breaking news
Manav Suthar
-
మానవ్ సుతార్ జోరు.. కౌంటీలో ఇరగదీస్తున్న భారత ఆటగాళ్లు
టీమిండియా రైజింగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ కౌంటీ చాంపియన్షిప్లోనూ అదరగొడుతున్నాడు. వార్విక్షైర్ తరఫున ఆడుతున్న మానవ్ సుతార్ తన స్పిన్ మ్యాజిక్తో హాంప్షైర్తో మ్యాచ్లో ఏడు వికెట్ల హాల్ (తొలి ఇన్నింగ్స్లో మూడు, రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు) నమోదు చేయడం విశేషం. మానవ్ సుతార్ విజృంభణ కారణంగా వార్విక్షైర్ ఇన్నింగ్స్ 129 పరుగుల తేడాతో హాంప్షైర్పై ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్ 398 పరుగులకు ఆలౌటైంది. అనంతరం హాంప్షైర్ తొలి ఇన్నింగ్స్లో 115, రెండో ఇన్నింగ్స్లో 154 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో 15 ఓవర్లు వేసిన మానవ్ సుతార్ 42 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో 23.3 ఓవర్లు వేసి 52 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కౌంటీ ఆడడానికి ముందు శ్రీలంక పర్యటనలోనూ మానవ్ సుతార్ దుమ్మురేపాడు. రెండు టెస్టులు కలిపి 11 వికెట్లు పడగొట్టిన సుతార్ ఖాతాలో ఒక ఐదు వికెట్ల హాల్ ఉండడం విశేషం. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత పలుచబడిన స్పిన్ విభాగంలో మానవ్ సుతార్ తన మ్యాజిక్తో భారత జట్టులో కొత్త ఆశలు రేపుతున్నాడు.ఇరగదీసిన చాహల్, అకిబ్ నబీఇక కౌంటీల్లో మానవ్ సుతార్తో పాటు మిగతా భారత బౌలర్లు కూడా తమ ప్రదర్శనతో అదరగొట్టారు. జమ్మూ కశ్మీర్ సంచలనం అకిబ్ నబీ కూడా అదిరిపోయే అరంగేట్రం చేశాడు. తొలిసారి కౌంటీల్లో ఆడుతున్న ఈ బారాముల్లా ఎక్స్ప్రెస్ సర్రే తరఫున రెండు కీలక వికెట్లు తీసి యార్క్షైర్పై విజయం సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. మరో టీమిండియా సీనియర్ యజ్వేంద్ర చాహల్కూడా నార్తంప్టన్షైర్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి 9 వికెట్లు తీసిన చాహల్ ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల హాల్ నమోదు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లోనూ చాహల్ అదరగొట్టాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఈ సీజన్లో చాహల్ 14 వికెట్లు తీశాడు.Manav Suthar vs Hampshire: 3/42 in the 1st inns4/52 in the 2nd innsOutstanding bowling touch in last few months for Indian spinner... 🔥pic.twitter.com/uTrBKhD1OS— CricketGully (@thecricketgully) September 5, 2026చదవండి: వైరలవుతున్న అల్కరాజ్ బనియన్ .. ఇదేం కర్మరా దేవుడా! -
పడిక్కల్, సుతార్కు నిరాశ.. ప్రసిద్ధ్ తన్నుకుపోయాడు..!
శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత ఆటగాళ్లు దేవ్దత్ పడిక్కల్, మానవ్ సుతార్ విశేషంగా రాణించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో పడిక్కల్ 3 ఇన్నింగ్స్ల్లో 109.33 సగటున, 2 సెంచరీల సాయంతో 328 పరుగులు చేయగా.. సుతార్ ఏకంగా 108.2 ఓవర్లు వేసి 16 వికెట్లు పడగొట్టాడు.ఈ స్థాయిలో సత్తా చాటినా వీరిద్దరికి ఓ విషయంలో నిరాశ మిగిలింది. టీమిండియా మేనేజ్మెంట్ ఇటీవల ప్రవేశ పెట్టిన 'ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు వీరిలో ఎవరికీ దక్కలేదు. ఆశ్చర్యకరంగా ఈ అవార్డును ప్రసిద్ద్ కృష్ణ ఎగరేసుకుపోయాడు.Prasidh Krishna won the Impact Player of the series vs Sri Lanka ❤️- Prasidh bowled his heart out for the country. pic.twitter.com/GpPUUkyrNC— Johns. (@CricCrazyJohns) August 28, 2026ఈ సిరీస్లో ప్రసిద్ద్ సుతార్ స్థాయిలో వికెట్లు తీయలేనప్పటికీ.. కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డుకు గణాంకాల కంటే పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేయడం, బ్యాటర్లపై నిరంతరం ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని ప్రసిద్ద్కు అవార్డును ప్రధానం చేసిన టీమిండియా పనితీరు విశ్లేషకుడు హరి ప్రసాద్ మోహన్ చెప్పకనే చెప్పాడు. 'ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డును టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో అనధికారంగా అందజేస్తారు. ఈ సిరీస్లో ప్రసిద్ద్ నాలుగు ఇన్నింగ్స్ల్లో 24,57 సగటున 7 వికెట్లు పడగొట్టాడు. రెండు టెస్టుల్లో ప్రసిద్ద్ మరో పేసర్ సిరాజ్ కంటే అధికంగా శ్రమించాడు. ఈ సిరీస్ మొత్తంలోనూ ప్రసిద్ద్ సిరాజ్ కంటే ఎక్కువ ఓవర్లు వేశాడు.కాగా, శ్రీలంకతో సిరీస్లో సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచిన పడిక్కల్కు అధికరిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన సుతార్కు ఎలాంటి అవార్డు లభించినప్పటికీ అందరి మన్ననలు అందుకున్నాడు. పడిక్కల్, సుతార్, ప్రసిద్ద్లతో పాటు ప్రతి ఒక్క ప్లేయర్ తలో చేయి వేయడంతో భారత్ శ్రీలంక గడ్డపై రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. రెండో టెస్ట్లో శ్రీలంక బ్యాటర్ సోనల్ దినుషా అనూహ్యంగా ప్రతిఘటించడంతో ఆ మ్యాచ్ డ్రా అయ్యింది. చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. 18 ఏళ్ల తర్వాత -
IND vs SL: భారత్-శ్రీలంక రెండో టెస్టు డ్రా
IND vs SL 2nd Test Day 5: కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు డ్రా ముగిసింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 1-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఫాలో ఆన్లో శ్రీలంక బ్యాటర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. 229/6తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. తమ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. సోనల్ దినూష (133 నాటౌట్) అజేయ సెంచరీతో టీమిండియాకు గెలుపును దూరం చేశాడు. శ్రీలంక తొమ్మిదో వికెట్ డౌన్ఎట్టకేలకు శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 90 బంతులు ఆడి 12 పరుగులు చేసిన కుమార.. జడేజా బౌలింగ్లో ఔటయ్యాడు. శ్రీలంక ప్రస్తుతం 190 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.శతక్కొట్టిన దినుష133.1: సిరాజ్ బౌలింగ్లో రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్న దినుష. 196 బంతుల్లో వంద మార్కుల అందుకున్న ఆల్రౌండర్. ఈ సిరీస్లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్న 25 ఏళ్ల దినుష. లంక స్కోరు: 385-8. 172 పరుగుల ఆధిక్యం.పోరాడుతున్న శ్రీలంక.. సెంచరీకి చేరువలో దినుషకొలంబో టెస్టులో శ్రీలంక డ్రా దిశగా పోరాడుతోంది. ఆఖరి రోజు టీ బ్రేక్ సమయానికి శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది. లంక ప్రస్తుతం 170 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. సోనల్ దినుష(195 బంతుల్లో 6 ఫోర్లుతో 98) సెంచరీకి చేరువలో ఉన్నాడు.150 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకలాహిరు కుమార 1, దినుష 83 పరుగులతో ఉన్నారు. లంక స్కోరు: 363-8.ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక116.3 వ ఓవర్: రవీంద్ర జడేజా బౌలింగ్లో ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన ప్రబాత్ జయసూరియ. లాహిరు కుమార క్రీజులోకి వచ్చాడు. లంక స్కోరు: 355-8 (117). దినుష 76 పరుగులతో ఉన్నాడు. శ్రీలంక ఆధిక్యం 142 పరుగులు.140 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకదినుష 76, ప్రబాత్ సున్నా పరుగులతో ఉన్నారు. స్కోరు: 353/7 (115).శ్రీలంక స్కోరు: 341-7 (110)దినుష 65, ప్రబాత్ సున్నా పరుగులతో ఉన్నారు. ఆధిక్యం 128 పరుగులు.ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంకటీమిండియా రెండో సెషన్ను ఘనంగా ఆరంభించింది. భోజన విరామం తర్వాత మానవ్ సుతార్ అటాకింగ్కు వచ్చి.. నాలుగో బంతికే కేశారా నువాంతను పెవిలియన్కు పంపాడు. జురెల్కు క్యాచ్ ఇచ్చి 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నువాంత వెనుదిరిగాడు. దీంతో లంక ఏడో వికెట్ కోల్పోయింది. స్కోరు: 330-7 (105). ప్రబాత్ జయసూరియ క్రీజులోకి రాగా.. దినుష 56 పరుగులతో ఉన్నాడు. లంక ఆధిక్యం 118 పరుగులు.తొలి సెషన్లో శ్రీలంక ఆధిపత్యంకీలకమైన ఐదో రోజు ఆటలో తొలి సెషన్లో భారత బౌలర్లు తేలిపోయారు. సొనాల్ దినుష, కేశారా నువాంత జోడీని విడదీసేందకు ఆపసోపాలు పడ్డారు. ఈ క్రమంలో దినుష అర్ధ శతకం (55*) పూర్తి చేసుకోగా.. నువాంత (46*) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.భోజన విరామ సమయానికి శ్రీలంక 104 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 329 పరుగులు సాధించింది. తద్వారా 116 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.నొప్పితో విలవిల్లాడిన నువాంత103.2వ ఓవర్: రవీంద్ర జడేజా వేసిన బంతి నువాంత కాలికి తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి పరిశీలించాడు. అయితే, వెంటనే నువాంత మళ్లీ బ్యాటింగ్ మొదలుపెట్టాడు. జడ్డూ ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేయగా.. అంపైర్ నుంచి ప్రతికూల ఫలితమే వచ్చింది.115 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకవికెట్లు తీయలైక భారత బౌలర్ల పాట్లు.. శ్రీలంక స్కోరు: 328-6. నువాంత 46, దినుష 54 పరుగులతో ఉన్నారు.శ్రీలంక స్కోరు: 320-6 (99)దినుష 52, నువాంత 41 పరుగులతో ఉన్నారు. శ్రీలంక ఆధిక్యం 107 పరుగులు.దినుష హాఫ్ సెంచరీ99 బంతులలో యాభై పరుగులు పూర్తి చేసుకున్న దినుష. నువాంత 39 పరుగులతో ఉండగా.. లంకస్కోరు: 315-6. 102 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక.శ్రీలంక స్కోరు: 306-6 (94)93 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక. దినుష 42, నువాంత 37 పరుగులతో ఉన్నారు.89 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకదినుష 39, నువాంత 37 పరుగులతో ఉన్నారు. స్కోరు: 302-6 (91).డ్రింక్స్ బ్రేక్ సమయానికి శ్రీలంక స్కోరు: 284-6దినుష 34, నువాంత 28 పరుగులతో ఉన్నారు. శ్రీలంక ఆధిక్యం 71 పరుగులకు చేరుకుంది. చేతిలో ఇంకా నాలుగు వికెట్లు ఉన్నాయి.శ్రీలంక స్కోరు: 276-6 (86)50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన దినుష, నువాంత. దినుష 29, నువాంత 27 పరుగులతో ఉన్నారు. 63 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకనిలకడగా ఆడుతున్న దినుష, నువాంతదినుష 22, నువాంత 20 పరుగులతో ఉన్నారు. స్కోరు: 262-6 (84). 49 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక. Ravindra Jadeja gets one to turn sharply as #TeamIndia hunt for wickets. 😮💨 Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/cMB2L0A3Ro— Sony Sports Network (@SonySportsNetwk) August 27, 202644 పరుగుల ఆధిక్యంలో లంకదినుష 21, నువాంత 17 పరుగులతో ఉన్నారు.35 పరుగుల ఆధిక్యంలో లంకసొనాల్ దినుష 13, నువాంత 16 పరుగులతో ఉన్నారు. లంక స్కోరు: 248/6 (78)శ్రీలంక ఓవర్నైట్ స్కోరు: 229-6సొనాల్ దినుష ఏడు, కేశారా నువాంత మూడు పరుగులతో అజేయంగా నిలిచారు.స్వల్ప ఆధిక్యంలో లంకఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక బుధవారం ఆట పూర్తయ్యేసరికి 72.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. తద్వారా 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లింది. పసిందు సూరియబండారా (92), కమిందు మెండిస్ (55) రాణించడంతో ఎట్టకేలకు లంక ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోగలిగింది.సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్లో భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 503-9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా ఆతిథ్య లంకను ఫాలో ఆన్ ఆడమని చెప్పింది. కాగా వర్షం వల్ల బుధవారం నాటి నాలుగో రోజు ఆటను ముందుగానే ముగించాల్సి వచ్చింది. క్లీన్స్వీప్పై గురిఇదిలా ఉంటే.. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గాలెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా శ్రీలంకను 165 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇదే జోరులో రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసేందుకు భారత్ సిద్ధమైంది.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, సారాంశ్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణశ్రీలంకలాహిరు ఉదార, కమిల్ మిశారా, పసిందు సూరియబండారా, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వ (కెప్టెన్), సొనాల్ దినుష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), కేశారా నువాంత, ప్రబాత్ జయసూరియ, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.చదవండి: IND vs SL: ఫాలో ఆన్ ఆడి గెలిచిన జట్లు ఇవే! -
మాస్టర్ ప్లాన్ అదిరింది.. ధోనిని మించిపోయిన పంత్!
