ఓ మగాడిని నమ్మి వస్తే.. | married woman commit to suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Nov 3 2017 12:27 PM | Updated on Nov 3 2017 12:27 PM

married woman commit to suicide - Sakshi

సంధ్యారాణి మృతదేహం

పిడుగురాళ్ల టౌన్‌: ఓ మగాడిని నమ్మి వస్తే అతడు అర్ధంతరంగా వదిలేశాడు. దీంతో మనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని 10వ వార్డులో గురువారం చోటు చేసుకుంది. వివరాలు...దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన పి. సంధ్యారాణి(27) భర్తతో విడాకులు తీసుకుని పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ముత్యాలంపాడు గ్రామానికి చెందిన అనుదీప్‌ పరిచయమయ్యాడు. అతడితో కలసి పిడుగురాళ్లలో ఉంటోంది. ఇటీవల సంధ్యారాణితో గొడవపడి చేయి చేసుకుని వెళ్లిపోయాడు.

అతడు గుంటూరులో ప్రైవేటు జాబ్‌ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన సంధ్యారాణి బుధవారం రాత్రి మైలతుత్తాన్ని పంచదారలో కలుపుకుని ఇడ్లీలో తినేసింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో విగతజీవిగా పడి ఉంది. ఉదయాన్నే స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఎం. హనుమంతరావు, ఎస్‌ఐ రవీంద్రబాబు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లో పరిసరాల్ని పరిశీలించారు. ఆమె వద్ద సూసైడ్‌ లెటర్‌ను గుర్తించారు. తన చావుకు ప్రేమికుడే కారణమని అందులో రాసింది. నమ్మి వచ్చినందుకు మోసం చేశాడని, వాడిని వదలొద్దంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement