IND vs SL 2nd Test Day 5: కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టులో ఆఖరిదైన ఐదో రోజు ఆట మొదలైంది.
UPDATES
డ్రింక్స్ బ్రేక్ సమయానికి శ్రీలంక స్కోరు: 284-6
దినుష 34, నువాంత 28 పరుగులతో ఉన్నారు. శ్రీలంక ఆధిక్యం 71 పరుగులకు చేరుకుంది. చేతిలో ఇంకా నాలుగు వికెట్లు ఉన్నాయి.
శ్రీలంక స్కోరు: 276-6 (86)
50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన దినుష, నువాంత. దినుష 29, నువాంత 27 పరుగులతో ఉన్నారు. 63 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక
నిలకడగా ఆడుతున్న దినుష, నువాంత
దినుష 22, నువాంత 20 పరుగులతో ఉన్నారు. స్కోరు: 262-6 (84). 49 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక.
44 పరుగుల ఆధిక్యంలో లంక
దినుష 21, నువాంత 17 పరుగులతో ఉన్నారు.
35 పరుగుల ఆధిక్యంలో లంక
సొనాల్ దినుష 13, నువాంత 16 పరుగులతో ఉన్నారు. లంక స్కోరు: 248/6 (78)
శ్రీలంక ఓవర్నైట్ స్కోరు: 229-6
సొనాల్ దినుష ఏడు, కేశారా నువాంత మూడు పరుగులతో అజేయంగా నిలిచారు.
స్వల్ప ఆధిక్యంలో లంక
ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక బుధవారం ఆట పూర్తయ్యేసరికి 72.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. తద్వారా 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లింది. పసిందు సూరియబండారా (92), కమిందు మెండిస్ (55) రాణించడంతో ఎట్టకేలకు లంక ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోగలిగింది.
సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్లో భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 503-9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా ఆతిథ్య లంకను ఫాలో ఆన్ ఆడమని చెప్పింది. కాగా వర్షం వల్ల బుధవారం నాటి నాలుగో రోజు ఆటను ముందుగానే ముగించాల్సి వచ్చింది.
క్లీన్స్వీప్పై గురి
ఇదిలా ఉంటే.. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గాలెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా శ్రీలంకను 165 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇదే జోరులో రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసేందుకు భారత్ సిద్ధమైంది.
తుదిజట్లు
భారత్
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, సారాంశ్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ
శ్రీలంక
లాహిరు ఉదార, కమిల్ మిశారా, పసిందు సూరియబండారా, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వ (కెప్టెన్), సొనాల్ దినుష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), కేశారా నువాంత, ప్రబాత్ జయసూరియ, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.


