీ రూ.10 వేలు తీసుకున్నాడు. నిఖా ధ్రువీకరణ పత్రం ఆమోదం కోసం దంపతులను ముంబై పంపించినట్లు బాధిత కుటుంబాన్ని నిందితు లు నమ్మించారు. ఈ ఆరు రోజులు బాధితురాలితో గడిపిన సలీం ఇబేద్.. దుబాయ్ పారిపోయేందుకు సన్నాహాలు చేసుకున్నాడు. బాలికలే కావాలని షరతు.. సలీం ఒబేద్ సోదరుడు ఇబ్రహీం సయూద్ సల్మాన్ అల్జబీ కూడా బాలికల కోసం దుబాయ్ నుంచి ఇటీవల హైదరాబాద్ వచ్చాడు. దళారి షఫీని ఫోన్లో సంప్రదించి తనకు బాలికల్ని చూపించాలని షరతు విధించాడు. గత మంగళవారం రాజేంద్రనగర్కు వచ్చిన ఇబ్రహీం.. షఫీని కలుసుకున్నాడు. షఫీ తన వద్ద ఉన్న బాలికల ఫొటోలు చూపగా అందు లో ఓ బాలికను ఎంచుకున్నాడు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో బుధవారం రాత్రి నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. గతంలో ఇలాంటి అక్రమాలు చేశారా.. అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు. షఫీ వద్ద 60 ఫొటోలు.. షఫీ వద్ద యువతులు, బాలికలకు సంబంధించి 60 ఫొటోలను పోలీసులు గుర్తించారు. తనకు మ్యారేజ్ బ్యూరో ఉండటంతో ఆ ఫొటోలున్నాయని దర్యాప్తులో షఫీ పోలీసులకు వివరించాడు. ఇద్దరు అమ్మాయిలకు నిఖా చేసి విదేశాలకు పంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో షఫీ ఒప్పుకున్నట్లు తెలిసింది. దుబాయ్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, హైదరాబాద్కు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని బాధితురాళ్లు అతడిని ఫోన్లో వేడుకున్నట్లు గుర్తించిన పోలీసులు.. షఫీని తిరిగి కస్టడీలోకి తీసుకొని విచారిస్తామని తెలిపారు. -
మన పాతబస్తీలో.. మరో పుత్తడిబొమ్మ
మళ్లీ వేటాడిన ముసలి షేక్ 76 ఏళ్ల అరబ్ షేక్తో మైనర్ బాలికకు పెళ్లి రూ.5 లక్షలు తీసుకొని వివాహం జరిపించిన మేనత్త కష్టాలు తీరుతాయంటూ తల్లిదండ్రులకు మాయమాటలు ఒమన్కు వెళ్లాక అమ్మాయికి నరకం షేక్ కొడుకులు, మనవళ్ల లైంగిక దాడి ఇక్కడుంటే చనిపోతానంటూ ఫోన్ చేసిన బాలిక పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు మేనత్తపై కేసు.. మైనర్ను తెస్తామని వెల్లడి సాక్షి హైదరాబాద్: అరబ్బుల దాష్టీకాలకు పాతబస్తీ అమ్మాయిలు బలవుతున్నారు. ఎడారి దేశం నుంచి వచ్చి వాలుతున్న కామాంధులు మైనర్లను కూడా పెళ్లిళ్లు చేసుకొని వారి గొంతు కోస్తున్నారు. తల్లిదండ్రులకు లక్షల్లో డబ్బు ఆశ చూపి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం, తర్వాత వారి దేశం తీసుకెళ్లడం, కామవాంఛ తీరిన తర్వాత నరకం చూపిస్తుండటంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. షేక్ కుటుంబీకులు కూడా లైంగిక దాడులకు పాల్పడుతుండటంతో దేశం కాని దేశంలో అత్యంత దుర్భర జీవితాలను గడుపుతున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది. తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ అమ్మాయిని ఆమె మేనత్తే ఒమన్కు చెందిన 76 ఏళ్ల అరబ్ షేక్కు కట్టబెట్టింది. పెళ్లి తర్వాత ఒమన్ వెళ్లిన ఆ అమ్మాయి తన దారుణ పరిస్థితిని తల్లిదండ్రులకు ఫోన్లో తెలిపింది. ఈ నరకం నుంచి తనను కాపాడకుంటే విషం తాగి చనిపోతానని విలపించింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో డీసీపీ వి.సత్యనారాయణ, అదనపు డీసీపీ కె.బాబురావులు గురువారం ఈ వివరాలు వెల్లడించారు. మాయమాటలు చెప్పి పెళ్లి.. ఫలక్నుమా పరిధిలోని నవాబ్సాబ్కుంట ప్రాంతానికి చెందిన అఫ్జల్ బేగం ఆలియాస్ సైదున్నీసా, ఆఫ్సర్లు దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద అమ్మాయి తొమ్మిదో చదువుతోంది. తమ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో తమ అమ్మాయిని వట్టేపల్లిలోని ఉంటున్న చెల్లి గౌసియా ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. గౌసియా.. ఖద్దామా(సేవకురాలు) వీసాపై వెళ్లి ఒమన్లో నివసిస్తోంది. ఈమె ఒమన్ షేక్లకు ఇక్కడి అమ్మాయిలతో పెళ్లిళ్లు చేయిస్తోంది. ఇటీవల ఆ దేశం నుంచి వచ్చిన 76 ఏళ్ల షేక్కు ఐదుగురు అమ్మాయిలను చూపించింది. అతడికి ఎవరూ నచ్చకపోవడంతో గౌసియా దృష్టి తన ఇంట్లో ఉంటున్న అన్న కూతురిపై పడింది. ఒమన్ షేక్తో అమ్మాయి పెళ్లి చేయిస్తే రూ.5 లక్షలు వస్తాయని, పేదరికం పోతుందని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. అమ్మాయి కూడా విలాసవ విలాసవంతమైన జీవితం గడుపుతుందని మాయమాటలు చెప్పి ఒప్పించింది. రంజాన్ మాసంలో వివాహం చేయించింది. అక్కడికి వెళ్లాక నరకం.. పెళ్లి అయిన నాలుగు రోజులు తర్వాత షేక్ ఒమన్ వెళ్లాడు. గతనెలలో గౌసియా.. తన మేనకోడల్ని ఒమన్ తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లాక ఆమెకు నరకం చూపిస్తున్నారు. పెళ్లాడిన వృద్ధ షేక్ జాడ లేదు. తీసుకెళ్లిన మేనత్త ఆచూకీ లేదు. షేక్ కొడుకులు, మనవళ్లు లైంగిక దాడికి పాల్పడుతున్నారు. చివరికి తనకు అన్నం కూడా పెట్టడం లేదంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ తల్లికి ఫోన్ చేసింది. తనను ఇక్కడ్నుంచి విడిపించకుంటే విషం తాగి చచ్చిపోతానని చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అరబ్ షేక్ తన రూ.5 లక్షలు చెల్లిస్తే తిరిగి బాలికను పంపుతానని చెబుతున్నట్టు అమ్మాయి తల్లి చెబుతోంది. అరబ్ షేక్ను అరెస్ట్ చేస్తామని, బాలికను హైదరాబాద్ తెస్తామని పోలీసులు తెలిపారు. మేనత్త గౌసియా, ఆమె భర్త సికిందర్, పెళ్లి చేసిన ఖాజీలపై కేసులు నమోదు చేశామన్నారు. బాలికను రక్షించేందుకు ప్రత్యేక టీమ్లను రంగంలోకి దింపినట్టు చెప్పారు. -
ఫార్మాసిటీలో పెట్టుబడులు పెడతాం
యూఏఈ ఎక్సే్చంజ్ చైర్మన్ బీఆర్ శెట్టి ఆసక్తి మంత్రి కేటీఆర్తో సమావేశమైన పారిశ్రామికవేత్త సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొల్పనున్న ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, యూఏఈ ఎక్సే్చంజ్ చైర్మన్ బీఆర్ శెట్టి ఆసక్తి చూపారు. హెల్త్కేర్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉందని ఆయన పేర్కొన్నారు. బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బీఆర్ షెట్టి సూచనప్రాయంగా అంగీకరించారు. తెలంగాణ గురించి తనకు చాలా మంది చాలా విషయాలు చెప్పారని, ఇప్పుడు మంత్రిని కలసి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి గురించి స్వయంగా తెలుసుకున్నట్లు చెప్పారు. దుబాయ్, అబుదాబిల్లోని పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటుచేసి తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు తెచ్చేలా తనవంతు కృషి చేస్తానని చెప్పారు. సంస్థ తరపున సామాజిక సేవా కార్యక్రమాలను సైతం చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ఆహ్వానించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం, సింగిల్ విండో అనుమతుల వివరాలను వివరించారు. హైదరాబాద్ బల్క్ డ్రగ్స్ ఉత్పత్తులకు రాజధానిగా అభివృద్ధి చెందిందని, లైఫ్సైన్సెస్, ఏరోస్పేస్ రంగాల్లో కూడా అధికంగా పెట్టబడులు వస్తున్నాయన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరు నెలల నరకం నుంచి విముక్తి
- అరబ్ షేక్ల చెర నుంచి బయటపడిన మహిళ - బంధువులు, పోలీసుల సహకారంతో నగరానికి హైదరాబాద్: పొట్ట చేతపట్టుకుని పరాయి దేశమెళ్లిన నగర మహిళకు నరకం చూపించారు అరబ్ షేక్లు. ఆరు నెలల పాటు ఆమెతో గొడ్డు చాకిరీ చేయించుకుని... కొట్టి.. బంధించి చిత్ర హింసలు పెట్టారు. బంధువులు... ప్రభుత్వం... పోలీసుల సహకారంతో ప్రాణాలు దక్కించుకుని ఎట్టకేలకు నగరానికి చేరుకున్న ఆమె సౌదీ పేరు చెబితేనే భయంతో వణికిపోతోంది. మహబూబ్ నగర్కు చెందిన ఆయేషా బీ (45) కుటుంబం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి లాలాపేటలో నివాసం ఉంటోంది. శాంతినగర్కు చెందిన బ్రోకర్ గౌస్.. దుబాయ్ వెళితే భారీగా సంపాదించవచ్చని ఆయేషాను నమ్మించాడు. ఆమె నుంచి రూ.లక్ష తీసుకున్న గౌస్... ఆయేషాను గత ఏడాది జూన్లో సౌదీకి పంపించాడు. నెలకు రూ.18 వేలు ఇస్తారని అక్కడ ఓ షేక్ ఇంట్లో ఆమె పనికి కుదిరింది. వెళ్లిన కొద్ది రోజులకే షేక్ కుటుంబం పైసా ఇవ్వకపోగా, ఆయేషాను కంటి నిండా నిద్రపోనీయకుండా, సరిపడా తిండి పెట్టకుండా వేధించడం మొదలుపెట్టింది. దీంతో ఓసారి ఇంటి నుంచి తప్పించుకోవడానికి ప్రయ త్నించిన ఆమెను షేక్ కుటుంబ సభ్యులు పట్టుకుని చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన ఆయేషాను నిర్బంధించి ఆరు నెలల పాటు నరకం చూపించారు. విషయాన్ని ఆమె ఎలాగో తన సోదరుడు, సామాజిక కార్యకర్త జహంగీర్కు ఫోన్ ద్వారా తెలిపింది. అతను సౌదీలో ఉన్న తన స్నేహితులు రఫీద్, ఇర్ఫాన్లకు చెప్పడంతో... వారు రెండు నెలలు శ్రమించి ఆయేషాను అక్కడి నుంచి తప్పించారు. తెలిసిన మరో షేక్ ఇంట్లో పెట్టారు. అక్కడా తిండి గింజల కోసం ఆరు మాసాలు ఆమె పనిచేయాల్సి వచ్చింది. ఈలోగా ఆమె సోదరుడు, మిత్రులు, హైదరాబాద్ పోలీసు అధికారులు చేసిన ప్రయత్నాలతో ఆయేషా తిరిగి నగరానికి చేరుకుంది. చిల్లిగవ్వ ఇవ్వలేదు... ఆరు నెలలు షేక్ ఇంట్లో పనిచేసినా తనకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయేషా ఆవేదనగా చెప్పింది. తాను అనుభవించిన నరకయాతన మరెవరూ పడకూడదని, నకిలీ వ్యక్తుల మాయలో పడి డబ్బు ఆశతో అరబ్ దేశాలకు వెళ్లవద్దని సూచించింది. తనకు సహకరించిన పోలీసులు, ప్రభుత్వం, అధికారులు, మిత్రులకు కృతజ్ఞతలు చెప్పింది. -
ఖతర్లో భారతీయుల వెతలు
ఖతర్తో ఇతర అరబ్ దేశాలు సంబంధాలు తెంచుకున్న ఫలితంగా అక్కడి నిర్మాణ రంగం కుదేలవ తోంది. ఫలితంగా ఆ రంగంలో ఉపాధి పొందుతున్న భారతీయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. పనిలేక... మరోచోట పనిచేయడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఖతర్లో ఉండలేక, స్వదేశానికి తిరిగి రాలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 2022 సాకర్ వరల్డ్కప్కు ఖతర్ ఆతిథ్యమిస్తోంది. అందుకోసం స్టేడియాల నిర్మాణంతో పాటు భారీగా మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆంక్షలు అమల్లోకి వచ్చి నెలన్నర రోజులు దాటడంతో నిర్మాణ రంగానికి అవసరమైన మెటీరియల్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సామగ్రి అందు బాటులో లేక నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. సుమారు 20 లక్షల మంది విదేశీ కార్మికులుంటే వీరిలో అత్యధికులు నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారు. ఖతర్ జనాభాలో 90% మంది విదేశీ కార్మికులే. నిర్మాణాలు నిలిచిపోవడంతో కంపెనీలు కార్మికుల్ని దీర్ఘకాలిక సెలవులపై ఇంటికి పంపేస్తున్నాయి. సాధారణంగా ఏడాదికి ఒక నెల సెలవు ఇచ్చే కంపెనీలు ఇప్పుడు ఐదునెలలు సెలవులు ప్రకటించాయి. కంపెనీ స్పాన్సర్డ్ వీసాలపై ఖతర్కు విదేశీ కార్మికులు వెళుతుంటారు. ఆ కంపెనీ పని కల్పిస్తే సరి. లేదంటే మరోచోట పనిచేయడానికి వారికి ఆస్కారం ఉండదు. దీంతో అక్కడ పనిలేక స్వదేశానికి తిరిగి వెళ్తే మళ్లీ రావడం ఆర్థికభారం కావడంతో ఖతర్ లోని విదేశీ కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయా రు. ఇప్పటికే మూడు లక్షల మంది కార్మికులు ఖతర్ను వదిలివెళ్లినట్లు అంచనా. నిర్మాణాలు నిలిచిపో తుండటం తో విదేశీ కార్మికుల ఖతర్ కల చెదిరిపోతోంది. అలాగే ఖతర్ యజమానులు కొందరు సౌదీ అరేబియా లో తమ ఫామ్హౌస్లలో పనిచేయడానికి, పశువుల కాపరులుగా భారతీయ కార్మికుల్ని నియమిం చుకున్నా రు. ఖతర్ వీసాలపై వీరిని తీసుకొచ్చి తాత్కాలిక అనుమతులతో సౌదీలో పనిలో పెట్టుకున్నారు. ఖతర్ దేశస్తులు వెంటనే సౌదీని వదిలివెళ్లాల్సిందిగా ఆదేశించ డంతో యజమాను లు వెళ్లిపోయారు. రోడ్డుమార్గాన్ని మూసివేసినందువల్ల వారి వద్ద పనిచేస్తున్న భారతీయ కార్మికులు దోహాకు వెళ్లడానికి సౌదీ అనుమతించడం లేదు. దాంతో వీరంతా ఆహారం, డబ్బు లేక రోడ్డునపడ్డారు. వీరిని ఇప్పుడు చట్టవిరుద్ధంగా సౌదీలో ఉంటున్న వారిగా పరిగణిస్తారు. ఖతర్లో 6.5 లక్షల మంది భారతీయులు ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని ఆరోపి స్తూ ఖతర్తో అన్నిరకాల సంబంధాల్ని తెంచు కుంటున్నట్లు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రయిన్, ఈజిప్టు జూన్ 5న ప్రకటించాయి. ఖతర్కు ఉన్న ఏకైక రోడ్డు మార్గాన్ని సౌదీ అరేబియా మూసివేసింది. పోర్టుల్లో ఖతర్కు వెళుతున్న నౌకలకు ప్రవేశాన్ని నిరాకరించాయి. విమానాలను రద్దు చేశాయి. తీవ్రవాద సంస్థలకు సాయం చేయకూడదని, అల్ జజీరా టీవీ ఛానల్ను మూసివేయాలని.. కొన్ని డిమాండ్లు పెట్టాయి. వీటికి ఖతర్ సమ్మతించడం లేదు. కువైట్ మధ్యవర్తిత్వం కూడా ఫలించలేదు. ఆర్థికంగా బలమైన దేశం కావడంతో ఖతర్ ఈ ఆంక్షల్ని తట్టుకొని.. ఇరాన్, టర్కీల నుంచి ఆహార పదార్థాలు, ఇతర సామగ్రిని తెచ్చుకుంటోంది. ఖతర్లో 6.5 లక్షల మంది భారతీయ కార్మికులు ఉండగా.. వీరు ఏటా రూ. 27 వేల కోట్లు భారత్కు పంపుతున్నారు. నిర్మాణ రంగం కుదేలవడంతో భారతీయ కార్మికులకు పనిలేకుండా పోతోంది. గతంలో చేసిన పనికి వేతనాలు అందక వీరిలో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఖతర్లో భారతీయ కార్మికులకు కష్టాలు
►ఖతర్లో కుదేలవుతున్న నిర్మాణరంగం ►భారతీయ కార్మికులపై ప్రభావం ఖతర్తో ఇతర అరబ్దేశాలు సంబంధాలు తెంచుకున్న ఫలితంగా అక్కడి నిర్మాణ రంగం కుదేలవుతోంది. ఫలితంగా ఆ రంగంలో ఉపాధి పొందుతున్న భారతీయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిలేక... మరోచోట పనిచేయడానికి వీల్లేక, ఖతర్లో ఉండలేక, స్వదేశానికి తిరిగి రాలేక... దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 2022 సాకర్ వరల్డ్కప్కు ఖతర్ ఆతిథ్యమిస్తోంది. దీనికోసం స్టేడియాలతో పాటు భారీ ఎత్తున్న మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. ఆంక్షలు అమల్లోకి వచ్చి నెలన్నర రోజులు దాటడంతో నిర్మాణ రంగానికి అవసరమైన మెటీరియల్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సామాగ్రి అందుబాటులో లేక నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. సుమారు 20 లక్షల మంది విదేశీ కార్మికులుంటే... వీరిలో అత్యధికులు నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారు. ఖతర్ జనాభాలో 90 శాతం మంది విదేశీ కార్మికులే. ఇప్పుడు నిర్మాణాలు నిలిచిపోవడంతో కంపెనీలు కార్మికులకు దీర్ఘకాలిక సెలవులపై ఇంటికి పంపేస్తున్నాయి. సాధారణంగా ఏడాది ఒక నెల సెలవు ఇచ్చే కంపెనీలు ఇప్పుడు ఐదునెలలు సెలవులు ఇస్తున్నాయి. కంపెనీ స్పాన్సర్డ్ వీసాలపైనే ఖతర్కు విదేశీ కార్మికులు వెళుతుంటారు. కాబట్టి ఆ కంపెనీ పని కల్పిస్తే సరి. లేదంటే మరోచోట పనిచేసుకోవడానికి ఆస్కారం ఉండదు. అక్కడుంటే పని లేదు... స్వదేశానికి తిరిగి వెళ్తే మళ్లీ రావడం ఆర్థికభారం. దీంతో ఖతర్లోని విదేశీ కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇప్పటికే మూడు లక్షల మంది కార్మికులు ఖతర్ను వదిలివెళ్లినట్లు అంచనా. నిర్మాణాలు క్రమేపీ నిలిచిపోతుండటంతో విదేశీ కార్మికుల ఖతర్ కల చెదిరిపోతోంది. అలాగే ఖతర్ యజమానులు కొందరు సౌదీ అరేబియాలో తమ ఫామ్హౌస్లలో పనిచేయడానికి, పశువుల కాపరులుగా భారతీయ కార్మికులను నియమించుకున్నారు. ఖతర్ వీసాలపై వీరిని తీసుకొచ్చి తాత్కాలిక అనుమతులతో సౌదీలో పనిలో పెట్టుకున్నారు. ఖతర్ దేశస్తులు వెంటనే సౌదీని వదిలివెళ్లాల్సిందిగా ఆదేశించడంతో యజమానులు వెళ్లిపోయారు. రోడ్డుమార్గాన్ని మూసివేసినందువల్ల వారి వద్ద పనిచేస్తున్న భారతీయ కార్మికులు దోహాకు వెళ్లడానికి సౌదీ అనుమతించడం లేదు. దాంతో వీరంతా ఆహారం, నగదు లేకుండా రోడ్డునపడ్డారు. మరో సమస్య ఏమిటంటే వీరిప్పుడు చట్టవిరుద్ధంగా సౌదీలో ఉంటున్న వారవుతారు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ ఖతర్తో అన్నిరకాల సంబంధాలను తెంచుకుంటున్నట్లు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రయిన్, ఈజిప్టు జూన్ 5న ప్రకటించాయి. ఖతర్కు ఉన్న ఏకైక రోడ్డు మార్గాన్ని సౌదీ అరేబియా మూసివేసింది. పోర్టుల్లో ఖతర్కు వెళుతున్న నౌకలకు ప్రవేశాన్ని నిరాకరించాయి. విమానాలను రద్దు చేశాయి. తీవ్రవాద సంస్థలకు సాయం చేయకూడదని, అల్ జజీరా టీవీ ఛానల్ను మూసివేయాలని.. ఇలా కొన్ని డిమాండ్లు పెట్టాయి. వీటికి ఖతర్ సమ్మతించడం లేదు. కువైట్ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఆర్థికంగా బలమైన దేశం కావడంతో ఖతర్ ఈ ఆంక్షలను తట్టుకొని... ఇరాన్, టర్కీల నుంచి ఆహారపదార్థాలు, ఇతరత్రా సామాగ్రిని తెచ్చుకుంటోంది. ఖతర్లో 6.5 లక్షల మంది భారతీయ కార్మికులు ఉన్నారు. వీరు ఏటా 27 వేల కోట్ల రూపాయలను భారత్కు పంపుతున్నారు. నిర్మాణ రంగం కుదేలవడంతో భారతీయ కార్మికులకు పనిలేకుండా పోతోంది. గతంలో చేసిన పనికి వేతనాలు అందక వీరిలో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. -
ఖతర్పై అరబ్ దేశాల మండిపాటు
రియాద్: సౌదీ అరేబియా, దాని మిత్ర దేశాలు ఖతర్ మొండి వైఖరిపై మండిపడ్డాయి. తమ డిమాండ్లను ఖతర్ ఒప్పుకోకపోవడంతో ఆ దేశంపై గుర్రుగా ఉన్నాయి. అరబ్ దేశాల్లో శాంతిభద్రతలను దెబ్బతీయడమే తన లక్ష్యంగా ఖతర్ పెట్టుకుందని ఆరోపిస్తున్నాయి. సౌదీ అరేబియా, ఈజిప్ట్, యూఏఈ, బహ్రెయిన్ లాంటి అరబ్ దేశాలు.. ఖతర్తో దౌత్య, ఆర్థిక, బౌగోళిక సంబంధాలను తెంచుకోవడం తెలిసిందే. గత నెలలో అల్జజీరా చానల్ మూసివేత, టర్కీ సాయుధ దళాల తొలగింపు, ఇరాన్తో బంధాలను తెంచుకోవడం, ఐసిస్, అల్కాయిదా వంటి పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను తెంచుకోవడం వంటి 13 డిమాండ్లను అంగీకరించాలని ఖతర్ను కోరాయి. ఈ మేరకు ఇచ్చిన గడువు కూడా ముగిసిన నేపథ్యంలో అరబ్దేశాలు ఖతర్పై విరుచుకుపడుతున్నాయి. -
అల్ జజీరాను మూసేయాల్సిందే!
దుబాయ్: ఖతార్ను ఇప్పటికే బహిష్కరించిన అరబ్ దేశాల్లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్టు దేశాలు తమ 13 డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా అల్టిమేటమ్ జారీ చేశాయి. అందుకు పది రోజుల గడువును విధించాయి. ఆ డిమాండ్లలో ఖతార్లోని అల్ జజీరా మీడియా నెట్వర్క్ను, దాని అనుబంధ సంస్థలన్నింటిని మూసివేయాలని ముందుగా డిమాండ్ చేసింది. తీవ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకోక పోవడం, దేశంలో నిర్మిస్తున్న టర్కీ వైమానిక స్థావరం పనులను తక్షణం నిలిపివేయడం, ఇరాన్తో దౌత్య సంబంధాలను కుదించుకోవడం, తమ నాలుగు దేశాలకు చెందిన పౌరులకు ఖతార్ పౌరసత్వం ఇవ్వడం నిలిపివేయడం ప్రధాన డిమాండ్లు. ఈ డిమాండ్ల చిట్టా శుక్రవారం నాడే తమకు అందిందని, వాటిని పరిశీలిస్తున్నామని ఖతార్ ప్రభుత్వం తెలిపింది. అరబ్, తమ దేశాల మధ్య కువైట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నందున ఆ దేశానికే తమ సమాధానం చెబుతామని ప్రభుత్వం పేర్కొంది. డిమాండ్లు చూడబోతే అంతర్జాతీయ టెర్రరిజాన్ని అరికట్టడంకన్నా తమ దేశ సార్వభౌమాధికారాన్ని కుదించడమే లక్ష్యంగా కనిపిస్తోందని ఖతార్ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కొన్ని డిమాండ్లు అంతర్జాతీయ మానవ హక్కులు, వాటి ఒడంబడికలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని ఖతార్ జాతీయ మానవ హక్కుల సంఘం ఆరోపించింది. కాగా ఖతార్ను బహిష్కరించిన సోదరు అరబ్ దేశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 'అల్ జజీరా' టీవీ చానెల్పై పడ్డాయి. 'అల్ జజీరా' చానెల్ను వెంటనే మూసివేయాలని అల్టిమేటం జారీచేశాయి. ఉగ్రవాదాన్ని ఎగదొస్తున్నదనే ఆరోపణలతో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఈఏ), ఈజిప్టు, బ్రహెయిన్ దేశాలు ఖతార్తో పూర్తిగా దౌత్య సంబంధాలు తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఆ చానెల్ను మూసివేయండి!
దుబాయ్: ఖతార్ను బహిష్కరించిన సోదరు అరబ్ దేశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 'అల్ జజీరా' టీవీ చానెల్పై పడ్డాయి. 'అల్ జజీరా' చానెల్ను వెంటనే మూసివేయాలని అల్టిమేటం జారీచేశాయి. ఉగ్రవాదాన్ని ఎగదొస్తున్నదనే ఆరోపణలతో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఈఏ), ఈజిప్టు, బ్రహెయిన్ దేశాలు ఖతార్తో పూర్తిగా దౌత్య సంబంధాలు తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ తమతో దౌత్యసంబంధాలు పునరుద్ధరించుకోవాలంటే తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ 13 డిమాండ్ల జాబితాను ఆయా దేశాలు ఖతార్కు అందజేశాయి. అందులో ఖతార్ కేంద్రంగా నడిచే 'అల్ జజీరా' చానెల్ను మూసివేయాలన్న డిమాండ్ కూడా ఉంది. అంతేకాకుండా తమ బద్ధ శత్రువైన ఇరాన్తో దౌత్య సంబంధాలు తెంపుకోవాలని, ముస్లిం అతివాద గ్రూపులైన ముస్లిం బ్రదర్హుడ్, ఇస్లామిక్ స్టేట్, అల్ కాయిదా, హిజ్బుల్లా, సిరియాలోని జభాత్ ఫతే అల్ షామ్ తదితర సంస్థలతో సంబంధాలు ఉండరాదని డిమాండ్ చేశాయి. ఖతార్లోని టర్కీ సైనిక స్థావరాన్ని సైతం ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్లపై ఖతార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి -
ఉగ్ర అంతానికిది ఆరంభం
ఖతర్తో అరబ్ దేశాల కటీఫ్పై ట్రంప్ ► తన పశ్చిమాసియా పర్యటన ఫలితమిస్తోందని వెల్లడి వాషింగ్టన్/దోహా: ఖతర్తో అరబ్ దేశాలు దౌత్య సంబంధాలు తెంచుకోవడం ఉగ్రవాద అంతానికి ఆరంభమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఇటీవల తను జరిపిన పర్యటన మంచి ఫలితాలిస్తోందని మంగళవారం ట్వీట్ చేశారు. ‘సౌదీ అరేబియా రాజుతోపాటు 50 దేశాల నేతల భేటీతో సాగిన నా సౌదీ పర్యటన ఇప్పటికే ఫలితాలిస్తోంది. ఉగ్రవాద సిద్ధాంతానికి ఇంకెంతమాత్రం నిధులు అందకూడదని వారికి చెప్పాను.. నేతలు ఇప్పుడు ఖతర్ను వేలెత్తి చూపుతున్నారు.. ఉగ్రవాదానికి నిధుల ప్రవాహంపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.. ఉగ్రవాద బీభత్సం అంతానికి బహుశా ఇది ఆరంభం కావొచ్చు’ అని పేర్కొన్నారు. ఖతర్ విమానాలకు ‘అరబ్’ దెబ్బ ఖతర్తో అరబ్ దేశాల కటీఫ్ వెంటనే తీవ్ర ప్రభావం చూపింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) తదితర దేశాలు ఖతర్కు మంగళవారం నుంచి విమాన సర్వీసులను నిలిపివేశాయి. ప్రతిగా ఖతర్ కూడా ఆ దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో పర్షియన్ సింధుశాఖలో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ప్రాంతంలో దాదాపు 70 విమానాలు నిలిచిపోయాయి. ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత్ సహా పలు దేశాల ప్రజలు చిక్కుకుపోయారు. యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాలకు వెళ్లే విమానాలను ఖతర్.. ఇరాన్, టర్కీల మీదుగా దారి మళ్లించింది. ఆసియా–పసిఫిక్, యూరప్, అమెరికా ప్రాంతాల మధ్య సాగే పలు కీలక విమాన సర్వీసులకు దోహా మజిలీ కావడంతో సమస్య తీవ్రం కానుంది. విదేశాలకు వెళ్లే భారతీయుల్లో చాలామంది దోహా నుంచే వెళ్తుంటారు. 2016లో భారత్, ఖతర్ మధ్య 26 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఖతర్పై యూఏఈ ఆంక్షల నేపథ్యంలో ఖతర్ వెళ్లే భారత విమానాలు పాకిస్తాన్, ఇరాన్ మీదుగా దోహాకు వెళ్తున్నాయి. దీంతో ప్రయాణ సమయం గంటకుపైగా పెరిగింది. కువైట్ మధ్యవర్తిత్వం ఖతర్ సంక్షోభ పరిష్కారానికి కువైట్ రంగంలోకి దిగింది. అరబ్ దేశాలకు, ఖతర్కు సయోధ్య కుదర్చడానికి కువైట్ అమీర్ (రాజు) షేక్ సబా అల్ అహ్మద్ అల్సబా మంగళవారం సౌదీ అరేబియాలోని జెడ్డాకు పయనమయ్యారు. ఆయన వెంట విదేశాంగ, సమాచార మంత్రులున్నారు. సంయమనం పాటించాలని ఆయన ఖతర్ అమీర్ అల్ థానీని కోరారు. అల్ సబా విజ్ఞప్తిపై అల్ థానీ.. అల్ జజీరా టీవీ చానల్లో చేయాల్సిన ప్రసంగాన్ని వాయిదా వేసుకున్నారని ఖతర్ విదేశాంగ మంత్రి రెహమాన్ తెలిపారు. 2014లో అరబ్ దేశాలకు, ఖతర్కు దౌత్య సంబంధాలు చెడినప్పుడూ కువైట్ పాలకుడు మధ్యవర్తిగా వ్యవహరించి రాజీ కుదిర్చారు. -
ఖతర్తో కటీఫ్...
అరబ్ దేశాలు, మాల్దీవుల నిర్ణయం ► ఉగ్రవాదానికి ఊతమిస్తోందని మండిపాటు ► రవాణా మార్గాల మూసివేత ► ఆరోపణలను తోసిపుచ్చిన ఖతర్ ► పశ్చిమాసియాలో పెను దౌత్య సంక్షోభం రియాద్: పశ్చిమాసియాలో పెను దౌత్య సంక్షోభం తలెత్తింది. ఖతర్ ఉగ్రవాదానికి ఊతమిస్తోందంటూ ఆ దేశంతో సౌదీ అరేబియా సహా ఐదు అరబ్ దేశాలు దౌత్యసంబంధాలను తెగతెంపులు చేసుకున్నాయి. దక్షిణాసియా ద్వీపదేశం మాల్దీవులు కూడా ఖతర్ను వెలేసింది. ఖతర్తో సంబంధాలను తెంచుకుంటున్నామని లిబియాలోని సమాంతర ప్రభుత్వాల్లో ఒకటైన తూర్పు లిబియాలోని ప్రభుత్వం తెలిపింది. చుట్టుపక్కల ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ఖతర్ పలు ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తోందని సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), బహ్రెయిన్, యెమన్, ఈజిప్టు సోమవారం ఆరోపించాయి.ఖతర్తో రవాణా మార్గాలను మూసేస్తున్నామని, తమ దేశంలోని ఖతర్ పౌరులు రెండువారాల్లోగా వెళ్లిపోవాలని ఆదేశించాయి. సరిహద్దుల మూసివేతతో ఖతర్లో ఆహార సంక్షోభం నెలకొన్నట్లు వార్తలు వచ్చాయి. ‘ఉగ్రవాద ముప్పు నుంచి మా దేశాన్ని కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం.. ముస్లిం బ్రదర్హుడ్, దాయెష్(ఐఎస్), అల్ కాయిదా వంటి గ్రూపులకు ఖతర్ మద్దతిస్తోంది.. మా దేశంలోని షియాలు అధికంగా ఉన్న ఖతిఫ్తోపాటు బహ్రెయిన్లో ఇరాన్ ప్రోద్బలంతో సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా అండగా నిలుస్తోంది’ అని సౌదీ పేర్కొంది. గల్ఫ్ దేశాలు సంరక్షక పాత్రతో తమపై పెత్తనం చలాయించాలని చూస్తున్నాయని ఖతర్ ఆరోపించింది. ‘వాటి చర్యలు సమర్థనీయం కాదు. తప్పుడు, నిరాధార ప్రకటనల ఆధారంగా ఆ నిర్ణయం తీసుకున్నాయి’ అని ఖతర్ విదేశాంగ శాఖ విమర్శించింది. ఖతర్కు వెళ్లొద్దు.. తమ పౌరులు ఖతర్కు వెళ్లొద్దని, తమ దేశాల్లోని ఖతర్ పౌరులు 14 రోజుల్లోగా వెళ్లిపోవాలని అరబ్ దేశాలు ఆదేశించాయి. ఖతర్తో ఉన్న సరిహద్దులను మూసేస్తున్నట్లు సౌదీ తెలిపింది. మంగళవారం నుంచి ఖతర్కు తమ సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఎమిరేట్స్, ఇతిహాద్, ఫ్లైదుబాయ్, ఎయిర్ అరేబియా, సౌదీ అరేబియా ప్రకటించాయి. సౌదీకి తమ సర్వీసులను తక్షణం మూసేస్తున్నట్లు ఖతర్ కూడా ప్రకటించింది. ఖతర్కు విమాన సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఈజిప్టు తెలిపింది. యెమన్లో ఇరాన్ మద్దతున్న రెబల్స్పై పోరాడుతున్న సౌదీ నేతృత్వంలోని కూటమి తమ గ్రూపు నుంచి ఖతర్ను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఇంధన వనరులు పుష్కలంగా ఉన్న ఖతర్తో పొరుగు దేశాల తెగతెంపుల నిర్ణయం పశ్చిమాసియాలోనే కాకుండా పాశ్చాత్య దేశాల ప్రయోజనాలపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. ఐసిస్, తదితర ఉగ్ర సంస్థలపై పోరులో కీలకమైన అమెరికా ఎయిర్బేస్ ఖతర్లో ఉంది. 2022లో ఫుట్బాల్ వరల్డ్ కప్ క్రీడలు ఖతర్లోనే జరగనున్నాయి. ఆహార పదార్థాలతోపాటు చాలా వస్తువులను ఖతర్ పొరుగు దేశాలనుంచి దిగుమతి చేసుకుంటోంది. ఖత ర్ ప్రజలు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఆహారాన్ని కొని దాచుకుంటున్నారని వార్తలొచ్చాయి. భారతీయులే ముఖ్యం: ఖతర్తో అరబ్ దేశాల తెగతెంపులు గల్ఫ్ సమన్వయ మండలి అంతర్గత వ్యవహారమని, ఆ ప్రాంతంలోని భారతీయుల గురించే ఆందోళన చెందుతున్నామని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. 26 లక్షల ఖతర్ జనాభాలో 6.5 లక్షల మంది భారతీయులు ఉన్నారు. నిర్ణయం వెనుక.. ఇరాన్ అండ ఉన్న గ్రూపులతోపాటు పలు ఉగ్ర ముఠాలకు ఖతర్ మద్దతిస్తోందని గల్ఫ్ దేశాలు కొన్నేళ్లుగా ఆరోపిస్తున్నాయి. 2014లో ఖతర్ నుంచి తమ రాయబారులు వెనక్కి పిలిపించాయి. పొరుగు దేశాలు తమ వార్తా సంస్థను హ్యాక్ చేసి, తమపై దుష్ప్రచారానికి ఒడిగట్టాయని ఖతర్ ఇటీవల ఆరోపించింది. సౌదీ అరేబియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా ఖతర్ రాజు(అమీర్) షేక్ అల్ థానీ కొన్ని వ్యాఖ్యలు చేశారని ఇటీవల ఖతర్ న్యూస్ ఏజెన్సీలో వార్తలు వచ్చా యి. ఇరాన్పై అమెరికా శత్రువైఖరిని ఆయన ప్రశ్నించారని, ట్రంప్ చాలా కాలం పదవిలో కొనసాగరని, ఖతర్– అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయని ఆయన అన్నట్లు కథనాలొచ్చాయి. వీటిని ఖతర్ తోసిపుచ్చింది. తమ న్యూస్ ఏజెన్సీని హ్యాక్ చేశారని, తాము సైబర్ నేర బాధితులమని పేర్కొంది. ఉగ్రవాదంపై ముస్లిం దేశాలు కలసికట్టుగా పోరాడాలని ట్రంప్.. సౌదీ పర్యటనలో పిలుపునిచ్చిన నేపథ్యంలో కీలక అరబ్ దేశాలు ఖతర్తో సంబంధాలు తెంచుకున్నాయి. -
2117 నాటికి మార్స్పై సిటీ
దుబాయ్: మానవుడు తన మేధాశక్తికి సాంకేతికతను జోడించి అసాధ్యమ నుకున్న వాటిని సుసాధ్యం చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు ఇతర గ్రహాలపై పరిశోధనలకు మాత్రమే పరిమితమైన దీన్ని త్వరలోనే గ్రహాలపై గృహాలు, నగరాలు, ఆధునిక కట్టడాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదే నిజమైతే రానున్న కాలంలో మనిషిని కూడా గ్రహాంతరవాసిగా పరిగణించే పరిస్థితి రానుంది. మరో వందేళ్లలో.. అంటే 2117 నాటికి అంగారకుడిపై మొట్టమొదటి నగరాన్ని నిర్మించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రణాళికలు రచిస్తోంది. దీంతోపాటు రానున్న దశాబ్దకాలంలో మనుషులను రవాణా చేసేందుకూ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ మేరకు రానున్న 100 ఏళ్ల జాతీయ ప్రణాళిక విధానాన్ని యూఏఈ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్దుమ్, అబుదాబీ యువరాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో ప్రకటించినట్లు గల్ఫ్ న్యూస్ తెలిపింది. రానున్న వందేళ్ల కాలంలో ఈ దిశగా పరిశోధనలు సాగించేందుకు పలు అంతర్జాతీయ సంస్థలతో కలసి పనిచేయనున్నట్లు చెప్పారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా అంతరిక్ష పరిశో ధనలు ప్రారంభించి యువతను ఆకర్షించను న్నట్లు తెలిపారు. అలాగే మనుషులు, ఆహారం, ఇతర నిత్యావసరాలను పంపేందుకు భూమి, అరుణగ్రహం మధ్య వేగవంతమైన రవాణా మార్గాన్ని నిర్మించను న్నట్లు చెప్పారు. ‘ఇతర గ్రహాలపై అడుగుపెట్టడం మానవుని దీర్ఘకాల కోరిక. ఈ కలను యూఏఈ నిజం చేస్తుంది’ అని దుబాయ్ రాజు రషీద్ అన్నారు. మార్స్ పై పరిశోధనలకు తమ మొదటి అంతరిక్షనౌకను 2021 లో ప్రయోగించనున్నట్లు యూఏఈ ప్రకటించింది. -
80 డేగలకు విమాన టికెట్లు!
దుబాయ్: 80 డేగలను తనతోపాటు విమానంలో తీసుకెళ్లడానికి సౌదీ యువరాజు వాటికోసం ప్రత్యేకంగా టికెట్లను కొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను సామాజిక మాధ్యమం రెడ్డిట్ వెబ్సైట్లో ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. విమానాల్లో కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించే తన స్నేహితుడు తనకు ఈ ఫొటోను పంపినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. కళ్లకు గంతలు కట్టిన డేగలను విమానంలోని సీట్లకు కట్టేసినట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది. డేగ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) జాతీయ పక్షి. ఇక్కడ విమానాల్లో వాటిని తీసుకెళ్లడానికి సాధారణంగానే అనుమతిస్తారు. -
దావూద్ వేట షురూ.. ఆస్తులు సీజ్!
న్యూఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం షాకిచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న అతడి ఆస్తులన్నింటిని సీజ్ చేసేందుకు ముందడుగేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని భారత ఇంటెలిజెన్స్గానీ, దర్యాప్తు సంస్థలుగానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. తమకు యూఏఈ నుంచి దీనికి సంబంధించి సమాచారం ఇంకా రాలేదని అంటున్నాయి. అయితే, యూఏఈ సీజ్ చేసిన ఆస్తులు విలువ దాదాపు రూ.15వేల కోట్లు ఉంటుందని అంచనా. 1993నాటి ముంబై పేలుళ్లకు ప్రధాన కారణం దావూద్ ఇబ్రహీం అని తెలిసిందే. ఇంకా ఎన్నో నేరాలు అతడు చేశాడు. అతడి కోసం భారత్ ఎప్పటి నుంచో వెతుకుతోంది. పాక్లోనే అతడు తలదాచుకున్నాడని తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యూఏఈ తాము నేరస్తులకు, ఉగ్రవాదులకు వ్యతిరేకం అని పరోక్షంగా చెప్పింది. దీంతోపాటు ప్రధాని నరేంద్రమోదీ 2015లో యూఏఈ పర్యటనకు వెళ్లినప్పుడు దావూద్ విషయాన్ని అక్కడ ప్రభుత్వానికి చెప్పడమే కాకుండా అతడి ఆస్తుల వివరాలను అందించి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే అతడి ఆస్తులు సీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇంకా ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. -
అరబ్లో తొలి భారత అధ్యయన పీఠం
కైరో: అరబ్ దేశాలలో తొలి భారతీయ అధ్యయన పీఠాన్ని ఈజిప్టులోని ప్రఖ్యాత ఐన్ షామ్స్ యూనివర్సిటీలో గతవారం(ఏఎస్యూ) ఏర్పాటు చేశారు. భారత సాంస్కృతి సంబంధాల శాఖ(ఐసీసీఆర్), యూనివర్సిటీ మధ్య ఈ ఏడాది కుదిరిన ఒప్పందం మేరకు ఈ పీఠాన్ని నెలకొల్పారు. భారత్–ఈజిప్ట్ల మధ్య పౌర సంబంధాలు ఉన్నప్పటికీ, విద్యారంగంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణులు చాలా పరిమితంగా ఉన్నాయని పీఠం ప్రారంభ సభలో భారత రాయబారి సంజయ్ భట్టాచార్య అన్నారు. మూడేళ్లు పనిచేసే ఈ పీఠాన్ని పరస్పర అంగీకారంతో పొడిగించుకోవచ్చు. -
మోసం చేసినట్టు చెప్పకు!
ఖలీఫా అల్ మామూన్ దగ్గర ఓ అందమైన అరబ్ గుర్రం ఉంది. ఓమా అనే వ్యక్తి దానిని కొనుక్కోవాలనుకున్నాడు. అందుకు సాటిగా అనేక ఒంటెలు, బోలెడంత డబ్బూ ఇస్తానని చెప్పాడు. అయినా మామూన్ అందుకు ఒప్పుకోలేదు. కానీ ఓమా ఆరు నూరైనా ఆ గుర్రాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. అల్ మామూన్ గుర్రం మీద స్వారీ చేసే మార్గంలో ఓ రోజు ఓమా మురికి పట్టిన బట్టలతో బోర్లా పడుకున్నాడు. ఆ మార్గంలో వచ్చిన అల్ మామూన్ రోడ్డు పక్కన పడి ఉన్న అతనిని చూసాడు. గుర్రం మీద నుంచి దిగి అతని వద్దకు వచ్చి లేపి కూర్చోబెట్టాడు. అయ్యా! పలు రోజులుగా పస్తులున్నాను. ఆకలితో శోష వచ్చి పడిపోయాను. నడవలేని స్థితిలో ఉన్నాను. నేను లేచి నిల్చోలేని స్థితిలో ఉన్నాను అంటూ గొణిగాడు ఓమా. ఆ మాటలు విని జాలిపడిన మామూన్ ఓమాను నెమ్మదిగా నడిపించి ఎలాగోలా అతనిని గుర్రం మీద కూర్చోబెట్టాడు. మరుక్షణమే ఓమా గుర్రాన్ని వేగంగా పోనిచ్చాడు. మామూన్ విస్తుపోయాడు. అంతలోనే తమాయించుకున్న మామూన్ అరిచేసరికే ఓమా వేగంగా వెళ్ళిపోయాడు. ఆగు....ఒక్క క్షణం ఆగు...నేను చెప్పేది విను. ఆ తర్వాత వెళ్ళిపో...నేను నిన్ను ఆపడం లేదు అన్నాడు మామూన్. ఓమా గుర్రం మీదే వెనక్కు వచ్చాడు. మామూన్ వంక చూసాడు. ఏమిటో చెప్పు త్వరగా అన్నాడు ఓమా. నీకు ఈ గుర్రం నీకు ఎలా లభించిందో ఎవరికీ చెప్పకు. ఇలా నన్ను మోసం చేసినట్టు చెప్పకు...ఒకవేళ నిజంగానే శోష వచ్చి రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాసరే ఇప్పటి నుంచి ఇంకెవరూ అలా పడిపోయిన వారికి సాయం చెయ్యక పరిపరి విధాలా ఆలోచిస్తారు....సాయం చేయడానికి వెళ్తే ఏం ముప్పు ముంచుకొస్తుందో అని భయపడతారు... అన్నాడు మామూన్. తన గుర్రం దొంగతనానికి గురైనందుకు బాధ పడలేదు మామూన్. కానీ ప్రజల మధ్య ఇలా మోసపోయిన తీరు గానీ వ్యాపిస్తే ఇతరులకు సహాయం చెయ్యాలి అనే వారు కూడా పునరాలోచనలో పడతారు కదా అని ఆయన ఆలోచించి ఓమాకు తాను మోసపుచ్చి గుర్రాన్ని పొందినట్టు ఎవరితోనూ చెప్పవద్దని సూచించాడు మామూన్. - మహిమ -
అర్ధరాత్రి మహిళ సాహసం
అర్ధరాత్రి పూట ఏదైనా ప్రమాదం జరిగితే సాధారనంగా అటువైపు వెళ్లేవాళ్లు మనకు ఎందుకొచ్చిందిలే అని ఊరుకుంటారు. కనీసం గాయపడిన వాళ్లను చూసే ప్రయత్నం కూడా చేయరు. కానీ రస్ అల్ ఖైమా ప్రాంతంలో మాత్రం ఆస్ట్రియాకు చెందిన ఓ మహిళ అద్భుతమైన సాహసం ప్రదర్శించింది. తీవ్రంగా గాయపడిన అరబ్ యువతిని తక్షణం కారులోంచి బయటకు తీసి, ప్రాథమిక చికిత్స చేసి.. తర్వాత వైద్య బృందానికి తెలిపింది. దాంతో ఆ అరబ్ యువతి ఘోర ప్రమాదం నుంచి సజీవంగా బయటపడింది. రస్ అల్ ఖైమాలోని ఓ ఫస్ట్ క్లాస్ హోటల్లో పనిచేసే సబ్రినా హొవోస్కీ అనే ఆస్ట్రియన్ మహిళ ప్రదర్శించిన ఈ ధైర్య సాహసాలకు గాను ఆమెను సత్కరించి, పురస్కారం అందజేసినట్లు ఆ ప్రాంత పోలీసు అధికారి అబ్దుల్లా ఖమీస్ అల్ హదీదీ తెలిపారు. బాధితురాలు కారు నడుపుతూ స్టీరింగ్ మీద నియంత్రణ కోల్పోయిందని.. కారు పలుమార్లు బోల్తా పడి హమారా మాల్ ఎదురుగా పడిపోయింది. ఆ దగ్గర్లోనే ఉన్న సబ్రినా వెంటనే ఆమె వద్దకు పరుగున వెళ్లి కారులోంచి బయటకు లాగి, ఆమెకు అత్యవసరంగా చేయాల్సిన చికిత్స చశారు. అనంతరం సెంట్రల్ ఆపరేషన్స్ రూంకు ఫోన్ చేశారు. ఆమె అంత తక్షణం స్పందించడం వల్లే అరబ్ యువతి ప్రాణాలు దక్కినట్లు పోలీసులు తెలిపారు. సమాజంలో అందరూ ఆమె మార్గంలో నడిచి, పరస్పర సామాజిక బాధ్యతను చూపించాలని అల్ హదీదీ అన్నారు. సబ్రినా వెంటనే స్పందించకపోతే బాధితురాలు మరణించి ఉండేదని ఆయన అన్నారు. -
గల్ఫ్ దేశాల్లో పనిచేయడం మనకు ప్రత్యక్ష నరకం
న్యూఢిల్లీ: పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాల బాట పట్టిన భారతీయులు ఆ దేశాల్లో అనుభవిస్తున్న బాధలు అంతా ఇంతా కాదు. కొంత మంది ఉద్యోగాలు ఊడిపోయి ఆకలి మంటలతో అలమటిస్తుండగా, మరికొంత మంది అక్రమంగా జైల్లో మగ్గిపోతున్నారు. ఇంకొందరు అకాల మరణాలకు గురవుతున్నారు. సౌదీ అరేబియా, కువైట్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఓమన్, బహ్రెయిన్ గల్ఫ్ దేశాల్లో భారతీయ కార్మికులు ఏడాదికి 69 మంది అకాల మరణం పాలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల మృతిసంఖ్య సగటున ఏడాదికి 26 ఉండగా, గల్ఫ్లోనే అత్యధికంగా ఉంది. అమెరికాలో జీవిస్తున్న భారతీయ కార్మికులతో పోలిస్తే సౌదీ అరేబియా, కువైట్లో చనిపోయే ప్రమాదం పది రెట్లు ఎక్కువగా ఉందని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. సౌదీ, ఓమన్, కువైట్, యూఏఈ నివేదికల ప్రకారం ఆయా దేశాల్లో ప్రతి లక్ష మంది కార్మికుల్లో 65 నుంచి 75 మంది భారతీయులు మరణిస్తున్నారు. పని ప్రదేశాల్లో సంభవించే ప్రమాదాల వల్ల, పని ఒత్తిడిని తట్టుకోలేక వచ్చే గుండెపోటు వల్ల, ఉన్న ఉద్యోగం ఊడిపోయి రోడ్డునపడి పస్తులుండడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ఆరు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల్లో 87 శాతం మంది తమ దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నామంటూ ఆయా దేశాల్లోని భారతీయ అంబసీలకు ఫిర్యాదు చేశారంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఖతార్లోని భారతీయ అంబసీకి 13,624 ఫిర్యాదులు, సౌదీ అరేబియాలో 11,195 ఫిర్యాదులు, కువైట్లో 11,103 ఫిర్యాదులు అందయాని భారత విదేశాంగ శాఖే ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది. జీతాలు చెల్లించక పోవడం, చెల్లించినా రావాల్సిన దానికన్నా తక్కువ చెల్లించడం, చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేయడం, ఎక్కువ పని గంటలు ఉండడం, ఎలాంటి సదుపాయాలులేని దుర్భర పరిస్థితుల్లో జీవించడం, భౌతికంగా హింసించడం, సకాలంలో వీసాలు, వర్క్ పర్మిట్ కార్డులు రిన్యువల్ చేయకపోవడం, వైద్య ఖర్చులు చెల్లించకపోవడం, కాంట్రాక్టు పీరియడ్ ముగిశాక మాతృదేశానికి విమాన టిక్కెట్లు ఇవ్వకపోవడం తదితర అంశాలపై ఈ ఫిర్యాదులు అందాయి. ప్రపంచవ్యాప్తంగా 7,213 మంది భారతీయ కార్మికులు జైళ్లలో మగ్గిపోతుండగా, ఒక్క సౌదీ అరేబియాలోనే 1,697 మంది మగ్గిపోతున్నారు. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్లో 1,143 మంది భారతీయులు జైళ్లలో మగ్గిపోతున్నారు. సకాంలో వీసాలను రిన్యువల్ చేయక పోవడం వల్ల, తిరుగు ప్రయాణంలో విమాన టిక్కెట్లు కొనుగోలుచేసే శక్తి లేకపోవడం వల్ల పని ఒత్తిడి తట్టుకోలేక కంపెనీ నుంచి పారిపోవడం తదితర కారణాల వల్ల భారతీయ కార్మికులు జైళ్లలో మగ్గిపోతున్నారు. -
పాకిస్తాన్ క్రికెట్ ఇక ముగిసినట్లే!
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ను ఆ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ హెచ్చరించాడు. స్వదేశంలో నిర్వహించనున్న సిరీస్లను ఇకపై యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించడం ఆపేయాలని సూచించాడు. అలా కానీ పక్షంలో పాకిస్తాన్ క్రికెట్ శకం ఇక ముగిసినట్లే అని తీవ్ర వ్యాఖ్యలుచేశాడు. గత ఆరేళ్లుగా నిర్జీవంగా ఉండే దుబాయ్, షార్జా, అబుదాబీ పిచ్ లపై ఆడటం వల్ల పాక్ బ్యాట్స్ మన్ చాలా కోల్పోతున్నారని వ్యాఖ్యానించాడు. అందుకే ఆటగాళ్లు టెక్నిక్, తమ నైపుణ్యం లోపించిందన్నాడు. తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన పాక్, రెండో టెస్టుకొచ్చేసరికి మళ్లీ పాతకథే పునరావృతం అయిందన్న నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ యూసఫ్ ఈ విధంగా స్పందించాడు. 2014-15లో ఆసీస్ తో సిరీస్లో పాక్ బ్యాట్స్ మన్ 9 సెంచరీలు కొట్టగా, ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్ లో రెండు టెస్టుల్లో కలిపి ఒక్క సెంచరీ నమోదైందని వెటరన్ ప్లేయర్ యుసఫ్ పేర్కొన్నాడు. పాక్ లో నిర్వహించాల్సిన సిరీస్ లకు శ్రీలంక, బంగ్లాదేశ్ పిచ్ లను ప్రత్యాయ్నాయంగా భావించాలన్నాడు. ఆలా చేయకపోతే టెస్టులు, వన్డేల్లో ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు ఎదుర్కొంటున్న పరిస్థితులు తలెత్తుతాయని పీసీబీకి తన అభిప్రాయాలను వివరించాడు. -
అరబ్ వస్తువులకు కేరాఫ్ బార్కాస్ బజార్
అరబ్ సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన బార్కాస్ ప్రాంతంలో రంజాన్ సందడి నెలకొంది. పాతబస్తీతో సంబంధం లేకుండా ప్రత్యేకమైన వస్తువులు లభ్యమవడం ఇక్కడి విశేషం. రంజాన్ మాసం నుంచే బార్కాస్ బజార్లో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తున్నారు. కాగా రంజాన్కు మరో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో బార్కాస్ బజార్లో రద్దీ మరింత పెరిగింది. రాత్రి పూట ఇక్కడి ప్రజలు గావ తాగుతూ పెద్ద ఎత్తున షాపింగ్ చేయడంతో నిమగ్నమవుతున్నారు. ఇక్కడ లభించే వస్తువులన్ని నాణ్యతతో ఉన్నందునే స్థానికులు ఎంతో ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారని వ్యాపారస్థులు పేర్కొంటున్నారు. పాత నగరానికి ఆనుకొని ఉన్నప్పటికీ ఈ ప్రాంత ఆచార వ్యవహారాలన్ని అరబ్ దేశాలవే. వహ్లాన్, బామ్స్, అవల్గీ, యాఫై, బహమాద్, కసేరీ తదితర రకాల కుటుంబీకులు బార్కాస్లో నివాసం ఉంటున్నారు. ప్రతిదీ ఇంపోర్టెడే.. బార్కాస్లో ప్రతి చిన్న వస్తువు అరబ్ నుంచి దిగుమతి అయ్యేదే. సూది, నెయిల్ కట్టర్, అత్తర్ పరిమళాలు, బెడ్ షీట్లు, టీవీలు, బురఖా, ఖర్జూర్, ఉద్దాన్, సేవింగ్ కిట్, టీ-షర్ట్ ఇలా ప్రతి వస్తువు కూడా ఇండోనేషియా, ఇటలీ తదితర దేశాలలో తయారైన వాటినే బార్కాస్ వాసులు వాడుతుంటారు. అజ్మల్, రసానీ, ఫ్రెష్ అండ్ ఫ్రెష్ తదితర కంపెనీల అత్తర్ పరిమళాలు ఇక్కడ లభిస్తుంటాయి. పెద్ద ఎత్తున లుంగీల కొనుగోలు.. బార్కాస్ బస్తీలోని ఏ గల్లీలో చూసినా పహిల్వాన్లే కనిపిస్తుంటారు. ఇక్కడ దాదాపు ప్రతి ఒక్కరు లుంగీలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. ఏ వీధిలో చూసినా... రంగురంగుల లుంగీలు ధరించిన వారే కనిపిస్తారు. వయో భేదం లేకుండా చిన్నారుల దగ్గర నుంచి వయో వద్ధుల వరకు లుంగీలు వాడతారు. కాగా ప్రస్తుతం రంజాన్ కావడంతో పురుషులంతా లుంగీలు కొనుగోలు చేస్తున్నారు. ఈ లుంగీల ధరలు వందల్లో ప్రారంభమై రూ.7 వేల వరకు పలకడం విశేషం. ఈ లుంగీలను ఇండోనేషియా, దుబాయి, సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకుంటారు. బార్కాస్ వాసులు ధరించే లుంగీలు దాదాపు 15 ఏళ్ల వరకు చెక్కుచెదరకుండా ఉంటాయి. -
బిచ్చగాళ్లు వాట్సాప్లో అడుక్కుంటున్నారు
దుబాయ్: నిన్న మొన్నటి వరకు దేవాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రోడ్ల మీద అడుకున్న యాచకులు మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్లోనూ అడుక్కుంటున్నారు. జాలి గుణం ఉన్న వారిని ప్రధానంగా టార్గెట్ చేసుకుంటున్న వారు కట్టు కథలతో కథనాలను పంపి తమకు తొచినంత దానం చేయమని అభ్యర్థిస్తున్నట్లు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఓ వెబ్సైట్ వెల్లడించింది. దయనీయమైన కథనాలను గుర్తు తెలియని నంబర్ల నుంచి పంపిస్తూ డబ్బులు యాచిస్తున్నట్లు పేర్కొంది. ఎంత తోచితే అంత దానం చేయాలని వేడుకుంటూ ఏకంగా బ్యాంకు అకౌంట్ నంబర్లు కూడా వాట్సాప్లకు పంపిస్తున్నారని వెబ్సైట్ తెలిపింది. రంజాన్ మాసం కావడంతో దుబాయ్లో ఈ మోసాల సంఖ్య మరింత పెరిగిందట. -
1 కోసం 32కోట్లు!
దుబాయ్: అధునాతన కారుకు ‘1’ నంబర్ ప్లేటు కోసం ఏకంగా రూ.32 కోట్లు వెచ్చించిన వింత ఘటన ఇది. శనివారం యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో జరిగిన వేలంలో యూఏఈ వ్యాపారి ఆరిఫ్ అహ్మద్ అల్-జరౌనీ నంబర్1 ప్లేటును రూ.32 కోట్లకు దక్కించుకున్నారు. ‘ఎప్పుడూ నంబర్ వన్గా ఉండటమే నా లక్ష్యం. షార్జాలో రిజిస్ట్రేషన్ చేసిన కారు కోసం ఈ నంబర్ కొన్నాను’ అని ఆయన చెప్పారు. 12, 22, 50, 100, 777, 1000, 2016, 2020 ఇలా మొత్తం 60 నంబర్ప్లేట్లను వేలం వేసి నిర్వహణ సంస్థ రూ. 91 కోట్లు మూటగట్టుకుంది. -
ఏపీ, అరబ్ దేశాల మధ్య వాణిజ్యాభివృద్ధికి ఎంఓయూ
సాక్షి, విజయవాడ బ్యూరో: టూరిజం, ఆహార ఉత్పత్తులు, విద్యా, వైద్యం తదితర రంగాల్లో వ్యాపార కార్యకలాపాలకు అరబ్ దేశాలు అనువైనవని ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్(ఐబీపీసీఆర్ఎకె) సెక్రటరీ జనరల్ లోకేష్ కె వర్మ చెప్పారు. అరబ్ దేశాల్లో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోగలితే ఏపీతోపాటు ఇక్కడి వ్యాపార, పారిశ్రామిక వేత్తలు కూడా అభివృద్ధి చెందవచ్చని సూచించారు. యునెటైడ్ అరబ్ ఎమిరెట్స్(యుఎఇ)కి చెందిన రఫ్ ఆల్కైమా స్టేట్లో ఐబీపీసీఆర్ఎకె సెక్రటరీ జనరల్గా ఉన్న లోకేష్ కె వర్మ, ఏపీ చాంబర్ ప్రెసిడెంట్(ఎలక్ట్) ముత్తవరపు మురళీకృష్ణతో బుధవారం ఒప్పందం(ఎంఓయు) కుదుర్చుకున్నారు. ఈ సందర్బంగా ఏపీ చాంబర్ హాలులో జరిగిన పారిశ్రామిక, వ్యాపారవ్తేతల ముఖాముఖిలో లోకేష్ వర్మ మాట్లాడుతూ అరబ్ దేశాలకు భారత్ నుంచి ఎగుమతి అవుతున్న సరుకులు, పరికరాలు అన్నీ ముంబాయి ఎయిర్పోర్టు, పోర్టు నుంచి వెళుతున్నాయని చెప్పారు. అదే గన్నవరం ఎయిర్పోర్టు, కృష్ణపట్నం ఓడరేవులను విస్తరించి విదేశాలకు సరుకు రవాణాను ప్రోత్సహిస్తే ఆంధ్రప్రదేశ్కు ఆదాయం పెరగడంతోపాటు ఇక్కడి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుందని చెప్పారు. -
అగ్ని కీలల్లో నివాస భవనం
-
నన్ను విడిపించండి ప్లీజ్..!
పనికోసం సౌదీకి వెళ్లి యజమాని పెడుతున్న వేధింపులను తాళలేక ఓ మహిళ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఓ గదిలో బందీగా ఉంటూ కష్టాలను ఓర్వలేక ఆందోళన చెందుతోంది. అక్కడే ఉండలేక, తిరిగి స్వదేశానికి రాలేక సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఆవేదన చెందుతోంది. తన కష్టాలను వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. తనను సురక్షితంగా స్వదేశానికి చేర్చమంటూ భారత ప్రభుత్వం, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను వేడుకుంటోంది. ముంబైకి చెందిన 47 ఏళ్ల మిష్భా షేక్ పనికోసం సౌదీ అరేబియా వెళ్లి యజమానుల ఉచ్చులో చిక్కుకుంది. తనను ఎలాగైనా ఇండియాకు రప్పించమంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. యజమాని ఓ గదిలో బంధించి తీవ్రమైన మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని, అవేదన వ్యక్తం చేస్తోంది. జయమాని 10,000 రియాల్స్ కట్టమని డిమాండ్ చేస్తున్నాడని, ఇటు పని, అటు డబ్బు లేక తాను ఎంతో కష్టాల్లో ఉన్నానని, తనను ఎలాగైనా అక్కడి నుంచి స్వదేశానికి రప్పించాలని వేడుకుంటోంది. పనికోసం వెళ్లి మిష్ఫా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోందని, సౌదీ యజమానుల వద్ద బందీగా ఉన్న ఆమెను సురక్షితంగా భారత్ కు తిరిగి తీసుకొచ్చేందుకు సహకరించమని ఆమె కుటుంబసభ్యులు సైతం భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
దుబాయ్ లో వరదలు తగ్గుముఖం
అబుదాబి: ఎడారి దేశం యూఏఈలో వరదలు తగ్గుముఖం పట్టాయి. 24 గంటలుగా స్తంభించిన జనజీవనం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది. నిన్న షార్జాకు వెళ్లే దారులన్నీ ట్రాఫిక్ తో నిండిపోగా, నేడు ఆ పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. జనాలు ఇప్పుడిప్పుడే రోడ్లమీదకి వస్తున్నారు. ఆఫీసులకు వెళ్లడం, ఇతర పనులకు వెళ్లే వాహనదారులు మళ్లీ తమ పనులను ప్రారంభించారు. కొన్ని విమాన సర్వీసులను అధికారులు పునరుద్ధరించారు. ధారాపాతంగా కురిసిన ఈ అరుదైన వర్షాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో బుధవారం స్టాక్మార్కెట్ మూతపడిన విషయం తెలిసిందే. 240 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అటు వర్షాల కారణంగా దాదాపు 250 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా తెలిపింది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన నగరం దుబాయ్ సహా అక్కడి చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. 130కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, జోరువానలతో అక్కడి జనజీవనం స్థంభించింది. పాఠశాలలు మూతపడ్డాయి. విమాన సేవలకు అంతరాయం కలిగింది. ఈ అరుదైన వాతావరణాన్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వర్షాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వెల్లువెత్తాయి. ఫేస్బుక్, ట్విట్టర్ లో వీడియోలు, ఫోటోలు పోస్ట్ లతో హంగామా నెలకొంది. కాగా ప్రపంచ 10 అత్యంత పొడి ప్రదేశాలలో యూఏఈ కూడా ఒకటి. దేశ వార్షిక వర్షపాతం 78 మిల్లీమీటర్లు (మూడు అంగుళాలు). కానీ వాతావరణ, సిస్మాలజీ నేషనల్ సెంటర్ అధికారుల అంచనాల ప్రకారం తాజాగా 240 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీన్నిబట్టే అక్కడి వాతావరణ పరిస్థితిని మనం అంచనా వేయవచ్చు. మరోవైపు ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులపై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. -
మహిళలే మనోళ్ల టార్గెట్...
- 8మంది ముఠా సభ్యుల అరెస్ట్ - గల్ఫ్లో ఉద్యోగాలంటూ ఆశ -నకిలీ, ఫోర్జరీ వీసాలతో పాటు పీవోఈ లేకుండానే దేశం దాటించుడే -వెస్ట్గోదావరి, ఈస్ట్ గోదావరి, బెంగళూరు, ముంబైలలో దందా -ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్టు చేసిన శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు హైదరాబాద్ పదో తరగతి కన్నా తక్కువ చదువుకున్న మహిళలకు గల్ప్లో అధిక వేతనం వచ్చే ఉద్యోగాలిప్పిస్తామంటూ వందలాది మందిని విమానమెక్కించేసిన ఎనిమిది సభ్యులున్న ముఠాను ఆర్జీఐఏ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నకిలీ, ఫోర్జరీ వీసాలతో పాటు ఫేక్ ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్(పీవోఈ) డాక్యుమెంట్లను సృష్టించి గ్రామీణ మహిళలను మోసం చేస్తున్న కేటుగాళ్ల వివరాలు గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు టెటలి సుబ్బిరెడ్డి, యెద్దుల శంకర్, తోట కంటేశ్వర, ముదిదన డేవిడ్ రాజు, జక్కంశెట్టి వెంకటేశ్వర రావు, సయ్యద్ ఇలియాజ్, దెబర దొమర, సబ్జర్ హుస్సేన్ లు ఇలా తప్పుడు పత్రాలతో వందలాది మహిళలను విదేశాలకు పంపించారని పోలీసులు తెలిపారు. కోట్లల్లో దందా... ఈ కేసు ప్రధాన సూత్రదారి పశ్చిమ గోదావరి పెంటపాడు గ్రామానికి చెందిన టెటలి సుబ్బిరెడ్డి (60) చదివింది ఎనిమిదే. మొదట్లో తన తండ్రికి చెందిన పాన్ షాప్ చూసుకునే వాడు. తర్వాత 1987లో రియాద్లోని అల్మాసద్ కంపెనీకి వెళ్లి పనిచేశాడు. ఇదే క్రమంలో అక్రమంగా భారతీయులు దుబాయ్కి వస్తున్న తీరును తెలుసుకున్నాడు. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన అతడు గల్ప్ ఏజెంట్లతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. 2013లో భారత్కు తిరిగి వచ్చి నకిలీ, ఫోర్జరీ వీసా దందాలు మొదలు పెట్టాడు. బెంగళూరులో సారా ట్రావెల్స్ పాస్పోర్టు ఏజెంట్గా అందరితో పరిచయం పెంచుకున్నాడు పదో తరగతి కన్నా తక్కువ చదివి ఆర్థిక అవసరాలున్న మహిళలను గుర్తించి వారికి ఉద్యోగం ఆశచూపి నకిలీ, ఫోర్జరీ వీసాలతో ఎయిర్ టికెట్లు సమకూర్చి కువైట్, సౌదీ, ఖతర్, దుబాయ్లకు పంపించే వాడు. మొదట్లో గోదావరి జిల్లాలకే పరిమిత మైన దందా.. త్వరలోనే బెంగళూరు, ముంబైకి కూడా పాకింది. గతంలో నకిలీ పర్యాటక వీసాల కేసులో అరెస్టైన సుబ్బిరెడ్డితో కలిసి తన బిజినెస్ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఈస్ట్గోదావరికి చెందిన జక్కంశెట్టి వెంకటేశ్వర్రావుతో, వెస్ట్ గోదావరి ఇరగవరం మండలం పాడి రెడ్డి పాలెంకు చెందిన డేవిడ్ రాజు, వైఎస్ఆర్ కడప జిల్లా పెంగళూరు మండల్, నారాయణ్ నెల్లూరుకు చెందిన పాస్పోర్టు ఏజెంట్ తోట కంటేశ్వర్, రాజంపేట వైఎస్ఆర్ ట్రావెల్స్ ట్రావెల్ ఏజెంట్ యెదుల శంకర్లతో పరిచయం ఏర్పడింది. వీరందరూ అప్పటికీ ఇదే రంగంలో ఉండటంతో ఒకరికొకరు అన్ని విషయాల్లో సహకరించుకునేవారు. కడప జిల్లాలోని చిన్నాచౌక్లోని ముత్తుర్సుపల్లికి చెందిన యెద్దుల శంకర్ రాజంపేటలోని రమణయ్య ద్వారా ఫేక్ టూరిస్ట్ వీసాలు రెడీ చేసి కడప, వెస్ట్గోదావరిలోని మహిళలను గల్ప్కు పంపిస్తున్నాడు. ఫేక్, ఫోర్జ్డ్ వీసాలతో పాటు పీవోఈ సర్టిఫికెట్లు రెడీ చేయడంలో మంచి దిట్ట అయిన తోట కంటేశ్వర...ఫొటోషాప్ వినియోగించి నకిలీ పీవోఈ, విజిట్ వీసాలు రెడీ చేసి హైదరాబాద్ నుంచి అభ్యర్థులను దుబాయ్ మీదుగా కువైట్, సౌదీకి పంపించాడు. కాఫీషాప్ అడ్డా.. ఈస్ట్ గోదావరి అంబాజిపేట మండలం ఇసుకపూడికి చెందిన జక్కంశెట్టి వెంకటేశ్వరరావు శంషాబాద్ విమానాశ్రయంలో కాఫీషాప్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. జెట్ ఎయిర్వేస్లోని కస్టమర్ సర్వీస్ ఏజెంట్గా పనిచేస్తున్న సయ్యద్ ఇలియాజ్ తరచుగా కాఫీ తాగేందుకు ఇక్కడికొస్తుండటంతో ఇద్దరి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ చొరవతోనే ఇలియాస్కు, టికే పాస్పోర్టు ఏజెంట్లు వెంకటేశ్వరరావు భాస్కర్ రెడ్డి, డేవిడ్ రాజుల మధ్య దళారీ అవతారమెత్తాడు. వారు తీసుకొచ్చే మహిళా ప్రయాణికులకు బోర్డింగ్ పాస్లు ఇప్పించేందుకు ఒక్కొక్క ప్రయాణికురాలికి రూ.ఐదు వేల చొప్పున వసూలు చేసేవాడు. అందులో రూ.మూడువేలను ఇలియాస్కు ఇచ్చేవాడు. అంతేకాకుండా నకిలీ పీఈవోలు సృష్టించడంలో సిద్ధాహస్తుడైన తోట కంటేశ్వరకు...ఆ డాక్యుమెంట్ల మీద ప్రయాణికులను క్లియర్ చేసేందుకు ఆర్జీఐ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ ఆఫీసర్గా పనిచేస్తున్న నల్గొండ జిల్లాలోని బీబీనగర్కు చెందిన దెబర దొమరను పరిచయం చేశాడు. ఆమె కూడా ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.ఐదు వేల వరకు తీసుకునేది. ఉపాధి కోసం గల్ప్దేశాలకు వెళ్లే వ్యక్తుల నుంచి పాస్పోర్టుల కోసమని రూ.65 వేలు ఒక్కో వ్యక్తి నుంచి వసూలు చేసేవాడు. బషీర్బాగ్లోని ఇలాఫ్ ఎంటర్ప్రైజెస్ సహకారంతో నకిలీ విజిట్ వీసాలు రెడీ చేశాడని పోలీసులకు తెలిసింది. రెండు చేతుల డబ్బులే... అరబ్ దేశాలకు వెళ్లాలనుకున్న నిరక్షరాస్యలను సబ్ ఏజెంట్ లు గుర్తిస్తారు. డాక్యుమెంట్ల కోసం రూ. 60 వేలు తీసుకుంటారు. వీరి జాబితాను గల్ప్ ఏజెంట్లకు పంపుతారు. జాబితా నుంచి కఫిల్ తమ అవసరాల మేరకు ఎంపిక చేసుకుని ఉపాధి, హూస్ మెయిడ్ వీసా ఎంబసీ నుంచి తెప్పిస్తారు. ఇలా వీరు ఒక్కో ఉద్యోగికి లక్ష రూపాయల చొప్పున గల్ప్ ఏజెంట్లకు చెల్లిస్తారు. ఇక్కడ ఉన్న ఏజెంట్ ఫేక్ టూరిస్ట్ వీసా రెండీ చేయటం తో పాటు.. ఆయా దేశాలకు టికెట్లు బుక్ చేస్తారు. పాస్ పోర్టు, ఫేక్ టూరిస్ట్ వీసా, ఉపాధి వీసాలను సబ్ ఏజెంట్ ల ద్వారా మహిళలకు అందిస్తారు. వీరే స్వయంగా మహిళలను విమానాశ్రయానికి తీసుకెళతారు. ఇండియాలో టూరిస్టు వీసాను మాత్రమే చూపించాలని మహిళలతో చెబుతారు. బోర్డింగ్ పాస్ ఇప్పించేందుకు ఎయిర్ లైన్స్ సిబ్బందికి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చెల్లిస్తారు. ఫేక్ పీవోఈ సర్టిఫికెట్, వీసాలను క్లియర్ చేసేందుక ఇమ్మిగ్రేషన్ అధికారికి రూ.5000 ఇస్తారు. దుబాయ్ లో దిగగానే టూరిస్టు వీసాను చించేసి.. అక్కడి అధికారులకు ఎంప్లాయ్ మెంట్, హౌస్ మెయిడ్ వీసాలను చూపించాల్సిందిగా చెబుతారు. డబ్బుల కోసం కక్కుర్తి... చదువు కున్నవారితో పాటు.. నిరక్షరాస్యులు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే సంస్కృతి బాగా పెరిగిపోయింది. అయితే ఉన్నత విద్య లేని వారు.. తరచూ ఏజెంట్ల చేతిలో మోసపోతుండటంతో ప్రభుత్వం వీరి భద్రత, రక్షణను దృష్టిలో ఉంచుకుని.. ప్రొటెక్టర్ ఆఫ్ ఎమ్మిగ్రెంట్స్ (పీఓఈ) తీసుకొచ్చింది. ఈ చట్టం కింద అధికారులు రెండు పాస్ పోర్టులను జారీ చేస్తారు. ఎమ్మిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ ( ఈసీఆర్), ఎమ్మిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్(ఈసీఎన్ఆర్) స్టేటస్ ఉంటుంది. ఈసీఆర్తో కూడిన పాస్పోర్టులకు పీవోఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఎయిర్పోర్టులో చూపించాల్సి ఉంటుంది. పీవోఈ సర్టిఫికెట్ రావాలంటే ఉద్యోగం ఇచ్చే వ్యక్తి, కంపెనీ సంబంధిత ఎంబస్సీలో ధరావతు కింద రూ.1,50,000ల డిపాజిట్ తో పాటు.. కనీస వేతనాలు, మెడికల్ సదుపాయం చేస్తామని ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటిని భరించలేని కలీఫాలు అడ్డదారిన గల్ప్ ఏజెంట్ల ద్వారా ఉద్యోగులను రప్పించుకుంటున్నారు. ఇలా అయితే వారికి కనీస వేతనాలు ఇవ్వాల్సిన అవసరముండదు. ఆరోగ్యం బాగా లేకున్నా కూడా పట్టించుకోవల్సిన అవసరముండదు. అందుకే చాలా మంది మహిళలకు ఈ విధానం గురించి తెలియక మోసగాళ్ల చేతులో పడి గల్ప్లో ఉద్యోగాల కోసం వెళ్లి నానాకష్టాలు పడుతున్నారు. వేధింపులకు గురైతున్నారు. ప్రయాణికులపై కూడా కేసులు ఏమీ తెలియకుండా మహిళలు వెళ్లినా.. ఇకపై ప్రయాణికులపై కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రయాణీకులను ఉపేక్షించడం వల్ల అక్రమ పాస్ పోర్టులు పొంది ఉగ్రవాదులు కూడా.. సరిహద్దులు దాటి వెళుతున్నారని అధికారులు అంటున్నారు. ఇకపై దళారులను గురించి ఏమీ తెలుసుకోకుండా.. గుడ్డిగా ఏజెంట్ల మాటలు వినే వారిపై ఎమ్మిగ్రేషన్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
దుబాయ్ షేక్ తో పెళ్లి అని చెప్పి...
హైదరాబాద్: ఓ మహిళా బ్రోకర్ ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్ లోని ఒమన్ నగరానికి చెందిన గొప్ప ధనవంతుడితో పెళ్లి అని చెప్పి నమ్మించి ఓ బిచ్చగాడికి కట్టబెట్టిన కిలాడీ సాజిద్ బేగంను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... వరుడు అరబ్ షేక్ అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి నగరంలోని ఓ ముస్లిం కుటుంబాన్ని సాజిదా బేగం నమ్మించింది. పెళ్లి తరువాత అమ్మాయికి మంచి ఉద్యోగం కూడా అతనే చూస్తాడంటూ అరచేతిలో స్వర్గం చూపించింది. ఆమె మాటలను నమ్మి గత ఆగస్టులో తమ కూతురు(28)కి ముస్లిం సాంప్రదాయం ప్రకారం నిఖా జరిపించారు. కోటి ఆశలతో కూతుర్ని ఒమన్ కు పంపించారు. తీరా అక్కడి వెళ్లాక తను పెళ్లి చేసుకుంది ఓ బిచ్చగాడినని తెలుసుకుని నివ్వెర పోయిందా యువతి. జరిగిన మోసాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో సాజిద్ బేగం మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలి తండ్రి గత నవంబరులో సాజిద్ బేగంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కేసు విచారణలో భాగంగా సాజిద్ బేగం ను అదుపులోకి తీసుకున్నామని దక్షిణమధ్య పోలీసులు తెలిపారు. బాధిత యువతిని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. -
ఆ చెత్త సెల్ఫీ జంటను ఎట్టకేలకు విడిచిపెట్టారు!
దుబాయ్: కొత్త సంవత్సరం సందర్భంగా దుబాయ్లో ఓ హోటల్ తగలబడుతుండగా.. దాని ముందు తాపీగా నిలబడి సెల్ఫీ తీసుకున్న ఓ జంటకు ఎట్టకేలకు విముక్తి లభించింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరు వ్యక్తులను విడుదల చేసినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ శుక్రవారం తెలిపింది. దుబాయ్ ఎమిరెట్స్ అటార్నీ జనరల్ ఎస్సాం అల్ హుమైదన్ను ఉటంకిస్తూ ప్రభుత్వ వార్తాసంస్థ డబ్ల్యూఏఎం ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా పక్కన ఉన్న 64 అంతస్తుల హోటల్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. నూతన సంవత్సరం వేడుకలకు కొద్దిముందే జరిగిన ఈ ప్రమాదంతో హోటల్లోని వారు ఉరుకులు, పరుగులతో హాహాకారాలు చేశారు. ఈ సమయంలో ఓ జంట మాత్రం కాలుతున్న హోటల్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకుంది. 2015లో ఇదే అత్యంత చెత్త సెల్ఫీ నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే వారికి ఎలాంటి నేరపూరిత ఉద్దేశం లేదని తెలియడంతో వదిలేశారు. అనుమతి లేకుండా సంబంధిత సంస్థలు, వ్యక్తుల ఫొటోలు తీయడం దుబాయ్లో నేరం. ఇందుకు అరెస్టుచేసి జైల్లో వేసే అవకాశం కూడా ఉంది. అయితే ఆ జంటను అరెస్టు చేయడం పనిలేని వ్యవహారమని దుబాయ్ రాజకీయ పరిశీలకులు పోలీసుల చర్యను తప్పుబట్టారు. -
యాక్టివిస్టును ఐఎస్ఐఎస్ అధినేతగా పొరపడి..!
న్యూయార్క్: ఐయాద్ ఎల్ బాగ్దాది.. అరబ్ విప్లవంలో పాల్గొన్న ప్రముఖ హక్కుల కార్యకర్త ఆయన. ఆయనకు ట్విట్టర్లో 70వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దుశ్చర్యలను ఆయన నిత్యం ట్విట్టర్లో తప్పుబడుతూ ఉంటారు కూడా. కానీ ట్విట్టర్ మాత్రం ఆయనను ఐఎస్ఐఎస్ అధినేత అబు బాకర్ అల్ బాగ్దాదిగా భావించింది. ఇద్దరి ఇంటిపేర్లు ఒకతీరుగా ఉండటంతో తనను ఐఎస్ఐఎస్ అధినేతగా భావించి అరగంటపాటు తన అకౌంట్ను ట్విట్టర్ సస్పెండ్ చేసిందని ఐయాద్ తెలిపారు. ఇండోనేషియా పత్రిక రిపబ్లికాను ఉటంకిస్తూ ఈ విషయాన్నిబీబీసీ వెల్లడించింది. 'సాధారణమైన అరబిక్ ఇంటిపేరు ఉండటంతో ఒక అరబ్ వ్యక్తిని ఐఎస్ఐఎస్ నేతగా ట్విట్టర్ పొరపడింది. ఇది కూడా ఒక రకం జాతి వివక్షే' అంటూ ఐయాద్ ట్విట్టర్లో తెలిపారు. తన ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించిన తర్వాత ఆయన ఈ విషయమై స్పందించారు. 'ఈ ఏడాది నా ఖాతా మీద ట్విట్టర్లో పదివేల అభిప్రాయాలు వెలువడ్డాయి. కానీ నా ఖాతాను నిర్దాక్షిణంగా సస్పెండ్ చేసి పక్కనబెట్టారు. అరబ్ దేశాలన్నింటిలోనూ ఎల్ బాగ్దాదీ ఇంటిపేరుతో ఉన్న కుటుంబాలు ఉంటాయి. ఎలాంటి వివరణ ఇవ్వకుండా నా ఖాతాను ఎలా సస్పెండ్ చేస్తారు' అని ఆయన ప్రశ్నించారు. నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంతో తన ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసిందని, కానీ తాను ఏ నిబంధనల్ని ఉల్లంఘించానో అది వెల్లడించలేదని పేర్కొన్నారు. ఖాతాల విషయంలో ట్విట్టర్ మరింత పారదర్శకంగా ఉండి ఎందుకు వాటిని రద్దు చేస్తున్నదో ముందే వెల్లడించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. -
దుబాయ్, సౌదీలో 100మందికి పైగా అరెస్ట్
-
సౌదీ చరిత్రలో ఇదే మొదటిసారి...
