Married Woman Suicide
-
కిట్టువల్లనే కుటుంబంలో కల్లోలం, సంధ్య చచ్చిపోయింది!
పశ్చిమ గోదావరి: తనను ఆర్థికంగా మోసగించారన్న మనస్తాపంతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో భార్య మృతి చెందింది. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మాదు శ్రీనివాస్ దంపతులు ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం భార్య సంధ్య (23) మృతి చెందడంతో బంధువులు విషాదంలో మునిగిపోయారు. దగ్గర బంధువైన కిట్టుకు 20 ఏళ్ల క్రితం నగదు ఇచ్చాడని ఆ నగదుతో పొలం కొన్నారని బంధువులు తెలిపారు. ప్రస్తుతం తాను అప్పుల్లో ఉన్నానని తన వాటాగా ఎంత వస్తే అంత ఇవ్వాలని శ్రీనివాస్ కిట్టును అడగ్గా.. ఇచ్చేది లేదని చెప్పడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. మేకా రామకృష్ణ (కిట్టు) వల్ల ఒక కుటుంబం నాశనమైందని బంధువులు ఆరోపించారు. ఈ చావుకు అతనిదే బాధ్యతని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, స్థానికులు ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. -
వరకట్న వేధింపులకు వివాహిత బలి!
విడవలూరు: వరకట్నం కోసం వేధించడంతో కల్లాపిరంగు పొడిని నీటిలో కలిపి తాగి వివాహిత మృతిచెందిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని ఊటుకూరు పెద్దపాళెం గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. బోగోలు మండలం తాటిచెట్లపాళెం గ్రామానికి చెందిన బచ్చింగారి సుగుణ (23)కు విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం గ్రామానికి చెందిన హరికృష్ణతో 2021లో వివాహమైంది.వారికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన ఏడాది తర్వాత అదనపు కట్నంగా రూ.7 లక్షలు తీసుకురావాలని భర్తతోపాటు, అత్త నర్సమ్మ, మామ నాగూరు, ఆడపడుచు నాగలక్ష్మి కలిసి సుగుణను వేధించడం మొదలుపెట్టారు. ఇవి బుధవారం తారస్థాయికి చేరాయి. మనస్తాపంతో సుగుణ ఇంటి ముందు చల్లే కల్లాపిరంగు పొడిని నీళ్లలో కలిపి తాగింది. సాయంత్రం వరకు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఇరుగుపొరుగున్న బంధువులు ఇది గుర్తించి ఈ సమాచారాన్ని సుగుణ తల్లి అన్నమ్మకు తెలిపారు.వారు వెంటనే పెద్దపాళెం గ్రామానికి చేరుకుని సుగుణను రాజుపాళెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తన కుమార్తె మరణంపై అనుమానం ఉందంటూ హరికృష్ణతోపాటు, అత్త నర్సమ్మ, మామ నాగూరు, ఆడపడుచు నాగలక్షి్మలపై అన్నమ్మ గురువారం స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో గ్రామంలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో హరికృష్ణ, అతని తండ్రి నాగూరు కూడా ఉన్నారు. వీరు బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నారని, కట్నం కోసం సుగుణను వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని గ్రామంలో ప్రచారం జరుగుతోంది. -
వంట త్వరగా చేయమన్నందుకు వివాహిత ఆత్మహత్య
అగనంపూడి: క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన దువ్వాడ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. దువ్వాడ సీఐ వావిలపల్లి ఎర్రం నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కణితిలో నివాసముంటున్న వ్యాన్ డ్రైవర్ వియ్యపు బాలాజీ గవర కంచరపాలెంకు చెందిన జ్యోతి (26)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఏడాది పాప (యోక్షిత) ఉంది. సోమవారం ఉదయం తన తండ్రికి క్యారేజ్ పట్టుకెళ్లాలి వేగంగా వంట చేయమని బాలాజీ భార్య జ్యోతికి చెప్పాడు. ఇంట్లో పనులన్నీ తానే చేయాలా అంటూ జ్యోతి రుసరుసలాడుతూ చంటిపాపను కింద దించేసి బెడ్రూమ్లోకి వెళ్లి తలుపు గడియపెట్టి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలాజీ గట్టిగా కేకలు వేశాడు. చుట్టుపక్కలవాళ్లు పిలిచినా పలకపోవడంతో బాలాజీ తలుపు గెడను విరగ్గొట్టి లోపలికి వెళ్లి రక్షించే ప్రయత్నం చేశాడు. ముందుగా ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో అగనంపూడిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే జ్యోతి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సంఘటనా స్థలానికి సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, దువ్వాడ సీఐ ఎర్రంనాయుడు చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
మేడ్చల్రూరల్: ఇంట్లో ఎవరూ లేని సమయంలో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాఘవేంద్రనగర్ కాలనీలో జరిగింది. ఎస్సై మురళీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లుకు చెందిన రత్తం నవీన్ భార్య స్వప్న (24), ముగ్గురు పిల్లలతో కలిసి రాఘవేంద్రనగర్ కాలనీలో ఉంటున్నారు. మంగళవారం ఉదయం భర్త నవీన్ పనికి వెళ్లగా.. ఇంట్లో ఉన్న ఆమె సీలింగ్ రాడ్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి 8 గంటల సమయంలో భర్త ఇంటికొచ్చే సరికి ఉరేసుకుని కనిపించింది. లోపలి నుంచి గడియ ఉండటంతో తలుపులు పగులగొట్టి చూడగా.. అప్పటికే ఆమె మృతిచెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మరో ఘటనలో మేడ్చల్రూరల్: ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశాకు చెందిన మాధవరావు కుటుంబంతో కలిసి మేడ్చల్లో నివసిస్తున్నారు. కుమార్తె శైలజ (24), స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుంది. కాగా మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం కుటుంబసభ్యులు ఇంటికొచ్చేసరికి శైలజ విగత జీవిగా పడి ఉండటం, వీడియో కాల్ ఆన్చేసి ఉండటాన్ని పోలీసులు గమనించారు. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. -
అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి
తిరువళ్లూరు: వివాహమై ఏడాది కాకముందే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటనలో ఆమె భర్తను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ యువతి బంధువులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాల వద్ద రాస్తారోకో నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా తిరువొత్తియూర్ కక్కన్ నగర్కు చెందిన పుష్పనాథన్ కుమార్తె షాలిని(24)కు వేపంబట్టు భారతీనగర్కు చెందిన మురళీధరన్తో తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. మురళీధరన్ అంబత్తూరులోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. వివాహమై తొ మ్మిది నెలలు దాటుతున్నా ఇంత వరకు సంతానం కలగలేదు. ఈ విషయంపై భార్యాభర్తలు తరచూ ఘర్షణ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం భార్యాభర్త వైద్యశాలకు వెళ్లి రక్త పరీక్ష చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే బ్లడ్ టెస్టులో నెగటివ్ రావడంతో మనస్తాపం చెందిన యువతి కుటుంబ సభ్యులతో ఎవరితోనూ మాట్లాడ కుండా ముభావంగా ఉన్నట్టు భర్త కుటుంబ సభ్యు లు కొందరు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి షాలిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్కు ఉరివే సుకుని కనిపించింది. పుట్టింటికి సమాచారం ఇవ్వకుండానే భర్త బంధువులు వైద్యశాలకు తరలించా రు. అయితే తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తూ యువతి బంధువులు మంగళవారం ఉదయం తిరుపతి–చైన్నె జాతీయ రహదారిలో రాస్తారోకో చేశారు. సంతానం లేదన్న కారణంతోనే హత్య చేశారని, భర్తతో పాటు బంధువులను అరెస్టు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపి రాస్తారోకో ను విరమింపచేశారు. కాగా బాధితుల రాస్తారోకో తో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. -
పిల్లలకోసం వేధింపులు
ఆదిలాబాద్: అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాండూర్లో చోటు చేసుకుంది. కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామానికి చెందిన దర్వాజల లచ్చన్న, భాగ్య దంపతుల కుమార్తె శ్రీలత(25)కు తాండూర్కు చెందిన పెద్దబోయిన మహేందర్తో 2021లో వివాహమైంది. ఆదివారం ఉదయం అత్తగారింటి నుంచి వెళ్లిన శ్రీలత తాండూర్ పాత గోదాంల సమీపంలోని రైల్వేట్రాక్పై శవమై కనిపించింది. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహానికి సోమవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పంచనామా నిర్వహించారు. కాగా తన కూతుర్ని భర్త మహేందర్, అత్త గౌరక్క, ఆడపడుచులు అదనపు కట్నం తీసుకురావాలని, పిల్లలు కావడంలేదని మానసికంగా వేధించేవారని ఆరోపించారు. అత్తింటి వారే చంపి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
భార్యను బాగా చూసుకుంటానన్నాడు.. కానీ ఆ భర్త.. చివరికి..
పీఎం పాలెం (భీమిలి): కట్నం వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. అదనపు కట్నం కోసం భర్త పేట్టే హింసలకు తాళలేక ఉరి వేసుకుని తనువు చాలించిది. పీఎం పాలెం రెండో బస్టాపు లక్ష్మివానిపాలెంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలానికి చెందిన భారతి(35)కి పీఎం పాలెం లక్ష్మివానిపాలెంకు చెందిన నరవ రామారావుతో 2008లో వివాహం జరిగింది. వివాహ సమయంలో పుట్టింటి వారు అల్లుడికి కట్నకానుకలు సమర్పించుకున్నారు. అయినప్పటికీ వివాహం జరిగిన కొన్నాళ్ల నుంచే రామారావు క్రూరత్వం బయటపడింది. చదవండి: పెళ్లయి రెండేళ్లు.. వివాహిత షాకింగ్ నిర్ణయం.. భార్య భారతిని అదనంగా కట్నం తీసుకురావాలని వేధించసాగాడు. ఆ వేధింపులు భరించలేక అప్పట్లో పుట్టింటికి వెళ్లిపోయి తెర్లాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు కూడా నమోదుకావడంతో భార్యను బాగా చూసుకుంటానని రామారావు పెద్దల సమక్షంలో 2016 రాజీ పడ్డాడు. తర్వాత కూడా రామారావు ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆ బాధలు భరించలేక శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు భారతి ఉరి వేసుకుంది. రాత్రి పొద్దుపోయే వరకూ ఈ విషయం బయటకు తెలియలేదు. భారతి ఉరి వేసుకున్న విషయం ఆమె కుమారుడు కౌసిక్ కుమార్ (12) నగరంలోని మాధవధారలో నివసిస్తున్న మేనమామ చిప్పాడ శ్రీనివాస్కు తెలియజేయగా ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పీఎం పాలెం పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. చిప్పాడ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పెట్రోలు పోసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం
(కోనసీమ) రాజోలు: ఒంటిపై పెట్రోలు పోసుకుని ఓ వివాహిత రాజోలు సర్కిల్ పోలీసు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన యర్రంశెట్టి విజయలక్ష్మి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. ఆమె విజయలక్ష్మి ఏ1 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్గా, ఆమె భర్త రమేష్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పని చేసుకుంటూ సుమారు రూ.80 లక్షల అప్పులు చేశారు. కొన్ని బకాయిల నిమిత్తం విజయలక్ష్మి పుట్టిల్లు ఇరుసుమండలో ఉన్న స్థలాన్ని, కేశవదాసుపాలెంలోని డాబా ఇంటిని అమ్మేందుకు.. అప్పులు ఇచ్చిన వ్యక్తులతో పెద్దల సమక్షంలో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా అప్పు ఇచ్చిన కొందరు బకాయి కింద ఇరుసుమండలోని భూమిని స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, భూసర్వే పనుల్లో వివాదం తలెత్తింది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు విజయలక్ష్మి తన స్కూటర్పై రాజోలు సర్కిల్ పోలీసు కార్యాలయానికి వచ్చింది. వెంట లీటరు బాటిల్లో పెట్రోలు పోయించి తెచ్చుకుంది. సర్కిల్ కార్యాలయం ఎదుట సిమెంట్ బల్లపై కూర్చుని సీఐ ఎప్పుడు వస్తారని అక్కడున్న సెంట్రీ కానిస్టేబుల్ను అడిగింది. సీఐ శిక్షణలో ఉన్నారని, సోమవారం వస్తారని కానిస్టేబుల్ చెప్పాడు. వెంటనే ఆమె కూడా తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పు పెట్టుకుంది. మంటలు పూర్తిగా వ్యాపించడంతో హాహాకారాలతో పరుగులు తీస్తూ పక్కనే ఉన్న ట్రెజరీ, రెవెన్యూ కార్యాలయాల సమీపానికి వచ్చింది. అక్కడ ఉన్న పలువురు ఆమెను రక్షించేందుకు తడి గోనె సంచులు, ఇసుక వేసి, మంటలను ఆదుపు చేశారు. హుటాహుటిన రాజోలు ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. డాక్టర్ రాంజీ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స చేశారు. విజయలక్ష్మి శరీరం సుమారు 80 శాతం కాలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె వాంగ్మూలాన్ని రాజోలు మెజి్రస్టేట్ జి.సురేష్బాబు నమోదు చేశారు. దీనిపై కేసు నమోదు చేస్తామని ఎస్సై కృష్ణమాచారి తెలిపారు. -
ఎలుకల మందు తిని వివాహిత ఆత్మహత్య
ప్రకాశం: ఎలుకల మందు తిని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మర్రిపూడి నడిగడ్డకు చెందిన ఆకుమళ్ల తిరుమలయ్య కుమార్తె వెంకటేశ్వరి(22)ని మూడేళ్ల క్రితం బేస్తవారిపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రమణయ్యతో వివాహమైంది. అయితే కొద్ది రోజుల్లోనే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి నిత్యం గొడవలు జరుగుతుండటంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వెంకటేశ్వరి పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన వెంకటేశ్వరి ఈ నెల 21న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తినింది. కుటుంబసభ్యులు గమనించి ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై అంకమ్మరావు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. మృతురాలి తండ్రి తిరుమలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని తహసీల్దార్ జి.విజయలక్షి్మ, వీఆర్ఓ శామ్యేలు పరిశీలించారు. -
నీలగిరిలో విషాదం: తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇద్దరు పిల్లలతో కలిసి..
నల్లగొండ క్రైం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నడికుడ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడంతో నీలగిరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. నార్కట్పల్లి మండలం ఔరవాణి గ్రామానికి చెందిన జాన్రెడ్డి, గాదె రమ్య(28) ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి రిషిక్ రెడ్డి(8), హంసిక (6) సంతానం.జాన్రెడ్డి నార్కట్పల్లి పాత ఇనుప సామగ్రి కొనుగోలు చేసే వ్యాపారం చేస్తూ కుటుంబంతో కలిసి నల్లగొండలోని చైతన్యపురికాలనీలో నివాసం ఉంటున్నారు. రమ్య బిందెలపై డిజైన్ బొమ్మలు వేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది. చదవండి👉🏻 'ఫోన్ నెంబర్ ఇవ్వు.. లేకపోతే లైంగికదాడి చేస్తాం' కుటుంబ కలహాలే కారణమా? రమ్య కొద్ది రోజులుగా పుట్టింట్లో ఉంటోంది. సోమవారం ఉదయం పిల్లలను బడికి పంపించేందుకు ఔరవాణి నుంచి నల్లగొండకు బయలుదేరింది. అయితే, రమ్య నల్లగొండకు రాకుండా పల్నాడు జిల్లాకు వెళ్లి పలక్నూమా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి అధికారుల ద్వారా తెలిసింది. అయితే, రమ్య నల్లగొండకు రాకుండా పల్నాడు జిల్లాకు ఎందుకు వెళ్లిందని కుటుంబ సభ్యులకు అంతు చిక్కడం లేదు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే రమ్య తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. చదవండి👉🏻కొట్టుకుని కేసులు పెట్టుకున్న సీఐలు -
ఆర్థిక ఇబ్బందులుతో ఒకరు.. వరకట్న వేధింపులు తాళలేక మరొకరు..
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన వివాహిత పోగుల మౌనిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై కె.కిశోర్ కథనం ప్రకారం.. మౌనికకు 10 సంవత్సరాల క్రితం విద్యాసాగర్తో వివాహం జరిగింది. పర్వతగిరిలో కంగన్హాల్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో భార్యభర్తలు తరచు మనస్తాపానికి గురయ్యేవారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌనిక దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వరకట్న వేధింపులకు వివాహిత బలి.. సంగెం: వరకట్న వేధింపులు తాళలేక విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది. చేసుకుంది. వరంగల్ జిల్లా సంగెం మండలం లోహితలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బొల్లేపల్లి ఉమామహేశ్వరి(20)ని హైదరాబాద్ బొల్లారానికి చెందిన కొప్పుల కమలాకర్ అలియాస్ కిరణ్కు ఇచ్చి గత ఏడాది ఆగష్టు 18న వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.2 లక్షల నగదు, 6 తులాల బంగారు ఆభరణాలు, ఇతర లాంచనాలు కట్నంగా ఇచ్చారు. కొద్ది రోజులకే భర్త కమలాకర్, అత్త పద్మ, మామ పాండు రూ.6 లక్షల అదనపు కట్నం తీసుకురావాలని వేధించసాగారు. రెండు నెలల క్రితం కొట్టి తల్లిగారింటికి పంపించారు. అప్పటి నుంచి లోహితలోనే ఉంటున్న ఉమామహేశ్వరి.. అదనపు కట్నం ఇవ్వలేక, కాపురానికి వెళ్లలేక మనస్తాపం చెంది ఈ నెల 11న విష గుళికలు మింగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలి తల్లి బొల్లేపల్లి సుమలత ఫిర్యాదు మేరకు కమలాకర్, పద్మ, పాండులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిద్దోజు కిరణ్మయి తెలిపారు. చదవండి: (ప్రియుడితో సహజీనవం, బుల్లితెర నటి ఆత్మహత్య) -
Sri Sathya Sai: పద్మావతి కథ విషాదాంతం
ఓడీ చెరువు (సత్యసాయి): పుట్టింటికి పంపలేదనే మనస్తాపంతో బిడ్డతో సహా బావిలోకి దూకిన వివాహిత కథ విషాదాంతమైంది. శుక్రవారమే చిన్నారి మృతదేహం లభ్యం కాగా, శనివారం తల్లి శవం బయటపడింది. వివరాలు.. అమడగూరు మండలం గొల్లపల్లికి చెందిన వెంకటేష్ భార్య పద్మావతి (26) రెండు రోజుల క్రితం తన మూడేళ్ల కుమార్తె నిహస్వి (3)తో కలిసి గ్రామ సమీపంలో ఉన్న బావిలో పడిన విషయం తెలిసిందే. నీటిపై తేలాడుతున్న చిన్నారి మృతదేహాన్ని అదే రోజు బయటకు తీశారు. పద్మావతి ఆచూకీ లభ్యం కాకపోవడంతో మండల ఎస్ఐ రమణ, ఏఎస్ఐ కిషోర్రెడ్డి, అటవీ శాఖ అధికారులు రాత్రంతా బావిలోని నీటిని మోటారుతో తోడించారు. శనివారం ఉదయం తల్లి శవం బయటపడింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చదవండి: (‘బంగారు తల్లి’ అంటూ మురిసిపోయావు.. అంతలోనే ఏమైంది తల్లీ?) -
కోర్టు ఉద్యోగిని ఆత్మహత్య
చిక్కబళ్లాపురం (బెంగళూరు): వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కబళ్లాపురం నగరంలో చోటు చేసుకుంది. వివరాలు... ఇక్కడి ఇందిరా నగరలో నివాసం ఉంటున్న ఆరతి హీరేమఠ (35) నగరంలోని కోర్టులో ఎఫ్డీఏగా విధులు నిర్వహిస్తోంది. భర్త రామకృష్ణయ్య బెంగళూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ అక్కడే ఓ ఇంటిలో బిడ్డలతో నివాసం ఉంటున్నాడు. చిక్కలో ఆరతి ఓ అద్దె ఇంటిలో ఉంటోంది. ఇదిలా ఉంటే గురువారం ఉదయం ఆరతి బయటకు రాకపోవడంతో ఇంటి పక్కన వారు పోలీసులకు, రామకృష్ణయ్యకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి వద్దకు చేరుకుని తలుపులు తెరచి చూడగా ఆరతి ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఏం కష్టం వచ్చిందో ఏమో.. పుట్టింటికి వచ్చి మరీ వివాహిత..
సాక్షి, నెల్లూరు రూరల్: ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ ఓ వివాహిత పుట్టింటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరురూరల్ పరిధిలోని పెద్దచెరుకూరులో గురువారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు స్థానికుడైన పులి దేవదానం కెనరా బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇతడి రెండో కుమార్తె సురేడ్డి కీర్తన(30)కు రాజా అనే వ్యక్తితో వివాహమైంది. రాజా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తుండేవాడు. వీరికి కుమారుడు శ్రీఫల్, కుమార్తె శ్రీషా ఉన్నారు. వీరు హైదరాబాద్లోని కూకట్పల్లిలో నివాసం ఉంటున్నారు. బుధవారం కీర్తన హైదరాబాద్ నుంచి పెద్దచెరుకూరులోని తండ్రి వద్దకు చేరుకుంది. గురువారం ఉదయం కీర్తన ఇంటి మిద్దెపైన ఉన్న బెడ్రూంకు వెళ్లింది. కుటుంబసభ్యులు గది వద్దకు వెళ్లి కీర్తనను పిలవగా ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె ఫ్యాన్కు ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించారు. వెంటనే కీర్తనను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే కీర్తన అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చదవండి: ప్రియురాలికి స్నేహితురాలు వీడియోకాల్.. వక్రబుద్ధితో.. రూరల్ పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని విచారించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు రోజులుగా భర్త మృతదేహంతోనే.. -
భార్య మీద అనుమానం.. పండుగపూట దారుణం
నిర్మల్(ఆదిలాబాద్): మహాశివరాత్రి పండుగరోజే జిల్లాకేంద్రంలో విషాదం, ఆందోళన చోటు చేసుకున్నాయి. అనుమానాస్పదస్థితిలో వివాహిత చనిపోవడం ఉద్రిక్తతకు దారితీసింది. తనను అత్తింటివారే చంపారంటూ బాధిత కుటుంబసభ్యులు స్థానిక రూరల్ పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మంజులాపూర్కు చెందిన అరుగుల సాయికృష్ణకు ఎనిమిదేళ్ల క్రితం కుంటాల మండల కేంద్రానికి చెందిన ప్రణీత(24)తో వివాహమైంది. వీరి ఆరేళ్ల కాపురానికి పండంటి ఇద్దరు బిడ్డలు పుట్టారు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో అనుమానం చిచ్చుపెట్టింది. సాయికృష్ణ భార్య మీద అనుమానంతో వేధించేవాడని ప్రణీత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నాలుగు నెలల క్రితం పంచాయితీ పెట్టి ఇద్దరి మధ్య సయోధ్య కూడా కుదిర్చారు. మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవ కావడంతో మంగళవారం ప్రణీత బాత్రూంలో షవర్కు ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. అత్తింటి వారే చంపారని.. ప్రణీత మృతి విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కుంటాల నుంచి వచ్చారు. భర్త, అత్తలే చంపారని ఆరోపించారు. వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రూరల్ పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఎస్సై వినయ్కుమార్ వారితో చర్చించి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. ప్రణీత అన్న ప్రవీణ్ ఫిర్యాదు మేరకు భర్త సాయికృష్ణ, అత్త లక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. తల్లి చనిపోవడం, తండ్రిపై కేసు కావడంతో 6, 4ఏళ్లు వయసున్న ఇద్దరు ఆడబిడ్డలు ఏడుస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. -
అత్తాకోడళ్ల మధ్య గొడవ.. అర్ధరాత్రి 12 గంటల సమయంలో
సాక్షి, సోంపేట (శ్రీకాకుళం): కొర్లాం పంచాయతీ గొనకపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన వివాహిత సివంగి యశోద (28) నేల బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బారువ పోలీసులు, మృతురాలి తల్లి లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. యశోద భర్త మోహనరావు వలస కార్మికుడిగా చిత్తూరులో ఉంటున్నాడు. దీంతో అత్తమామలను చూసుకుంటూ, పిల్లలను చదివిస్తూ యశోద గొనకపాడు గ్రామంలోనే ఉంటుంది. ఆదివారం రాత్రి అత్తాకోడళ్ల మధ్య చిన్నపాటి గొడవ తలెత్తింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె అర్ధరాత్రి 12 గంటల సమయంలో సమీపంలో ఉన్న నేలబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈమెకు ఇద్దరు పిల్లలు షర్మిళ, క్రాంతి ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే యశోద మృతి చెందడంతో గొనకపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురా లి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు బారువ ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (గచ్చిబౌలి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. సహోద్యోగికి ఫోన్ చేసి..) -
సుజన, వెంకటకృష్ణ మధ్య మనస్పర్థలు.. అర్ధరాత్రి దాటాకా..
సాక్షి, ధర్మవరం (అనంతపురం): అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ బ్యాంక్ ఉద్యోగి భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని నేసేపేటకు చెందిన వెంకటకృష్ణ.. తాడిమర్రిలోని ఎస్బీఐ శాఖలో పనిచేస్తున్నారు. 2016లో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొండయ్య, గంగాదేవి దంపతుల కుమార్తె వెంకట సుజన (26)ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో రూ.18 లక్షల కట్నం, 30 తులాల బంగారు నగలను సుజన తల్లిదండ్రులు అందజేశారు. కొన్నేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంత కాలంగా సుజన, వెంకటకృష్ణ మధ్య మనస్పర్థలు చెలరేగి తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటిపైన మూడో అంతస్తులో సుజన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదవండి: (ఇంటర్ విద్యార్థినితో పరిచయం పెంచుకొని.. పలుమార్లు అత్యాచారం) ఆదివారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, అదనపు కట్నం కోసమే వేధింపులకు గురిచేసి తమ కుమార్తెను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ వెంకటకృష్ణ కుటుంబసభ్యులతో మృతురాలి తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు డీఎస్పీ రమాకాంత్కు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... మృతురాలి భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
విషాదం: సుగుణ తలుపులు తీయ్.. కిటికీలో నుంచి చూడగా..
సాక్షి, విశాఖపట్నం: ఎంవీపీకాలనీ సెక్టార్–6లోని ఓ ఇంట్లో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. పత్రుల సుగుణ(25), దూడ ఉపేంద్ర దంపతులు రెండు నెలలుగా సెక్టార్–6లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సుగుణ మద్దిలపాలెంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. సోమవారం ఉదయం ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. కొంత సమయం తర్వాత ఉపేంద్ర ఇంటికి వచ్చి సుగుణ తలుపులు తీయ్ అంటూ గట్టిగా అరిచాడు. ఇది గమనించిన ఇంటి యజమాని పుసర్ల సూర్యారావు వచ్చి ఏమైందని అడిగాడు. తలుపులు తీయడం లేదని ఉపేంద్ర బదులిచ్చాడు. దీంతో ఇద్దరూ కిటికీలో నుంచి చూడగా.. ఆమె ఉరివేసుకుని చనిపోయినట్లు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న ఎంవీపీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై ఇంటి యజమాని సూర్యారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎంవీపీ పోలీసులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. చదవండి: (మసాజ్సెంటర్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్) -
అన్నతోనే ‘సంబంధం’ అని పంచాయితీ.. భార్యపై చేయిచేసుకోవడంతో..
సాక్షి, కొండపాక(గజ్వేల్., సిద్దిపేట): కుటుంబ కలహాలతో రెండేళ్ల కుమారుడికి నిప్పంటించి తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని సిర్సనగండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. సిర్సనగండ్లకు చెందిన గవ్వల అయ్యల్లం, బీరవ్వల రెండో కుమారుడు స్వామికి చేర్యాల మం డలం వేచరేణికి చెందిన పోశయ్య, మల్లవ్వల చిన్న కుమార్తె నవితను ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. స్వామి వ్యవసాయ పనులతో పాటు కూలీ పను లు చేసుకుంటూ భార్య నవిత (25), కుమారుడు మణిదీప్ (2)ను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో స్వామి అన్న భాస్కర్కు నవితకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో వారం రోజుల క్రితం కులపెద్దలు సముదాయించి స్వామికి నచ్చజెప్పారు. ఈ క్రమంలో శనివారం స్వామి వ్యవసాయ బావి వద్ద పత్తి ఏరేందుకు భార్యను రమ్మని చెప్పగా.. ఆమె రానని అనడంతో ఇద్దరికి గొడవ జరిగింది. దీంతో స్వామి భార్య పై చేయి చేసుకొని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన నవిత మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమారుడు మణిదీప్పై పెట్రోల్ పోసి నిప్పంటించి తాను కూడా నిప్పంటించుకుంది. చదవండి: ఇంతమంది చనిపోతుంటే ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తోంది? ఇంట్లో నుంచి వస్తున్న పొగను గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు పగుల గొట్టి చూడగా ఇద్దరూ విగత జీవులై కనిపించా రు. తమ కూతురు నవితపై లేనిపోని అభాండాలు వేసి, వేధించి చంపారని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కూతురు మృతికి కారణమయ్యారని అత్త బీరవ్వ, బావ భాస్కర్, భర్త స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్ సీఐ ప్రవీణ్కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. చదవండి: బాత్రూంలో ఉరివేసుకొని బాలింత ఆత్మహత్య -
పెళ్లయిన నాటి నుంచి గొడవలే.. తట్టుకోలేక..
సాక్షి, జియాగూడ: పెళ్లయిన నాటి నుంచి ఇంట్లో తరచూ గొడవల కారణంగా మనస్థాపం చెందిన ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళ్హాట్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ రాజశేఖర్రెడ్డి వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ ఇంద్రానగర్లో ఉంటున్న కరణ్ ఖాళీ ఇంట్లోనే ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం సికింద్రాబాద్ పాటిగడ్డ అస్మత్పేట్ ప్రాంతానికి చెందిన శ్వేత(22)తో వివాహం జరిగింది. ఇటీవల వారికి కూతురు కూడా జన్మించింది. అయినా గొడవలు తగ్గకపోవడంతో మనస్థాపం చెందిన శ్వేత శుక్రవారం ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లయిన ఎనిమిది నెలలకే అఘాయిత్యం
సాక్షి, నేరడిగొండ(ఆదిలాబాద్): మండలంలోని సవర్గాం గ్రామానికి చెందిన నాలుగు నెలల గర్భిణి జాదవ్ సంగీత(22) శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తెను అత్తింటి వారే హత్య చేశారంటూ నేరడిగొండ జాతీయ రహదారిపై మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు రాస్తారోకో చేపట్టారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బజార్హత్నూర్ మండలం కాండ్లి గ్రామానికి చెందిన చౌహాన్ రామేశ్వర్, అనసూయ దంపతుల కూతురు సంగీతకు 2021 జనవరి 6న నేరడిగొండ మండలం సవర్గాం గ్రామానికి జాదవ్ విజయ్తో వివాహం జరిగింది. శుక్రవారం సవర్గాం గ్రామంలోని ఇంట్లో సంగీత పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడింది. ఈ విషయాన్ని స్థానికులు బజార్హత్నూర్ మండలం కాండ్లి గ్రామంలో ఉంటున్న మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతోవారు బంధువులతో కలిసి సవర్గాం చేరుకున్నారు. తమ కూమర్తెను చంపుతామని కొద్దిరోజులుగా సంగీత భర్త, మామ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారే సంగీతను హత్య చేశారని నేరడిగొండ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న బోథ్ సీఐ నైలు, ఎంపీపీ రాథోడ్ సజన్ ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు. గర్భిణిగా ఉన్న సంగీత కడుపునొప్పి భరించలేకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని ఎస్సై భరత్సుమన్ తెలిపారు. ఈ మేరకు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం బోథ్ సివిల్ ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. చదవండి: పెళ్లి బరాత్.. అంతలో సడన్గా పోలీసుల ఎంట్రీ ! -
మూడేళ్ల నుంచి లైంగిక వేధింపులు.. కేసు పెట్టిన మారలేదు.. చివరకు..
సాక్షి, పెంచికల్పేట్(ఆదిలాబాద్): ఇంటి పక్కన నివసించే వ్యక్తి లైంగిక వేధింపులకు వివాహిత బలైంది. పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసినా అతడి వేధింపులు ఆగకపోవడంతో భరించలేక శనివారం ఆత్మహత్య చేసుకుంది.ఎస్సై సిహెచ్.రమేష్ తెలిపిన వివరాలు.. ఎల్కపల్లి గ్రామానికి చెందిన జునుగరి శ్రీనివాస్కు 20ఏళ్ల క్రితం ఈస్గాం గ్రామానికి చెందిన సుజాత(35)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. సుజాత ఇంటి పక్కనే ఉంటున్న రాచర్ల కృష్ణ గత మూడేళ్ల నుంచి లైంగికంగా వేధిస్తున్నాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా తీరు మారలేదు. వేధింపులు భరించలేక రెండేళ్ల క్రితం స్థానిక పెంచికల్పేట్ పోలీసుస్టేషన్లో సుజాత తన భర్తతో కలిసి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి కృష్ణను అరెస్టు చేశారు. అయినా మళ్లీ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తీవ్ర మనస్తాపం చెందిన సుజాత శనివారం ఇంట్లోనే పురుగుల మందు తాగగా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. కారకుడైన కృష్ణను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మృతురాలి తల్లి రాధాబాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. చదవండి: అప్పన్నకే శఠగోపం -
ఆడపిల్లలు పుట్టారని రోజూ వేధింపులు.. భార్య ఆత్మహత్య
అమీర్పేట: ఆడపిల్లలు పుట్టారని భర్త వేధిస్తుండటంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా పెద్ద అరిశర్లపల్లి మండలం నార్ల తండాకు చెందిన రమావత్ లింగం పెద్ద కుమార్తె వి.అనిత (25)ను 2015లో రేగులవర తండా మాచర్లకు చెందిన బాబూరావుకు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి బోరబండ ఇంద్రానగర్ ఫేస్–2లో నివాసముంటున్నారు. బాబూరావు కూలీ పనిచేయగా వచ్చిన డబ్బుతో రోజూ మద్యం తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. శనివారం సాయంత్రం 5 గంటలకు అనిత తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారని రోజూ తాగి వచ్చి భర్త కొడుతున్నాడని చెప్పగా, వారు కూతురికి సర్ధిచెప్పారు. కొద్ది సేపటి తర్వాత తల్లి ఫోన్ చేయగా అనిత తీయలేదు. అల్లుడు బాబూరావుకు ఫోన్ చేస్తే అతను కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇదిలా ఉండగా, ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు బంధువులు రవీందర్, హన్మంత్ అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. అల్లుడి వేధింపుల కారణంగానే అనిత ఆత్మహత్య చేసుకుందని, విచారణ జరిపి అతడిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని లింగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమ వేధింపులు: అల్లుడిని హత్య చేసిన మామ -
వివాహేతర సంబంధం: భార్య ఆత్మహత్య
సాక్షి, కర్నూలు: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం నంద్యాల పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.నంద్యాల టూటౌన్ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ మండలం ముత్తలూరు గ్రామానికి చెందిన గండ్ర పుల్లయ్య వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామానికి చెందిన కీర్తి (33)ని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ విద్యావంతులు కావటంతో పెళ్లి అనంతరం ఉద్యోగం కోసం నంద్యాల పట్టణానికి వచ్చి ఎస్బీఐ కాలనీలో ఉంటున్నారు. స్థానిక నాగార్జున ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పుల్లయ్య, గుడ్షెప్పర్డ్ స్కూల్లో టీచర్గా కీర్తి ఉద్యోగంలో చేరారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు సంతానం. సంతోషంగా సాగుతున్న వీరి సంసార జీవితంలో ఓ యువతి చిచ్చురేపింది. నాగార్జున కాలేజీలో చదువుకున్న సుభాషిణి ప్రస్తుతం నంద్యాల తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న ట్రెజరీ కార్యాలయంలో అసిస్టెంట్ క్లర్క్గా పనిచేస్తోంది. ఈ యువతి పుల్లయ్య స్టూడెంట్. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయంలో పుల్లయ్య, కీర్తి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఏకంగా సుభాషిణిని రెండో పెళ్లి చేసుకుని ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను కీర్తి సెల్కు పంపి వేధించేవారు.తమకు అడ్డుగా ఉన్నావంటూ సుభాషిణి తరచూ ఆమె ఫోన్కు మెసేజ్లు పెట్టడం, మరోవైపు భర్త కూడా మానసికంగా వేధింపులకు గురిచేయడంతో జీవితంపై విరక్తి చెందిన కీర్తి శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు కీర్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని అనుమానం వ్యక్తం చేస్తూ పుల్లయ్యకు దేహశుద్ధి చేయడంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. రెండో భార్య సుభాషిణి కూడా ఇంటికి తాళం వేసి వెళ్లింది. కాగా తన కుమార్తె చావుకు అల్లుడు, అతని రెండో భార్య సుభాషిణే కారణమని మృతురాలి తల్లి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ కంబగిరిరాముడు తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య.. అత్తింటి వారి ఇల్లు ధ్వంసం
మెదక్ రూరల్: కుటుంబ కలహాలతో వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ మండలం జానకంపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మార్గం దుర్గయ్య – పోచమ్మలకు శ్రీశైలం, రాములు, శేఖర్ ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఇందులో చిన్న కుమారుడైన శేఖర్కు అదే గ్రామానికి చెందిన నిర్మల(28)ను ఇచ్చి 2011లో వివాహం జరిపించారు. శేఖర్, శ్రీశైలం ఇద్దరు ఒకే ఉంట్లో ఉంటుండగా, రాములు వేరేచోట నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆస్తి పంపకాలు, వేరు కాపురం వంటి చిన్నపాటి గొడవలు శేఖర్, శ్రీశైలం కుటుంబాల మధ్య జరిగినట్లు తెలిపారు. కొత్త ఇంటిని నిర్మించే విషయంలో అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరిగాయి. దీంతో కొంతకాలం సాఫీగా సాగిన శేఖర్–నిర్మల వివాహ బంధంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అన్నిటికీ నిర్మల కారణమని ఆమెను తరచూ సూటీపోటి మాటలతో ఇబ్బందిపెట్టే వారని తెలిపారు. నిర్మలను ఉద్దేశించి అందరూ చస్తే.. చావు ఇంటి నిర్మాణం గురించి మాట్లాడకు అంటూ బెదిరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన నిర్మల గురువారం రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో అందరు నిద్రిస్తుండగా దూలానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ విషయం తెలిసిన అదే గ్రామంలో ఉంటున్న నిర్మల అన్న బిక్షపతి, సమీప బంధువులు మార్గం వెంకటేష్, మార్గం శ్రీనివాస్, మార్గం లింగం, మార్గం శంకర్లతో పాటు మరికొంత మంది ఆగ్రహంతో మృతురాలి భర్త ఇంటితో పాటు అతడి అన్నలు శ్రీశైలం, రాములు ఇళ్లను ద్వంసం చేశారు. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. పికెట్ నిర్వహించిన పోలీసులు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా పోలీసులు మోహరించారు. మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, సీఐ రాజశేఖర్, ఎస్ఐ అంజనేయులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కాగా ఇరు వర్గాల పై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే నిర్మలకు ఉన్న ఇద్దరు అక్కలు భూలక్ష్మి, యశోదలు కూడా వేర్వేరు సందరా>్భల్లో గతంలో చనిపోవడం పట్ల వారి అన్న భిక్షపతి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తల్లి ప్రేమకు దూరమైన ఇద్దరు చిన్నారులు.. కుటుంబ కలహాలతో నిర్మల మృతి చెందడంతో సాత్విక్, మనిదీప్ అనే ఆరేళ్లలోపు ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. తల్లి మృతి చెందగా, ఇళ్లను బంధువులు ధ్వంసం చేసి ఘర్షణ వాతావరణం నెలకొనగా ఏమి తెలియని పరిస్థితిలో చిన్నారులు బిక్కుబిక్కుమంటూ రోదించడం అక్కడివారిని కంటతడిపెట్టించింది. -
వివాహిత ఆత్మ‘హత్య’
కర్నూలు, కృష్ణగిరి: ఆరు రోజుల కిత్రం అదృశ్యమైన మహిళ బుధవారం హంద్రీ కాలువలో శవమై తేలింది. మృతురాలి తలపై గాయం ఉండటంతో భర్తే హత్య చేసి కాలువలో పడేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన సుధాకర్కు ఎరుకలచెర్వు గ్రామానికి చెందిన రామకృష్ణమ్మ(23)కు మూడేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి ఏడాది పాప ఉంది. ఈ నెల 7న సాయంత్రం పొలం వద్దకు నీరు పెట్టేందుకు దంపతులిద్దరూ వెళ్లారు. ఆ తర్వాత రామకృష్ణమ్మ ఇంటికి రాలేదు. మరుసటి రోజు రామకృష్ణమ్మ అదృశ్యమైనట్లు తల్లి నాగ తిమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మూడు రోజులుగా పోలీసులు హంద్రీనీవా కాలువ, పొలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. భర్తను సైతం అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా బుధవారం హంద్రీనీవా కాలువలో గుండ్లకొండ పంప్హౌస్ వద్ద రామకృష్ణమ్మ శవమై తేలింది. విషయం తెలుసుకున్న డోన్ సీఐ సుధాకర్రెడ్డి, కృష్ణగిరి ఎస్ఐ రామాంజనేయరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. డోన్ వైద్యులతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం పోలీసుల బందోబస్తు మధ్య లక్కసాగరంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులుతెలిపారు. -
అత్తింటి ఆరళ్లకు యువతి బలి
