50 ఫ్యామిలీలు ఉండే భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి | Massive fire breaks out in Noidas Mamura village | Sakshi
Sakshi News home page

50 ఫ్యామిలీలు ఉండే భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

Jul 15 2026 2:41 PM | Updated on Jul 15 2026 3:09 PM

  Massive fire breaks out in Noidas Mamura village

నోయిడాలో 50 కుటుంబాలు ఉండే ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇద్దరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. పలు కుటుంబాలు భవనంలో చిక్కుకుపోయాయని తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బుధవారం ఫేజ్‌ 3 పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మమూరా గ్రామంలో ఎలక్ట్రిక్‌ బైక్‌లో చెలరేగిన మంటల వల్ల అగ్ని ప్రమాదం జరిగింది.

ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భవనంలో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏంటో తెలుసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.

నోయిడా సెక్టార్‌ 66లో జరిగిన భవన అగ్నిప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఘటన స్థలికి చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. సహాయ చర్యలు, రక్షణ చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని చెప్పారు. అన్ని స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలని పాలన యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. సహాయ చర్యలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గౌతమ్ బుద్ధ నగర్ సంయుక్త కమిషనర్ రాజీవ్ నారాయణ్ మాట్లాడుతూ.. “సెక్టార్‌ 66 పరిధిలోని ఫేజ్‌-3 పోలీస్ స్టేషన్‌ పరిధి మమూరా గ్రామంలో అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం అందింది. అగ్నిమాపక సేవల సిబ్బంది వెంటనే స్పందించి అత్యంత తక్కువ సమయంలో ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక చర్యలు, రక్షణ చర్యల కోసం హైడ్రాలిక్ ప్లాట్‌ఫార్ములు, రెస్క్యూ వాహనాలు, 7 అగ్నిమాపక వాహనాలను వినియోగించారు. 

మంటలు చెలరేగిన భవనం జీ ప్లస్ 4 నిర్మాణం. అందులో దాదాపు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. నివాసితులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే పొగ పీల్చడం వల్ల ఇద్దరికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. భవనం కింది స్థలంలో పార్కింగ్ సౌకర్యం ఉంది. బేస్‌మెంట్ లేదు. పార్కింగ్ ప్రాంతం నుంచి పై అంతస్తులకు పొగ వ్యాపించి లోపల ఉన్న వారిపై ప్రభావం చూపింది.

పొగ ప్రభావంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించిన ఇద్దరిని వెంటనే అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం ఇస్తాం. వారిని ఇప్పటికే ఆసుపత్రికి తీసుకెళ్లాం. ప్రతి అంతస్తులో దాదాపు 5 కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 12 గదులు రెండు గదుల ఫ్లాట్లుగా ఏర్పాటు చేశారు. భవనంలో ఉన్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడానికి రక్షణ చర్యలు చేపట్టాం” అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement