పుస్తకాన్ని రాసి ప్రచురించిన నాలుగేళ్ల బాలుడు | Guinness World Record Set By four years Boy For Publishing A Book | Sakshi
Sakshi News home page

పుస్తకాన్ని రాసి ప్రచురించిన నాలుగేళ్ల బాలుడు

Apr 3 2023 6:14 AM | Updated on Apr 3 2023 7:18 AM

Guinness World Record Set By four years Boy For Publishing A Book - Sakshi

అబుదాబి: పిట్ట కొంచెం కూత ఘనం అని సామెత. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కి చెందిన ఈ నాలుగేళ్ల బాలుడిని చూస్తే పిట్ట కొంచెం రాత ఘనం అని సామెత మార్చుకోవాలి. అబుధాబిలో ఉండే సయీద్‌ రషీద్‌ అనే నాలుగేళ్ల వయసున్న బాలుడు ఒక పుస్తకాన్ని రాయడంతో పాటు దానిని ప్రచురించి గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కాడు. ఒక ఏనుగుకి, ఎలుగుబంటికి మధ్య  ఏర్పడిన స్నేహానుబంధాన్ని కథగా మలిచాడు. ఆ పుస్తకం వెయ్యి కాపీల వరకు అమ్ముడైంది.

గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు అధికారులు ఈ ఘనత సాధించిన అతి  పిన్న వయస్కుడిగా సయీద్‌ రికార్డులకెక్కినట్టుగా ప్రకటించారు. సయీద్‌ ఈ పుస్తకం రాయడానికి ఎనిమిదేళ్ల వయసున్న అతని అక్క అయిధాబీ స్ఫూర్తిగా నిలిచిందని ఖలీజా టైమ్స్‌ వెల్లడించింది. ఇప్పటికే అయిధాబీ ఒక ప్రచురణ సంస్థను కూడా నడుపుతూ రికార్డులు సాధించింది. మొత్తమ్మీద ఫ్యామిలీలో అందరికీ పుస్తకాలంటే ఎంతో ఇష్టం కావడంతో  ఈ అరుదైన ఘనత సాధించగలిగాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement