
యునైటెడ్ ఎమిరేట్స్లో సోమవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిన్నారులు మరణించారు. అనుకోకుండా ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఏడుగురు చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటన దుబాయ్కి దాదాపు 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న దడ్నా గ్రామంలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలతో ఇళ్లంతా దట్టమైన పోగలు అలుముకొని పిల్లలు చనిపోయారని, వారి తల్లి ప్రాణాలతో బయటపడిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపుచేశారు.