మేడ్చల్ జిల్లా: లోన్ యాప్ వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నేరేట్మెట్ పోలీసులు తెలిపిన మేరకు..రేవంత్కుమార్, దేవనందిని (25) దంపతులు నేరేడ్మెట్లో నివాసముంటున్నారు. ఈ నెల 7న రేవంత్కుమార్ బయటకు వెళ్లిన అనంతరం భార్యకు ఫోన్ చేశాడు.
ఆమె స్పందించకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా బెడ్ రూమ్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఫోన్ను పరిశీలించగా ఓ గుర్తు తెలియని లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నట్లు గుర్తించారు. తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురిచేసినట్లు విచారణలో తేలింది. ఇదిలా తండ్రి వెంకట్రెడ్డి మాత్రం.. భర్త, అత్తమాల వేధింపుల వల్లనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని వాపోయాడు.


