breaking news
New Zealand vs West Indies
-
ఐపీఎల్ వేలంలో అన్సోల్డ్.. కట్ చేస్తే! అక్కడ డబుల్ సెంచరీతో
మౌంట్ మౌంగానుయి వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 316 బంతుల్లో తన రెండో టెస్టు డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.178 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన కాన్వే దూకుడుగా ఆడి తన ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్గా 367 బంతులు ఎదుర్కొన్న కాన్వే.. 31 ఫోర్ల సాయంతో 508 పరుగులు చేశాడు. ఇంతకుముందు డెవాన్ ఇంగ్లండ్పై తన తొలి డబుల్ సెంచరీని సాధించాడు.కాన్వే-లాథమ్ వరల్డ్ రికార్డు..ఈ మ్యాచ్లో డెవాన్ కాన్వేతో పాటు కెప్టెన్ టామ్ లాథమ్ కూడా (246 బంతుల్లో 137; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 323 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా న్యూజిలాండ్ గడ్డపై అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సాధించిన జోడీగా లాథమ్- కాన్వే చరిత్ర సృష్టించారు. అదేవిధంగా డబ్ల్యూటీసీ చరిత్రలో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. సౌతాఫ్రికాతో టెస్టులో 2019లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ- మయాంక్ అగర్వాల్ తొలి వికెట్కు 317 పరుగులు జోడించగా.. లాథమ్- కాన్వే ఈ రికార్డును బ్రేక్ చేశారు. తొలి ఇన్నింగ్స్లో కివీస్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 145 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 508 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఐపీఎల్ వేలంలో అన్సోల్డ్..కాగా డబుల్ సెంచరీ వీరుడు డెవాన్ కాన్వే ఇటీవల జరిగిన ఐపీఎల్-2026 మినీ వేలంలో అన్సోల్డ్గా మిగిలిపోయాడు. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన కాన్వేను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ఐపీఎల్లో కూడా మంచి రికార్డును డెవాన్ను ఎవరూ తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. గతంలో అతడు సీఎస్కే ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: Ashes 2025: స్టోక్స్, ఆర్చర్ విరోచిత పోరాటం.. ఇంగ్లండ్ ఆలౌట్ -
వేలంలో అన్సోల్డ్.. కట్చేస్తే!.. ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్ స్టార్లు టామ్ లాథమ్, డెవాన్ కాన్వే సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ చరిత్రలో తొలి వికెట్కు అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా నిలిచారు. వెస్టిండీస్తో గురువారం మొదలైన మూడో టెస్టు సందర్భంగా ఈ ఘనత సాధించారు.డబ్ల్యూటీసీ (WTC) 2025-27లో భాగంగా కివీస్ జట్టు స్వదేశంలో విండీస్తో మూడు టెస్టుల సిరీస్ ఆడుతోంది. అసాధారణ పోరాటంతో వెస్టిండీస్ తొలి టెస్టు డ్రా చేసుకోగా.. రెండో టెస్టులో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. ఇరుజట్ల మధ్య గురువారం ‘బే ఓవల్’ వేదికగా మూడో టెస్టు మొదలైంది.ఓపెనింగ్ జోడీగా వచ్చి.. శతకాలతో చెలరేగిటాస్ గెలిచిన ఆతిథ్య కివీస్.. పర్యాటక విండీస్ను బౌలింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనింగ్ జోడీగా వచ్చిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ (Tom Latham), డెవాన్ కాన్వే సెంచరీలతో చెలరేగారు. లాథమ్ 246 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 137 పరుగులు చేసి.. రోచ్ బౌలింగ్లో రోస్టన్ చేజ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.మరోవైపు.. తొలిరోజు ఆట ముగిసే సరికి కాన్వే 279 బంతుల్లో 178 పరుగులతో (25 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా నైట్ వాచ్మన్ జేకబ్ డఫీ (Jacob Duffy) 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఫలితంగా గురువారం నాటి మొదటిరోజు ఆటలో న్యూజిలాండ్ 90 ఓవర్లలో వికెట్ నష్టానికి 334 పరుగులు సాధించింది.ప్రపంచ రికార్డుఇదిలా ఉంటే.. తొలి వికెట్కు లాథమ్, కాన్వే కలిసి 520 బంతుల్లో ఏకంగా 323 పరుగులు జతచేశారు. డబ్ల్యూటీసీ చరిత్రలో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. సౌతాఫ్రికాతో టెస్టులో 2019లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ- మయాంక్ అగర్వాల్ తొలి వికెట్కు 317 పరుగులు జోడించగా.. లాథమ్- కాన్వే తాజాగా ఈ రికార్డును సవరించారు.అంతేకాదు.. సొంతగడ్డపై టెస్టుల్లో అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సాధించిన జోడీగానూ లాథమ్- కాన్వే చరిత్రకెక్కారు. గతంలో ఈ రికార్డు చార్లెస్ స్టెవర్ట్ డెంప్స్టర్- జాన్ ఎర్నెస్ట్ మిల్స్ పేరిట ఉండేది. వీరిద్దరు కలిసి ఇంగ్లండ్పై 1930లో 276 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదిలా ఉంటే.. అబుదాబిలో మంగళవారం జరిగిన ఐపీఎల్-2026 మినీ వేలంలో అన్సోల్డ్గా మిగిలి పోయిన కాన్వే.. వేలం తర్వాత తన తొలి మ్యాచ్లోనే రికార్డు సెంచరీ సాధించడం విశేషం.చదవండి: IPL 2026 Auction: స్టీవ్ స్మిత్, కాన్వేలకు షాక్.. వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే -
విండీస్తో రెండో టెస్టు.. న్యూజిలాండ్ ఘన విజయం
వెల్లింగ్టన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సెకెండ్ టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బ్లాక్క్యాప్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. డెవాన్ కాన్వే(28), కేన్ విలియమ్సన్(16) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన విండీస్ మొదటి ఇన్నింగ్స్లో 205 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో షాయ్ హోప్(47) టాప్ స్కోరర్గా నిలవగా.. క్యాంప్బెల్(44) , కింగ్(33) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిక్నర్ నాలుగు, రే మూడు వికెట్లు సాధించారు.అనంతరం కివీస్ తమ తొలి ఇన్నింగ్స్ను 278/9 వద్ద ముగించింది. ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డ పేసర్ టిక్నర్ బ్యాటింగ్కు రాలేదు. మిచెల్ హే (93 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు.దీంతో తొలి ఇన్నింగ్స్లో కివీస్కు 73 పరుగుల ఆధిక్యం లభించింది. కరీబియన్ బౌలర్లలో అండర్సన్ ఫిలిప్ 3, రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్లో విండీస్ కేవలం 128 పరుగులకే కుప్పకూలింది. కివీ పేసర్ జాకబ్ డఫీ 5 వికెట్లు పడగొట్టి కరేబియన్ల పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మిచెల్ రే మూడు వికెట్లు సాధించాడు. కవీమ్ హోడ్జ్(35) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో విండీస్ ఆతిథ్య జట్టు ముందు కేవలం 56 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మౌంట్ మంగునూయ్ వేదికగా డిసెంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs SA: ‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు? -
న్యూజిలాండ్కు భారీ షాక్
వెస్టిండీస్తో రెండో టెస్టు సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బౌలర్ బ్లెయిర్ టిక్నర్ దారుణంగా గాయపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.కివీస్ జట్టు స్వదేశంలో వెస్టిండీస్ (NZ vs WI)తో ఆల్ ఫార్మాట్ సిరీస్లు ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత ఐదు టీ20ల సిరీస్ను 3-1తో గెలిచిన న్యూజిలాండ్.. వన్డే సిరీస్లో 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అనంతరం క్రైస్ట్చర్చ్ వేదికగా తొలి టెస్టులో కివీస్ విజయం సాధించే దిశగా పయనించగా.. అద్భుత పోరాటంతో విండీస్ మ్యాచ్ను డ్రా చేసుకుంది.205 పరుగులకే ఆలౌట్ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా బుధవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. విండీస్ బ్యాటింగ్కు దిగింది. కివీస్ బౌలర్ల ధాటికి తాళలేక 75 ఓవర్లు ఆడి కేవలం 205 పరుగులకే ఆలౌట్ అయింది.నాలుగు వికెట్లతో చెలరేగిన టిక్నర్ విండీస్ ఓపెనర్లు జాన్ కాంప్బెల్ (44), బ్రాండన్ కింగ్ (33) ఓ మోస్తరుగా రాణించగా.. షాయీ హోప్ (48) కూడా ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (29) మాత్రమే చెప్పుకోగదగ్గ స్కోరు చేశాడు. ఇక కివీస్ బౌలర్లలో పేసర్లు బ్లెయిర్ టిక్నర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మైకేల్ రే మూడు వికెట్లు పడగొట్టాడు.మరోవైపు.. జేకబ్ డఫీ ఒక వికెట్ తీయగా.. స్పిన్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) సైతం ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. విండీస్ టెయిలెండర్ ఆండర్సన్ ఫిలిప్ (5) రనౌట్ రూపంలో కివీస్కు ఓ వికెట్ దక్కింది. నొప్పితో విలవిల్లాడుతూఇదిలా ఉంటే.. వెస్టిండీస్ ఇన్నింగ్స్ 66వ ఓవర్లో మైకేల్ రే బంతితో రంగంలోకి దిగగా.. ట్రవిన్ ఇమ్లాచ్ ఫైన్ లెగ్ దిశగా బాల్ను గాల్లోకి లేపాడు. ఇంతలో ఫీల్డర్ టిక్నర్ బంతిని ఆపే క్రమంలో పల్టీ కొట్టాడు. ఈ క్రమంలో తన ఎడమ భుజం (Shoulder Injury)పై భారం మొత్తం పడగా.. నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో పడుకుండిపోయాడు.ఏడ్చేసిన బౌలర్!దీంతో కివీస్ శిబిరంలో ఆందోళన చెలరేగగా.. టిక్నర్ పరిస్థితి చూసి బౌలర్ మైకేల్ దాదాపుగా కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇంతలో ఫిజియో వచ్చి టిక్నర్ను మైదానం వెలుపలికి తీసుకువెళ్లగా.. అటు నుంచి అటే ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో టిక్నర్ ఎడమ భుజం విరిగినట్లు వార్తలు వస్తున్నాయి.మరోవైపు.. బుధవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి 9 ఓవర్లలో కివీస్ 24 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ టామ్ లాథమ్ 7, డెవాన్ కాన్వే 16 పరుగులతో క్రీజులో నిలిచారు. విండీస్ కంటే కివీస్ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్గా తొలిరోజు ఆతిథ్య న్యూజిలాండ్దే పైచేయి కాగా.. టిక్నర్ గాయం ఆందోళనకరంగా పరిణమించింది. చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు -
న్యూజిలాండ్కు 'ట్రిపుల్' షాక్
స్వదేశంలో వెస్టిండీస్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్కు ట్రిపుల్ షాక్ తగిలింది. డిసెంబర్ 10 నుంచి వెల్లింగ్టన్ వేదికగా జరుగబోయే రెండో టెస్ట్కు ముందు ఏకంగా ముగ్గురు స్టార్ బౌలర్లు గాయపడ్డారు. మ్యాట్ హెన్రీ కాఫ్ ఇంజ్యూరితో, నాథన్ స్మిత్ సైడ్ స్ట్రెయిన్తో, మిచెల్ సాంట్నర్ గ్రోయిన్ ఇంజ్యూరితో మిగతా రెండు టెస్ట్లకు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఆల్రౌండర్ క్రిస్టియన్ క్లార్క్, ఫాస్ట్ బౌలర్ మైఖేల్ రే, గ్లెన్ ఫిలిప్ జట్టులోకి వచ్చారు. స్మిత్, హెన్రీ తొలి టెస్ట్ సందర్భంగా గాయపడగా.. సాంట్నర్ ఇదే గాయం కారణంగా తొలి టెస్ట్కు కూడా దూరంగా ఉన్నాడు. పై ముగ్గురితో పాటు కొత్తగా మరో ఎంపిక కూడా జరిగింది. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన టామ్ బ్లండెల్కు కవర్గా మిచ్ హేను కూడా జట్టులోకి తీసుకున్నారు.కాగా, క్రైస్ట్చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. విండీస్ బ్యాటర్లు అసమాన పోరాటపటిమతో 531 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ మ్యాచ్ను డ్రా చేసుకున్నారు.షాయ్ హోప్ సూపర్ సెంచరీ (140).. జస్టిన్ గ్రీవ్స్ అజేయ డబుల్ సెంచరీ (202).. కీమర్ రోచ్ (233 బంతుల్లో 58 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో విండీస్ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లారు.72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గెలుపు అంచులకు వెళ్లిందంటే, ఈ విండీస్ యోధుల పోరాటం ఎలా సాగిందో అర్దం చేసుకోవచ్చు. అంత భారీ లక్ష్య ఛేదనలో విండీస్ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఏకంగా 163.3 ఓవర్లు ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు.చేతిలో 4 వికెట్లు ఉండి, గెలుపుకు 74 పరుగుల దూరంలో ఉన్న సమయంలో (457/6), ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఈ మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా పరోక్షంగా విండీస్ గెలిచినట్లే. విండీస్ యెధుల పోరాటాన్ని యావత్ క్రికెట్ ప్రపంచం కీర్తించింది. -
వెస్టిండీస్ క్రికెటర్ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్ క్రికెటర్ జస్టిన్ గ్రీవ్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. నాలుగో ఇన్నింగ్స్లో ఆరు లేదంటే అంతకంటే లోయర్ ఆర్డర్లో వచ్చి ద్విశతకం బాదిన క్రికెటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.పరిమిత ఓవర్ల సిరీస్లలో పరాభవంకాగా ఐదు టీ20, మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు విండీస్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటన (West Indies tour of New Zealand, 2025)కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా ఆతిథ్య కివీస్ 3-1తో గెలిచింది. వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ మేరకు పరిమిత ఓవర్ల సిరీస్లలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవాల తర్వాత.. వెస్టిండీస్ టెస్టు సిరీస్ మొదలుపెట్టింది.తొలి టెస్టులో అసాధారణ పోరాటంక్రైస్ట్చర్చ్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టును అసాధారణ పోరాటంతో వెస్టిండీస్ కనీసం డ్రా చేసుకోగలిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కివీస్ తొలి ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌట్ అయింది.ఇందుకు బదులిచ్చే క్రమంలో వెస్టిండీస్ తడబడింది. తేజ్నరైన్ చందర్పాల్ (52), షాయీ హోప్ (Shai Hope- 56) మాత్రమే రాణించగా.. మిగతా వాళ్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో 167 పరుగులకే పర్యాటక జట్టు కుప్పకూలింది. ఫలితంగా కివీస్కు తొలి ఇన్నింగ్స్లో 64 పరుగుల ఆధిక్యం లభించింది.హోప్ సెంచరీ, జస్టిన్ డబుల్ సెంచరీఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్.. ఎనిమిది వికెట్ల నష్టానికి 466 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా విండీస్కు 531 (64+ 466)పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఈ నేపథ్యంలో షాయీ హోప్ (234 బంతుల్లో 140)తో కలిసి జస్టిన్ గ్రీవ్స్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు.ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన గ్రీవ్స్.. 388 బంతులు ఎదుర్కొని 19 ఫోర్ల సాయంతో 202 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, ఆఖరి రోజు విండీస్కు చేతిలో 4 వికెట్లు ఉండి.. విజయానికి 74 పరుగుల దూరంలో ఉన్న వేళ.. సమయాభావం దృష్ట్యా ‘డ్రా’కు అంగీకరించాల్సి వచ్చింది.ఆరో స్థానంలో వచ్చిఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా 31 ఏళ్ల జస్టిన్ గ్రీవ్స్ (Justin Greaves)... టెస్టు క్రికెట్లో నాలుగో ఇన్నింగ్స్లో ఆరో స్థానంలో వచ్చి డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఇక ఇతరులలో భారత దిగ్గజం సునిల్ గావస్కర్ నాలుగో ఇన్నింగ్స్లో ఓపెనర్గా వచ్చి 221 పరుగులు చేయడం విశేషం.చదవండి: భారత్తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు భారీ షాకులు -
చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసిన వెస్టిండీస్
వెస్టిండీస్ క్రికెట్ జట్టు చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసింది. క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్లో 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అసాధారణ పోరాటపటిమ ప్రదర్శించింది. చేతిలో 4 వికెట్లు ఉండి, గెలుపుకు 74 పరుగుల దూరంలో ఉన్న సమయంలో (457/6), ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో డ్రాతో సరిపెట్టుకుంది.ఆట చివరి రోజు జస్టిన్ గ్రీవ్స్ అజేయ డబుల్ సెంచరీతో (202).. కీమర్ రోచ్ (233 బంతుల్లో 58 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో వీరిచిత పోరాటాన్ని చేశారు. ముఖ్యంగా గ్రీవ్స్ చేసిన పోరాటం టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ పోరాటాల్లో ఒకటిగా మిగిలిపోనుంది. తిమ్మిర్లతో బాధపడుతూ గ్రీవ్స్ ఆడిన ఇన్నింగ్స్ నభూతో నభవిష్యతి అన్నట్లు ఉంది.37 ఏళ్ల వయసులో రోచ్ చేసిన పోరాటాన్ని విస్మరించలేము. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన తర్వాత ఏకంగా 233 బంతుల ఎదుర్కోవడం అంటే ఆషామాషీ విషయం కాదు. అంతకుముందు షాయ్ హోప్ అద్బుతమైన శతకంతో (140) వీరిలో స్పూర్తి నింపాడు.72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గెలుపు అంచులకు వెళ్లిందంటే, ఈ విండీస్ యోధుల పోరాటం ఎలా సాగిందో అర్దం చేసుకోవచ్చు. అంత భారీ లక్ష్య ఛేదనలో విండీస్ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఏకంగా 163.3 ఓవర్లు ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు.ముఖ్యంగా గ్రీవ్స్ ఆటతీరును ఎంత పొగిడినా తక్కువే. ఇతగాడు 565 నిమిషాల పాటు క్రీజ్లో ఉండి, తన జట్టు మ్యాచ్ను కోల్పోకుండా కాపాడాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా పరోక్షంగా విండీస్ గెలిచినట్లే. విండీస్ యెధుల పోరాటాన్ని యావత్ క్రికెట్ ప్రపంచం కీర్తిస్తుంది.ఈ యోధులు ఎదుర్కొన్నది సాధారణ బౌలింగ్ గణాన్ని కాదు. మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ లాంటి పేస్ బౌలింగ్ దిగ్గజాలను, బ్రేస్వెల్ లాంటి నాణ్యమైన స్పిన్నర్ను. వీరి తట్టుకొని నాలుగో ఇన్నింగ్స్లో అంత భారీ లక్ష్యానికి చేరువ కావడం ఊహకందని గొప్ప విషయం.ఉనికి కోసం పోరాడుతున్న క్రమంలో..గత మూడు దశాబ్దాలుగా ప్రభ కోల్పోయి ఉనికి కోసం పోరాడుతున్న విండీస్ లాంటి జట్టు నుంచి ఇలాంటి వీరోచిత పోరాటన్ని ఎవరూ ఊహించి ఉండరు. ఈ జట్టు షాయ్ హోప్ లాంటి ఆటగాడు ఇస్తున్న స్పూర్తితో ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో.. పాకిస్తాన్ను పాకిస్తాన్లో ఓడించి, పూర్వ వైభవం దిశగా సాగుతున్నామన్న సంకేతాలు పంపింది.సరికొత్త చరిత్ర అయ్యేదిఈ మ్యాచ్ విండీస్ గెలిచి ఉంటే సరికొత్త చరిత్ర సృష్టించి ఉండేది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు 500కు మించి లక్ష్యాన్ని ఛేదించలేదు. గత రికార్డు కూడా విండీస్ పేరిటే ఉంది. 2003లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో విండీస్ 418 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.లాథమ్, రచిన్ శతకాలుఅంతకుముందు టామ్ లాథమ్ (145), రచిన్ రవీంద్ర (176) భారీ శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ (466/8) చేసి విండీస్ ముందు 531 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కీమర్ రోచ్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.చెలరేగిన డఫీదీనికి ముందు జేకబ్ డఫీ ఐదేయడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్లో 167 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లోనూ హోప్ (56) రాణించాడు. తేజ్నరైన్ చంద్రపాల్ (52) అర్ద సెంచరీతో పర్వాలేదనిపించాడు.కలిసికట్టుగా రాణించిన విండీస్ బౌలర్లువిండీస్ బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 231 పరుగులకే ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (52) ఒక్కడే కివీస్ ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు. -
ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్న కరీబియన్ యోధుడు
1970, 80 దశకాల్లో ప్రపంచ క్రికెట్ను శాశించిన వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం ఉనికి కోసం పోరాడుతుంది. స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్, బోర్డు ఆర్థిక సమస్యలు, ఆటగాళ్ల మధ్య విభేదాలు, మౌలిక సదుపాయాల లోపం కారణంగా ఆ జట్టు కనీసం చిన్న జట్లకు కూడా పోటీ ఇవ్వలేని స్థితిలో ఉంది. రెండు సార్లు వన్డే ప్రపంచకప్ (1975, 1979), రెండు సార్లు టీ20 ప్రపంచకప్ (2012, 2016) ఛాంపియన్ అయిన ఆ జట్టు ప్రస్తుతం ప్రపంచకప్కు అర్హత సాధించాలంటేనే ఇబ్బంది పడుతుందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.ఇలాంటి పరిస్థితుల్లో ఆ జట్టును ఓ 'హోప్' నిలబెడుతుంది. ఆ హోప్ పేరే 'షాయ్ హోప్' (Shai Hope). ఈ బార్బడోస్ వికెట్కీపర్ బ్యాటర్ ప్రస్తుతం విండీస్ క్రికెట్కు ఆశాకిరణంలా మారాడు. విండీస్ జట్టు అడపాదడపా విజయాలు సాధిస్తుందంటే ఈ హోప్ పుణ్యమే. ఈ హోపే లేకుంటే విండీస్ క్రికెట్కు నామరూపాలు కూడా లేవు.ఈ ఒక్కడే నిలకడగా రాణిస్తూ ప్రపంచ క్రికెట్ పటంలో విండీస్ పేరు తుడిచిపెట్టుకుపోకుండా కాపాడుతున్నాడు. ఫార్మాట్లో ఏదైనా ఇతనికి అండగా నిలబడే ఒక్క ప్లేయర్ కూడా ప్రస్తుత విండీస్ జట్టులో లేడు. ఎవరైనా ఉన్నా వారు వన్ మ్యాచ్ వండర్లానే మిగిలిపోతున్నారు.హోప్ ఒక్కడే బ్యాటర్గా, వికెట్కీపర్గా, కెప్టెన్గా (పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో) త్రిపాత్రాభినయం చేస్తూ విండీస్ క్రికెట్ను బ్రతికిస్తున్నాడు. గడిచిన ఐదేళ్లలో ఈ హోప్ మరింత రాటుదేలాడు. దాదాపుగా ప్రతి మ్యాచ్లో సత్తా చాటుతూ ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లకు పోటీగా మారాడు. ఫార్మాట్ ఏదైనా హోప్ తన తడాఖా చూపుతున్నాడు.తొలుత టెస్ట్ల్లో కాస్త వీక్గా కనిపించినా, క్రమంగా ఈ ఫార్మాట్పై కూడా తన ముద్ర వేశాడు. ఈ ఏడాది ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై 2, భారత్లో ఒకటి, తాజాగా న్యూజిలాండ్ గడ్డపై సెంచరీ చేశాడు. వాస్తవానికి హోప్ అత్యుత్తమంగా ఆడే ఫార్మాట్ వన్డే క్రికెట్. ఈ ఫార్మాట్లో హోప్ను మించినోడు లేడు. అతని గణాంకాలే ఇందుకు నిదర్శనం. 148 మ్యాచ్ల్లో అతను 50కి పైగా సగటుతో 19 సెంచరీల సాయంతో 6000 పైచిలుకు పరుగులు చేశాడు. ఈ గణాంకాలు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి గణాంకాలతో పోటీపడతాయి. ముఖ్యంగా ఈ ఏడాది హోప్ ఫార్మాట్లకతీంగా అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టీ20 శతకంతో మొదలుకొని భారత్లో టెస్ట్ శతకం, పాకిస్తాన్లో వన్డే శతకం, న్యూజిలాండ్లో మరో వన్డే శతకం, తాజాగా న్యూజిలాండ్లో టెస్ట్ శతకం సాధించి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో ముందువరుసలో ఉన్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా ఆటగాడు శుభ్మన్ గిల్ (1732) ఒక్కడే హోప్ (1677) కంటే ఎక్కువ పరుగులు చేశాడు.తాజాగా హోప్ న్యూజిలాండ్పై చేసిన టెస్ట్ సెంచరీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. కంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతూనే హోప్ ఈ సెంచరీ చేశాడు. 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్ను (116) కొనసాగిస్తున్నాడు. 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వీరోచిత పోరాటాన్ని ప్రదర్శిస్తున్నాడు.జస్టిన్ గ్రీవ్స్తో (55) కలిసి ఐదో వికెట్కు అజేయమైన 140 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్లో విండీస్ గెలవాంటే చివరి రోజు 319 పరుగులు చేయాలి. హోప్ కసి చూస్తే విండీస్కు సంచలన విజయం అందించేలా కనిపిస్తున్నాడు. ఇదే జరిగితే విండీస్ క్రికెట్ పునర్జన్మకు బీజం పడినట్లే. -
హోప్ వీరోచిత శతకం.. కంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతూనే..!
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో విండీస్ స్టార్ బ్యాటర్ షాయ్ హోప్ (Shai Hope) అద్భుత శతకంతో మెరిశాడు. కంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతూనే ఈ సెంచరీ నమోదు చేశాడు. 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్ను (103) కొనసాగిస్తున్నాడు. 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వీరోచిత పోరాటాన్ని ప్రదర్శిస్తున్నాడు.జస్టిన్ గ్రీవ్స్తో (42) కలిసి ఐదో వికెట్కు అజేయమైన 110 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్లో విండీస్ గెలవాలంటే ఇంకా 349 పరుగులు చేయాలి. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్ 182/4గా ఉంది. నాలుగో రోజు మూడో సెషన్ ఆట కొనసాగుతుంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో విండీస్ గెలవలేదు.అంతకుముందు టామ్ లాథమ్ (145), రచిన్ రవీంద్ర (176) భారీ శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ (466/8) చేసింది. కీమర్ రోచ్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. దీనికి ముందు.. జేకబ్ డఫీ ఐదేయడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్లో 167 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లోనూ హోప్ (56) రాణించాడు. తేజ్నరైన్ చంద్రపాల్ (52) అర్ద సెంచరీతో పర్వాలేదనిపించాడు.అంతకుముందు న్యూజిలాండ్ కూడా తొలి ఇన్నింగ్స్లో తడబడింది. విండీస్ బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో 231 పరుగులకే ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (52) ఒక్కడే కివీస్ ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా క్రైస్ట్చర్చ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. -
లాథమ్, రచిన్ భారీ శతకాలు.. పట్టు బిగించిన న్యూజిలాండ్
క్రైస్ట్చర్చ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ పట్టు బిగించింది. టామ్ లాథమ్ (145), రచిన్ రవీంద్ర (176) భారీ శతకాలతో కదంతొక్కడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 481 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు స్కోర్ 417/4గా ఉంది. విల్ యంగ్ (21), బ్రేస్వెల్ (6) క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో రోచ్, షీల్డ్స్కు తలో 2 వికెట్లు దక్కాయి.అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 167 పరుగులకే ఆలౌటైంది. చంద్రపాల్ (52), హోప్ (56) మాత్రమే అర్ద సెంచరీలతో రాణించారు. జేకబ్ డఫీ 5 వికెట్లు తీసి విండీస్ను దెబ్బేశాడు. హెన్రీ 3, ఫౌల్క్స్ 2 వికెట్లు తీశారు.దీనికి ముందు న్యూజిలాండ్ కూడా తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే (231) ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (52), బ్రేస్వెల్ (47) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో న్యూజిలాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. విండీస్ బౌలర్లు తలో చేయి వేసి న్యూజిలాండ్ను తక్కువ స్కోర్కే పరిమితం చేశారు. -
ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్
క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. తొలుత విండీస్ బౌలర్లు రెచ్చిపోయి కివీస్ను 231 పరుగులకే కట్టడి చేయగా.. ఆతర్వాత కివీస్ బౌలర్లు విండీస్ను 167 పరుగులకే కుప్పకూల్చి ప్రతీకారం తీర్చుకున్నారు. జేకబ్ డఫీ ఐదు వికెట్లు తీసి విండీస్ను దెబ్బేశాడు. మ్యాట్ హెన్రీ 3, ఫౌల్క్స్ 2 వికెట్లతో మిగతా పని కానిచ్చేశారు.తేజ్నరైన్ చంద్రపాల్ (52), షాయ్ హోప్ (56) అర్ద సెంచరీలతో రాణించడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వీరు కాకుండా ఇమ్లాచ్ (14), రోచ్ (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. విండీస్ ఇన్నింగ్స్లో ఏకంగా నలుగురు ఖాతా కూడా తెరవలేకపోయారు.అంతకుముందు విండీస్ బౌలర్లు తలో చేయి వేసి కివీస్ను స్వల్ప స్కోర్కే కట్టడి చేశారు. కేన్ విలియమ్సన్ (52), బ్రేస్వెల్ (47) ఓ మోస్తరుగా రాణించడంతో ఆ జట్టు గౌరవప్రమైన స్కోర్ చేయగలిగింది.64 పరుగుల కీలక ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. రెండో రోజు మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ 10, డెవాన్ కాన్వే 1 పరుగుతో క్రీజ్లో ఉన్నారు. -
కివీస్పై విండీస్ ఆధిపత్యం
క్రైస్చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో విండీస్ బౌలర్లు చెలరేగిపోయారు. తలో చేయి వేసి కివీస్ను స్వల్ప స్కోర్కే పరిమితం చేశారు. కీమర్ రోచ్, సీల్స్, షీల్డ్స్, గ్రీవ్స్ తలో 2.. లేన్, ఛేజ్ చెరో వికెట్ తీసి కివీస్ తొలి ఇన్నింగ్స్ను 231 పరుగులకే కుప్పకూల్చారు.కివీస్ ఇన్నింగ్స్లో కేన్ విలియమ్సన్ (52) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. బ్రేస్వెల్ (47), బ్లండల్ (29), లాథమ్ (24), నాథన్ స్మిత్ (23), యంగ్ (14) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాన్వే (0), రచిన్ (3), ఫౌల్క్స్ (4), హెన్రీ (8) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ ఇన్నింగ్స్లో కివీస్పై విండీస్ స్పష్టమై ఆధిపత్యం చలాయించింది.అనంతరం బరిలోకి దిగిన విండీస్ బ్యాటింగ్లోనూ పర్వాలేదనిపిస్తుంది. 44 ఓవర్ల తర్వాత ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. షాయ్ హోప్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. తేజ్నరైన్ చంద్రపాల్ 38, కెప్టెన్ ఛేజ్ 0 పరుగుల వద్ద క్రీజ్లో ఉన్నారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు విండీస్ ఇంకా 126 పరుగులు వెనుకపడి ఉంది. ప్రస్తుతం రెండో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్ ఇది. -
భారీ రికార్డులు సొంతం చేసుకున్న కేన్ మామ
క్రైస్ట్చర్చ్లో వెస్టిండీస్తో ఇవాళ (డిసెంబర్ 2) మొదటి టెస్ట్లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 102 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి ఔటైన అతడు.. విండీస్పై టెస్ట్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో న్యూజిలాండ్ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కేన్కు ముందు రాస్ టేలర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత విండీస్పై కేన్ టెస్ట్ పరుగుల సంఖ్య 1022 పరుగులకు చేరగా.. రాస్ టేలర్ పరుగుల సంఖ్య 1136గా ఉంది.ఈ ఇన్నింగ్స్తో కేన్ మరో ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. టెస్ట్ల్లో విండీస్పై అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా నాథన్ ఆస్టల్ రికార్డును సమం చేశాడు. కేన్, ఆస్టల్ ఇద్దరూ విండీస్పై తలో 8 టెస్ట్ ఫిఫ్టీలు చేశారు.కేన్ రికార్డులను పక్కన పెడితే.. ఈ మ్యాచ్లో కివీస్ తడబాటుకు లోనైంది. 120 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ డెవాన్ కాన్వే డకౌటయ్యాక కేన్, కెప్టెన్ లాథమ్ (24) కాసేపు నిలకడగా బ్యాటింగ్ చేశారు. 94 పరుగుల జట్టు స్కోర్ వద్ద కేన్ ఔట్ కావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. జట్టు స్కోర్కు మరో పరుగు జోడించబడగానే లాథమ్ కూడా ఔటయ్యాడు. మరో 8 పరుగుల వ్యవధిలో రచిన్ రవీంద్ర (3) కూడా ఔటయ్యాడు. మరో 17 పరుగుల తర్వాత విల్ యంగ్ (14) కూడా పెవిలియన్కు చేరాడు. విండీస్ బౌలర్లలో రోచ్, సీల్స్, లేన్ తలో వికెట్ తీయగా.. గ్రీవ్స్ 2 వికెట్లు పడగొట్టాడు. 48 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 5 వికెట్ల నష్టానికి 148 పరుగులుగా ఉంది. టామ్ బ్లండల్ (29), బ్రేస్వెల్ (6) క్రీజ్లో ఉన్నారు. -
విలియమ్సన్ రీఎంట్రీ.. విండీస్తో టెస్టులకు కివీస్ జట్టు ఇదే
వెల్లింగ్టన్: సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) న్యూజిలాండ్ టెస్టు జట్టులో పునరాగమనం చేశాడు. విదేశీ లీగ్లలో ఆడేందుకు జాతీయ కాంట్రాక్టుకు దూరమైన విలియమ్సన్... పరిమిత మ్యాచ్ల్లో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లో చాలా మ్యాచ్లకు దూరమైన కేన్... వచ్చే నెల 2 నుంచి వెస్టిండీస్ (NZ vs WI Tests)తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆడనున్నాడు. దీని కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సోమవారం 14 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టామ్ లాథమ్ సారథ్యంలో..ఇప్పటికే వెస్టిండీస్పై టీ20, వన్డే సిరీస్లు నెగ్గిన న్యూజిలాండ్... సొంతగడ్డపై సుదీర్ఘ ఫార్మాట్లోనూ బలమైన జట్టుతో బరిలోకి దిగనుంది. టామ్ లాథమ్ జట్టుకు సారథ్యం వహించనుండగా... కాన్వే, విలియమ్సన్, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ బ్యాటింగ్ భారం మోయనున్నారు. ఇక విలియమ్సన్ వంటి అనుభవం గల ఆటగాడు జట్టులో ఉండటం ఇతర ఆటగాళ్లకు ఎంతగానో ఉపకరిస్తుందని న్యూజిలాండ్ హెడ్కోచ్ రాబ్ వాల్టర్ అన్నాడు. పేస్ బౌలర్లు జాక్ ఫౌల్క్స్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నెర్ జట్టులో చోటు దక్కించుకోగా... గాయం నుంచి పూర్తిగా కోలుకోని కైల్ జెమీసన్ను ఈ సిరీస్కు పరిగణించలేదు. వెస్టిండీస్తో టెస్టులకు న్యూజిలాండ్ జట్టు టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రేస్వెల్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్ -
షాయ్ హోప్ మహోగ్రరూపం
న్యూజిలాండ్ పర్యటనలో వెస్టిండీస్ వన్డే సిరీస్ను కూడా కోల్పోయింది. తొలుత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-3 తేడాతో చేజార్చుకున్న కరీబియన్ జట్టు.. తాజాగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది.నేపియర్ వేదికగా ఇవాళ (నవంబర్ 19) జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో విండీస్ కెప్టెన్ వీరంగం చేశాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ, విధ్వంసకర శతకం బాదాడు. కేవలం 69 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.విండీస్ ఇన్నింగ్స్లో హోప్ 109 పరుగుల తర్వాత రెండో అత్యధిక స్కోర్ కేవలం 22 పరుగులు మాత్రమే. అకీమ్ అగస్ట్, జస్టిన్ గ్రీవ్స్, రొమారియో షెపర్డ్ తలో 22 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లలో మాథ్యూ ఫోర్డ్ (21), రూథర్ఫోర్డ్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 4, జేమీసన్ 3, టిక్నర్, సాంట్నర్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్కు ఓపెనర్లు డెవాన్ కాన్వే (90), రచిన్ రవీంద్ర (56) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆఖర్లో టామ్ లాథమ్ (39 నాటౌట్), మిచెల్ సాంట్నర్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో చెలరేగడంతో న్యూజిలాండ్ మరో 3 బంతులు మిగిలుండగానే మ్యాచ్తో పాటు సిరీస్ను కూడా కైవసం చేసుకుంది. నామమాత్రపు చివరి వన్డే హ్యామిల్టన్ వేదికగా నవంబర్ 22న జరుగనుంది. అనంతరం డిసెంబర్ 2 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ మొదలవుతుంది.19వ సెంచరీఈ ఇన్నింగ్స్తో హోప్ ఈ ఏడాది విండీస్ తరఫున మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ సెంచరీ హోప్కు వన్డేల్లో 19వది. క్రిస్ గేల్ (25) తర్వాత వన్డేల్లో విండీస్ తరఫున అత్యధిక సెంచరీలు చేసింది హోపే. 19 శతకాలను హోప్ కేవలం 142 ఇన్నింగ్స్ల్లో సాధించడం మరో విశేషం. ఈ సెంచరీలకు హోప్ 12 దేశాలపై చేశాడు. -
న్యూజిలాండ్కు భారీ షాక్..
స్వదేశంలో వెస్టిండీస్తో జరుగుతున్న మూడు వన్డేల వన్డే సిరీస్లో న్యూజిలాండ్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, తొలి వన్డే సెంచరీ హీరో డారిల్ మిచెల్ గజ్జ గాయం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. క్రైస్ట్చర్చ్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో మిచెల్ తొడ కండరాలు పట్టేశాయి.దీంతో మ్యాచ్ అనంతరం అతడిని స్కాన్స్ కోసం ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్లలో చిన్నపాటి చీలిక (minor tear) ఉన్నట్లు తేలింది. దీంతో అతడికి రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో అతడిని జట్టును నుంచి కివీస్ సెలక్టర్లు తప్పించారు. మిచెల్ స్ధానాన్ని వెటరన్ బ్యాటర్ హెన్రీ నికోల్స్తో సెలక్టర్లు భర్తీ చేశారు."డారిల్ మిచెల్ వంటి అద్బుతమైన ఆటగాడు సిరీస్ మధ్యలో తప్పుకోవడం మాకు గట్టి ఎదురు దెబ్బే. అతడు మా జట్టులో కీలక సభ్యుడు. తర్వాత రెండు మ్యాచ్లలో అతడి లేని లోటు మాకు కచ్చితంగా తెలుస్తోంది" అని కోచ్ రాబ్ వాల్టర్ పేర్కొన్నారు. మిచెల్ తిరిగి వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల సిరీస్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశముంది.న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, మార్క్ చాప్మన్చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! స్టార్ ప్లేయర్కు మళ్లీ పిలుపు -
ఉత్కంఠ పోరు.. విండీస్పై న్యూజిలాండ్ గెలుపు
వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. ఆదివారం క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్పై 7 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (118 బంతుల్లో 119; 12 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా.. డెవాన్ కాన్వే (58 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్) ఆర్ధ శతకంతో రాణించాడు. టాపార్డర్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (4), విల్ యంగ్ (0) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ ఫోర్డ్ రెండు, గ్రీవ్స్, చేజ్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 262 పరుగులే చేయగలిగింది. షెర్ఫాన్ రూథర్ఫర్డ్ (61 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్స్లు), గ్రీవ్స్ (24 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ షై హోప్ (37; 2 ఫోర్లు, 1 సిక్స్), కీసీ కార్టి (32; 2 ఫోర్లు), అతానెజ్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్), రొమారియో షెఫర్డ్ (26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) సమష్టిగా రాణించడంతో గెలిచే స్థితిలో నిలిచింది. కానీ ఆఖరి 12 బంతుల్లో 32 పరుగుల సమీకరణాన్ని సాధించలేకపోయింది. చివరి రెండు ఓవర్లలో కరేబియన్ జట్టు 24 పరుగులు సాధించి ఓటమి పాలైంది. జేమీసన్ కీలక వికెట్లు పడగొట్టగా, హెన్రీ, ఫౌక్స్, సాన్ట్నర్ తలా ఒక వికెట్ తీశారు.చదవండి: IND vs SA: ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టుకు డౌటే -
వర్షార్పణం.. ఆధిక్యంలో న్యూజిలాండ్
న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 10) జరగాల్సిన నాలుగో టీ20 వర్షార్పణమైంది. నెల్సన్లోని సాక్స్ట్న్ వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉండింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. 6.3 ఓవర్ల తర్వాత మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది.వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. ఆ సమయానికి విండీస్ స్కోర్ వికెట్ నష్టానికి 38 పరుగులుగా ఉంది. అలిక్ అథనాజ్ (21) ఔట్ కాగా.. ఆమిర్ జాంగూ (12), కెప్టెన్ షాయ్ హోప్ (3) క్రీజ్లో ఉన్నారు. అథనాజ్ వికెట్ నీషమ్కు దక్కింది.ఆధిక్యంలో న్యూజిలాండ్ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో న్యూజిలాండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. మొదటి మ్యాచ్లో విండీస్ గెలువగా.. న్యూజిలాండ్ వరుసగా రెండు, మూడు మ్యాచ్ల్లో గెలిచింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఐదో టీ20 డునెడిన్ వేదికగా నవంబర్ 13న జరుగనుంది.కాగా, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్తో పాటు 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తుంది. టీ20 సిరీస్ తర్వాత వన్డే సిరీస్, ఆతర్వాత టెస్ట్ సిరీస్ జరుగుతాయి. నవంబర్ 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగనుండగా.. డిసెంబర్ 2, 10, 18 తేదీల్లో టెస్ట్ మ్యాచ్లు మొదలవుతాయి. చదవండి: ఐదేసిన ములానీ.. మావి ఆల్రౌండ్ షో -
ఉత్కంఠ పోరు.. పోరాడి ఓడిన వెస్టిండీస్
వెస్టిండీస్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20 అభిమానులను ఆఖరివరకు మునివేళ్లపై నిలబెట్టింది. నెల్సన్ వేదికగా నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో 9 పరుగుల తేడాతో విండీస్ ఓటమి పాలైంది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్ జట్టు 19.5 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది.లక్ష్య చేధనలో వెస్టిండీస్ 88 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఆల్రౌండర్ రొమారియో షెపర్డ్, టెయిలాండర్ బ్యాటర్ స్ప్రింగర్ కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ బౌండరీల వర్షం కురిపించారు. విధ్వంసకర బ్యాటింగ్తో తమ జట్టును విజయానికి చేరువ చేశారు. అయితే 19 ఓవర్లో ఆఖరి బంతికి స్ప్రింగర్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 39) ఔట్ కావడంతో కివీస్ మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి ఓవర్లో విండీస్ విజయానికి 12 పరుగులు అవసరమవ్వగా.. జామిసన్ కేవలం రెండు రన్స్ మాత్రమే ఇచ్చాడు. షెపర్డ్(34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 49) ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. బ్లాక్క్యాప్స్ బౌలర్లలో జాకబ్ డఫీ, ఇష్ సోధి చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. జామిసన్, బ్రెస్వెల్, శాంట్నర్ తలా వికెట్ సాధించారు.కాన్వే సూపర్ హాఫ్ సెంచరీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 56) హాఫ్ సెంచరీ సాధించగా.. మిచెల్(41), రవీంద్ర(26) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. విండీస్ బౌలర్లలో ఫోర్డ్, హోల్డర్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ విజయంతో కివీస్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 నెల్సన్ వేదికగా సోమవారం జరగనుంది. -
మొన్న టీ20లకు రిటైర్మెంట్.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం!
వెస్టిండీస్తో వన్డే సిరీస్కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు శుక్రవారం వెల్లడించింది. ఈ సిరీస్కు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. వర్క్లోడ్ మెనెజ్మెంట్లో భాగంగా ఈ సిరీస్ నుంచి కేన్ తప్పుకొన్నాడు.ఇటీవల అంతర్జాతీయ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికిన విలియమ్సన్..ఇకపై ఎక్కువగా టెస్ట్ ఫార్మాట్పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వన్డేల్లో న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు (7256 పరుగులు, సగటు 48.70) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న కేన్ మామ.. ఫిట్నెస్ పరంగా మాత్రం అతడు గత కొంతకాలంగా సతమవుతున్నాడు. విండీస్తో మూడు టెస్టుల సిరీస్ సమయానికి పూర్తి ఫిట్గా ఉండేందుకే వన్డేలకు దూరంగా ఉండాలని విలియమ్సన్ నిర్ణయించుకున్నాడు. ఈ కివీస్ మాజీ కెప్టెన్ త్వరలోనే వన్డేలకు కూడా వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది. ఐపీఎల్-2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ వ్యూహాత్మక సలహాదారుడిగా కేన్ పనిచేయనున్నాడు.ఇక గాయం కారణంగా ఇంగ్లండ్తో ఆఖరి రెండు వన్డేలకు దూరమైన స్టార్ పేసర్ మాట్ హెన్రి తిరిగి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా ఇంగ్లండ్ సిరీస్లో అద్భుతంగా రాణించిన పేసర్ బ్లెయిర్ టిక్నర్కు మరోసారి జట్టులో చోటు లభించింది. ఈ జట్టుకు స్టార్ ఆల్రౌండర్ మిచెల్ శాంట్నర్ నాయకత్వం వహించనున్నాడు. మరోవైపు మహ్మద్ అబ్బాస్, ఫిన్ అలెన్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, బెన్ సియర్స్ వంటి ఆటగాళ్లు జట్టు సెలక్షన్కు అందుబాటులో లేరు. ఈ మూడు మ్యాచ్ల సిరీస్ నవంబర్ 16 నుంచి క్రైస్ట్చర్చ్ వేదికగా ప్రారంభం కానుంది.విండీస్తో వన్డేలకు కివీస్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్చదవండి: పాకిస్తాన్ కెప్టెన్ విధ్వంసం.. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ -
ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. రోవ్మన్ పావెల్ విధ్వంసం.. కానీ..
న్యూజిలాండ్- వెస్టిండీస్ మధ్య రెండో టీ20 ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఆఖరి బంతి వరకు విజయం కోసం ఇరుజట్లు హోరాహోరీ తలపడ్డాయి. మరి గెలుపు ఎవరిని వరించిందంటే..?!ఐదు టీ20లు, మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడేందుకు విండీస్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. ఆక్లాండ్లో బుధవారం ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్ వెస్టిండీస్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం అదే వేదికపై రెండో టీ20 జరిగింది. ఆక్లాండ్లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే (16), వన్డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (11) మరోసారి విఫలం కాగా.. మరో ఓపెనర్ టిమ్ రాబిన్సన్ (25 బంతుల్లో 39) రాణించాడు.కేవలం 28 బంతుల్లోనేఇక నాలుగో నంబర్ బ్యాటర్ మార్క్ చాప్మన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది ఏకంగా 78 పరుగులు సాధించాడు. చాప్మన్ విధ్వంసకర ఇన్నింగ్స్కు తోడు.. డారిల్ మిచెల్ (14 బంతుల్లో 28 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 8 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచాడు.Starring Mark Chapman: A Bowler’s Nightmare 🎥#NZvWI pic.twitter.com/KXWomWevnN— FanCode (@FanCode) November 6, 2025ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ రెండు వికెట్లు తీయగా.. మాథ్యూ ఫోర్డ్, జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్కు ఆదిలోనే షాక్ తగిలింది.ఓపెనర్ బ్రాండన్ కింగ్ (0)ను జేకబ్ డఫీ డకౌట్ చేశాడు. అయితే, మరో ఓపెనర్ అలిక్ అథనాజ్ (25 బంతుల్లో 33), వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ షాయీ హోప్ (26 బంతుల్లో 24) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. మిడిలార్డర్లో అకీమ్ ఆగస్టి (7), జేసన్ హోల్డర్ (16) నిరాశపరచగా.. ఏడో నంబర్ ఆటగాడు రోస్టన్ చేజ్ (6) కూడా విఫలమయ్యాడు.రోవ్మన్ పావెల్ అద్భుత ఇన్నింగ్స్ఈ క్రమంలో విజయంపై ఆశలు వదిలేసుకున్న వేళ.. విండీస్ పవర్ హిట్టర్ రోవ్మన్ పావెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 16 బంతుల్లోనే ఒక ఫోర్, ఆరు సిక్సర్ల సాయంతో 45 పరుగులు సాధించి జట్టును విజయానికి చేరువ చేశాడు.అతడికి తోడుగా రొమారియో షెఫర్డ్ (16 బంతుల్లో 34), మాథ్యూ ఫోర్డ్ (13 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఈ క్రమంలో కివీస్ విధించిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. ఆఖరి ఓవర్లో విండీస్ విజయ సమీకరణం ఆరు బంతుల్లో 16 పరుగులుగా మారింది.ఆఖరి ఓవర్లో కైలీ జెమీషన్ బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతికే ఫోర్డ్ ఫోర్ బాదాడు. ఆ తర్వాత పరుగులేమీ రాలేదు. మూడో బంతి నోబాల్ కాగా ఫోర్డ్ మరో ఫోర్తో చెలరేగాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ తీశాడు. ఈ క్రమంలో పావెల్ నాలుగో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించి చాప్మన్కు క్యాచ్ ఇచ్చాడు.ఆఖరి బంతి వరకు ఉత్కంఠదీంతో విండీస్ కీలక వికెట్ కోల్పోగా.. అకీల్ హొసేన్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఐదో బంతికి అకీల్ సింగిల్ తీయగా.. ఆఖరి బంతికి విండీస్ విజయానికి ఐదు పరుగులు అవసరమయ్యాయి. అయితే, ఇక్కడే జెమీషన్ మాయ చేశాడు. అద్భుత బంతిని సంధించగా.. ఫోర్డ్ సింగిల్కే పరిమితమయ్యాడు. దీంతో మూడు పరుగుల స్వల్ప తేడాతో జయభేరి మోగించిన ఆతిథ్య కివీస్ సిరీస్ను 1-1తో సమం చేసింది. కివీస్ బౌలర్లలో ఇష్ సోధి, సాంట్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. డఫీ, జెమీషన్ చెరో వికెట్ తీశారు. చాప్మన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగే మూడో టీ20కి సాక్స్టన్ ఓవల్ వేదిక.చదవండి: IND vs AUS: గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్ -
చాప్మన్ ఊచకోత.. న్యూజిలాండ్ భారీ స్కోర్
ఆక్లాండ్ వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (నవంబర్ 6) జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్ చెలరేగిపోయాడు. కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. చాప్మన్ ధాటికి విండీస్ బౌలర్లు విలవిలలాపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో చాప్మన్తో పాటు టిమ్ రాబిన్సన్ (39 బంతుల్లో 25; 5 ఫోర్లు, సిక్స్) రాణించాడు. ఆఖర్లో డారిల్ మిచెల్ (14 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), మిచెల్ సాంట్నర్ (8 బంతుల్లో 18 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. మిగతా ఆటగాళ్లలో డెవాన్ కాన్వే 16, రచిన్ రవీంద్ర 11, బ్రేస్వెల్ 5 పరుగులు చేశారు.విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 2, మాథ్యూ ఫోర్డ్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ తీశారు. జేడన్ సీల్స్ (4-0-61-0), అకీల్ హొసేన్కు (1-0-23-0) చాప్మన్ చుక్కలు చూపించాడు. ఫోర్డ్ (4-0-17-1), ఛేజ్ (4-0-33-2), హోల్డర్ (4-0-34-1) పొదుపుగా బౌలింగ్ చేశారు.కాగా, ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్ననే జరిగిన తొలి మ్యాచ్లో వెస్టిండీస్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెన్ పోరాటం వృధా అయ్యింది. 165 పరుగుల ఛేదనలో సాంట్నర్ చెలరేగి ఆడినా (28 బంతుల్లో 55 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) న్యూజిలాండ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. అంతకుముందు విండీస్ ఇన్నింగ్స్లో షాయ్ హోప్ (53) అర్ద సెంచరీతో రాణించాడు.చదవండి: వేర్వేరు క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు వీరే..! -
చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్
వెస్టిండీస్తో నిన్న (నవంబర్ 5) జరిగిన టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగి.. వీరోచిత పోరాటాన్ని (28 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు) ప్రదర్శించాడు. సాంట్నర్ చెలరేగినా న్యూజిలాండ్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. తద్వారా స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుకపడిపోయింది.ఈ ఇన్నింగ్స్తో సాంట్నర్ పలు రికార్డులు నెలకొల్పాడు. ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్లలో ఎనిమిది అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్కు దిగిన కెప్టెన్లలో హాఫ్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ విభాగంలో అత్యధిక స్కోర్ సాంట్నర్ సహచరుడు టిమ్ సౌథీ (39), ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు (39) రషీద్ ఖాన్ పేరిట సంయుక్తంగా ఉండేది.ఈ మ్యాచ్లో 107/9 స్కోర్ వద్ద జేకబ్ డఫీతో (1 నాటౌట్) సాంట్నర్ పదో వికెట్కు అజేయమైన 50 పరుగులు జోడించాడు. తద్వారా ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్లలో పదో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం జోడించిన రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు జోష్ లిటిల్-బ్యారీ మెక్కార్తీ (44*) పేరిట ఉండేది.కాగా, నిన్నటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. షాయ్ హోప్ (53) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ను సాంట్నర్ (55 నాటౌట్) గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, రోస్టన్ ఛేజ్ తలో 3 వికెట్లు తీసి కివీస్ను దెబ్బకొట్టారు. ఈ సిరీస్లోని రెండో టీ20 ఆక్లాండ్ వేదికగా నవంబర్ 6న జరుగనుంది. చదవండి: నరాలు తెగే ఉత్కంఠ: సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథా -
నరాలు తెగే ఉత్కంఠ: సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథా
న్యూజిలాండ్ పర్యటనను వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఘనంగా ఆరంభించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో ఆతిథ్య కివీస్పై విండీస్ ఏడు పరుగుల స్వల్ప తేడాతో విజయం (West Indies Beat New Zealand) సాధించింది. తద్వారా ఐదు టీ20ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది.కాగా ఐదు టీ20 మ్యాచ్లు, మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో బుధవారం ఆక్లాండ్లో ఇరుజట్ల మధ్య తొలి టీ20 జరిగింది. ఈడెన్ పార్క్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. విండీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులుదీంతో బ్యాటింగ్కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (3), అలిక్ అథనాజ్ (16) విఫలమైనా.. వన్డౌన్ బ్యాటర్ షాయీ హోప్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు.మొత్తంగా 39 బంతులు ఎదుర్కొన్న హోప్ నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 53 పరుగులు సాధించాడు. మిగతా వారిలో రోస్టన్ చేజ్ (28), రోవ్మన్ పావెల్ (23 బంతుల్లో 33) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. కివీస్ బౌలర్లలో జేకబ్ డఫీ, జకారీ ఫౌల్క్స్ రెండేసి వికెట్లు తీయగా.. కైలీ జెమీషన్, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ పడగొట్టారు.ఇక విండీస్ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు టిమ్ రాబిన్సన్ (27), డెవాన్ కాన్వే (13) ప్రభావం చూపలేకపోయారు. వన్డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (21) నిరాశపరచగా.. మార్క్ చాప్మన్ (7), డారిల్ మిచెల్ (13), మైకేల్ బ్రాస్వెల్ (1), జేమ్స్ నీషమ్ (11) పూర్తిగా విఫలమయ్యారు.సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథాఇలాంటి దశలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ గెలుపు ఆశలు చిగురించేలా చేశాడు. కేవలం 28 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, రెండు సిక్స్లు బాది.. 55 పరుగులు సాధించిన సాంట్నర్ ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అయితే, మిగిలిన వారి నుంచి సహకారం అందకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన కివీస్.. 157 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఫలితంగా విండీస్ చేతిలో ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రోస్టన్ ఛేజ్ చెరో మూడు వికెట్లు కూల్చారు. మిగిలిన వారిలో మాథ్యూ ఫోర్డ్, రొమారియో షెఫర్డ్, అకీల్ హొసేన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇరుజట్ల మధ్య గురువారం (నవంబరు 6) ఇదే వేదికపై రెండో టీ20 నిర్వహణకై ముహూర్తం ఖరారైంది.చదవండి: అందుకే అర్ష్దీప్ను తప్పించాం.. అతడికి అన్నీ తెలుసు: టీమిండియా కోచ్