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో మాత్రమే ఉంది. సోనల్ దినూష (7), కెషారా నువంత (3) క్రీజులో ఉన్నారు. సోనల్ దినూష మాత్రమే బ్యాటర్ కావడం, మిగతావాళ్లంతా టెయిలెండర్లు కావడంతో చివరి రోజు టీమిండియా బౌలర్లకు మిగతా నాలుగు వికెట్లు తీయడం కష్టమేమీ కాదు. అయితే లంక రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు బ్యాటర్ పసిందు సూరియబండార ఆయువు పట్టుగా నిలిచాడు. 21 పరుగుల వద్ద లభించిన లైఫ్ను సద్వినియోగం చేసుకున్న పసిందు ఆ తర్వాత 90 పరుగులు చేసి ఔటయ్యాడు. లంక నాలుగో రోజు ఆటను పూర్తి చేయగలిగిందంటే అదంతా పసిందు చలవే. జిడ్డు బ్యాటింగ్తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన పసిందును ఔట్ చేసేందుకు టీమిండియా మాస్టర్ప్లాన్ వేసింది.ఆ మాస్టర్ప్లాన్లో పంత్, మానవ్ సుతార్లు కీలకపాత్ర పోషించారు. ఇన్నింగ్స్ 61వ ఓవర్ మానవ్ సుతార్ వేశాడు. ఆఫ్ స్టంప్ అవతల వేసిన స్లో బంతిని పసిందు ఆడే ప్రయత్నంలో క్రీజులైన్ దాటి బయటికి వచ్చాడు. ఇది గమనించిన పంత్ కేవలం 0.3 సెకన్ల వ్యవధిలో బెయిల్స్ను ఎగురగొట్టాడు. రిప్లేలో పంత్ చేసిన డిస్మిసల్ చూస్తే వారెవ్వా అనకుండా ఉండలేం. ఈ ఒక్క స్టంపౌట్ విషయంలో మాత్రం భారత మాజీ కీపర్ ఎంఎస్ ధోనిని కూడా మించిపోయాడనంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలా మానవ్ సుతార్ తెలివైన బంతితో పసిందును బోల్తా కొట్టించినప్పటికీ, ఇక్కడ పంత్ను కూడా మెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతకముందు బంతికే పసిందు ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్నాడు. ఈ సమయంలో పంత్.. ‘బ్యాటర్ అలసిపోయాడు.. రెడీగా ఉండండి’ అన్న మాటలు మైక్ స్టంప్లో రికార్డయ్యాయి.Rishabh Pant stumped Sri Lanka’s Sooriyabandara in just 0.3 seconds 🥶🔥What a quick stumping 🔥 pic.twitter.com/lztPjNcEMf— Harshit (@I_am_Harshit_17) August 26, 2026Read: దుమ్మెత్తిపోసుకున్న జడ్డూ, సిరాజ్.. ఏం జరిగిదంటే? -
IND vs SL: ఎట్టకేలకు ఆధిక్యంలోకి శ్రీలంక!
టీమిండియాతో రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక ఎట్టకేలకు ఆధిక్యంలోకి వచ్చింది. పసిందు సూరియబండారా అద్భుత ఆట తీరుతో లంక పరువును కాపాడాడు. కాగా కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య నిర్ణయాత్మక రెండో టెస్టు ఆదివారం మొదలైన సంగతి తెలిసిందే.సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగి.. 503-9 వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (117), ధ్రువ్ జురెల్ (115 నాటౌట్) శతకాల వల్ల భారత్ భారీ స్కోరు సాధించగలిగింది.290 రుగులకే ఆలౌట్అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక బుధవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా.. తొలి ఇన్నింగ్స్లో 290 రుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దాటికి లంక టాపార్డర్ కుదేలు కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన పసిందు సూరియబండారా (80) జట్టును ఆదుకున్నాడు. ఇక ఆల్రౌండర్ సొనాల్ దినుష శతకం (103)తో చెలరేగాడు. దీంతో లంక దాదాపు మూడు వందల పరుగులకు చేరువకాగలిగింది.ఫాలో ఆన్భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిద్ కృష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. అరంగేట్ర ఆటగాడు సారాంశ్ రెండు, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక లంకను 290 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో ఫాలో ఆన్లో భాగంగా వెంటనే శ్రీలంకను బ్యాటింగ్కు ఆహ్వానించింది.రాణించిన పసిందు, కమిందుఈ క్రమంలో బుధవారం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే శ్రీలంక తమ ఓపెనర్ లాహిరు ఉదార (3) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ కమిల్ మిశార (32)తో కలిసి వన్డౌన్ బ్యాటర్ పసిందు రెండో వికెట్కు 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆ తర్వాత కమిందు మెండిస్తో కలిసి మూడో వికెట్కు 115 పరుగులు జోడించాడు.ఈ క్రమంలో కమిందు అర్ధ శతకం (55) పూర్తి చేసుకున్న తర్వాత అవుట్ కాగా.. పసిందు సెంచరీ దిశగా పయనించాడు. అయితే, మానవ్ సుతార్ స్పిన్ మాయలో చిక్కుకుని.. 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టంపౌట్గా వెనుదిరిగాడు. మిగతా వారిలో కెప్టెన్ ధనంజయ డి సిల్వ 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా (6) విఫలమయ్యాడు.ఎట్టకేలకు ఆధిక్యంలోకి లంకఅయితే, వర్షం వల్ల ముందుగానే ఆటను నిలిపివేశారు. మొత్తానికి నాలుగో రోజు ఆట పూర్తయ్యే సమయానికి శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. తద్వారా 16 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. సెంచరీ వీరుడు సొనాల్ దినుష ఏడు, కేశారా నువాంత మూడు పరుగులతో అజేయంగా నిలిచారు.భారత బౌలర్లలో మానవ్ సుతార్ రెండు వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, సారాంశ్ జైన్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. ఆటకు గురువారమే చివరి రోజు. అయితే, బుధవారం వర్షం వల్ల ముందుగానే ఆటను నిలిపివేసిన క్రమంలో గురువారం ఉదయం 9.45 నిమిషాలకే మ్యాచ్ ఆరంభమవుతుంది. ఇదిలా ఉంటే.. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే గాలెలో టీమిండియా గెలుపొందింది. కొలంబోలోనూ భారత్ గెలుపు దాదాపు ఖాయమైంది. అయితే, వర్షం ముప్పు కారణంగా గురువారం వీలైనంత త్వరగా లంకను ఆలౌట్ చేసి.. విజయం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.చదవండి: IND vs SL: ఫాలో ఆన్ ఆడి గెలిచిన జట్లు ఇవే! -
గాయపడ్డ సిరాజ్!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డాడు. శ్రీలంకతో రెండో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా క్యాచ్ అందుకునే క్రమంలో ఈ హైదరాబాదీ అదుపుతప్పి కిందపడ్డాడు. కాగా కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య ఆదివారం రెండో టెస్టు మొదలైన సంగతి తెలిసిందే.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. 503-9 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బుధవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా శ్రీలంకను 290 పరుగులకు ఆలౌట్ చేసిన.. టీమిండియా ఫాలో ఆన్ ఆడిస్తోంది.పసిందు క్యాచ్ అందుకునేందుకు..ఈ క్రమంలో లంక రెండో ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ బంతితో రంగంలోకి దిగాడు. అతడి బౌలింగ్లో శ్రీలంక వన్డౌన్ బ్యాటర్ పసిందు సూరియబండారా షాట్ ఆడగా.. క్యాచ్ పట్టేందుకు సిరాజ్ డీప్ మిడ్ వికెట్ పొజిషన్ నుంచి పరిగెత్తుకు వచ్చి డైవ్ కొట్టాడు.మైదానం వీడి.. ఈ క్రమంలో బంతిని అందుకున్నప్పటికీ.. అది సిరాజ్ చేజారింది. అదుపు తప్పి కిందపడ్డ సిరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. పక్కటెముకల వద్ద చేయి పెట్టుకుని నొప్పితో విలవిల్లాడాడు. హుటాహుటిన ఫిజియో వచ్చి పరిశీలించాడు. అయితే, నొప్పి తగ్గకపోవడంతో సిరాజ్ను మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లాడు. తిరిగి వచ్చిన సిరాజ్భోజన విరామం తర్వాత కూడా సిరాజ్ ఫీల్డ్కు రాలేదు. దీంతో సిరాజ్ గాయంపై అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. అయితే, కాసేపటి తర్వాత అతడు మైదానానికి వచ్చి చురుకుగా ఫీల్డింగ్ చేయడంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది.చదవండి: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఆల్రౌండర్! -
మెరిసిన పసిందు, దినుష.. ఇంకా వెనుకబడే ఉన్న శ్రీలంక
టీమిండియాతో రెండో టెస్టు మూడో రోజు ఆటలో శ్రీలంక పోరాట పటిమ కనబరిచింది. కొలంబోలో 8/2 ఓవర్నైట్ స్కోరుతో మంగళవారం ఆట మొదలుపెట్టింది ఆతిథ్య జట్టు. కాసేటికే ఓపెనర్ కమిల్ మిశారా (19) వెనుదిరిగినప్పటికీ.. నాలుగో నంబర్ బ్యాటర్ పసిందు సూరియబండారా పట్టుదలగా నిలబడ్డాడు.మెరిసిన పసిందుభారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ.. కమిందు మెండిస్తో కలిసి ఐదో వికెట్కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తంగా 133 బంతులు ఎదుర్కొన్న పసిందు తొమ్మిది ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించాడు. అయితే, సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ రవీంద్ర జడేజా అద్భుత బంతితో పసిందును బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియాకు మంచి బ్రేక్ లభించింది.మిగిలిన వారిలో కమిందు మెండిస్ (32) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ (8) విఫలమయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా డకౌట్ అయి నిరాశపరచగా.. ఈసారి సొనాల్ దినుష బాధ్యత తీసుకున్నాడు. అతడికి తోడుగా కేశారా నువాంత (74 బంతుల్లో 18) నిలబడ్డాడు.దినుష పోరాటంమంగళవారం ఆట ముగిసే సమయానికి దినుష 137 బంతుల్లో 85 పరుగులతో అజేయంగా నిలవగా.. అతడికి తోడుగా లాహిరు కుమార (8*) నిలిచాడు. వర్షం వల్ల భోజన విరామం తర్వాత ఆటకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత చాలా సేపు ఆట కొనసాగగా.. మూడో సెషన్ను మధ్యాహ్నం 3.45 నుంచి సాయంత్రం 5.45 నిమిషాల వరకు నిర్వహించాలని భావించారు. అయితే, మరోసారి వర్షం వల్ల అంతరాయం కలగడంతో దాదాపు ఇరవై ఎనిమిది నిమిషాలకు ముందుగానే ఆటను నిలిపివేశారు. అప్పటికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా కంటే.. ఇంకా 238 పరుగులు వెనుబడి ఉంది. ఓవరాల్గా భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్ చెరో మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా రెండో రోజు ఆటలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.చదవండి: టెక్నిక్ లేకుండా ఆడతాడు.. పంత్కు అదొక్కటే ప్లస్! -
కష్టాల్లో పడిన లంక.. రెండోరోజు భారత్దే ఆధిపత్యం
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కమిల్ మిషారా 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం లంక 495 పరుగుల వెనుకబడి ఉంది. మొదటి రోజులాగే రెండో రోజు ఆటలో కూడా భారత్దే ఆధిపత్యం. పడిక్కల్, జురెల్ శతకాలతో చెలరేగితే, ఆ తర్వాత బౌలింగ్లో మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెలరేగడంతో లంకకు ఆదిలోనే షాకులు తగిలాయి.అంతకముందు తమ తొలి ఇన్నింగ్స్ను టీమిండియా 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది .బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై భారత బ్యాటర్లు చెలరేగడంతో తొలి టెస్టు తరహాలోనే రెండో టెస్టులోనూ భారత్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. దేవదత్ పడిక్కల్ (193 బంతుల్లో 117), ధ్రువ్ జురెల్ (115 నాటౌట్)సెంచరీలతో చెలరేగారు. మిగతా బ్యాటర్లలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ (63), కెప్టెన్ గిల్ (50) అర్ధసెంచరీలు సాధించగా, జైస్వాల్ (45), జడేజా (43) రాణించారు. లంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 4 వికెట్లు తీయగా, కెషారా నువంతా, ప్రబాత్ జయసూరియ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఓవర్నైట్ స్కోరు 300/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 307 పరుగుల వద్ద డెబ్యూ ఆటగాడు సారాంశ్ జైన్ (6) ఔట్ కావడంతో ఆరో వికెట్ కోల్పోయింది. మొదటి రోజు ఆటలో గాయంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన రిషబ్ పంత్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. ధ్రువ్ జురెల్తో కలిసి పంత్ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ ఇద్దరు కలిసి ఏడో వికెట్కు 152 బంతుల్లో 112 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే పంత్, జురెల్లు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వర్షం అంతరాయంతో టీ బ్రేక్ సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 475 పరుగుల వద్ద నిలిచింది. వర్షం తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఎక్కువ సేపు సాగకపోయినప్పటికీ, జురెల్ తన కెరీర్లో రెండో టెస్టు సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత సిరాజ్ (3) ఔటవ్వడంతో భారత్ 489 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జురెల్ ఒక సిక్సర్ సహా రెండు ఫోర్లు కొట్టడంతో టీమిండియా స్కోరు 500 పరుగుల మార్క్ దాటింది. వెంటనే కెప్టెన్ గిల్ 503 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు.Read: వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో వెనుక కారణమిదే? -
ఇప్పుడే అతడిని స్పెషల్ ప్లేయర్ అనొద్దు: శ్రీలంక క్రికెట్ దిగ్గజం
మానవ్ సుతార్ రూపంలో టీమిండియాకు అద్భుతమైన స్పిన్నర్ దొరికాడు. తన అరంగేట్ర టెస్టులో అఫ్గానిస్తాన్పై అదరగొట్టిన సుతార్.. తాజాగా గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో కూడా అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మానవ్ మొత్తంగా ఈ మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టి భారత్కు కీలక విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో సుతార్పై శ్రీలంక మాజీ ఆల్రౌండర్ రస్సెల్ ఆర్నాల్డ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నప్పటికీ అప్పుడే మానవ్ను 'స్పెషల్' బౌలర్గా ముద్ర వేయలేమని ఆర్నాల్డ్ అభిప్రాయపడ్డాడు. కాగా దేశవాళీ క్రికెట్లో గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తుండడంతో ఈ ఏడాది అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టుకు మానవ్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆ మ్యాచ్లో 6 వికెట్లు పడగొట్టి తన ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన మానవ్.. 17 వికెట్లు పడగొట్టాడు."మానవ్కు అద్భుతమైన టాలెంట్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అతడి ఇప్పటివరకు ఆడింది కేవలం రెండు టెస్టులే. అవి కూడా స్పిన్కు అనుకూలించే ఉపఖండ పరిస్థితులే. కాబట్టి ఇప్పుడే అతడిని స్పెషలిస్ట్ స్పిన్నర్ అనడం కాస్త తొందరపాటే అవుతోంది. అతడు విదేశీ కండీషన్స్ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. అతడు మంచి కంట్రోల్తో బౌలింగ్ చేస్తున్నాడు. బ్యాటర్ల మైండ్ సెట్ను ముందుగానే రీడ్ చేస్తున్నాడు. మంచి పిచ్లపై కూడా పరుగులను కట్టడి చేసే సత్తా అతడికి ఉంది. గతంలో విదేశీ పర్యటనల్లో అశ్విన్ కూడా తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లపై ఒత్తిడి పెంచే వాడు. మానవ్ సుతార్ కూడా విదేశీ కండీషన్స్లో మెరుగ్గా రాణిస్తాడని ఆశిస్తున్నా" అని సోనీ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుతార్ పేర్కొన్నాడు. -
'జడేజా పని అయిపోయింది.. దయచేసి అతడితో పోల్చొద్దు'
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 165 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు అదరగొట్టారు. ముఖ్యంగా టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. సుతార్ మొత్తంగా పది వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. మరో వెటరన్ స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా ఫర్వాలేదనిపించాడు. నాలుగు వికెట్లతో జడ్డూ రాణించినప్పటికి.. అతడి బౌలింగ్ శైలిపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జడేజా గతంలా ఇప్పుడు ఎటాకింగ్ స్పిన్నర్ కాదని, బ్యాటింగ్ ఆల్రౌండర్గా మారిపోయాడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.జడేజా, మానవ్ సుతార్కు బౌలింగ్లో ఎలాంటి పోలిక లేదు. ఇద్దరూ భిన్నమైన బౌలర్లు. చేతిలోనే బంతిని తిప్పడం సుతార్ బలం. స్టంప్స్ టార్గెట్గా బౌలింగ్ చేయడం జడ్డూ బలం. అతడు స్టాక్ బాల్స్తో బ్యాటర్లను కట్టడి చేస్తాడు. అయితే జడేజా ఇప్పుడు అంత అటాకింగ్ స్పిన్నర్ కాదు. అతడు బ్యాటర్గా ఉంటూ, బౌలింగ్లో సహాయపడే ప్లేయర్గా మారిపోయాడు. మరోవైపు మానవ్ తను ఆడిన రెండు మ్యాచ్లలోనూ సత్తా చాటాడు. బ్యాటర్ల మైండ్ సెట్ను ముందుగానే అంచానా వేసి అతడు బౌలింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం మానవ్ భారత స్పిన్ బౌలింగ్ విభాగంలో కీలకమైన ఆటగాడిగా మారిపోయాడని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.కాగా జడేజా గత కొంతకాలంగా టెస్టుల్లో బ్యాటర్గా రాణిస్తున్నప్పటికి బౌలింగ్లో మాత్రం అతడి గ్రాఫ్ పడిపోయింది. 2025 నుంచి జడేజా ఇప్పటివరకు 20 ఇన్నింగ్స్లలో కేవలం 29 వికెట్లు పడగొట్టాడు. అతడు గతేడాది నుంచి కనీసం ఒక్కసారి ఫైవ్ వికెట్ హాల్ సాధించలేకపోయాడు. ఓవరాల్గా జడ్డూ తన టెస్టు కెరీర్లో జడేజా 169 మ్యాచ్లు ఆడి 352 వికెట్లు పడగొట్టాడు.చదవండి: పాకిస్తాన్ డ్రెసింగ్రూమ్కి వెళ్లు: నాసిర్ హుసేన్కు డీకే కౌంటర్ -
1-600: టీమిండియా టెస్టు ప్రయాణంలో విజయాలు ఎన్ని?