సౌదీ అరేబియా చరిత్రలోనే మొట్టమొదటిసారి మహిళలకు ఓటు హక్కు కల్పించడంతోపాటు, పోటీకి అనుమతించారు. దీంతో ఈ ఎన్నికల్లో మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మహిళలకు ఓటు హక్కును చివరిగా కల్పించిన దేశాల్లో ఒకటిగా సౌదీ నిలిచింది. ప్రస్తుతం మొత్తం 284 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికలకు బరిలో 5,938 పురుషులతోపాటు.. 978 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. అయితే కనీసం మహిళలు ఒంటరిగా కారు కూడా నడపకూడదన్న నిబంధనలు ఉన్న ఈ దేశంలో... ఎన్నికల వేళ కొన్ని షరతులను సడలించి కారులో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళే అవకాశాన్ని కల్పించారు. సంప్రదాయాలకు పెట్టింది పేరుగా ఉన్న ఈ దేశంలో ప్రస్తుత ఎన్నికలు మహిళా హక్కులకు ఓ ప్రత్యేక మైలు రాయిగా నిలిచాయి. అయితే ఎన్నికల ప్రచారానికి వెళ్ళే స్త్రీలు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు. ప్రచార సమయంలో ఓ పురుషుడి ప్రాతినిధ్యంలో కేవలం తెర వెనుక ఉండి మాత్రమే మహిళా అభ్యర్థులు ప్రచారం చేసే అవకాశం కల్పించారు. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించిన ఈ శుభ సందర్భంలోనూ... పురుష ఓటర్ల రిజిస్ట్రేషన్లు 1.35 మిలియన్లకు దాటి ఉండగా... కేవలం లక్షా 30 వేల మంది మహిళలు మాత్రమే ఓట్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో సాల్మా అల్ రషిద్ తొలి ఓటును రిజిస్టర్ చేసుకున్న మహిళగా గుర్తింపు పొందారు. ఇది నిజంగా మంచి మార్పు అని, మహిళా ప్రాతినిధ్యం నిర్థారించుకోడానికి ఇదో మంచి మార్గమని ఆమె అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిల్ కు జరుగుతున్న ఎన్నికల్లో అధికారాలు తక్కువే అయినా మహిళలకు మాత్రం ఇదో మైలురాయి అని ఆమె వ్యాఖ్యానించారు. కాగా ఈ సంప్రదాయ సమాజానికి అనుగుణంగా స్త్రీలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓ ప్రత్యేక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అసలు సౌదీ రాజ్యంలో ఎన్నికలు జరగడమే అరుదుగా ఉంటుంది. ఇప్పడు జరిగిన ఈ ఎన్నికలతో కలిపి చరిత్రలో ఇక్కడ మొత్తం మూడుసార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. నలభై ఏళ్ళ పాటు (1965 నుంచి 2005 వరకు) ఇక్కడ ఎన్నికలే నిర్వహించలేదు. కాగా మాజీ రాజు అబ్దుల్లా నిర్ణయం ఇప్పటి ఈ ఎన్నికలకు దారి తీసింది. ఇక్కడి మహిళలు కూడా ఎన్నికల్లో పాల్గొనాలన్నది ఆయన ఆశయం. కింగ్ అబ్దుల్లా సంస్కరణలు ప్రకటించడంలో భాగంగా సౌదీ మహిళలు మంచి స్థానాల్లో ఉంటే సరైన అభిప్రాయాలను, సలహాలను వ్యక్తం చేయగలరని అప్పట్లో ఆయన అభిప్రాయపడ్డారు. తర్వాత జనవరిలో ఆయన మరణించే ముందు దేశంలోని ప్రధాన అడ్వైజరీ కౌన్సిల్.. షౌరాలో 30 మంది మహిళలను నియమించారు కూడా. ఇప్పడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 2,100 కౌన్సిల్ సీట్లు అందుబాటులో ఉండగా.. మిగిలిన 1,050 సీట్లకు రాజు అనుమతితో నియమిస్తారు. కాగా శనివారం తర్వాత ఎప్పుడైనా ఎన్నికల ఫలితాలు తెలిసే అవకాశం ఉంది. -
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ ఓ అరబ్ ముస్లిం మహిళ!
న్యూయార్క్: అమెరికా ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రానికి ప్రతీకగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ వాస్తవానికి మొఖం కనిపించేలా బురఖా ధరించిన అరబ్ ముస్లిం యువతి స్కెచ్ నుంచి రూపొందిన విగ్రహమని తాజాగా తేలింది. 1855-56లో ఈజిప్టులో ప్రయాణించిన ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడరిక్ అగస్టీ బర్థోల్దీ. లిబర్టీ విగ్రహాన్ని రూపొందించారు. ప్రజా చిహ్నాలుగా చరిత్రలో నిలిచిపోయే భారీ విగ్రహాలను చెక్కడం పట్ల అమితాసక్తి కలిగిన ఫెడరిక్ను సూయిజ్ కెనాల్కు ఓ లైట్హౌస్ను డిజైన్ చేయాల్సిందిగా అప్పటి ఈజిప్టు ప్రభుత్వం 1869లో కోరింది. సూయిజ్ కెనాల్కు కాగడా పట్టుకొని కాపాల కాస్తున్న ఓ అరబ్ రైతు మహిళ రూపంలో లైట్హౌస్ను నిర్మించేందుకు ఫ్రెడరిక్ ఓ డిజైన్ రూపొందించారు. ఆ డిజైన్కు ఇప్పటి లిబర్టీ విగ్రహానికి కొన్ని పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అప్పుడు డిజైన్ చే సిన అరబ్ మహిళ ఎడమ చేతిలో కాగడా పట్టుకున్నట్టు ఉండగా, ప్రస్తుత లిబర్టీ విగ్రహంలో కుడిచేతిలో కాగడా పట్టుకున్నట్టు ఉంది. అప్పుడు ఆ అరబ్ మహిళ స్కెచ్కు ఫెడరిక్ ‘ఈజిప్ట్ బ్రింగ్స్ లైట్ టు ఆసియా’ అని నామకరణం కూడా చేశారు. అప్పట్లో ఈజిప్టులో మెజారిటీ శాతం ముస్లింలే ఉండేవారు. అలెగ్జాండ్రియా, కైరోలో 86 శాతం మంది, మిగతా ప్రాంతాల్లో 91 శాతం ముస్లింలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు, నివేదికలు వెల్లడిస్తున్నాయి. అనివార్య కారణాల వల్ల సూయిజ్ కెనాల్ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అమెరికా స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఫ్రెంచ్ ప్రజల తరఫున ఆ దేశానికి ఓ భారీ విగ్రహాన్ని అందజేయాలనే ఆలోచన ఫ్రెంచ్ ప్రభుత్వానికి వచ్చింది. అప్పటి ఫ్రెంచ్ చరిత్రకారుడు ఎడౌర్డ్ డీ లబైలాయే ద్వారా దీన్ని డిజైన్ చేయాల్సిన కాంట్రాక్ట్ ఫెడరిక్కు వచ్చింది. ఫెడరిక్ గతంలో తను రూపొందించిన డిజైన్ల ఆధారంగా 1870లో కొత్త విగ్రహం కొరకు డిజైన్లు గీయడం ప్రారంభించారు. అందులో భాగంగా అరబ్ ముస్లిం మహిళ స్కెచ్ను రోమన్ స్వేచ్ఛామూర్తిగా అభివృద్ధి చేశారు. దాన్ని పారిస్ ప్రభుత్వం అంగీకరించింది. పారిస్లో ఈఫిల్ టవర్ను నిర్మించిన ప్రముఖ బిల్డర్ గుస్తవ్ ఈఫిల్ సహకారంతో ఈ విగ్రహాన్ని ఫెడరిక్ పూర్తి చేశారు. సకాలంలో దీని నిర్మాణం పూర్తికాలేదు. అయినప్పటికీ అమెరికా స్వాతంత్య్ర శతజయంతోత్సవాలను పురస్కరించుకొని ఫ్రాన్స్ ఈ లిబర్టీ విగ్రహాన్ని అమెరికాకు అందజేయగా 1886లో ప్రతిష్టించారు. అమెరికా స్వేచ్ఛకు ప్రతీకగా ఓ బహుమానంగా వచ్చిన విగ్రహాన్ని ప్రతిష్టించడం సబబుకాద ంటూ అప్పట్లో రాజకీయ వర్గాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. ఫెడరిక్ తన తల్లి చార్లోటీ బెస్సర్ బర్థోల్దిని స్ఫూర్తిగా తీసుకొని లిబర్టీ విగ్రహాన్ని చెక్కారన్న వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. -
ఐఎస్ఐఎస్లో భారతీయ ఫైటర్లపై చిన్నచూపు
-
ఐఎస్ఐఎస్లో భారతీయ ఫైటర్లపై చిన్నచూపు
న్యూఢిల్లీ: ప్రపంచానికి సవాల్ మారిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్).. అరబ్, దక్షిణాసియా దేశాలతో పాటు నైజీరియా, సూడాన్ తదితర దేశాల నుంచి ఎక్కువగా యువతను రిక్రూట్ చేసుకుంటున్నా.. జీతాలు, హోదా వంటి విషయాల్లో అందరినీ సమానంగా పరిగణించడం లేదు. అరబ్ ఫైటర్లతో పోలిస్తే భారతీయులు సహా దక్షిణాసియా వాసులు గొప్ప పోరాట యోధులు కాదని ఐఎస్ఐఎస్ భావిస్తోంది. అరబ్ ఫైటర్ల కంటే వారిని తక్కువ స్థాయిగా చూస్తున్నట్టు ఇంటలిజెన్స్ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ ఇంటలిజెన్స్ సంస్థలు రూపొందించిన ఈ నివేదికను భారత్ సంస్థలకు అందజేశాయి. ఆ నివేదిక ప్రకారం.. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాలతో పాటు నైజీరియా, సూడాన్ దేశాల నుంచి ఐఎస్ఐఎస్లో చేరిన ఉగ్రవాదులను అరబ్ ఫైటర్ల కంటే తక్కువ స్థాయిలో పరిగణిస్తున్నారు. అరబ్ ఫైటర్లకు ఆపీసర్ కేడర్ స్థాయి కల్పించి, ఆత్యాధునిక ఆయుధాలు, వేతనాలు, వసతులు కల్పిస్తున్నారు. దక్షిణాసియా వారికి మాత్రం అరబ్ ఫైటర్ల కంటే తక్కువ హోదా, జీతాలు ఇచ్చి, చిన్న చిన్న బ్యారక్లలో ఉంచుతున్నారు. ఇరాక్, సిరియాల్లో ఆత్మాహుతి దాడులకు ఎక్కువగా వీరినే ఉసిగొల్పుతున్నారు. పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని ఇచ్చి, సమీప లక్ష్యంలో దాడులకు పంపుతున్నారు. ఐఎస్ఐఎస్లో 23 మంది భారతీయులు చేరగా, వారిలో ఆరుగురు ఉగ్రవాద చర్యల్లో చనిపోయారు. ఉగ్రవాద దాడుల్లో వీరిని సైనికుల మాదిరిగా ముందుకు ఉసికొల్పుపుతు అరబ్ ఫైటర్లు వెనక ఉంటున్నట్టు నివేదిక వెల్లడించింది. -
18 ఏళ్లకే ఎన్నారై కుర్రోడి రికార్డు
దుబాయ్: యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్లోని భారత సంతతికి చెందిన రామ్కుమార్ రామన్ 18 ఏళ్ల అతి పిన్న వయసులోనే అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్ (ఏసీసీఏ) సభ్యత్వం సాధించి రికార్డు సృష్టించాడు. ఏసీసీఏ సభ్యత్వం కోసం మామూలుగా మూడేళ్ల పాటు అర్హత గల పని అనుభవం ఉండాలి. ఈ అర్హత సాధించటానికి అభ్యర్థులు నాలెడ్జ్ మాడ్యూల్, స్కిల్స్ మాడ్యూల్, ప్రొఫెషనల్ మాడ్యూల్ అనే మూడు దశల్లో పరీక్షలు ఉంటాయి. మొత్తం 14 పేపర్లు ఉంటాయి. ఈ 14 పేపర్లను మూడేళ్లలో పూర్తి చేయాలి. 2012 సెప్టెంబర్లో ఈ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుని, ఈ ఏడాది జూన్లో చివరి పరీక్ష రాసినట్లు రామన్ చెప్పాడు. మార్కుల పరంగా చెప్పాలంటే 10కి 8.6 గ్రేడ్ సాధించినట్లు పేర్కొన్నాడు. -
ట్విట్టర్, ఫేస్ బుక్ లో వదంతులకు మరణశిక్షే..!
ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తే ఏమవుతుందో తెలుసా.. ఇక్కడైతే ఏమో గానీ సౌదీ అరేబియాలో అయితే మాత్రం మరణశిక్ష విధిస్తారట. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలపై ఎన్నో ఆంక్షలు విధిస్తున్న సౌదీ సర్కారు తాజా ప్రకటన సామాన్య ప్రజల్లో ఆందోళన రేపుతోంది. ఈ ప్రకటన వెనుక.. మొత్తం సోషల్ మీడియానే ఆ దేశంలో నిషేధించాలన్న ప్రయత్నం కనిపిస్తోందని పలువురు అంటున్నారు. కొత్తరాజు సల్మాన్ పాలనలో ఈ మరణ శిక్షల జోరు పెరిగిపోతోంది. సౌదీ రాజు కొత్త నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంస్థలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల హజ్ యాత్రకు వెళ్లి తొక్కిసలాటలో వెయ్యిమంది వరకూ చనిపోవడం... దీనికి కారణం ప్రభుత్వ నిర్వహణ లోపమేనని సోషల్ మీడియాలో రావడంతో... ఆగ్రహానికి గురైన ప్రభత్వం ఈ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు చిన్నపాటి తప్పులు చేసినవారికి.. ఖైదు, ప్రయాణ నిషేధం, గృహ నిర్బంధం వంటి శిక్షలు అమలులో ఉన్నాయని, ఇప్పుడు ఓ సామాజిక మాధ్యమంలో వదంతులు సృష్టించేవారికి మరణ శిక్ష విధించేందుకు నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి అని మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ చెప్తోంది. అయితే ఏ రకం వార్తలకు శిక్ష పడుతుందో స్పష్టంగా ధ్రువీకరించలేదని ఓ సీనియర్ న్యాయమూర్తి అంటున్నారు. ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తున్న కొత్త చట్టాన్ని కొన్ని వారాల క్రితం వచ్చిన సౌదీ రాజు ప్రకటించారు. 79 ఏళ్లు కొత్త రాజు సల్మాన్, అతడి కుమారుడు 30 ఏళ్ల మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రవేశ పెట్టిన ఈ ప్రకటనకు జనం నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మాస్ మీడియాను సెన్సార్ చేయడం కోసం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. -
కిందపడేసి కొడుతూ కాలితో తన్ని.. ఉమ్మేశాడు
రియాద్: సౌదీ అరేబియాలో ఓ భారతీయుడిపై దాడి జరిగింది. విచక్షణ రహితంగా ఓ అరబ్ ఇంజినీర్ చేసిన ఈ దాడిని పలువురు ఖండించగా అతడిపై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో బయటకు వచ్చి పలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. మక్కా మసీదు ప్రాంతంలో ఓ నిర్మాణం విస్తరణకు సంబంధించిన పనులను అరబ్ దేశానికి చెందిన ఇంజినీర్ భారతీయుడికి అప్పగించాడు. అయితే, తాను నిర్ణయించిన సమయానికి పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఇంజినీర్ ఏమాత్రం కనికరం లేకుండా విచక్షణ రహితంగా భారతీయ యువకుడిపై దాడి చేశాడు. కిందపడేసి కొడుతూ కాలితో తన్ని ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించాడు. అంతేకాకుండా అతడిపై ఉమ్మి కూడా వేశాడు. రెండు నిమిషాలపాటు రికార్డయిన ఈ వీడియోను ఓ కెనడా జర్నలిస్టు తారేక్ ఫతా తన ఫేస్బుక్ పేజీలో పెట్టాడు. దీంతో ఆ వీడియో బయటకు వచ్చి ఆ ఇంజినీర్ నిర్వాకంపట్ల విమర్శలు వచ్చాయి. సౌదీకి చెందిన కార్మిక శాఖ డైరెక్టర్ జనరల్ ఘటన స్థలికి వెళ్లి వివరాలు సేకరించి దర్యాప్తుకు ఆదేశించారు. అయితే, ఆ ఇంజినీర్ మాత్రం బాధితుడికి క్షమాపణలు చెప్పాడని, దర్యాప్తు మాత్రం చట్ట ప్రకారం జరుగుతుందని చెప్పారు. -
సుష్మా జీ.. నా సోదరిని రక్షించండి
తక్షణం స్పందించిన సుష్మా... యువతికి వీడిన చెర దుబాయ్: ఆమె ఓ ఎయిర్ హోస్టెస్. మంచి కెరీర్ కోసమని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్లింది. అయితే ఉద్యోగాల పేరిట తీసుకెళ్లిన ఏజెంట్లు ఆమెనక్కడ మరికొందరితో కలిసి నిర్బంధించారు. ఉద్యోగరీత్యా ఖతార్లో ఉంటున్న ఆమె సోదరుడు దేవ్ తంబోలికి ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు ఈనెల 21న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు ట్వీట్ చేశాడు. ‘సుష్మా జీ... నా సోదరి ఈనెల 14న యూఏఈకి వెళ్లింది. ఏజెంట్లు ఆమెనక్కడ నిర్బంధించారు. కొడుతున్నారట కూడా... దయచేసి సహాయం చేయండి’ అని కోరాడు. దాంతో సుష్మా స్పందించి యూఏఈలోని భారత రాయబార కార్యాలయ సిబ్బందిని రంగంలోకి దింపారు. స్థానిక పోలీసులు, ప్రవాస భారతీయుల సహాయంతో మొత్తం మీద 33 ఏళ్ల యువతిని రక్షించారు. ఈ విషయాన్ని సుష్మా వెంటనే తంబోలికి ట్వీట్ ద్వారా తెలిపారు. రాయబార కార్యాలయం నడిపే శరణాలయానికి తరలించామని, ఆమె క్షేమంగా ఉందని తెలిపారు. -
ఒక్క నిమిషంలో నిధుల బదిలీ
ఎమిరేట్స్ ఎన్బీడీ డెరైక్ట్రెమిట్2 మొబైల్ ద్వారా.. హైదరాబాద్: యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్లో ప్రముఖ బ్యాంక్ అయిన ఎమిరేట్స్ ఎన్బీడీ ఫండ్స్రెమిటెన్స్కు సంబంధించి వినూత్నమైన డెరైక్ట్రెమిట్2మొబైల్ సర్వీస్ను ప్రారంభించింది. ఈ సర్వీస్తో యూఏఈలో తమ బ్యాంక్ ఖాతాదారులు భారత్లో ఏ మొబైల్ నంబర్కైనా ఫండ్స్ను బదిలీ చేసుకోవచ్చని ఎమిరేట్స్ ఎన్బీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక్క నిమిషంలోనే నిధుల బదిలీ జరుగుతుందని ఎమిరేట్స్ ఎన్బీడీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సువొ సర్కార్ పేర్కొన్నారు. భారత్లో యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఈ సర్వీస్ను అందిస్తున్నామని, త్వరలో ఇతర బ్యాంక్ల ద్వారా కూడా ఈ సర్వీస్ను అందించగలమని వివరించారు. -
లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడికి చాన్స్
వ్యాపార, పారిశ్రామిక వర్గాల సమస్యలు పరిష్కరిస్తాం - మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి - అరబ్ ఇన్వెస్టర్లకు ప్రధాని మోదీ ఆహ్వానం మస్దర్ (యూఏఈ): భారత్లో దాదాపు లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.65 లక్షల కోట్లు) మేర పెట్టుబడులకు తక్షణ అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇన్ఫ్రా, రియల్టీ, ఇంధనం తదితర రంగాల్లో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా అరబ్ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. వ్యాపారవర్గాల సమస్యలను పరిష్కరించేందుకు, అరబ్ దేశాలతో 34 సంవత్సరాలుగా వాణిజ్య లోటును తొలగించేందుకు తమ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోందని మోదీ వివరించారు. గత ప్రభుత్వాల అనిశ్చితి, అలసత్వం కారణంగా నిల్చిపోయిన అనేక పనులను పునఃప్రారంభించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అబుధాబిలోని మస్దర్ నగరంలో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వ్యాపార దిగ్గజాలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. ‘గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా కొన్ని సమస్యలు కూడా మా ప్రభుత్వానికి సంక్రమించాయి. కేవలం కొన్ని మంచి అంశాలనే తీసుకుని, సమస్యలను పక్కన పెట్టలేము. అందుకే గత ప్రభుత్వాల అలసత్వం కారణంగా నిల్చిపోయిన పనులను పునఃప్రారంభించడానికి ప్రాధాన్యం ఇస్తున్నాము’ అని మోదీ తెలిపారు. ‘ఆసియా శతాబ్ది’ని సాకారం చేద్దాం: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ సహా పలు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సైతం భారత్ వృద్ధి అవకాశాలపై అత్యంత ఆశావహ అంచనాలతో ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. ఆసియా వైపు, అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత్ వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని ఆయన చెప్పారు. ఆసియాకు సంబంధించి అనేక ప్రధానాంశాల్లో యూఏఈ కీలకపాత్ర పోషిస్తోందని, అది లేకుండా ఆసియా పరిపూర్ణం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో 21వ శతాబ్దాన్ని ‘ఆసియా శతాబ్ది’గా మార్చేందుకు భారత్తో యూఏఈ చేతులు కలపాలన్నారు. భారత సామర్థ్యం, యూఏఈ శక్తి కలిస్తే ఇది సాధ్యమేనని మోదీ చెప్పారు. యూఏఈ ఇన్వెస్టర్లు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చిందని, వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తూ వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ఇన్వెస్టర్లతో చర్చించేందుకు వాణిజ్య మంత్రిని యూఏఈకి పంపిస్తానని మోదీ హామీ ఇచ్చారు. మస్దర్ సిటీలో మోదీ టూర్ దాదాపు గంటపైగా సాగింది. ‘విజ్ఞానమే జీవితం’ అని టూర్ సందర్భంగా విజిటర్స్ బుక్లో ఆయన రాశారు. డ్రైవర్ రహిత పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ కారులో మోదీ కొద్ది సేపు ప్రయాణించారు. మైక్రో-నానో ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ, మైక్రోస్కోపీ ల్యాబ్ మొదలైనవి సందర్శించారు. 34 సంవత్సరాలు కోల్పోయాం.. యూఏఈ, భారత్ మధ్య 700 ఫ్లయిట్స్ నడుస్తున్నాయని, కానీ భారత ప్రధాని యూఏఈకి రావడానికి 34 సంవత్సరాలు పట్టేసిందని మోదీ పేర్కొన్నారు. గడిచిన 34 ఏళ్లలో భారత ప్రధానుల్లో ఏ ఒక్కరూ యూఏఈలో పర్యటించలేదని, ఫలితంగా అన్ని సంవత్సరాల మేర అవకాశాలను కోల్పోయామని చెప్పారు. ఇలాంటిది పునరావృతం కాబోదని, ఇన్ని సంవత్సరాల లోటును భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. 125 కోట్ల జనాభా గల భారత్లో అపార అవకాశాలను ఉన్నాయన్నారు. వేగవంతంగా, నాణ్యమైన గృహాలను చౌకగా నిర్మించేందుకు ఉపయోగపడే టెక్నాలజీ భారత్కు అవసరమని మోదీ చెప్పారు. వ్యవసాయ రంగంలో కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు మొదలైనవి అవసరమని, వీటన్నింటిలోను యూఏఈ ఇన్వెస్టర్లు అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. అబుదాబి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వర్గాలు, ప్రభుత్వ అధికారులతో పాటు ఎటిసెలాట్, ఎతిహాద్ ఎయిర్వేస్ తదితర దిగ్గజాల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత్లో వ్యాపారాల నిర్వహణకు పాటించాల్సిన ప్రక్రియ సంక్లిష్టంగా ఉంటోందని ప్రధాని దృష్టికి తెచ్చిన యూఏఈ ఇన్వెస్టర్లు.. ఏక గవాక్ష క్లియరెన్స్ విధానం మొదలైనవి అమల్లోకి తేవాలని కోరారు. తమ పెట్టుబడులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. 75 బిలియన్ డాలర్లకు పెట్టుబడులు.. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టం చేసుకునే దిశగా భారత్లో తమ పెట్టుబడులను 75 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 5 లక్షల కోట్లు) పెంచడానికి యూఏఈ అంగీకరించింది. అలాగే వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 60 శాతం మేర పెంచుకోవాలని భారత్, యూఏఈ నిర్ణయించుకున్నాయి. ఇంధన రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి అంగీకరించినట్లు సంయుక్త ప్రకటనలో అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అమెరికా, చైనా తర్వాత యూఏఈ భారత్కి మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామి. 2014-15లో భారత్-యూఏఈల మధ్య వాణిజ్యం 60 బిలియన్ డాలర్ల మేర ఉంది. -
యూఏఈతో అనుబంధం
మన పౌరులకు చాన్నాళ్లనుంచి వివిధ రంగాల్లో ఉపాధి కల్పించడమే కాదు...వర్తక, వాణిజ్య రంగాల్లో మనకు కీలక భాగస్వామిగా ఉంటూవస్తున్న యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులు పర్యటించారు. మనకు గతంలో ఇరాన్తో ఉన్న సంబంధబాంధవ్యాల వల్లకావొచ్చు... యూఏఈపై మొదటినుంచీ ఉన్న అమెరికా ప్రభావంవల్ల కావొచ్చు భారత-యూఏఈల మధ్య సంబంధాలు తగిన స్థాయిలో విస్తరించలేదు. ఇప్పుడు మారిన ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో ఒక్క యూఏఈ మాత్రమే కాదు... గల్ఫ్ సహకార మండలి(జీసీసీ)లోని ఇతర భాగస్వామ్య దేశాలు బహ్రైన్, కువైట్, ఒమన్, కతార్, సౌదీ అరేబియాలు సైతం ‘లుక్ ఈస్ట్’ విధానంలో భాగంగా భారత్తో మరింత సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నాయి. ఇదే సమయంలో మన దేశం కూడా పశ్చిమాసియాపై దృష్టి సారించింది. మన ప్రాథమ్యాలు ఏవైనా... మన ప్రయోజనాలు ఎవరితో ముడిపడి ఉన్నా మన ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు అన్నివిధాలా తోడ్పడుతున్న యూఏఈని విస్మరించడం తెలివైన పని కాదు. అయినా సరే మన ప్రధాని ఒకరు ఆ దేశం వెళ్లడానికి 34 ఏళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. అయితే ఇన్నేళ్ల సమయంలోనూ ఆ దేశంతో మంచి సంబంధాలు లేవని కాదు. ఇరు దేశాల మంత్రులూ పరస్పరం పర్యటించుకోవడం సాగుతున్నది. ద్వైపాక్షిక ఒప్పందాలూ కుదురుతున్నాయి. కానీ ప్రధాని స్థాయి అధినేత పర్యటించడంవల్ల చేకూరే లాభాలు వేరుగా ఉంటాయి. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం రంగాలతోపాటు యూఏఈలో ఉండే భారతీయుల స్థితిగతులను మెరుగుపర్చడం మోదీ పర్యటన ఉద్దేశమని నాలుగు రోజుల నాడు విదేశాంగ ప్రతినిధి చెప్పారు. వాస్తవానికి రెండేళ్లక్రితం అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ యూఏఈ పర్యటన ఖరారై చివరి నిమిషంలో రద్దయింది. అప్పుడే ఉగ్రవాద కార్యకలాపాల నిరోధంలో పరస్పరం సహకరించుకునే ఒప్పందం, పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదురుతాయని అన్నారు. అప్పటినుంచీ అవి పెండింగ్లోనే ఉన్నాయి. ఆ ఒప్పందాలపై సంతకాలు చేయడంతోపాటు త్వరలో జరపబోయే ఇజ్రాయెల్ పర్యటనకు ఇది విరుగుడుగా ఉపయోగపడుతుందని భావించడంవల్ల కూడా కావొచ్చు...మోదీ యూఏఈ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒక బృందంగా చూస్తే జీసీసీ దేశాలకు మన నుంచి ఎగుమతులు, ఆ దేశాలనుంచి మనకొచ్చే దిగుమతులూ గణనీయంగానే ఉన్నాయి. ప్రత్యేకించి యూఏఈతో ఇవి అధికం. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమెరికా, చైనాల తర్వాత మనతో వాణిజ్య భాగస్వామ్యమున్న దేశాల్లో యూఏఈది అగ్రతాంబూలం. ఈ కాలంలో యూఏఈతో మన వాణిజ్య లావాదేవీల పరిమాణం 6,000 కోట్ల డాలర్లు (రూ. 3,93,000కోట్లు). ఇక మన దేశం దిగుమతి చేసుకునే ముడి చమురులో 45 శాతాన్ని జీసీసీ దేశాలే అందజేస్తుండగా అందులో యూఏఈ వాటా గణనీయంగా ఉంది. ప్రస్తుతం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనీయాలని సంకల్పించుకున్న మన దేశం ఆ రంగంలో గల్ఫ్ దేశాలనుంచి భారీయెత్తున పెట్టుబడులను ఆశించింది. అందుకు తగ్గట్టుగా భారత్-యూఏఈలమధ్య కుదిరిన ఒప్పందం మొత్తంగా 7,500 కోట్ల డాలర్లను (రూ.4 లక్షల 90 వేల కోట్లు) భారత్లో రైల్వేలు, పోర్టులు, రోడ్లు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం కోసం వెచ్చించాలని సంకల్పించింది. అలాగే గల్ఫ్ దేశాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నిర్మాణ రంగం, రవాణా, ఇతర సర్వీసుల్లో భారత్ సహకారంతో మానవ వనరులను పెంపొందించాలను కుంటున్నాయి. యూఏఈని నరేంద్ర మోదీ ‘మినీ భారత్’గా అభివర్ణించడంలో వాస్తవముంది. జీసీసీ దేశాల్లో మొత్తంగా 70 లక్షలమంది భారతీయులుండగా అందులో ఒక్క యూఏఈలోనే 26 లక్షలమంది ఉన్నారు. ఆ దేశ జనాభాలో మన ప్రవాసులు 30 శాతం వరకూ ఉంటారు. మొత్తంగా గల్ఫ్ దేశాలనుంచి ఏటా 600 కోట్ల డాలర్ల(రూ. 39,240 కోట్లు) సొమ్ము మన దేశానికి వస్తుంటుంది. ఇదంతా రాత్రింబగళ్లు నెత్తురును చెమట చుక్కలుగా చేసి తమ కుటుంబాలకు కార్మికులు పంపిస్తున్న మొత్తం. ఈ రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న గల్ఫ్ కార్మికుల సంక్షేమం విషయంలో మన పాలకులు ఇంతవరకూ సరైన దృష్టి పెట్టలేదు. అసలు ప్రవాస భారతీయుల సదస్సుల్లో అమెరికా, బ్రిటన్ దేశాల ఎన్నారైలకిచ్చే ప్రాముఖ్య తను గల్ఫ్ దేశాల ప్రవాసులకు ఇవ్వరు. గల్ఫ్ దేశాలకెళ్లేవారిలో అత్యధికులు అంతంతమాత్రం చదువులు చదివి వివిధ పనుల్లో ప్రావీణ్యాన్ని సంపాదించినవారే. వారి జీవన పరిస్థితులను సరిదిద్దడానికి, వారికెదురవుతున్న ఇబ్బందులపైనా, వాటి పరిష్కారాలపైనా పాలకులు సమగ్ర ఆలోచన చేయలేదు. ఇప్పుడు భారతీయ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు, వారికి చట్టపరంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని తీర్చడానికి అవసరమైన వ్యవస్థ వంటివి ఏర్పాటు చేయబోతున్నట్టు మోదీ ప్రకటించారు. మంచిదే. ఇది మరింత విస్తరించాల్సి ఉంది. నరేంద్ర మోదీ పర్యటన తర్వాత ఇరు దేశాలమధ్య సంబంధాలు మరింత మెరుగయ్యాయనడంలో సందేహం లేదు. ఇరు దేశాల సంయుక్త ప్రకటన ఆ సంగతిని స్పష్టంచేస్తున్నది. ముఖ్యంగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంలో ఇరు దేశాలూ సహకరించుకోవాలని నిర్ణయించాయి. మతంపేరుతోగానీ, ఇతరత్రాగానీ వేరే దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థించే పోకడలను ఖండించాయి. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ అనుసరిస్తున్న విధానాలను గట్టిగా వ్యతిరేకిస్తున్న మన దేశానికి ఇది నైతికబలాన్ని చేకూర్చే విషయం. అంతేకాదు...దావూద్ ఇబ్రహీంవంటి మాఫియా డాన్లు పాక్నుంచి గల్ఫ్ దేశాలకు నిధులు తరలించి, అటునుంచి భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలను నడుపుతున్నారు. ఇరు దేశాలమధ్యా కుదిరిన అవగాహనవల్ల అలాంటి కార్యకలాపాలకు బ్రేకు పడుతుంది. మొత్తంగా మోదీ పర్యటన పశ్చిమాసియాలో భారత్ ప్రభావాన్ని, పాత్రనూ మరింతగా పెంచుతుంది. -
ఉగ్రభూతంపై ఉమ్మడి పోరు
-
ఉగ్రభూతంపై ఉమ్మడి పోరు
అబుదాబి: పశ్చిమాసియా దేశాల ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలలో బయటి దేశాల ప్రమేయం వల్లనే అశాంతి పెరిగిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ దేశాలు కలసికట్టుగా కృషి చేస్తే సమస్యల పరిష్కారం తేలికవుతుందని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వచ్చిన సందర్భంగా మోదీ, స్థానిక ఖలీజ్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక సమస్యలు ఆయా దేశాలు పూనుకుంటేనే పరిష్కారమవుతాయన్నది తన ప్రగాఢ విశ్వాసమన్నారు. పశ్చిమాసియా దేశాలన్నింటితో భారత్కు సత్సంబంధాలు ఉండటం విశేషమని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని అంతర్గత సమస్యల్లో జోక్యం చేసుకోకూడదన్న మౌలిక నియమాన్ని భారత్ పాటిస్తూ, వివిధ అంశాల్లో చర్చలకు మద్దతిస్తోందన్నారు. ఈ ప్రాంత దేశాలు సమష్టిగా, నిర్మాణాత్మకంగా శాంతి స్థాపనకు కృషి చేయాలని, ఈ కృషి కేవలం ఈ ప్రాంతానికే కాకుండా మొత్తం ప్రపంచానికే మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇరాన్తో అగ్రదేశాల అణు ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ ‘ఉగ్రవాదం వంటి అతి తీవ్రమైన సమస్యలు ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని, శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగిస్తున్నప్పుడు అణు ఒప్పందం అనేది ఈ ప్రాంతంలో అస్థిరత్వానికి కారణం కానే కాకూడదు’ అని అన్నారు. పరస్పర విశ్వాసంతో ఈ ప్రాంతంలో చర్చలు, సహకారం మొదలవాలని అన్నారు. 34 ఏళ్ల తరువాత తొలిసారి భారత ప్రధాని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్లో పర్యటిస్తున్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి వెళ్లిన మోదీ సాయంత్రం అబుదాబి చేరుకున్నారు. విమానాశ్రయంలో యువరాజు షేక్ మహమ్మద్ జాయేద్ అల్ నహ్యా ప్రొటోకాల్ను పక్కన పెట్టి మోదీకి సంప్రదాయక స్వాగతం పలికారు. యువరాజుతో పాటు ఆయన ఐదుగురు సోదరులూ మోదీ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఏఈ సైనిక దళాల వందనాన్ని మోదీ స్వీకరించారు. ప్యాలెస్లో తనకు ఏర్పాటు చేసిన బసకు మోదీ చేరుకున్నారు. అక్కడ యువరాజుతో కాసేపు చర్చలు జరిపారు. శాంతికి ప్రతీక ఈ మసీదు.. అక్కడి నుంచి ముందుగా అరబ్లకు అత్యంత పవిత్రమైన షేక్ జాయేద్ గ్రాండ్ మసీదును సందర్శించారు. 82 గుమ్మటాలతో అద్భుతమైన ఇస్లామిక్ నిర్మాణ కౌశల్యానికి ప్రసిద్ధి చెందిన ఈ మసీదు.. మక్కా, మదీనా మసీదుల తర్వాత మూడో అతిపెద్దది. లక్షా 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 3,500 కోట్లతో నిర్మించిన ఈ మసీదుకు యూఏఈ తొలి అధ్యక్షుడు షేక్ జాయేద్ బిన్ సుల్తాన్ అన్ నహ్యా పేరును పెట్టారు. ‘ఈ అపూర్వమైన పవిత్ర మసీదును సందర్శించటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది అద్భుతమైన నైపుణ్యానికి, సృజనాత్మకతకు గొప్ప ఉదాహరణ. శాంతికి, కరుణకు, సౌభ్రాతృత్వానికి, ఇస్లాంపై అచంచలమైన విశ్వాసానికి ఇది ప్రతీక’ అని మోదీ సందర్శకుల పుస్తకంలో రాశారు. కీలక భాగస్వామిగా యూఏఈ యూఏఈతో తన చర్చల ఎజెండాను ఖలీజ్టైమ్స్కు ఇంటర్వ్యూలోనే మోదీ స్పష్టంగా సూచించారు. వాణిజ్యం, ఉగ్రవాద నిరోధం వంటి అంశాలలో యూఏఈతో కీలక భాగస్వామ్యం నెరపడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. రెండు దేశాలు ఉగ్రవాదం, తీవ్రవాదంతో సహా కొన్ని అంశాలలో ఒకే విధమైన ఆందోళనలను ఎదుర్కొంటున్నాయి కాబట్టి ఈ అంశాలు రెండు దేశాలకు అత్యధిక ప్రాధాన్యాంశాలన్నారు. భద్రత విషయంలో యూఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ఇంధనం, పెట్టుబడుల రంగాలలో సహకారాన్ని ఆశిస్తున్నామన్నారు. వ్యాపారానికి భారత్ ఆకర్షణీయ గమ్యంగా పెట్టుబడిదారులను ప్రోత్సహించటం తన లక్ష్యమన్నారు. 1970లలో 180 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్న యూఏఈ-భారత్ వ్యాపార బంధం ప్రస్తుతం 60 బిలియన్ డాలర్లతో భారత్ మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉందని.. ఇది మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు వివరించారు. భారతీయ కార్మికులతో భేటీ ఆ తర్వాత భారత్ నుంచి వలస వచ్చిన కార్మికులను ఐ-కాడ్ కార్మికుల రెసిడెన్షియల్ క్యాంప్ హౌస్లో కలిసి వారి సమస్యలపై చర్చించారు. క్రీడా హాల్లో వారితో ఫొటోలు దిగారు. ఈ దేశ అభివృద్ధిలో 26 లక్షల మంది భారతీయులు భాగస్వామ్యం వహించటం ఆనందంగా ఉందని మోదీ అన్నారు. భారత ప్రభుత్వం వారికి అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం యువరాజుతో చర్చలు జరిపిన అనంతరం మోదీ దుబాయ్కి వెళ్తారు. అక్కడ ఉపాధ్యక్షుడు, ప్రధాని అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్తో చర్చలు జరుపుతారు. ఆ తరువాత ప్రపంచంలో అత్యంత ఎత్తై బుర్జ్ ఖలీఫాను సందర్శిస్తారు. అనంతరం దుబాయ్ క్రికెట్ మైదానంలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడతారు. మోదీ పర్యటనను పురస్కరించుకుని యూఏఈలో ఒక దేవాలయం నిర్మించుకోవటానికి స్థలం కేటాయించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మోదీ సెల్ఫీ దౌత్యం అరబ్ దేశంలో కూడా కొనసాగింది. ప్రఖ్యాత షేక్ జాయేద్ మసీదును సందర్శించిన సందర్భంగా మోదీ అరబ్ రాజకుటుంబీకులు, షేక్లతో సెల్ఫీ దౌత్యం నెరిపారు. మీగడ రంగు కుర్తా, కాషాయం తెలుపు లాల్చీ ధరించిన మోదీ మసీదుకు వచ్చిన షేక్లతో తన మొబైల్తో సెల్ఫీకి పోజ్లిచ్చారు. -
అరబ్ కంట్రీ నాకు 'మినీ ఇండియా'
అబుదాబీ: భారత ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆ వెంటనే అరబ్ రాజు ఆయనను సాధరంగా ఆహ్వానించారు. అనంతరం రాజుతో మోదీ భేటీ అయ్యారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ అరబ్ కంట్రీ తనకు మినీ ఇండియా అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్కు అరబ్ దేశాలు ఎప్పటికీ ముఖ్యమైనవేనని చెప్పారు. ఆదివారం ప్రధాని రెండు రోజుల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి బయలు దేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన షార్జాకు చెందిన ఖాలిజ్ అనే పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చాలా సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని అరబ్ కంట్రీస్కు వెళతున్నారని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో భారత్ ఎప్పుడూ గల్ఫ్ దేశాలతో ముందుంటుందని, ఆ దేశాలు తన మనసుకు మినీ ఇండియాలా అనిపిస్తాయని, అక్కడ దాదాపు 26లక్షలమంది భారతీయలు జీవిస్తున్నారని తెలిపారు. భారత్కు ముఖ్య అవసరాలైన రక్షణ, శక్తి, ఆర్థికాభివృద్ధి వంటి అంశాల్లో గల్ఫ్ పాత్ర ముందుంటుందని చెప్పారు. -
'భారత మహిళలకు మరింత భద్రత అవసరం'
అబుదాబీ: భారత మహిళలకు మరింత స్వేచ్ఛ అవసరం అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఉంటున్న భారతీయులు పేర్కొన్నారు. అక్కడ 69వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్న నేపథ్యంలో వారు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆది,సోమవారాల్లో ప్రధాని నరేంద్రమోదీ యూఏఈలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ అంశాన్ని లేవనెత్తడం గమనార్హం. పితృస్వామ్య పాలనకు భారత్ ఒక సాక్ష్యం అని, అయితే, కొంతమంది మాత్రం మహిళలకు స్వేచ్ఛకావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కేవలం స్వాతంత్ర్యం మాత్రమే కాదని, మహిళల సాధికారతకు, స్వశక్తికి భారత్లో ఎంతో చేయాల్సిన అవసరం చాలా ఉందని గుర్తు చేస్తున్నారని తెలిపారు. ఇక, భారత్లో మహిళలపై నేరాలు తక్కువగా ఉండాలని, వారికి మరింత భద్రత లభించాలని కోరుకుంటున్నామని మరికొందరు మహిళా సభ్యులు కోరారు. -
బాలికతో అరబ్ షేక్ వివాహం... అడ్డుకున్న పోలీసులు
చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): పేదరికం, నిరక్ష్యరాస్యతను ఆసరాగా చేసుకొని బాలికను వివాహం చేసుకునేందుకు ఓ అరబ్ షేక్ చేసిన ప్రయత్నాన్ని రెయిన్బజార్ పోలీసులు అడ్డుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... ఒమన్ దేశం మస్కట్ ప్రాంతానికి చెందిన అల్ బాలుచీ బాదర్ యూసుఫ్ సేద్(37) గత నెల 16వ తేదీన టూరిస్ట్ వీసాపై హైదరాబాద్కు వచ్చాడు. హిమాయత్నగర్ హైదర్గూడలోని హోటల్ హన్షు గ్రాండ్లో 18వ తేదీన దిగాడు. అక్కడ ఉన్న సమయంలోనే అయేషా అనే పెళ్లిళ్ల బ్రోకర్తో చర్చలు జరిపాడు. దీంతో అయేషా రెయిన్బజార్ అరబ్గల్లీకి చెందిన బస్సుడ్రైవర్ ఖయ్యూం, సయ్యదా హైదరీ ఫాతిమాల కుమార్తె(17) విషయం తెలిపింది. పేదరికంతో బాధ పడుతున్న వారికి రూ.5 లక్షలు ఇప్పిస్తానని, అరబ్ షేక్తో పెళ్లికి ఒప్పుకోవాలని ఆశపెట్టింది. తల్లిదండ్రులు అంగీకరించటంతో ఈ నెల 2వ తేదీన వివాహం చేయాలని నిశ్చయించి, ముందుగా ఖర్చుల కోసం అయేషా షేక్ నుంచి రూ.30 వేలు తీసుకుంది. దీంతో పాటు పాస్, పోర్టు వీసా వచ్చేంత వరకు రెండు నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు కూతురితో కలసి ఉండేందుకు ఒక గది అద్దెకు తీసుకోవాలని బాలిక తండ్రి ఖయ్యూంకు రూ.15 వేలు అందజేసింది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 10 గంటలకు వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో రెయిన్బజార్ ఎస్సై జి.శ్రీనివాస్ రెడ్డి అక్కడికి చేరుకొని విషయాన్ని పసిగట్టి వివాహాన్ని అడ్డుకున్నారు. వెంటనే అరబ్ షేక్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. విలేకర్ల సమావేశంలో మీడియా ముందుకు అరబ్ షేక్ను తీసుకొచ్చిన సమయంలో అతడు నవ్వులు చిందిస్తూ కనిపించడం గమనార్హం. -
పాతబస్తీలో బాల్య వివాహం అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో బాల్య వివాహాన్ని సౌతో జోన్ పోలీసులు అడ్డుకున్నారు. రెయిన్ బజార్లో బాల్య వివాహం జరుగుతున్నట్లు స్థానికులు సమాచారం అందించటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ సందర్భంగా బాలికను నిఖా చేసుకునేందుకు సిద్ధపడ్డ ఓ అరబ్ షేక్ సహా పలువురిని అరెస్ట్ చేశారు. బాలికకు పోలీసులు విముక్తి కలిగించారు. కాగా నిఖా జరిపేందుకు మధ్యవర్తిత్వం నడిపిన బ్రోకర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గత రెండు రోజుల క్రితం ఛత్రీనాకలో ఓ బాల్య వివాహాన్ని కూడా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. -
కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్న అరబ్ షేక్
చాంద్రాయణగుట్ట: బాలికను ఒప్పంద వివాహం చేసుకొన్న అరబ్ షేక్ను కంచన్బాగ్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. అతనికి సహకరించిన మరో ఐదుగురిని కూడా రిమాండ్కు తరలించారు. సోమవారం దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ కథనం ప్రకారం....ఒవున్ దేశానికి చెందిన సెనేది కమీస్ మహ్మద్ కమీస్ (70) గతనెల 30న విజిటింగ్ వీసాపై నగరానికి వచ్చాడు. హఫీజ్బాబానగర్కు చెందిన మహిళకు రూ. లక్ష చెల్లించి బాలికను 15 రోజుల కోసం కాంట్రాక్టు పెళ్లి చేసుకున్నాడు. బాలికను ముంబైకి తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు పట్టుకొని బాలికకు షేక్ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించారు. షేక్తో పాటు అతనికి సహకరించిన ట్రావెల్ ఏజెంట్ ఆసీమ్ సయీద్, పెళ్లిళ్ల బ్రోకర్ సయ్యద్ జుల్ఫీకర్ అలీ, మధ్యవర్తులు అబ్దుల్లా బిన్ హుస్సేన్ యెమానీ, నూర్జాహాన్ బేగంలను పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. కాగా, షేక్ ఒమాన్ దేశంలో అపర కోఠీశ్వరుడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ధనవంతుడనే అహంతోనే నిందితుడు బాలిక జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధమయ్యాడన్నారు. కాగా, పాతబస్తీలో అమాయక బాలికలకు షేక్లతో వివాహం జరిపిస్తున్న 20 మంది ఖాజీలపై నిఘా ఉంచామని డీసీపీ తెలిపారు. అలాంటి వారిపై త్వరలోనే సస్పెక్ట్ షీట్లు, పీడీయాక్ట్ ప్రయోగిస్తామన్నారు. విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
యెమెన్ పయనం ఎటు?
అరబ్ వసంతం మధ్య ఆసియా దేశాల ప్రజలకు హక్కులు ప్రసాదించడానికి బదులు, ఆయా దేశాలలో అంతర్యుద్ధాలకీ, అశాంతికీ దారితీయడం ఒక చారిత్రక విషాదం. ప్రస్తుతం యెమెన్ సంక్షోభాన్ని గమనిస్తే ఇదే భావనకు రాక తప్పదు. అవినీతికీ, రాచరికాలకీ, కుటుంబ పాలనకీ వ్యతిరేకంగా ప్రారంభమైన అలజడిని ఆసరా చేసుకుని ఉగ్రవాదులు తిష్టవేశారని అనిపిస్తుంది. యెమెన్ పరిణామాలు ఇదే చెబుతున్నాయి. అరబ్ ద్వీపకల్పంలోనే పేద దేశమైన యెమెన్ ఇప్పుడు అంతర్యుద్ధం అంచున ఉంది. 1978 నుంచి యెమెన్ను పాలిస్తున్న అల్ అబ్దుల్లా సలేహ్ నియంతృత్వానికీ, అవినీతి విధానాలకీ వ్యతిరేకంగా 2011కు ముందే ప్రజలు గళమెత్తారు. ఈ నిరసన ఈజిప్ట్, ట్యునీషియా ఉద్యమాలతో మిన్నంటింది. ఈజిప్ట్ ఆందోళనకారులు పద్దెనిమిది రోజులలో పాలకుడు ముబారక్నూ, ట్యునీషియా నిరసనకారులు నెలలోపున బెన్ అలీనీ గద్దెలు దింపగలిగారు. కానీ ‘ఇది యెమెన్. ఈజిప్ట్, ట్యునీషియా కాదు’ అని సలేహ్ బీరాలు పలికినా 2012లో విపక్షాలతో కుదిరిన ఒప్పందం మేరకు పదవి నుంచి వైదొలిగాడు. సలేహ్ ప్రభుత్వంలో ఉపాధ్యక్షునిగా పని చేసిన అబ్ద్ రుబ్బు మన్సూర్ హాదీ అధ్యక్షుడయ్యాడు. అయితే ఇతడు కూడా సెప్టెంబర్ 21, 2014న రాజీనామా చేశాడు. హుతీ ఉగ్రవాదులు రాజభవనాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఇతడు మొదట ఏడెన్ తరువాత రియాద్ వెళ్లిపోయాడు. ఇతడిని సంక్షుభిత కాలంలో యెమెన్ అధ్యక్షునిగా చాలా దేశాలు గుర్తించాయి. యెమెన్లో హుతీ ఉగ్రవాదులు (జేదీ పోరాట యోధులు, షియా వర్గీయులు, అబ్దుల్ మాలిక్ అల్ హుతీ నాయకత్వంలో పోరాడుతున్నవారు) ఉత్తర యెమెన్ కేంద్రంగా గడచిన రెండు మూడేళ్లలో అనూహ్యమైన విజయాలు సాధించారు. అందులో రాజధాని సనాను అదుపులోకి తెచ్చుకోవడం ఒకటి. తరువాత దేశమంతటా విస్తరించాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ఇక దక్షిణ యెమెన్ కేంద్రంగా అల్ కాయిదా, హిరాక్ ఉద్యమకారులు విడివిడిగా హుతీతో పోరాడుతూ, సనాపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల రాజధాని సనాలో జరిగిన రెండు ఆత్మాహుతి దాడులు తమ పనేనని ఐఎస్ఐఎస్ ప్రకటించింది. అంటే జాతీయ, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు సమస్యను మరింత జటిలం చేశాయి. అలాగే పొరుగున ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య వైషమ్యం కూడా యెమెన్ మంటలకు ఆజ్యం పోస్తోంది. ఇంకో షియా రాజ్యం తన పొరుగున ఉండరాదన్నదే సౌదీ అరేబియా ఆశయం. మార్చి మాసాంతంలో జరిగిన పరిణామాలతో సౌదీ అరేబియా హుతీ ఉగ్రవాదులపై వైమానిక దాదులకు కూడా పాల్పడింది. ఇక హుతీలు షియా తెగకు చెందిన వారు కాబట్టి ఇరాన్ తన మద్దతును ప్రకటించింది. సౌదీ అరేబియాకు యథాప్రకారం అమెరికా, బ్రిటన్ సాయం అందిస్తున్నాయి. అయితే అమెరికా అల్కాయిదా పట్ల తనకు ఉన్న వ్యతిరేకతను దాచు కోకుండా దక్షిణాది నుంచి పోరాడుతున్న ఆ సంస్థ సభ్యుల మీద డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉంది. నియంతృత్వం సరికాదని భావించి, బాధ్యతాయుతమైన ప్రభుత్వం కోసం ఆశపడి వీధులలోకి వచ్చిన యెమెన్ పౌరులకు చివరికి అశాంతే మిగిలింది. అశాంతి నుంచి అశాంతికే పరిస్థితులు నడిపించాయి. సలేహ్ 1999లో మొదటిసారి ఎన్నికలు జరిపాడు. తనే మళ్లీ పాలకుడయ్యాడు. నిజానికి ఏ ప్రతిపక్షానికి పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పరిస్థితులు కల్పించుకున్నాడు. తరువాత రాజ్యాంగం ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే అందుకు ప్రజలు నిరాకరించారు. ఎందుకంటే, ఆ రాజ్యాంగం ప్రకారం సలేహ్ జీవితకాలం దేశ అధ్యక్షుడిగా కొనసాగుతాడు. ఇతడు యెమెన్కు ఇచ్చినది ఏమీ లేదు- బహుముఖ సంక్షోభం తప్ప. ఏ సమస్యనీ పరిష్కరించే యత్నం చేయలేదు. అరబ్ దేశాలలో ఒకటైనా ఇక్కడ చమురు కొరత ఏర్పడింది. దేశ ఎగుమతులు 85 శాతం వరకు అదే. ప్రభుత్వ ఆదాయంలో 70 శాతం చమురు మీదే. దీనికి తోడు నీటి కొరత నెలకొంది. పదేళ్లు గడిస్తే రాజధాని సనాలో చుక్క నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని అంచనా. ఇలా ఉండగా జనాభా విపరీతంగా పెరిగింది. నిరుద్యోగం, ఆకలీ పెరిగాయి. దీని తోనే అసంతృప్తి ఉద్యమరూపం దాల్చింది. దేశంలో అధికార మార్పిడి అని వార్యమైంది. అయితే ఈ పరిణామాన్ని ఉగ్రవాదం, అంతర్జాతీయ రాజకీయం హైజాక్ చేయడమే విషాదం.