సాక్షి, పెట్లూరు (ప్రకాశం): ఆ యువతికి వివాహమై ఏడాదిన్నరే. ఏమైందో ఏమో గానీ అత్తారింట్లో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని పెట్లూరులో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి కుమార్తె శవాన్ని చూసి తమ కుమార్తెను భర్త, అత్తమామలు చంపి ఉరేశారని ఎస్ఐ, తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. పెట్లూరు ఎస్సీ కాలనీకి చెందిన ఆరితోటి వినోద్కు బల్లికురవ మండలం వైదన గ్రామానికి చెందిన మేరిమ్మ అలియాస్ స్వాతి (21)తో సుమారు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. మేరిమ్మ తాను నిద్రించిన గది నుంచి బయటకు వచ్చి టాయిలెట్కి వెళ్లి పక్కనే ఉన్న మరో గదిలొ శ్లాబ్ కొక్కేనికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కోడలు గదిలో నిర్జీవంగా వేలాడుతూ ఉండటాన్ని చూసిన అత్త బిగ్గరగా కేకలేసింది. ఇంట్లోని కుమారులు, కాలనీలోని మరి కొందరు వచ్చి చూన్నీ కోసి మేరిమ్మను కిందకు దించగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి ఇది ముమ్మాటికీ హత్యేనని పోలీసులు తహసీల్దార్ ఎదుట వాపోయారు. తమ కుమార్తెను అత్తింటివారే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అఘాయిత్యం ఎందుకు జరిగిందని చనిపోయిన కుమార్తె మృతదేహం వద్ద రోధించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. తహసీల్దార్ సుజాత సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి మృతురాలి తల్లిదండ్రులు, అత్తమామలు, భర్తతో మాట్లాడి వివరా>లు సేకరించారు. -
పెళ్లై రెండేళ్లు గడవక మందే
పీఎం పాలెం(భీమిలి): పెళ్లై రెండేళ్లు గడవక మందే మనస్తాపంతో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చంద్రంపాలెం భరత్నగర్లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ పి.సూర్యనారాయణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణా జిల్లా బంటుబిల్లి గ్రామానికి చెందిన లుక్కా శ్రీనివాసరావుకు మచిలీపట్నం కొత్తపేటకు చెందిన వీరరాఘవమ్మతో (25) సుమారు రెండేళ్ల కిందట వివాహం జరిగింది. ప్రస్తుతం వారికి 9 నెలల పాప ఉంది. శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నెల రోజుల కిందట చంద్రంపాలెం భరత్నగర్లోని ఓ గ్రూపు హౌస్లో వీరు కాపురంపెట్టారు. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి భోజనాల సమయంలో భార్యాభర్తల నడుమ చిన్నపాటి వివాదం జరిగింది. దీన్ని అవమానంగా భావించిన వీరరాఘవమ్మ అందరూ నిద్రించిన తరువాత వేరే గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని వేలాడుతున్న భార్యను గమనించిన శ్రీనివాసరావు వెంటనే కిందకు దించి పోలీసులకకు విషయం తెలియజేశాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి మణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
మహిళ అనుమానాస్పద మృతి
కుత్బుల్లాపూర్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రం, హుర్లా గ్రామానికి చెందిన సురేష్చంద్ జాన్గిద్ కుమార్తె నిర్మల కుమారి అలియాస్ మంజు(29)కు భాగ్యలక్ష్మి కాలనీ శ్రీకృష్ణనగర్కు చెందిన సంతోష్కుమార్తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గత కొంత కాలంగా అదనపు కట్నం కోసం అత్తింటి వారు మంజును వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న మంజు తన అక్క మల్లికకు ఫోన్ చేసి తన భర్త, అత్తింటి వారు రూ. 5 లక్షలు తేవాలని ఒత్తిడి చేస్తురని, తాను జైపూర్ వచ్చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ నెల 19న మంజు విషం తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆమె అత్తింటివారు మృతురాలి తండ్రి సురేష్ చంద్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. గురువారం నగరానికి వచ్చిన ఆయన అత్తింటి వారి వేధింపుల కారణంగానే తన కుమార్తె మృతి చెందిందని ఆరోపిస్తూ పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్య
మాలూరు: అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బుదవారం రాత్రి పట్టణంలో జరిగింది. పట్టణానికి చెందిన ఆర్.అనూష (26) మృతురాలు. అనూష తమిళునాడు కృష్ణగిరి జిల్లా సూళగిరి తాలూకా హదలన్ దోడ్డి గ్రామానికి చెందిన రాజశేఖర్, మంజుళ దంపతుల కుమార్తె. రెండు సంవత్సరాల క్రితం పట్టణంలోని ఆదర్శనగరలో రవి కుమార్తో వివాహమైంది. అనూష దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే అనూష ఆరోగ్యం ఈ మధ్య దెబ్బతింది. భర్త అత్తమామలు పలు ఆస్పత్రుల్లో చూపించారు. అయితే ఆరోగ్యం మెరుగు పరడక పోవడంతో విరక్తి చెందిన ఆమె బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన చేరుకున్నారు. అనూష తల్లి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
వివాహిత ఆత్మహత్య
జవహర్నగర్: ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కార్మికనగర్కు చెందిన మైలవరపు రాజు కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు అతనికి ఇద్దరు భార్యలు శైలజ (22), శారద. అందరూ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. తమ స్వగ్రామం బీబీనగర్లో వేడుక జరుగుతున్నందున కుటుంబ సభ్యులు అందరూ అక్కడికి వెళ్లగా గురువారం ఇంట్లో ఒంటరిగా ఉన్న శైలజ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న జవహర్నగర్ పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ నగరం నాకు వద్దు..
ఉప్పల్: నగరంలో ఉండటానికి ఇష్టపడని ఓ ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రామంతాపూర్ కేసిఆర్నగర్, సాయికృష్టా కాలనిలో నివాసముండే ఒరిస్సా వాసి సంతోష్ ఠాగూర్ ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా నగరంలో ఉంటున్న సంతోష్ ఐదు నెలల క్రితం బార్య ప్రియాంక కుమారీ(27)తోపాటు వచ్చి సాయికృష్ణానగర్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. తొమ్మిది నెలల పాప, మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. కొన్ని రోజులుగా బార్య స్వస్థలం వెళతానని పదే పదే చెబుతున్నప్పటీకీ భర్త నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన ప్రియాంక శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రియాంక సోదరుడు రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చిత్తూరు జిల్లాలో వివాహిత ఆత్మహత్య
-
ఉరేసుకుని వివాహిత మృతి
కాకినాడ క్రైం: కాకినాడ రూరల్ మండలం స్వామినగర్కు చెందిన నేమాల సుధ (22) ఇంట్లో చున్నీతో ఉరేసుకుని మరణించింది. శుక్రవారం ఉదయం సుధ ఇంట్లో ఫోన్ మాట్లాడుతున్న సమయంలో భర్త దుర్గాప్రసాద్ చూసి ఫోన్ మాట్లాడవద్దని చెప్పినా వినలేదు. దీంతో సాయంత్రం ‘మీ నాన్నకు విషయం చెబుతాను’ అని చెప్పి తాపీ పనికి వెళ్లిపోయాడు. రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన దుర్గాప్రసాద్ ఇంటి తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడం, ఇంట్లో టీవీ ఆన్చేసి ఉండడంతో అదే ప్రాంతంలో ఉంటున్న తన మామయ్య కోసూరి తాతారావుతో విషయం చెప్పి తీసుకొచ్చారు. ఎంత ప్రయత్నించినా తలుపు తీయకపోవడంతో బద్దలుగొట్టి చూసేసరికి ఇంట్లో దూలానికి వేలాడుతూ సుధ కన్పించింది. ఈ విషయాన్ని ఇంద్రపాలెం పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. సుధ పెళ్లికి ముందే నర్సీపట్నంలోని తన మేనత్త కొడుకుతో ప్రేమలో ఉండేదని, పెళ్లయిన తరువాత కూడా ఫోను మాట్లాడుతూ ఉండేదని భర్త దుర్గాప్రసాద్ చెబుతున్నాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విజయశంకర్ తెలిపారు. అమ్మాయి చనిపోయే ముందు రాసిన లెటర్ ఒకటి దొరికిందని, తాను తన బంధువుల అబ్బాయితో మాట్లాడుతున్నానని, ఈ విషయం ఇంట్లో తెలిసిందని, బంధువులు అందరికీ తెలిస్తే తమ కుటుంబ పరువుపోతుందన్న ఉద్దేశంతో తాను చనిపోతున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదంటూ అందులో రాసినట్టు ఎస్సై విజయశంకర్ తెలిపారు. మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
వివాహిత ఆత్మహత్య
శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని ఎస్ఎంపురం గ్రామానికి చెందిన వివాహిత పడ్డ దీప (28) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఎచ్చెర్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైరి సింగుపురం గ్రామానికి చెందిన దీపతో ఎస్ఎంపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ పడ్డ గోవిందరావుతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. దీపకు కడుపు నొప్పి రావడంతో బాధ భరించలేక సంక్రాంతి నాడు ఇంటి వద్ద ఉన్న పురుగుల మందు తాగడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. దీపకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఎస్సై వై.కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
కృష్ణాజిల్లా, ముసునూరు (నూజివీడు) : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, అత్త మామలు, తోటి కోడలు, బావగార్లు మూకుమ్మడిగా పెడుతున్న వేధింపులకు తాళలేక ఓ మహిళ పురుగు మందు తాగి తనువు చాలించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కేవీజీవీ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చింతలవల్లి శివారు గోగులంపాడుకు చెందిన ఎలికే అనిల్ భార్య వెంకటేశ్వరమ్మ (25) భార్యా భర్తలు. వీరు 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరమ్మ ఆదివారం ఉదయం పురుగు మందు తాగింది. దీంతో ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ క్లినిక్లో ప్రథమ చికిత్స అందించి, అనంతరం నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు భావిస్తుండగా, అల్లుడు, అత్తింటివారే తమ బిడ్డను అంతమొందించినట్లుగా మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గోగులంపాడులోని ఇంటివద్ద అత్త, స్థానికులను ఎస్ఐ విచారించి ఆధారాలు సేకరిస్తున్నారు. నూజివీడు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. మృతురాలి తల్లిదండ్రులు కొండలరావు, రంగారావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
పీఎం పాలెం(భీమిలి): పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించి స్థానిక ఎస్ఐ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడకు చెందిన పిళ్లా కీర్తి పద్మావతి(19)ని బక్కన్నపాలెం ఎన్టీఆర్ కాలనీకి చెందిన మహేష్కు ఇచ్చి సుమారు 7 నెలల కిందట వివాహం చేశారు. ఆమె కడుపు నొప్పి, నడుము నొప్పితో దీర్ఘకాలంగా బాధ పడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో వారందరూ దిగువ పోర్షన్లోని గదులలో నిద్రపోతుండగా పై అంతస్తులో నిర్మించిన గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
ఆడపిల్లలు పుట్టారని వేధింపులు..
కర్నూలు, వెల్దుర్తి: ఆడపిల్లలు పుట్టారని, పనిచేయడం చేతకాదని భర్త, అత్తమామ నిత్యం వేధిస్తుండడంతో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వెల్దుర్తి మండలం యాదరాళ్ల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వెల్దుర్తి ఏఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల సమీపంలోని బిల్లలాపురానికి చెందిన లీలావతి(25)కి యాదరాళ్లకు చెం దిన బాలసుబ్రహ్మణ్యంతో 2010లో వివాహమైంది. వీరికి ఇద్దరు కవల పిల్లలు(కుమార్తెలు) ఉన్నారు. లీలావతి అమ్మా, నా న్నలు జయమ్మ, చెన్నయ్య అనారోగ్యంతో మృతి చెందారు. పెద్ద దిక్కులేని ఆమెకు ధైర్యం చెప్పి అండగా నిలవాల్సిన భర్త వేధింపుల పర్వం కొనసాగించాడు. అత్తమామలు కూడా అదే బాట పట్టారు. సూటిపోటి మాటలను తాళలేని లీలావతి.. శుక్రవారం ఇంట్లోని బాత్రూంలోకి వెళ్లి గడియవేసుకుని పురుగులమందు తాగింది. ఎంతసేపటికీ రాకపోవడంతో తలుపు పగులగొట్టి చూశారు. అప్పటికే ఆమె మృతిచెందింది. లీలావతి పెదనాన్న గుర్రం చెన్నయ్య ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు గ్రామానికి చేరుకుని విచారించారు. మృతదేహాన్ని డోన్కు ఆస్పత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. భర్తతో పాటు అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
అనంతపురం, తాడిపత్రి: పట్టణంలోని సీబీ రోడ్డులో గురువారం అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. టైలర్స్కాలనీకి చెందిన షఫీ తన కుమార్తె షాను(24)ను నాలుగేళ్ల క్రితం పట్టణానికి చెందిన ఇర్ఫాన్కు ఇచ్చి వివాహం చేశారు. ఇర్ఫాన్ పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నాడు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు కలిగినా ఇద్దరు మృతి చెందారు. ఉదయం పొరుగున ఉన్న ఇంటిలో షాను ఫ్యానుకు ఉరివేసుకుని ఉండడాన్ని గమనించిన స్థానికులు విషయాన్ని భర్తకు తెలియజేశారు. భర్త స్థానికుల సాయంతో ఫ్యాన్కు వేలాడుతున్న షాను మృతదేహాన్ని కిందకు దించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి కుటుంబీకులు షాను మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తండ్రి షఫీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
భర్త, పిల్లలను గదిలో బంధించి..
గచ్చిబౌలి: అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ భర్త, పిల్లలను గదిలో ఉంచి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ధర్మేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్చెరువు, గోకుల్నగర్ చెందిన అర్షియా అంజుమ్(23)కు మసీద్బండకు చెందిన అమ్జాద్తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు ఐమాన్(3), కుమార్తె అర్ఫియా అంజుమ్ ఉన్నారు. బుధవారం భార్యాభర్తల మధ్య గొడవజరగడంతో క్షణికావేశానికి లోనైన అర్షియా అంజుమ్ భర్త, పిల్లలు బెడ్రూమ్లో ఉండగా బయటి నుంచి గడియ పెట్టి హాల్లో ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గదిలో నుంచి భర్త కేకలు వేస్తూ వారించినా ఆమె పట్టించుకోకపోవడంతో పైఅంతస్తులో ఉంటున్న అన్న, వదినలు అజ్మత్, గౌసియాలకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వారు కిందకు వచ్చి చూడగా మెయిన్డోర్కు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. ఫ్యాన్కు వేలాడుతున్న అర్షియాను కిందికు దించి కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్త ఖుమ్రూ, బావ అజ్మత్, తోటి కోడలు గౌసియా వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి ఖదీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య,భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, కొద్ది రోజుల క్రితం పెద్ద సమక్షంలో పంచాయతీ చేసి సర్ది చెప్పామన్నారు. అయినా అర్షియాను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వేధింపులు తాళలేక మహిళ ..
ఖాజీపేట : అత్త ఆడబిడ్డ వేధింపులు తాళలేక ములపాక గ్రామానికి చెందిన బుజ్జి అనే మహిళ ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. కమలాపురం మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన బుజ్జిని ములపాక చెందిన రాంప్రసాద్ అనే యువకుడికి ఐదేళ్ల కిందట వివాహం చేశారు. ఇటీవలే ఆ అమ్మాయి పోలీసు వలంటీర్గా ఎంపికైంది. గత కొంతకాలంగా అత్త యశోదమ్మ తోపాటు ఆడబిడ్డ భర్తతో అనేక విభేదాలు కారణంగా తరచూ ఇంట్లో వేధింపులు జరిగేవి. దీంతో మానసికంగా బుజ్జి తీవ్ర ఆవేదన చెంది బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. విషయం తెలుసుకున్న బుజ్జి తల్లితండ్రులు మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే తండ్రి పూజారి ఓబులేసు తన కూతురు అత్త, ఆడబిడ్డ భర్త వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతురాలి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. -
భర్త వేధింపులు తాళలేక..
అమలాపురం రూరల్: మండలంలోని పేరూరు శివారు లంకతోటలో భర్త, అత్త మామల వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుందని పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. గ్రామానికి చెందిన కుడుపూడి తనీష్కుమార్ భార్య వాణి ఈశ్వరి (28) ఈ అఘాయిత్యానికి పాల్పడిందన్నారు. అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కాంపౌడర్గా పనిచేస్తున్న తనీష్కుమార్కు అదే గ్రామానికి చెందిన వాణి ఈశ్వరితో 11ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి పదేళ్ల కుమారుడు, ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు. ఇటీవల కాలంలో తనీష్కుమార్ భార్యను నిర్లక్ష్యం చేస్తూ వేధిస్తున్నాడని సీఐ చెప్పారు. భర్తతో పాటు అత్త మామలు రాజరాజేశ్వరి, సూర్యనారాయణలు కూడా ఆమెను వేధించసాగారు. కొన్ని నెలలుగా భర్త, అత్తమామల వేధింపులు అధికం కావడంతో వాటిని భరించలేక వాణి ఈశ్వరి సోమవారం తెల్లవారు జామున ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకుంది. ఘటనా స్థలాన్ని సీఐ కోటేశ్వరరావు సోమవారం ఉదయం పరిశీలించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో కొన్ని ఆధారాలను సేకరించారు. భర్త, అత్తమామల వేధింపుల వల్లే వాణి ఈశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక ఆధారాలు లభించడంతో సీఐ శ్రీరామకోటేశ్వరరావు భర్త, అత్త మామలను తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్టు సీఐ తెలిపారు. హత్య చేసి ఆత్యహత్యగా చిత్రీకరణ పుట్టింటి వారు ఫిర్యాదు తన చెల్లిని ఆమె భర్త, అత్తమామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి సోదరుడు రాయుడు వెంకటరమణ ఆరోపించారు. తన బావకు వేరే పెళ్లి చేయాలన్న ఆలోచనతో అత్త మామలు తన చెల్లిని పథకం ప్రకారం హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారు జామున బావ, చెల్లి గొడవ పడ్డారని తెలిసిందని, ఆ సమయంలోనే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన చెల్లి మరణ వార్త విని తాము వెళ్లే సరికే ఉరి నుంచి శవాన్ని తప్పించినట్టుగా చేసి ఓ కుర్చీలో ఉంచారని చెప్పారు. తన చెల్లిది ముమ్మాటికీ హత్యేనని, ఈ మేరకు తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని వెంకటరమణ తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
పులివెందుల : పట్టణంలోని రాజారెడ్డి కాలనీకి చెందిన లావణ్య(23) అనే వివాహిత శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. లావణ్యకు మల్లికార్జునతో 8నెలల కిందట వివాహమైంది. లావణ్య పట్టణంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో నర్సుగా విధులు నిర్వహిస్తుండేది. మల్లికార్జున ఇప్పట్ల సమీపంలోని సంచుల ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవాడు. గత రెండు రోజుల కిందట ముద్దనూరు వద్ద గల మంగపట్నం గ్రామంలో బంధువులు ఉండటంతో అక్కడ దేవర జరుగుతోందని ఆ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ లావణ్య బంధువులతో కలుపుగోలుగా ఉండలేదని తల్లి మందలించింది. చిన్నప్పటి నుంచి సున్నిత మనస్తత్వం గల లావణ్య తల్లి మందలించడంతో మనస్థాపం చెంది శుక్రవారం రాజారెడ్డికాలనీలోని స్వగృహంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహమైన మరుసటి రోజే..
వేలూరు: వివాహమైన మరుసటిరోజే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వానియంబాడి సమీపంలో గురువారం జరిగింది. వివరాలు.. వేలూరు జిల్లా వానియంబాడి నేతాజీనగర్కు చెందిన వినాయకం కుమార్తె మీనా (20). ఈమెకు విరిసలాంబట్టు గ్రామానికి చెందిన చిన్నస్వామి కుమారుడు గోవిందస్వామి(25)తో బుధవారం వివాహం జరిగింది. వివాహం జరిగిన వెంటనే పెళ్లి కుమార్తె ఇంటికి నూతన దంపతులు వచ్చారు. గోవిందరాజ్ గురువారం సాయంత్రం పని నిమిత్తం కురిసలాంబట్టుకు వెళ్లాడు. మీన అదే ప్రాంతంలోని యువరాజ్ ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మీనా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన బంధువు ఇది గమినించి కేకలు వేశాడు. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. వారి సమాచారంతో వానియంబాడి పోలీసులు అక్కడికి చేరుకుని మీనా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
భర్త వివాహేతర సంబంధాలూ కారణమా?
కడప అర్బన్ : కడప నగరంలోని చిన్నచౌకు పోలీసుస్టేషన్ పరిధి ఓం శాంతినగర్లో నివసిస్తున్న ఎన్.చెన్నమ్మ అలియాస్ చిన్ని అలియాస్ నేహ (23) అనే యువతి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. తాను నివసిస్తున్న ఇంటి బెడ్రూములో ఫ్యానుకు చీరెతో ఉరేసుకుంది. చిన్నచౌకు ఎస్ఐ రాధాకృష్ణ సంఘటన స్థలాన్ని సిబ్బందితో కలిసి పరిశీలించారు. స్థానికులు, బం«ధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చాపాడు మండలం చిన్న గెలిగనూరుకు చెందిన చెన్నమ్మ కడప నగరలలోని ఓ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. కడప నగరం చిన్నచౌకు పరిధిలోని ముత్తరాసుపల్లెకు చెందిన జి.శ్రీను (24) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. వీరిద్దరికీ ఈనెల 11 తేదీన వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఓం శాంతినగర్లో నెల రోజుల నుంచి ఇరువురు సహజీవనం చేస్తున్నారు. అయితే మరో యువతిని వివాహం చేసుకుంటానని చెన్నమ్మతో అప్పుడప్పుడు గొడవ పడేవాడు. ఈ క్రమంలో గత రాత్రి తాము ఉంటున్న ఇంటిలోనే ఫ్యాన్కు ఉరి వేసుకుని చెన్నమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె మృతికి శ్రీనునే కారణమని మృతురాలి తండ్రి చెన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ రాధాకృష్ణ తెలిపారు. వల్లూరులో వివాహిత..భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులే కారణం: వల్లూరు : అత్తింటి వేధింపులు గర్భిణి ప్రాణాన్ని బలిగొన్నాయి. తల్లిదండ్రులు, బంధువులను ఎదిరించి ప్రేమించిన వాన్ని కులాంతర వివాహం చేసుకుని కాపురానికి వచ్చిన ఆమెకు భర్త వేధింపులే జీవితంపై విరక్తిని కలిగేలా చేశాయి. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించింది. ఈ సంఘటన వల్లూరు మండలంలోని పుల్లారెడ్డిపేట ఎస్సీ కాలనీలో శుక్రవారం జరిగింది. వల్లూరు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి. ఎస్సీ కాలనీకి చెందిన గొడ్డు సన్నికుమార్ అదే మండలంలోని దుగ్గాయపల్లెకు చెందిన కల్పన అనే యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో.. ఆమె పెద్దలను, బంధువులను వదులుకుని నాలుగేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. వీరికి ఇప్పటికే ఒకటిన్నరేళ్ల పాప వుండగా.. కల్పన ప్రస్తుతం గర్భవతి. కొంత కాలంగా ఆమెను భర్త సన్నికుమార్తోపాటు అత్త రూతమ్మ, ఆడపడుచు శ్రావణి వేధింపులకు గురి చేసే వారు. దీంతో వారి వేధింపులకు తట్టుకోలేక కల్పన శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి వెనుక భాగాన చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కల్పన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త సన్నీకుమార్, అత్త రూతమ్మ, ఆడపడుచు శ్రావణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భర్త వివాహేతర సంబంధాలూ కారణమా? భర్త సన్నికుమార్ ఇంటిలో అడుగుపెట్టిన కల్పనకు కొద్ది నెలలకే అతని నిజ స్వరూపం తెలిసిందని, పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలను కలిగి ఉన్నట్లు పసిగట్టిందని, అయితే చేసేదేమీలేక అలాగే భరిస్తూ వచ్చిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సన్ని కుమార్ ఇటీవల కమలాపురం పట్టణానికి చెందిన ఒక వివాహితను సైతం వలలో వేసుకుని చెట్టాపట్టాల్గా తిరగడం, కొన్ని రోజులు ఇద్దరు కలిసి కనిపించకుండా పోవడం జరిగాయని, ఈ విషయం తెలుసుకున్న కల్పన భర్తను నిలదీసిందని, అప్పటి నుంచి వేధింపులు తీవ్రమయ్యాయని, దీంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని వారు చెబుతున్నారు. -
వివాహిత ఆత్మహత్య
బుట్టాయగూడెం: ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కృష్ణాపురంలో బుధవారం చోటు చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియకరాకపోవడంతో స్థానిక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బుట్టాయగూడెం మండలం కృష్ణాపురానికి చెందిన తుమ్మలపల్లి శ్రీనివాసరావు, విజయ దంపతుల కుమార్తె రామలక్ష్మికి రెండేళ్ల క్రితం జంగారెడ్డిగూడేనికి చెందిన ఓలేటి ప్రదీప్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి రేవంత్ అనే ఆరు నెలల బాబు ఉన్నాడు. 15 రోజుల క్రితం పుట్టింటి నుంచి కూతురు రామలక్ష్మిని తండ్రి శ్రీనివాసరావు అత్తవారింట్లో దించాడు. ఈ నెల 4వ తేదీన రామలక్ష్మి, ప్రదీప్ల పెళ్లిరోజు. అదే రోజు బిడ్డ రేవంత్ అన్నప్రాసన ముహూర్తం పెట్టారు. ఈ రెండు వేడుకలను జంగారెడ్డిగూడెంలోనే జరుపుకున్నారు. అయితే మంగళవారం సాయంత్రం రామలక్ష్మి కుమారుడికి వ్యాక్సిన్ వేయించేందుకు కృష్ణాపురంలో పుట్టింటికి వచ్చింది. బుధవారం ఉదయం తండ్రి శ్రీనివాసరావు, తల్లి విజయ రేవంత్కు వ్యాక్సిన్ వేయించేందుకు బుట్టాయగూడెం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని గమనించి చుట్టుపక్కల వారిని పిలిచారు. వారు తలుపులు పగలకొట్టి చూడగా రామలక్ష్మి కాలిపోయి మృతదేహంగా పడి ఉంది. ఒంటిపై పెట్రోలు పోసుకొని మృతి చెందినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ బి.ఉదయ్భాస్కర్, ఏఎస్సై ఐ.భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై తెలిపారు. పోలవరం సీఐ రమేష్ బాబు రామలక్ష్మి కుటుంబ సభ్యులను, అటు అత్తమామలను ప్రశ్నించారు. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు ఆత్మహత్యకు పాల్పడిన రామలక్ష్మి ఒక లెటర్ కూడా రాయడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆమె మృతి అనంతరం పరిసర ప్రాంతాన్ని పరిశీలించగా బీరువా సమీపంలో ఒక లెటర్ ఉందని దానిని పోలీసులకు ఇచ్చారు. దానిలో ‘నాన్న నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. నువ్వు ఎవరినీ ఏమీ అనకు. నా చావుకు నేనే బాధ్యురాలిని. దయచేసి నా అత్తింటి వారికి ఎటువంటి సంబం«ధం లేదు. నేను చనిపోయిన విషయం ఎవరికీ చెప్పకు. ఇదే నా చివరి కోరిక’ అంటూ తనను ముద్దుగా పిలుచుకునే అమ్ములు పేరుమీద ఒక లెటర్ను రాసిపెట్టినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య
చోడవరం టౌన్: రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజపుత్ర గీతాదేవి(26) అనే వివాహిత బుధవారం రాత్రి ఇంటిలోని ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని దుడ్డువీధిలో నివాసం ఉంటున్న పద్మారాం రాజుపుత్ర కొన్నేళ్లుగా చోడవరంలోని చీడికాడ రోడ్డులో హార్డవేర్ దుకాణం నిర్వహిన్నాడు. పద్మారాం బుధవారం రాత్రి దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లే సరికి గీతాదేవి ఇంటిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెంది ఉంది. పద్మారాం కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ట్రైనీ ఎస్ఐ హిమగిరి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. పద్మారాం, గీతాదేవి మధ్య మనస్పర్థలున్నాయని, వారు తరచూ గొడవలు పడుతున్నారని స్థానికులు తెలిపారు. -
నా కుమార్తెను ‘చంపేశారు’...!
కడప అర్బన్ : కడప నగరం అక్కాయపల్లెకు చెందిన ఓ వివాహిత గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటనపై మృతురాలి తండ్రి, బంధువులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రగుంట్లలోని శాంతినగర్లో నివాసం ఉంటున్న పాతకడప రెడ్డెయ్య, రమణమ్మల కుమార్తె సుధారాణి (21)కి, కడప నగరంలోని అక్కాయపల్లెకు చెందిన కోటపాటి శ్రీకాంత్కు 2015లో వివాహమైంది. వివాహ సమయంలో రూ. 6 లక్షలు కట్నంగా ఇచ్చారు. వీరికి నిఖిల్ (9 నెలలు) అనే బాలుడు ఉన్నాడు. శ్రీకాంత్ కడప నగరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్గా పని చేస్తున్నాడు. కాగా వివాహమైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్ఫర్థలు ఏర్పడ్డాయి. ఇటీవల సుధారాణి తమ పుట్టింటికి వెళ్లింది. గత శనివారం శ్రీకాంత్ సోదరుడు, తన వివాహం వచ్చేనెల 7న జరగనుందని, తన వదిన సుధారాణిని ఇంటికి పిలుచుకుని వచ్చాడు. ఈ క్రమంలో కళాశాల నుంచి ఇంటికి భోజనానికి వచ్చిన శ్రీకాంత్ తన భార్యతో గొడవపడ్డాడు. తర్వాత కళాశాలకు వెళ్లాడు. అదే సమయంలో ఆమె ఇంట్లో అపస్మారకంగా పడి ఉండటంతో బంధువులు, స్థానికులు 108 ద్వారా సుధారాణిని రిమ్స్కు తరలించారు. అప్పటికే రిమ్స్ క్యాజువాలిటీలో సుధారాణికి ప్రాథమిక వైద్య పరీక్షలు చేసిన వైద్యులు మృతి చెందిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి రెడ్డెయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఐదుగురిపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎన్. రాజరాజేశ్వర రెడ్డి తెలిపారు. నా కుమార్తెను చంపేశారు: మృతురాలి తండ్రి రెడ్డెయ్య ఆవేదన తన కుమార్తెను పథకం ప్రకారమే, పిలిపించి చంపేసి అన్యాయం చేశారని మృతురాలు సుధారాణి తండ్రి రెడ్డెయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంత్కు ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు ఉండేవని, తన కుమార్తెను సరిగా చూసుకోకపోవడంతోనే ఇంటికి తీసుకుని వెళ్లామన్నారు. తమ కుమార్తె శరీరంపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయన్నారు. కాగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ సంఘటనలో తల్లి మరణించి, తండ్రి కటకటాలపాలు కావడంతో వారి కుమారుడు నిఖిల్ -
వివాహిత ఆత్మహత్యాయత్నం
మంచిర్యాలక్రైం: మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస్ టాకీస్ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణపల్లి అనిత(30) అలియాస్ లాస్య గురువారం రసాయనం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అనితకు వేధనాచారితో 2012లో వివాహం జరిగిది. అప్పటినుంచి అత్తమామలు భర్త తరుచూ వేధింపులకు గురిచేస్తున్నారు. గతంలో పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు నిర్వహించారు. ఇటీవల కాలంలో వేధింపులు అధికం కావడంతో భరించలేక గురువారం బాత్రూం క్లీనర్ తాగింది. కుటుంబసభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. అనితకు కూతురు వింధ్య, కుమారుడు విశ్వన్ ఉన్నారు. అనిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు భర్త వేధనాచారి, మామ బ్రహ్మయ్య, అత్త మణమ్మలపై కేసు నమోదు చేసి దర్యాçప్తు జరుపుతున్నామని మహిళా పోలీస్ స్టేషన్ సీఐ చంద్రమౌళి తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
గార : కొర్లాం పంచాయతీ కొమురవానిపేటలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈ గ్రామానికి చెందిన పుక్కళ్ల్ల ధనం(26) అనే వివాహిత సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు తనచీరనే కట్టుకుని ఉరివేసుకుంది. భర్త దత్తాత్రేయ సీమెన్గా పనిచేస్తూ రెండు నెలల కిందట విధులు ముగించుకొని సెలవులపై ఇంటికి వచ్చాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు నిఖిల్(4), లోకేష్(8నెలలు) ఉన్నారు. తల్లి మృతితో ఇద్దరు చిన్నారుల రోదన మిన్నంటింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఒడిశా రాష్ట్రం జబల్పూర్ గ్రామానికి చెందిన మృతురాలి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత మంగళవారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించారు. భర్త వేధింపులు భరించలేక తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లి గురమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై బలివాడ గణేష్ కేసు నమోదు చేశారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
గుంటూరు ఈస్ట్: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన స్థానిక కొత్తపేట పరిధిలోని గణేష్ రావు వీధిలో సోమవారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం గుంటూరు రూరల్ మండలం చిన పలకలూరుకు చెందిన తెలగపల్లి ఉమామహేశ్వరరావు, సుజాత దంపతుల రెండో కుమార్తె గీతాంజలి జేకేసీ కళాశాలలో బీఎస్సీ చదివింది. తల్లిదండ్రులు 2017 ఆగస్టులో కొత్తపేట గణేష్ రావు వీధికి చెందిన చదలవాడ సీత కుమారుడు రవికి ఇచ్చి వివాహం చేశారు. రవి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. వివాహం జరిగినప్పటి నుంచి భార్యతో నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పేవాడు. అత్త సుజాత కట్నకానుకలు సరిపోలేదంటూ కోడలిని నిత్యం వేధించేది. నెల కిందట గీతాంజలికి టైఫాయిడ్ రావడంతో తండ్రి పుట్టింటికి తీసుకువెళ్లి చికిత్స చేయించాడు. ఈ నెల 22న అత్తవారింటికి తిరిగి వచ్చింది. ఈ సమయంలో రవి మామతో గొడవపడ్డాడు. సోమవారం రాత్రి రవి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి గదిలో తన భార్య ఉరి వేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న కొత్తపేట ఎస్హెచ్ఓ వంశీధర్, క్లూస్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అల్లుడే తమ కుమార్తెను హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
పెళ్లయిన ఆరునెలలకే విషాదాంతం
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): పెళ్లయిన ఆరు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. యల్లపువానిపాలెంలో తీవ్ర విషాదం నింపిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. పొన్నపు సోనీ(26)కి శ్రీకాకుళం జిల్లా నర్సిపురం ప్రాంతానికి చెందిన సంజయ్కుమార్తో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. సంజయ్కుమార్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. సోనీ కన్నవారి ఇంట్లోనే దంపతులు నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం ఆయన ఉద్యోగ రీత్యా క్యాంపు వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఇంటి బయట సోనీ తల్లిదండ్రులు కాలెమ్మ, అప్పారావు ఉండగా, కూతురు ఎంతకీ బయటకు రావడం లేదేంటని గదిలోకి వెళ్లి చూశారు. ఫ్యానుకి వేలాడుతూ కనిపించడంతో వీరు నిశ్చేష్టులయ్యారు. స్థానికుల సహకారంతో ఆమెను బతికించుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మరణించింది. ఘోరం జరిగిపోయిందంటూ సోనీ తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగారు. కన్నీరుమున్నీరై విలపించారు. జరిగిన సంఘటనపై గోపాలపట్నం పోలీస్స్టేషన్ ఎస్ఐ తమ్మినాయుడు సిబ్బందితో విచారణ చేపట్టారు. సోనీ తల్లిదండ్రులను ఆరా తీశారు. తమకు ఎలాంటి అనుమానాలూ లేవని, కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోందని, కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సోనీ సున్నిత మనస్కురాలు అని స్ధానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. ఎస్ఐ తమ్మినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్త ఊళ్లోలేని సమయంలో... అప్పారావు, కాలెమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. మూడో కుమార్తె సోనీ. ఆరునెలల క్రితమే శ్రీకాకుళం జిల్లా నర్సిపురం ప్రాంతానికి చెందిన సంజయ్కుమార్కు ఇచ్చి వివాహం చేశారు. ప్రైవేటు సంస్థలో ఇంజినీరుగా పని చేస్తున్నాడు. శ్రీకాకుళం నుంచి క్యాంపు వెళ్లే ముందు గోపాలపట్నంలోని యల్లపువానిపాలెంలో సోనీ కన్నవారి ఇంట్లో ఈ నెల12న దించి వెళ్లారు. ఆయన చిత్తూరు క్యాంపు వెళ్లారు. ఇంతలోనే సోనీ ఆత్మహత్యకు పాల్పడడంతో జరిగిన సంఘటన తెలిసి హుటాహుటిన నగరానికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. -
ఇష్టం లేని పెళ్లి చేశారని..!
రాంబిల్లి(యలమంచిలి): మండలంలోని లోవపాలెం సమీప జీడితోటలో ఉరివేసుకొని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సముద్ర స్నానానికని చెప్పి వెళ్లి అఘాయిత్యానికి పాల్పడింది. ఇష్టంలోని పెళ్లి చేయడమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఎస్ఐ కె. కుమారస్వామి, లోవపాలెం గ్రామస్తుల కథనం ప్రకారం.. లోవపాలేనికి చెందిన సంధ్యకు రేవుపోలవరానికి చెందిన చింతకాయల జగ్గారావుతో ఆరునెలల క్రితం వివాహమైంది. అప్పట్లో సంధ్య తనకు ఆ పెళ్లి వద్దని నిరాకరించినా పెద్దలు బలవంతంగా పెళ్లి చేసి కాపురానికి పంపించారు. అయితే కొన్ని రోజులుగా సంధ్య లోవపాలెంలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పది రోజుల నుంచి భర్త వద్ద వెళ్లమంటూ ఆమె తల్లి ఒత్తిడి తెస్తున్నా సంధ్య అందుకు అంగీకరించడంలేదు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం సముద్ర స్నానానికి అని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లింది. ఎంతకూ ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం సముద్ర తీరంలోని జీడితోటలో సంధ్య మృతదేహం ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ కుమారస్వామి వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి సంధ్య మృత దేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు సహా పలువురిని విచారించారు. తహసీల్దార్ ఎస్.ఎ. మహేశ్వరరావు పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంధ్య మృతితో రెండు గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఓ మగాడిని నమ్మి వస్తే..
పిడుగురాళ్ల టౌన్: ఓ మగాడిని నమ్మి వస్తే అతడు అర్ధంతరంగా వదిలేశాడు. దీంతో మనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని 10వ వార్డులో గురువారం చోటు చేసుకుంది. వివరాలు...దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన పి. సంధ్యారాణి(27) భర్తతో విడాకులు తీసుకుని పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ముత్యాలంపాడు గ్రామానికి చెందిన అనుదీప్ పరిచయమయ్యాడు. అతడితో కలసి పిడుగురాళ్లలో ఉంటోంది. ఇటీవల సంధ్యారాణితో గొడవపడి చేయి చేసుకుని వెళ్లిపోయాడు. అతడు గుంటూరులో ప్రైవేటు జాబ్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన సంధ్యారాణి బుధవారం రాత్రి మైలతుత్తాన్ని పంచదారలో కలుపుకుని ఇడ్లీలో తినేసింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో విగతజీవిగా పడి ఉంది. ఉదయాన్నే స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఎం. హనుమంతరావు, ఎస్ఐ రవీంద్రబాబు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లో పరిసరాల్ని పరిశీలించారు. ఆమె వద్ద సూసైడ్ లెటర్ను గుర్తించారు. తన చావుకు ప్రేమికుడే కారణమని అందులో రాసింది. నమ్మి వచ్చినందుకు మోసం చేశాడని, వాడిని వదలొద్దంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. -
దైవసన్నిధిలో వివాహిత ఆత్మహత్య
నర్రవాడ(దుత్తలూరు): దైవసన్నిధిలో పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం నర్రవాడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..కలిగిరి మండలం నాగసముద్రం బీసీ కాలనీకి చెందిన ఇర్ల రాజేశ్వరి(30), వెంకటేశ్వర్లు దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త వెంకటేశ్వర్లు హైదరాబాద్లో పనిచేస్తూ దసరాకు ఇంటికి వచ్చాడు. శుక్రవారం పనికి వెళ్దామని భార్యను కోరగా, తనకు ఆరోగ్యం సరిగాలేదని తెలిపింది. భర్త పనికి వెళ్లిన తరువాత కుమార్తె, కుమారుడ్ని తీసుకుని వింజమూరు బయల్దేరింది. వింజమూరులో పిల్లలకు టిఫిన్ పెట్టించి పురుగుల మందు కొనుగోలు చేసింది. అక్కడ్నుంచి వెంగమాంబ దర్శనం చేసుకుందామని నర్రవాడకు తీసుకొచ్చింది. వెంగమాంబ దర్శనం అనంతరం క్యూలైన్ల సమీపంలోని మెట్ల వద్ద పిల్లలతో కూర్చుంది. పిల్లలు ఆకలేస్తుందమ్మా ఇంటికి వెళ్దామనగా, కాలకృత్యాలు తీర్చుకురండి వెళ్దామని చెప్పింది. పిల్లలు పక్కనే ఉన్న చెట్ల చాటుకు కాలకృత్యాలకు వెళ్లగా రాజేశ్వరి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును సేవించింది. తిరిగి వచ్చిన పిల్లలు తల్లి నోరు, ముక్కు వెంట నురుగు రావడం చూసి భయంతో చుట్టుపక్కల వారిని కేకలు వేశారు. స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికే ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్సై ఎం వెంకటరాజేష్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. తల్లి మృతదేహంవద్ద పిల్లలు కన్నీరుమున్నీరు కావడం పలువురిని కంట తడిపెట్టించింది. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
ప్రేమ వివాహం విషాదాంతం
► వివాహిత అనుమానాస్పద మృతి ► భర్త వేధింపులే కారణమంటున్న మృతురాలి తల్లి పీఎం పాలెం (భీమిలి) : ప్రేమ వివాహం చేసుకున్న ఆరు నెలలకే ఓ యువతి తనువు చాలించింది. యువతి ఇంట్లో ఉరి వేసుకుని వేలాడుతుండగా పోలీసుల సమక్షంలో వారి బంధువులు కిందకు దించారు. సోమవారం చోటు చేసుకున్న ఈ సంఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ కె.లక్ష్మణమూర్తి, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... మద్దిలపాలెం పెట్రోలు బంకు వెనుక నివసిస్తున్న పైబూడి వెంకటేశ్వరరావు కుమార్తె సంతు దుర్గాదేవి(24) గరంలోని ఓ ప్రముఖ వ్యాపార సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పని చేసేది. అదే సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నరేష్కుమార్ రెడ్డి అనే యువకుడితో పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. పెద్దలకు చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మధురవాడ స్వతంత్రనగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరి ప్రేమ వివాహం విషయం యాజమాన్యానికి తెలియడంతో ఇద్దరినీ ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి వారికి ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. దీంతో కన్నవారి ఇంటి నుంచి డబ్బులు తీసుకురమ్మని భార్యపై నరేష్ ఒత్తిడి చేస్తుండేవాడు. తమ కష్టాలు తల్లి సత్యవతికి దుర్గాదేవి తెలియజేయడంతో ఆమె పలుమార్లు కొంత నగదు పంపించింది. ఈ క్రమంలో కన్నవారి ఇంటి నుంచి రూ.2లక్షలు తీసుకురమ్మని భార్యపై నరేష్కుమార్రెడ్డి ఒత్తిడి పెంచాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఆమె మృతదేహం ఇంటిలో వేలాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకునే సమయానికి ఆమె భర్త నరేష్కుమార్రెడ్డి ఆచూకీ లభించలేదు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత తాను అనుభవిస్తున్న ఇబ్బందులు, ఆర్థిక సమస్యలను నోట్బుక్లో నాలుగు పేజీలలో దుర్గాదేవి రాసింది. ఆ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భర్త వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి సత్యవతి రోదిస్తున్న తీరు అక్కడి వారిని కలిచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.