భారత టెస్టు క్రికెట్లో చారిత్రక మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో ఏకంగా 165 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా తమ 600వ టెస్టును భారత్ భారీ గెలుపుతో చిరస్మరణీయం చేసుకుంది.బౌలర్ల విజృంభణకాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా శ్రీలంకకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం మొదలైన తొలి టెస్టు.. బుధవారం ఆఖరి రోజు ఆటతో ముగిసింది. ఈ మ్యాచ్లో భారత్ విధించిన 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక లంక చతికిలపడింది.భారత బౌలర్ల విజృంభణ కారణంగా లక్ష్య ఛేదనలో కేవలం 206 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ మొత్తంగా పది వికెట్లు కూల్చి లంక బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేయగా.. సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.సెంచరీ హీరో పడిక్కల్భారత తొలి ఇన్నింగ్స్లో వన్డౌన్ బ్యాటర్ పడిక్కల్ భారీ శతకం (167) బాదాడు. ఫలితంగా టీమిండియా 462 పరుగులు చేయగలిగింది. దీంతో రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకే చాపచుట్టేసినా.. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని లంకకు 372 పరుగుల మేర భారీ టార్గెట్ నిర్దేశించగలిగింది.ఇదిలా ఉంటే.. 1932లో టీమిండియా తన టెస్టు ప్రయాణం మొదలుపెట్టింది. మొట్టమొదట ఇంగ్లండ్తో ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మ్యాచ్ ఆడింది. ప్రస్తుతం 600 మైలురాయికి చేరుకుంది. మరి ఈ టీమిండియా ప్రయాణంలో వర్షం లేదా ఇతర కారణాల వల్ల రద్దైన మ్యాచ్లు పోనూ మొత్తం గెలుపులు, ఓటములు ఎన్నో తెలుసా?.. ప్రతి వంద మ్యాచ్ల మధ్య భారత జట్టు జర్నీ ఎలా సాగిందంటే..1-600 జర్నీ సాగిందిలా..1-100: 10 విజయాలు, 40 ఓటములు, 50 డ్రా101-200: 25 విజయాలు, 32 ఓటములు, 43 డ్రా201-300: 21 విజయాలు, 26 ఓటములు, ఒకటి టై, 52 డ్రా301-400: 32 విజయాలు, 31 ఓటములు, 37 డ్రా401-500: 42 విజయాలు, 28 ఓటములు. 30 డ్రా501-600: 57 విజయాలు, 31 ఓటములు, 2 డ్రా.మొత్తం: 187 విజయాలు, 188 ఓటములు, 1 టై, 214 డ్రా.చదవండి: నిన్ను ఐపీఎల్కు తీసుకెళ్తా: జైస్వాల్ -
రికార్డుల మోత మోగించిన సుతార్
శ్రీలంకపై తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్లో (6/55) ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడంతో పాటు మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు (10/131) పడగొట్టిన అతడు, పలు రికార్డులు బద్దలు కొట్టాడు.సుతార్ బద్దలు కొట్టిన రికార్డులు* 6/55: శ్రీలంక గడ్డపై శ్రీలంకపై భారత బౌలర్ సాధించిన అత్యుత్తమ టెస్టు ఇన్నింగ్స్ గణాంకాల్లో రెండో స్థానం. రవిచంద్రన్ అశ్విన్ 6/46తో ముందున్నాడు.* 10/131: శ్రీలంకలో ఒక టెస్టు మ్యాచ్లో భారత బౌలర్ సాధించిన అత్యుత్తమ మ్యాచ్ గణాంకాలు.* శ్రీలంకపై టెస్టుల్లో భారత బౌలర్ సాధించిన అత్యుత్తమ మ్యాచ్ గణాంకాల్లో నాలుగో స్థానం.* సుతార్ తన కెరీర్లో 2 టెస్ట్లు పూర్తయ్యేసరికి 17 వికెట్లు తీసుకున్నాడు. ఈ జాబితాలో నరేంద్ర హిర్వాణి 24 వికెట్లతో, అక్షర్ పటేల్ 18 వికెట్లతో మాత్రమే సుతార్ కంటే ముందున్నారు.* శ్రీలంకపై టెస్టుల్లో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలిచాడు.రెండు టెస్టుల్లోనే 17 వికెట్లు24 ఏళ్ల సుతార్ టెస్టు కెరీర్కు ఇది అద్భుతమైన ఆరంభం. ఈ ఏడాది ఆఫ్ఘనిస్తాన్పై అరంగేట్రం చేసిన అతను తొలి టెస్టులోనే ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు.ఇప్పుడు శ్రీలంకపై 10 వికెట్లతో తన సత్తా చాటాడు. దీంతో కేవలం రెండు టెస్టుల్లో 17 వికెట్లు సాధించాడు. అతని బౌలింగ్ సగటు 11.35గా ఉంది. ఇప్పటివరకు రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు, ఒక 10 వికెట్ల మ్యాచ్ ప్రదర్శన నమోదు చేశాడు.ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం పడిక్కల్కుసుతార్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దేవదత్ పడిక్కల్కు దక్కింది. తొలి ఇన్నింగ్స్లో పడిక్కల్ 167 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో కీలకమైన 44 పరుగులు సాధించాడు. సాయి సుదర్శన్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన పడిక్కల్ తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.తాజా విజయంతో భారత్ రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు ఆగస్టు 23న కొలంబోలో ప్రారంభం కానుంది. -
అతడొక అద్భుతం.. భారత క్రికెట్ను ఏలుతాడు: గిల్
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో టీమిండియా వెళ్లింది. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో భారత్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్లో 462 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్(167 పరుగులు) అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం బౌలింగ్లో భారత స్పిన్నర్లు మ్యాజిక్ చేశారు. ముఖ్యంగా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. 4 వికెట్ల తీసి లంక జట్టును దెబ్బ తీశాడు. ఫలితంగా ఆతిథ్య జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటైనప్పటికి.. తొలి ఇన్నింగ్స్ లభించిన ఆధిక్యాన్ని జోడించి శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్ను ఉంచింది. ఈ లక్ష్యాన్ని చేధించలేక శ్రీలంక 206 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో మానవ్ సుతార్ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. ఈ రాజస్తాన్ స్పిన్నర్ 6 వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో మానవ్ సుతార్పై భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు."మానవ్ ఒక అద్భుతమైన స్పిన్నర్. భారత్ తరపున తొలి మ్యాచ్(అఫ్గానిస్తాన్)లోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ మ్యాచ్లో కూడా అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. అతడు కచ్చితంగా భారత జట్టుకు సుదీర్ఘకాలం ప్రాతినిథ్యం వహిస్తాడు. పడిక్కల్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాలి. అతడు రెండు ఇన్నింగ్స్లలోనూ అత్యుత్తమంగా రాణించాడు. అతడి బ్యాటింగ్ చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. తొలి ఇన్నింగ్స్లో కేవలం సెంచరీ చేయడమే కాకుండా, ఆ తర్వాత కూడా బాధ్యతాయుతంగా ఆడి జట్టును మంచి పొజిషేన్లో నిలిపాడు. రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లను అతడు ఎదుర్కొన్న తీరు, ఆధిపత్యం చెలాయించిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలైట్ అని గిల్ పేర్కొన్నాడు.అదేవిధంగా రెండో ఇన్నింగ్స్లో వరుసగా వికెట్లు కోల్పోవడంపై గిల్ స్పందించాడు. "వాతావరణ పరిస్థితుల వల్ల 4వ, 5వ రోజుల్లో ఎన్ని ఓవర్ల ఆట సాధ్యమవుతుందో తెలియదు. అందుకు దూకుడుగా ఆడి ప్రత్యర్ది ముందు 400కు పైగా లక్ష్యాన్ని ఉంచాలని భావించాం. ఈ క్రమంలోనే వరుసగా వికెట్లు కోల్పోయాం. దీని గురుంచి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము అప్పటికే మ్యాచ్పై పట్టు సాధించాం. ఇక . 600వ చారిత్రక టెస్టులో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. డబ్ల్యూటీసీ రేసులో ప్రతీ గెలుపు మాకు కీలకమని" శుబ్మన్ వ్యాఖ్యనించాడు. -
శ్రీలంకను మట్టికరిపించిన టీమిండియా.. ఘన విజయం
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 165 పరుగుల తేడాతో మట్టికరిపించింది. గాలెలో 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. 206 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు భారీ విజయం సాధ్యమైంది. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ఆరు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో టీమిండియా రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 ఫైనల్ రేసులో కీలక ముందడుగు వేసింది. కాగా రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గాలె స్టేడియంలో శనివారం తొలి టెస్టు మొదలైంది.పడిక్కల్ సెంచరీతో..టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ భారీ శతకం (167)తో చెలరేగగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంకను 284 పరుగులకే కట్టడి చేసింది.అయితే, రెండో ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ (66)తో రాణించగా.. భారత్ 193 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో... తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం లభించిన కారణంగా శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.ధనంజయ, దినుష పోరాటంఈ నేపథ్యంలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. టాపార్డర్లో ఓపెనర్లు నిశాన్ మధుష్క (6), లాహిరు ఉదార (16)తో పాటు.. అనూహ్య రీతిలో అరంగేట్రం చేసిన వన్డౌన్ బ్యాటర్ పసిందు సూరియబండారా (0) పూర్తిగా విఫలమయ్యాడు.సీనియర్ బ్యాటర్ కమిందు మెండిస్ (2) కూడా చేతులెత్తేశాడు. ఇలాంటి తరుణంలో కెప్టెన్ ధనంజయ డి సిల్వ, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో సొనాల్ దినుష పట్టుదలగా నిలబడ్డారు. బుధవారం నాటి ఐదో రోజు ఆటలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని భారత బౌలర్ల సహనాన్ని వీరిద్దరు పరీక్షించారు.జడ్డూ మ్యాజిక్ఈ క్రమంలో రవీంద్ర జడేజా ధనంజయ డి సిల్వ (59)ను అవుట్ చేసి బ్రేక్ ఇవ్వగా.. ప్రసిద్ కృష్ణ నిరోషన్ డిక్వెల్లా (10)ను అవుట్ చేశాడు. దీంతో భోజన విరామ సమయానికి శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.India needed a way through, and Ravindra Jadeja found it. 🤩 Watch #SLvIND, 1st Test | Day 5, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/tCm8qzqmBb— Sony Sports Network (@SonySportsNetwk) August 19, 2026ఆరేసిన మానవ్ సుతార్అయితే, లంచ్ తర్వాత కూడా సొనాల్ దినుష పట్టువీడకుండా క్రీజులో పాతుకుపోయాడు. సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ మానవ్ సుతార్ అతడికి ఊహించని షాకిచ్చాడు. 76వ ఓవర్లో తొలి బంతిని లెగ్ స్టంప్ అవుట్సైడ్ దిశగా సంధించగా.. షాట్ ఆడే క్రమంలో దినుష (84) విఫలమయ్యాడు. ఈ క్రమంలో ధ్రువ్ జురెల్ క్యాచ్ అందుకోగా.. టీమిండియా సంబరాలు అంబరాన్నంటాయి.Manav Suthar cleaned up the tail in a flash! ⚡Three wickets in one over to put the finishing touches on a sensational bowling effort. Watch #SLvIND, 1st Test | Day 5, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/LwSc4NGRW2— Sony Sports Network (@SonySportsNetwk) August 19, 2026ఇక ఆ తర్వాత మరుసటి బంతికే మానవ్ సుతార్ ప్రభాత్ జయసూర్య (0)ను బౌల్డ్ చేశాడు. తర్వాతి ఓవర్లో లాహిరు కుమార (0)ను కూడా పెవిలియన్కు పంపాడు. ఇక 78వ ఓవర్లో నాలుగో బంతికి కేశారా నువాంత (20)ను కూడా బౌల్డ్ చేసిన మానవ్ సుతార్ తన ఆరో వికెట్తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.ఇక తొలి ఇన్నింగ్స్లో మానవ్ సుతార్ నాలుగు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ మ్యాచ్లో మొత్తంగా పది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్. ఇదిలా ఉంటే.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. కాగా టెస్టుక్రికెట్లో భారత్కు ఇది 600వ మ్యాచ్ కావడం విశేషం.శ్రీలంక వర్సెస్ భారత్ తొలి టెస్టు👉వేదిక: గాలె ఇంటర్నేషనల్ స్టేడియం, గాలె.👉టాస్: టీమిండియా.. బ్యాటింగ్సంక్షిప్త స్కోర్లు👉భారత్: 462 &193👉శ్రీలంక: 284 &206👉ఫలితం: శ్రీలంకపై 165 పరుగుల తేడాతో భారత్ జయభేరి👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: దేవదత్ పడిక్కల్ (167 & 44).చదవండి: వివాదంలో రింకూ సింగ్! -
IND vs SL: చివరి రోజు.. ఆరు వికెట్లు తీయాలి!
శ్రీలంకతో గాలె టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. భారత బౌలర్ల విజృంభణతో లంక బ్యాటర్లు ఆరంభంలోనే పెవిలియన్కు వరుస కట్టారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక కేవలం 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడం బ్యాటర్ల వైఫల్యానికి నిదర్శనం.తొలి ఇన్నింగ్స్ ఇలాప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా రెండు మ్యాచ్లు ఆడేందుకు శ్రీలంకకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలె స్టేడియంలో శనివారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగి.. తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌట్ అయింది.టాపార్డర్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం (82) సాధించగా.. వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. మొత్తంగా 230 బంతులు ఎదుర్కొని 167 పరుగులు సాధించాడు. వీరితో పాటు ఆరో నంబర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీ (51)తో రాణించాడు.లంకను కట్టడి చేసిన భారత బౌలర్లులంక బౌలర్లలో స్పిన్నర్లలో ప్రభాత్ జయసూర్య నాలుగు వికెట్లతో విజృంభించగా.. కేశారా నువాంత మూడు వికెట్లు పడగొట్టాడు. పేసర్ అసిత ఫెర్నాండో రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం శ్రీలంక బ్యాటింగ్కు దిగి 284 పరుగులకు ఆలౌట్ అయింది.భారత స్పిన్నర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా మూడు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ చెరో వికెట్ కూల్చారు. దీనిని బట్టి ఓవరాల్గా ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్లో స్పిన్నర్ల హవా కొనసాగిందని చెప్పవచ్చు.అయితే, రెండో ఇన్నింగ్స్కు వచ్చే సరికి కథ మారిపోయింది. ఈసారి పిచ్ కాస్త పేస్ బౌలర్లకు అనుకూలించగా.. లంక పేసర్లు అసిత ఫెర్నాండో, లాహిరు కుమార టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశారు. అసిత నాలుగు వికెట్లు తీయగా.. కుమార రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ప్రభాత్ జయసూర్యకు మూడు వికెట్లు దక్కగా.. కేశారా ఒక వికెట్ తీశాడు.ఈసారి 193 పరుగులకే ఆలౌట్లంక బౌలర్ల విజృంభణ కారణంగా రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకే కుప్పకూలింది. అయితే, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 178 పరుగులు కలుపుకొని.. శ్రీలంకకు 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.పేసర్ సిరాజ్ నిశాన్ మధుష్క (6)ను అవుట్ చేయగా భారత్ వికెట్ల ఖాతా తెరిచింది. స్పిన్నర్ మానవ్ సుతార్ పసిందు సూరియబండారా (0), లాహిరు ఉదార (16)లను పెవిలియన్కు పంపగా.. మరో పేసర్ ప్రసిద్ కృష్ణ కమిందు మెండిస్ (2)ను అవుట్ చేశాడు.పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఇలా లంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ కెప్టెన్ ధనంజయ డి సిల్వతో కలిసి సొనాల్ దినుష ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. మంగళవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ధనంజయ 31, దినుష 25 పరుగులతో క్రీజులో నిలిచారు. ఫలితంగా లంక ఆట పూర్తయ్యేసరికి 34 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేయగలిగింది. ఇక బుధవారం ఆటకు చివరి రోజు కాగా.. లంక విజయానికి 288 పరుగుల దూరంలో ఉండగా.. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. కాగా బుధవారం వీలైనంత త్వరగా భారత బౌలర్లు ధనంజయ, దినుష జోడీని విడదీయాల్సి ఉంటుంది. దినుష తొలి ఇన్నింగ్స్లో సెంచరీ (100) చేసిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియాకు చేదువార్త! -
టీమిండియాకు బ్యాడ్న్యూస్!
శ్రీలంకతో తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో స్టార్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్కు వచ్చాడు.ఆరంభంలోనే చెలరేగిన బౌలర్లుకాగా గాలె వేదికగా మొదటి టెస్టులో టీమిండియా శ్రీలంకకు 372 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు.. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ నిశాన్ మధుష్క (6)ను అవుట్ చేసి సిరాజ్ వికెట్ల వేటను ఆరంభించాడు.అనంతరం స్పిన్నర్ మానవ్ సుతార్ వన్డౌన్లో వచ్చిన పసిందు సూరియబండారాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో అతడు గోల్డెన్ డకౌట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ప్రసిద్ కృష్ణ కమిందు మెండిస్ (2)ను అవుట్ చేయగా.. సుతార్ బౌలింగ్లో లాహిరు ఉదార (16) నాలుగో వికెట్గా వెనుదిరిగాడు.నిలకడగా ధనంజయ, దినుషఈ క్రమంలో కెప్టెన్ ధనంజయ డి సిల్వకు తోడైన సొనాల్ దినుష నిలకడగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు. అయితే, లంక రెండో ఇన్నింగ్స్లో 28వ ఓవర్లో మానవ్ సుతార్ బంతితో రంగంలోకి దిగి.. ఫ్లైటెడ్ డెలివరీని సంధించాడు. బంతి బలంగా తాకడంతోదీంతో స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో దినుష బంతిని బలంగా బాదగా.. ఫీల్డర్ జురెల్ కాళ్లకు తాకింది. అతడు నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి పరిశీలించాడు. నొప్పి తగ్గకపోవడంతో ఫిజియో సాయంతో జురెల్ మైదానాన్ని వీడగా.. సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా సర్ఫరాజ్ ఖాన్ మైదానంలోకి వచ్చాడు. కాగా గాలె వేదికగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో జురెల్ హాఫ్ సెంచరీ (51) చేశాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఏడు పరుగులే చేసి అవుటయ్యాడు.ఇదిలా ఉంటే.. మంగళవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ధనంజయ 31, దినుష 25 పరుగులతో క్రీజులో నిలిచారు. లంక గెలవాలంటే ఆటకు చివరి రోజైన బుధవారం లంకకు 288 పరుగులు అవసరం. ఇక టీమిండియా గెలవాలంటే వీలైనంత త్వరగా ఆఖరి రోజు ఆరు వికెట్లు తీయాలి.చదవండి: IND vs SL: గాలెలో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? -
284 పరుగులకు శ్రీలంక ఆలౌట్.. భారత్కు భారీ ఆధిక్యం
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్లో సత్తాచాటిన టీమిండియా.. అనంతరం బౌలింగ్లోనూ అదరగొట్టింది. భారత బౌలర్లు రాణించడంతో శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో గిల్ సేనకు తొలి జట్టులో 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మూడో రోజు ఆటలో తమ తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన శ్రీలంకకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ నిషాన్ ఫెర్నాండోను మొదటి ఓవర్లోనే పేసర్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత భారత స్నిన్నర్లు రంగంలోకి దిగారు. మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, జడేజాలతో కూడిన స్పిన్ త్రయం శ్రీలంక బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. దీంతో ఆతిథ్య జట్టు కేవలం 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.సోనల్ అద్భుత సెంచరీఈ సమయంలో జట్టును యువ బ్యాటర్ సోనల్ దినూష, నిరోషన్ డిక్వెల్లా అద్భుతమైన ఇన్నింగ్స్లతో ఆదుకున్నారు. దినుష 167 బంతుల్లో తన తొలి టెస్టు సెంచరీని పూర్తి చేసుకోగా.. డిక్వెల్లా 80 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ ఆరో వికెట్కు 146 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే డిక్వెల్లా ఔటయ్యాక లంక వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. లోయార్డర్ బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. దినుష(100) కూడా సరిగ్గా సెంచరీ చేసి ఔటయ్యాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా మూడు, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు. కాగా ప్రతికూల వాతవారణం కారణంగా మూడో రోజు ఆట 13 ఓవర్ల ముందే ముగిసిపోయింది. మంగళవారం నాలుగో రోజు ఆట పదిహేను నిమిషాల ముందు ఆరంభం కానుంది. -
'నమ్మినందుకు ఇరగదీస్తున్నాడు.. గిల్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే'
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్పిన్నర్ మానవ్ సుతార్ తనకు అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టాడు. మ్యాచ్లో ఇప్పటికే మానవ్ సుతార్ రెండు కీలక వికెట్లు తీశాడు. 27 పరుగులతో నిలకడగా ఆడుతున్న లాహిరు ఉడారాను బోల్తా కొట్టించిన మానవ్ సుతార్ ఆ వెంటనే ఇన్ఫామ్ బ్యాటర్ దినేశ్ చందిమల్ను తెలివిగా బుట్టలో వేసుకున్నాడు. ‘బిగ్ స్పిన్నర్ అవుతాడు’ఈ నేపథ్యంలో మానవ్ సుతార్పై టీమిండియా మాజీ క్రికెటర్లు అజయ్ జడేజా, అజింక్య రహానేలు ప్రశంసల జల్లు కురిపించారు. తొలి టెస్టుకు ఈ ఇద్దరు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్నారు. చందిమల్ను ఔట్ చేసిన తర్వాత అజయ్ జడేజా మాట్లాడుతూ.. "టీమిండియా బిగ్ స్పిన్నర్ అయ్యేందుకు మానవ్ సుతార్కు అన్ని అర్హతలు ఉన్నాయి. బంతిని టర్న్ చేయడంలో అతడి సామర్థ్యం అసాధారణమైనది. దీంతో లంక బ్యాటర్లు అతడిని ఎదుర్కోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. మానవ్ సుతార్పై నమ్మకముంచి అతడికి అవకాశం కల్పించిన కెప్టెన్ శుబ్మన్ గిల్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే" అని చెప్పుకొచ్చాడు. అజయ్ జడేజా వ్యాఖ్యలను రహానే సమర్ధించాడు. ఆ ఇద్దరిని కలగలిపి.."జడేజా భాయ్, నేను మీ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. టెస్టు క్రికెట్లో టీమిండియాకు మ్యాచ్ విన్నర్గా మారే సత్తా మానవ్ సుతార్కు ఉంది. లంక పిచ్లపై అతడు అద్భుతమైన టర్న్ను రాబడుతున్నాడు. అతడి బౌలింగ్లో జడేజాలో ఉండే కచ్చితత్వం, అశ్విన్ లాగా బంతిని టర్న్ చేయడం లాంటి రెండు సామర్థ్యాలు ఒకేసారి ఉండడం సానుకూలాంశం. భవిష్యత్తులో భారత క్రికెట్లో మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించనున్నాడు" అని రహానే పేర్కొన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైంది. 460 పరుగుల ఓవర్నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించిన అనంతరం చివరి వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (167) సెంచరీతో రాణించగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధశతకాలతో మెరిశారు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు తీయగా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు.ఇక మూడో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. సోనాల్ దినుష (14), నిరోషన్ డిక్వెల్లా (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. మానవ్ సుతార్ రెండు, కుల్దీప్, జడేజా, సిరాజ్ తలా ఒక వికెట్ తీశారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. 🚨 Ajay Jadeja & Ajinkya Rahane Praise Manav Suthar During IND vs SL Live Match 🚨Ajay Jadeja 🗣️: Manav Suthar has the potential to become India’s next big Test spinner. His ability to turn the ball is exceptional, and the Sri Lankan batters are struggling against him. Credit… pic.twitter.com/BcZjpmepqy— Central Cricket (@arshdeep3444) August 17, 2026 Manav Suthar gets his second of the innings as Sri Lanka slip to three down on Day 3! 💥 Watch #SLvIND, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/FANRuZ6FDO— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026Manav Suthar lures Chandimal into the edge, and Rishabh Pant makes no mistake behind the stumps! 🧤 Watch #SLvIND, 1st Test | Day 3, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #SLvIND #BeautifulGameOfTestCricket pic.twitter.com/Dsy7xz9Ciw— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026Read: తప్పించాలని డిమాండ్లు; బ్యాట్తోనే జవాబు.. ఆ ఇద్దరి వల్లే! -
చెలరేగిన భారత బౌలర్లు.. శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. ఫలితంగా భోజన విరామ సమయానికి శ్రీలంక సగం వికెట్లు కోల్పోయి కేవలం 99 పరుగులే చేయగలిగింది.కాగా గాలె వేదికగా 460/9 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. మరో రెండు పరుగులు జోడించి (462) ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక బ్యాటింగ్కు దిగగా ఆది నుంచే భారత బౌలర్లు చుక్కలు చూపించారు. Early breakthrough for Team India! 💥Mohammed Siraj strikes with just the second ball.Watch #SLvIND, 1st Test | Day 3, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #SLvIND #MohammedSiraj #BeautifulGameOfTestCricket pic.twitter.com/zHSQOGD0jj— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026సిరాజ్ మొదలు పెట్టగా..ఓపెనర్లలో నిశాన్ ఫెర్నాండోను పేసర్ మహ్మద్ సిరాజ్ డకౌట్ చేయగా.. లాహిరు ఉదార 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్పిన్నర్ మానవ్ సుతార్ బౌలింగ్లో అవుటయ్యాడు.మానవ్ సుతార్కు రెండుఇక వన్డౌన్లో వచ్చిన దినేశ్ చండిమాల్ (4)ను స్వల్ప స్కోరుకే మానవ్ పెవిలియన్కు పంపాడు. కమిందు మెండిస్ (14) కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఇచ్చిన క్యాచ్ను కెప్టెన్ శుబ్మన్ గిల్ అద్భుత రీతిలో ఒడిసిపట్టగా.. లంక నాలుగో వికెట్ కోల్పోయింది.Manav Suthar lures Chandimal into the edge, and Rishabh Pant makes no mistake behind the stumps! 🧤 Watch #SLvIND, 1st Test | Day 3, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #SLvIND #BeautifulGameOfTestCricket pic.twitter.com/Dsy7xz9Ciw— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026ఇక కెప్టెన్ ధనంజయ డి సిల్వ (21) రవీంద్ర జడేజా బౌలింగ్లో కేఎల్ రాహుల్కు ఊహించని రీతిలో క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్గా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో సోమవారం లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక 28 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులే చేసింది. సొనాల్ దినుష 14, నిరోషన్ డెక్విల్లా 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే లంక ఇంకా 363 పరుగులు వెనుకబడి ఉంది. ఇదిలా ఉంటే.. తొలి సెషన్లో భారత స్పిన్నర్లు మానవ్, కుల్దీప్, జడేజా కలిసి నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం.చదవండి: పంత్ చేయలేనిది.. బట్లర్ చేశాడు.. సంతోషం -
తొలి టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లతో.. సర్ఫరాజ్కు చాన్స్!
శ్రీలంకతో గాలే వేదికగా జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాలే పిచ్ తొలి రెండు రోజులు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని, ఆ తర్వాతి మూడు రోజులు స్పిన్నర్లకు ఉపయుక్తంగా ఉంటుందని పిచ్ రిపోర్ట్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. మ్యాచ్కు ఒక్కరోజు మాత్రమే మిగిలిఉన్నప్పటికీ, తుదిజట్టు ఇంకా ఖరారు కాలేదు. గాలే పిచ్ పరిస్థితులను బట్టి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోంది. ఈ లెక్కన కుల్దీప్ యాదవ్తో పాటు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ లేదా సారాంశ్ జైన్లో ఒకరు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా చోటు దక్కించుకోనున్నారు. ఇక సిరాజ్, గుర్నూర్ బ్రార్ లేదా ప్రసిధ్ క్రిష్ణలు పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో తొలి ఐదు స్థానాల్లో (జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, గిల్, పంత్) ఎలాంటి మార్పు లేనప్పటికీ, ఆరో స్థానంపై తెగ చర్చ నడుస్తోంది. ఆరో స్థానంలో జురెల్ లేదా సర్ఫరాజ్ల్లో ఒకరికే చాన్స్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే సీనియార్టీ ప్రకారం జురెల్ కంటే సర్ఫరాజ్ వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. దీంతో సర్ఫరాజ్ లంకతో తొలి టెస్టులో ఆడడం దాదాపు ఖాయమైనట్లే.టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్: జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవద్ పడిక్కల్, గిల్ (కెప్టెన్), పంత్ ( వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్/సారాంశ్, సిరాజ్, గుర్నూర్/ప్రసిధ్ క్రిష్ణ.🚨 NOT A TURNER ❌ - Galle pitch is likely to be batting friendly in first 2 days. [Sahil Malhotra from TOI]India likely to field 2 quicks & 3 spinners for depth and balance. pic.twitter.com/vx6k5h5aLy— Johns. (@CricCrazyJohns) August 14, 2026Read: వీవీఎస్ లక్ష్మణ్కు బీసీసీఐ అత్యున్నత పదవి? -
స్పిన్నర్లతో తలనొప్పి.. కుల్దీప్ యాదవ్కు నో ఛాన్స్?!
శ్రీలంకతో టెస్టు సిరీస్కు టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమైంది. శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ను భారత జట్టు సద్వినియోగం చేసుకుంది. సమిష్టిగా రాణించి విజయం సాధించింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరికింది.ఈ నేపథ్యంలో గాలె వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో పాల్గొనే భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో ఎవరికి చోటు దక్కుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా శ్రీలంకలోనూ టర్నింగ్ పిచ్లు ఉంటాయి.అదరగొట్టిన జడ్డూ, మానవ్ఇక వార్మప్ మ్యాచ్లో స్పిన్ విభాగంలో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ అద్భుతంగా రాణించారు. లంక తొలి ఇన్నింగ్స్లో చెరో రెండు వికెట్లు తీసిన వీరిద్దరు.. ఆ తర్వాత బ్యాటింగ్లోనూ రాణించారు. తొలి ఇన్నింగ్స్లో జడ్డూ 63 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగగా.. మానవ్ 41 పరుగులు సాధించాడు.తేలిపోయిన సారాంశ్ఇక లంక రెండో ఇన్నింగ్స్లో జడ్డూ రెండు వికెట్లు తీయగా.. మానవ్ పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీయలేకపోయాడు. అనంతరం లక్ష్య ఛేదనలో జడ్డూ 22 పరుగులు, మానవ్ 4 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగారు. అయితే, ఈ మ్యాచ్లో మరో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్ వికెట్లు తీయలేకపోయాడు. పెద్దగా పరుగులు కూడా రాబట్టలేకపోయాడు.మరోవైపు.. లంక తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు తీసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం బౌలింగ్కు రాలేదు. ఈ నేపథ్యంలో తొలి టెస్టు తుదిజట్టులో ఈ నలుగురిలో ఎవరికి అవకాశం వస్తుందన్న అంశంపై టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులె స్పందించాడు.కుల్దీప్నకు నో ఛాన్స్?!‘‘గాలెకు చేరుకుని పిచ్ను పరిశీలించిన తర్వాతే తుదిజట్టుపై నిర్ణయం జరుగుతుంది. అయితే, మా జట్టులోని నలుగురు స్పిన్నర్లు ఎవరికి వారే ప్రత్యేకం. జడ్డూ అనుభవజ్ఞుడు. మానవ్ సుతార్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు.ఇక సారాంశ్ జైన్ దేశీ క్రికెట్లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. కుల్దీప్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టుకు ఎల్లప్పుడూ మణికట్టు స్పిన్నర్ అవసరం ఉంటుంది. మా నలుగురు స్పిన్నర్లు వైవిధ్యమైన బౌలర్లు. అయితే, పరిస్థితులకు తగ్గట్లే గాలెలో నిర్ణయం తీసుకుంటాం’’ అని సాయిరాజ్ బహుతులె తెలిపాడు.అందుకే బౌలింగ్ చేయలేదుఅదే విధంగా.. వార్మప్ మ్యాచ్లో లంక రెండో ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయకపోవడంపై సాయిరాజ్ వివరణ ఇచ్చాడు. ‘‘అతడు మెరుగ్గా ఆడాడు. వికెట్లు తీశాడు. అయితే, తనే విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. మిగిలిన వారికి కూడా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాలని భావించాడు. కుల్దీప్ దాదాపు 20 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు. కాబట్టి రెస్ట్ తీసుకున్నాడు’’ అని సాయిరాజ్ తెలిపాడు. కాగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు మొదలుకానుండగా.. ఇందుకు గాలె వేదిక.శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ.చదవండి: గిల్, అభిషేక్ కాదు.. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ ఇతడే! -
పడిక్కల్ భారీ శతకం.. జడ్డూ ఫిఫ్టీ.. బ్రార్ మెరుపులు
శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టుకు టీమిండియా ధీటుగా బదులిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్లో శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. దేవదత్ పడిక్కల్ భారీ శతకం, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ, గుర్నూర్ బ్రార్ మెరుపుల కారణంగా మంచి స్కోరు సాధించింది.శ్రీలంక 363 డిక్లేర్డ్శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా.. శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది. కొలంబోలో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.ఫలితంగా శ్రీలంక క్రికెట్ ఎలెవన్.. తొలిరోజు ఆటలో ఎనిమిది వికెట్ల నష్టానికి 363 పరుగులు సాధించింది. ఇక శనివారం నాటి రెండో రోజు ఆటలో ఓవర్నైట్ స్కోరు వద్దనే తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది.జైసూ, పంత్, జురెల్ విఫలం ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ 40 పరుగులతో రాణించాడు. వన్డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ 121 బంతుల్లో శతకం పూర్తి చేసుకుని రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్లు రిషభ్ పంత్ (2), ధ్రువ్ జురెల్ (1) పూర్తిగా విఫలమయ్యారు.ఇలాంటి తరుణంలో నాలుగో స్థానంలో వచ్చిన స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు.. మరో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ మానవ్ సుతార్ తోడయ్యాడు. జడ్డూ 117 బంతుల్లో 63 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్ చేరగా.. మానవ్ 90 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అయితే, అసంక మనోజ్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా మానవ్ వెనుదిరిగాడు.గుర్నూర్ బ్రార్ మెరుపులు ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వచ్చి 15 బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. మహ్మద్ సిరాజ్ 8 బంతుల్లో ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ఆల్రౌండర్ సారాంశ్ జైన్ 22 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగగా.. గుర్నూర్ బ్రార్ మెరుపులు మెరిపించాడు.వరుస విరామాల్లో ఆటగాళ్లు పెవిలియన్ చేరిన తర్వాత పడిక్కల్ మళ్లీ బ్యాటింగ్కు దిగాడు. 103 పరుగులతో తిరిగి బ్యాటింగ్ మొదలుపెట్టిన పడిక్కల్.. ఆట ముగిసేసరికి మొత్తంగా 164 బంతులు ఎదుర్కొని 142 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 18 ఫోర్లు ఉన్నాయి.ఆరు పరుగుల తేడాఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 90 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. పడిక్కల్ 142 పరుగులతో ఉండగా.. బ్రార్ 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక క్రికెట్ ఎలెవన్ కంటే కేవలం ఆరు పరుగులు వెనుకబడి ఉంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్కు ఆదివారం చివరి రోజు. చదవండి: ద్రవిడ్ వద్దన్నాడు.. యువీ ఉంటే కథ వేరుగా ఉండేది -
టీమిండియా యువ క్రికెటర్ సంచలన నిర్ణయం!
టీమిండియా యువ ఆల్రౌండర్ మానవ్ సుతార్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 23 ఏళ్ల సుతార్ తిరిగి ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో వార్విక్షైర్ తరపున ఆడేందుకు సిద్దమయ్యాడు. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ముగిసిన వెంటనే అతడి ఇంగ్లండ్కు పయనం కానున్నాడు. ఈ విషయాన్ని వార్విక్షైర్ క్రికెట్ క్లబ్ ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది. ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్ టోర్నీలో వార్విక్షైర్ ఆడే చివరి 4 మ్యాచ్లకు మానవ్ అందుబాటులో ఉండనున్నాడు. కాగా ఈ సీజన్ ఆరంభంలోనూ వార్విక్షైర్ తరఫున మానవ్ రెండు మ్యాచ్లు ఆడాడు. సమర్సెట్తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. యార్క్షైర్తో మ్యాచ్లోనూ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. మొత్తంగా రెండు మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ రాజస్తాన్ స్పిన్నర్ బ్యాటింగ్లో కూడా 98 పరుగులు చేశాడు. మళ్లీ ఇప్పుడు ఇంగ్లీష్ గడ్డపై ఇరగదీసేందుకు సుతార్ ఉవ్విళ్లూరుతున్నాడు.అరంగేట్రంలో అదుర్స్కాగా మానవ్ సుతార్ గత నెలలో ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ తరపున అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్లోనే అతడు అదరగొట్టాడు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ రాణించాడు. డెబ్యూ మ్యాచ్లోనే 5 వికెట్ల హాల్ సాధించి అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఈ క్రమంలోనే సుతార్ను రవీంద్ర జడేజా అందుబాటులో వచ్చినప్పటికి శ్రీలంక పర్యటనకు ఎంపిక చేశారు. అతడికి తుది జట్టులో కూడా చోటు దక్కే అవకాశముంది.చదవండి: LPL 2026: ఇదేమి బ్యాటింగ్ బ్రో? అక్కడ కూడా పరువు తీస్తున్నావుగా? -
కౌంటీలోనూ అదే జోరు.. బౌలింగ్తో హడలెత్తించిన మానవ్ సుతార్!
టీమిండియా తరఫున అరంగేట్రం మ్యాచ్లోనే అదరగొట్టిన మానవ్ సుతార్ కౌంటీ చాంపియన్షిప్లోనూ తన బౌలింగ్తో బెంబెలె త్తిస్తున్నాడు. ఆఫ్గన్తో జరిగిన టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్ ఆడిన తొలి మ్యాచ్లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఆఫ్గన్పై ప్రదర్శనతో కౌంటీ క్రికెట్లో ఆడే అవకాశం దక్కించుకున్న మానవ్ సుతార్ అక్కడ కూడా అరంగేట్రంలోనే అదుర్స్ అనిపించాడు. వార్విక్షైర్ తరఫున బరిలోకి దిగిన మానవ్ సుతార్ యార్క్షైర్తో జరుగుతున్న కౌంటీ మ్యాచ్లో 85 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మానవ్ సుతార్ తీసిన మూడు వికెట్లు కీలకమైనవే కావడం విశేషం. మొదట హాఫ్ సెంచరీ చేసిన సామ్ వైట్మన్ (55)ను పెవిలియన్ చేర్చిన మానవ్ సుతార్.. తన సెంచరీతో యార్క్షైర్ ఇన్నింగ్స్కు వెన్నుముకలా నిలిచిన విలియమ్ లక్స్టన్ (167 పరుగులు) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత చివర్లో యార్క్షైర్ భారీ స్కోరు చేయడంలో సహాయపడిన జార్జ్ హిల్ (30)ను ఔట్ చేసి ముచ్చటగా మూడో వికెట్ తీసుకున్నాడు.ఇలా అరంగేట్రం మ్యాచ్లోనే మూడు కీలక వికెట్లు తీసి కౌంటీ క్రికెట్లోనూ మానవ్ సుతార్ అదుర్స్ అనిపించాడు. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్షైర్ 110.4 ఓవర్లలో 469 పరుగులకు ఆలౌటైంది. విలియం లక్స్టన్ సెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ జానీ బెయిర్ స్టో (68)తో పాటు సామ్ వైట్మన్ అర్థసెంచరీ సాధించారు. మానవ్ సుతార్, ఈతన్ బాంబర్, ఎడ్ బెర్నాడ్లు తలా మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ ఆరంభించిన వార్విక్షైర్ 23 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. రాబర్ట్ యేట్స్ (22), సామ్ హెయిన్ (1) పరుగుతో క్రీజులో ఉన్నారు.Manav Suthar has his first championship wicket! pic.twitter.com/BmD8DZ2lX7— No Context County Cricket (@NoContextCounty) June 12, 2026Talk about a dream start on debut 🤩🎥 Manav Suthar getting his maiden Test wicket in his very first over 🙌Scorecard ▶️ https://t.co/Au50EfVM30#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/MEx9QHwkD0— BCCI (@BCCI) June 7, 2026 -
టెస్ట్ల్లో సరికొత్త 'నంబర్ వన్'
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సరికొత్త నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్గా అవతరించాడు. సహచరుడు జో రూట్ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తాజాగా లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్లో అర్ద సెంచరీ సాధించి నంబర్ వన్ స్థానానికి చేరాడు. ఇదే మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో ఘోరంగా విఫలమైన రూట్ రెండు స్థానాలు దిగజారి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ మధ్యలో ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ ఓ స్థానం మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు.తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్లో సూపర్ సెంచరీతో సత్తా చాటిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. 743 రేటింగ్ పాయింట్లు కలిగిన గిల్.. ప్రస్తుతం భారత్ తరఫున అత్యధిక రేటింగ్ కలిగిన బ్యాటర్గా నిలిచాడు.ఇదే మ్యాచ్లో సెంచరీ చేసిన మరో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ ర్యాంక్లో (34) ఎలాంటి మార్పు లేదు. గిల్తో పాటు టాప్-10లో ఉన్న మరో టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓ స్థానంలో కోల్పోయి తొమ్మిదో స్థానానికి చేరాడు. ఓవరాల్గా తాజా ర్యాంకింగ్స్లో అత్యధిక లబ్ది పొందిన బ్యాటర్గా గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. ఫిలిప్స్ తాజాగా ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్లో ఓ మోస్తరు ప్రదర్శన చేసినప్పటికీ.. 15 స్థానాలు మెరుగుపర్చుకొని 40వ స్థానానికి ఎగబాకాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ టెస్ట్లో కళ్లు చెదిరే ప్రదర్శన ఇచ్చిన ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ 7 స్థానాలు మెరుగుపర్చుకొని పదో స్థానానికి ఎగబాకాడు. ఆఫ్ఘన్ టెస్ట్లో సంచలన ప్రదర్శన ఇచ్చిన టీమిండియా అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ తొలిసారి టాప్-100లోకి ప్రవేశించాడు. ఆ మ్యాచ్లో 7 వికెట్లు తీసిన సుతార్ 272 రేటింగ్ పాయింట్లు సాధించి 72వ స్థానంలో నిలిచాడు.మిగతా భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఓ స్థానం మెరుగుపర్చుకొని 14వ స్థానానికి చేరగా.. సిరాజ్ ఓ స్థానం కోల్పోయి 15వ స్థానానికి పడిపోయాడు. ఆల్రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా వెటరన్ ఆటగాడు రవీంద్ర జడేజా టాప్ ప్లేస్ను నిలుపుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 2 స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. -
టీమిండియా యువ సంచలనానికి బంపరాఫర్
తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్లో అద్భుత ప్రదర్శనతో (7 వికెట్లు) ఆకట్టుకున్న టీమిండియా యువ సంచలనం మానవ్ సుతార్కు ఊహించని అవకాశం లభించింది. అరంగేట్రంలోనే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇచ్చిన అతడితో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోని ప్రముఖ జట్టైన వార్విక్షైర్ రెండు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్ల ఒప్పందం చేసుకుంది.సుతార్కు ఈ డీల్ చాలా లక్కీగా పరిగణించబడుతోంది. టీమిండియా భవిష్యత్ ఇంగ్లండ్ పర్యటనల్లో అతడికి ఈ అనుభవం చాలా పనికొస్తుంది. స్పిన్నర్లకు పెద్దగా సహకరించని ఇంగ్లండ్ పిచ్లపై సుతార్ తన బౌలింగ్ను మెరుగుపర్చుకోవచ్చు. ఇంగ్లండ్లో రాణిస్తే సుతార్ భవిష్యత్తుకు తిరుగుండదు.అశ్విన్ రిటైర్మెంట్, జడేజా తరచుగా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రస్తుతం భారత టెస్ట్ జట్టుకు విదేశీ పరిస్థితుల్లో స్థిరమైన స్పిన్నర్ అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యంలో సుతార్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అనుభవం సాధించడం టీమిండియాకు చాలా ఉపయోగపడుతుంది.దేశీయ క్రికెట్లో అత్యుత్తమ ట్రాక్ రికార్డు (30 మ్యాచ్ల్లో 136 వికెట్లు) కలిగిన సుతార్.. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్తో టీమిండియా అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ స్పెల్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా భారత్ వైపుకు తిప్పింది. రెండో ఇన్నింగ్స్లోనూ సుతార్ తన ప్రభావాన్ని కొనసాగిస్తూ మరో వికెట్ సాధించాడు. మొత్తంగా అరంగేట్ర టెస్ట్లో 7 వికెట్లు తీసి, భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకుగానూ అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. -
భారత్ కు మరో యువరాజ్ అసలెవరీ మానవ్ సుతార్
-
మానవ్ మాయాజాలం.. టీమిండియా రికార్డు విజయం
న్యూ చండీఘడ్లోని ముల్లాన్పూన్ వేదికగా పసికూన ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో భారత్ ఒకేసారి బ్యాటింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ను రెండుసార్లు ఆలౌట్ చేసింది. భారత స్పిన్నర్లు ఏకంగా 16 వికెట్లు తీసి ఆఫ్ఘన్ల భరతం పట్టారు. తొలి ఇన్నింగ్స్లో అరంగేట్రం స్పిన్నర్ 6 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్లో సుందర్ 4, కుల్దీప్ 3 వికెట్లతో సత్తా చాటారు. ఈ గెలుపు టీమిండియాకు పరుగుల పరంగా (ఇన్నింగ్స్) అతి భారీ విజయంగా నిలిచింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 564-8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (100), కెప్టెన్ శుభ్మన్ గిల్ (126) సెంచరీలతో కదంతొక్కగా.. సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ 24, ధృవ్ జురెల్ 19, మానవ్ సుతార్ 28, మహ్మద్ సిరాజ్ 22, కుల్దీప్ యాదవ్ 9 (నాటౌట్) పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లతో చెలరేగగా.. జియా ఉర్ రహ్మాన్, కెప్టెన్ హష్మతుల్లా షాహిది తలో వికెట్ తీశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ను అరంగేట్రం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (22-10-33-6) తిప్పేశాడు. అతడికి ప్రసిద్ద్ కృష్ణ (11-2-37-3), సుందర్ (6.4-1-21-1) కూడా తోడవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్ 152 పరుగులకే చాపచుట్టేసింది. ఆ జట్టు తరఫున రహ్మత్ షా (60) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం ఫాలో ఆన్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో ప్రతిఘటనే లేకుండా చేతులెత్తేసింది. ఈసారి సుందర్ (11-4-36-4), కుల్దీప్ (7.5-1-30-3), సుతార్ (10-2-29-1), సిరాజ్ (4-1-11-1) రెచ్చిపోవడంతో 112 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయంపాలైంది. -
జడేజా వారసుడు దొరికేశాడు.. 38 ఏళ్లలో ఒకే ఒక్కడు
భారత క్రికెట్లో సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రత్యేక స్ధానం ఉంది. 37 ఏళ్ల జడేజా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ తనదైన ముద్రవేసుకున్నాడు. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన ఈ సౌరాష్ట్ర వెటరన్ క్రికెటర్.. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో మాత్రం ఆడుతున్నాడు.అతడి వయస్సు దృష్ట్యా త్వరలోనే టెస్ట్ క్రికెట్కూ వీడ్కోలు పలికే అవకాశముంది. దీంతో టీమిండియాలో జడేజా వారసుడు ఎవరన్న చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో ఓ యువ స్పిన్నర్ వెలుగులోకి వచ్చాడు. తన స్పిన్ మాయాజాలంతో జడేజాను తలపిస్తున్నాడు. అతడే రాజస్తాన్కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్.అరంగేట్రంలో అదుర్స్ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్లో అరంగేట్రం చేసిన 23 ఏళ్ల మానవ్ సుతార్.. తన తొలి మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. మొదట బ్యాటింగ్లో 28 పరుగులతో రాణించిన సుతార్.. ఆ తర్వాత బౌలింగ్తో అఫ్గాన్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.తన వేసిన తొలి ఓవర్లోనే మొదటి అంతర్జాతీయ వికెట్ను అతడు పడగొట్టాడు. ఈ రాజస్తాన్ యువ ఆటగాడు పిచ్పై బంతిని బాగా టర్న్ చేయడంతో పాటు స్టంప్స్ను టార్గెట్ చేస్తూ తనలోని బౌలింగ్ స్కిల్స్ను చూపించాడు. మొదటి ఇన్నింగ్స్లో 22 ఓవర్లు బౌలింగ్ చేసిన సుతార్.. కేవలం 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.సరికొత్త చరిత్రదీంతో మానవ్ సుతార్ ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. 21వ శతాబ్దంలో అరంగేట్ర టెస్టు ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు సాధించిన రెండో భారత ప్లేయర్గా సుతార్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2008లో అమిత్ మిశ్రా తన అరంగేట్ర టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్ల హాల్ సాధించాడు. మళ్లీ ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత సుతార్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అదేవిధంగా గత 38 ఏళ్లలో టెస్టు అరంగేట్రంలో ఒక ఇన్నింగ్స్లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలర్గా సుతార్ నిలిచాడు. ఇంతకముందు భారత దిగ్గజ బౌలర్ నరేంద్ర హిర్వాణీ తన అరంగేట్రం(1988)లో వెస్టిండీస్పై 61 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టారు.సుతార్ సక్సెస్ వెనక ద్రవిడ్మానవ్ సుతార్ సక్సెస్ వెనక టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. ఇండియా-A, అండర్-19 జట్లకు ఆడే సమయంలో ద్రవిడ్ దృష్టిలో సుతార్ పడ్డాడు. నువ్వు బ్యాటింగ్ను ఎలాగైనా మేనేజ్ చేయగలవు, కానీ నీ బౌలింగ్పై ఎక్కువ దృష్టి పెట్టు అని ప్రతీసారి ద్రవిడ్ సలహా ఇచ్చేవాడంట.ఈ విషయాన్ని మానవ్ కోచ్ ధీరజ్ స్వయంగా తెలిపారు. కాగా ఆ సమయంలో ద్రవిడ్ బెంగళూరులోని ఎన్సీఎ హెడ్గా ఉన్నాడు. ప్రస్తుతం తరం క్రికెటర్లంతా వైట్బాల్ క్రికెట్ వైపు మొగ్గు చూపుతుంటే, మానవ్ మాత్రం అందుకు భిన్నంగా గత ఐదు, ఆరేళ్ల నుంచి రెడ్బాల్ క్రికెట్పైనే పూర్తి దృష్టి పెట్టాడు.ఇప్పటికే ఫస్ట్క్లాస్ క్రికెట్లో తన సత్తాను నిరూపించుకున్నాడు. తన అరంగేట్ర సీజన్(2022-23 రంజీ ట్రోఫీ) రాజస్థాన్ తరఫున కేవలం 6 మ్యాచ్ల్లోనే 39 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఐపీఎల్-2024 నుంచి గుజరాత్ టైటాన్స్ జట్టులో అతడు భాగంగా ఉన్నాడు.నెట్స్లో టీమిండియా కెప్టెన్, గుజరాత్ టైటాన్స్ సారధి శుబ్మన్ గిల్కు సుతార్ గంటల తరబడి బౌలింగ్ చేసేవాడు. గిల్ కూడా నెట్స్లో సుతార్ బౌలింగ్ను ఎదుర్కోవడానికే ఎక్కువ ఆసక్తి చూపించేవాడంట. దగ్గనుంచి అతడి స్కిల్స్ను చూసిన గిల్.. సుత్తార్ భారత జట్టుకు ఎంపిక కావడంలో తన వంతు పాత్ర పోషించాడు. -
మానవ్ మాయ.. 152 పరుగులకే కుప్పకూలిన అఫ్గాన్
ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాతో జరుగుతున్న ఏకైక టెస్ట్లో భారత బౌలర్లు సత్తాచాటారు. అఫ్గాన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 58.4 ఓవర్లలో కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. 113/5 ఓవర్ నైట్స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన పర్యాటక జట్టు అదనంగా 39 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్ను ముగించింది.దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో 412 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక భారత బౌలర్లలో అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ 6 వికెట్లతో సత్తాచాటాడు. రెండో రోజు ఆటలో మూడు వికెట్లు సాధించిన సుతార్.. ఇప్పుడు మూడో రోజు ఆటలో మరో 3 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ శతాబ్దంలో అరంగేట్ర టెస్టు ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు సాధించిన రెండో భారత ప్లేయర్గా సుతార్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2008లో అమిత్ మిశ్రా తన అరంగేట్ర టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్ల హాల్ సాధించాడు. ఇక మానవ్తో పాటు ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టాడు.ఫాల్ ఆన్ ఆడనున్న అఫ్గాన్ఇక స్వల్ప స్కోర్కే పరిమితమైన అఫ్గానిస్తాన్ను ఫాల్ఆన్కు భారత్ అహ్హనించింది. 412 పరుగుల లోటుతో అఫ్గాన్ తమ సెకెండ్ ఇన్నింగ్స్ను మొదలు పెట్టింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండిచా 564 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేఎల్ రాహుల్(100), శుబ్మన్ గిల్(126) సెంచరీలతో కదం తొక్కగా.. సుదర్శన్(81), పంత్(81) హాఫ్ సెంచరీలతో రాణించారు.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! కేవలం 10 బంతుల్లోనే


