breaking news
Galle
-
లంకపై విజయం.. గంభీర్ ప్లాన్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి సెషన్లో 20 ఓవర్ల పాటు ఒక్క వికెట్ కూడా పడకపోగా, లంక బ్యాటర్లు జిడ్డు ఆటను ప్రదర్శించారు. ముఖ్యంగా కెప్టెన్ ధనంజయ డిసిల్వా, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దినూషలు మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్కు 95 పరుగులు జోడించారు. ఈ నేపథ్యంలోనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి టీమిండియా ఆటను గమనిస్తూ వచ్చిన గంభీర్ బౌలర్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 30 ఓవర్ల పాటు భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంపై గంభీర్ ఆగ్రహించాడు. దీంతో లంక 112 పరుగుల వద్ద ఉన్నప్పుడు డ్రింక్స్ బ్రేక్ రాగా, ఆ సమయంలో గంభీర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి డగౌట్కు వచ్చి మాస్టర్ ప్లాన్ వివరించాడు. గంభీర్ ఇచ్చిన ప్లాన్ ఆటను పూర్తిగా మార్చేయడంతో ఆటకు అదే టర్నింగ్ పాయింట్ అయింది.సిరాజ్ను పిలిచిన గంభీర్ బౌలింగ్ ప్లాన్ను వివరించాడు. పేస్ అటాకింగ్ను పక్కనబెట్టి, పూర్తిగా స్పిన్నర్లతో బౌలింగ్ చేయించమని సిరాజ్కు వివరించాడు. ఈ విషయాన్ని వెంటనే కెప్టెన్ గిల్కు చేరవేయాలని తెలిపాడు. గంభీర్ సలహాను పాటించిన మరుక్షణమే టీమిండియాకు ఫలితం రావడం విశేషం. 94 పరుగుల జోడించి బలపడుతున్న ధనంజయ, దినూష జోడిని జడేజా విడదీశాడు. అలా టీమిండియా మళ్లీ విజయం ట్రాక్ ఎక్కినట్లయింది. మరో ఎండ్ నుంచి మానవ్ సుతార్ కూడా తన బౌలింగ్తో ముప్పతిప్పలు పెట్టడంతో లంక కష్టాలు రెట్టింపు అయ్యాయి. చివరకు 206 పరుగుల వద్ద లంక తమ ఇన్నింగ్స్ను ముగించడంతో 165 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది.🚨Gautam Gambhir Gives Mohammed Siraj a Bowling Plan to Break Sri Lanka’s Partnership🚨Indian bowlers are struggling to take wickets on the morning of Day 5, as Sri Lankan batters Dhananjaya de Silva and Sonal Dinusha are batting strongly and building a solid partnership.… pic.twitter.com/Bu6YQa8DXD— Central Cricket (@arshdeep3444) August 19, 2026చదవండి: పాక్ జట్టును అవమానించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్! -
శ్రీలంకను మట్టికరిపించిన టీమిండియా.. ఘన విజయం
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 165 పరుగుల తేడాతో మట్టికరిపించింది. గాలెలో 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. 206 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు భారీ విజయం సాధ్యమైంది. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ఆరు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో టీమిండియా రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 ఫైనల్ రేసులో కీలక ముందడుగు వేసింది. కాగా రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గాలె స్టేడియంలో శనివారం తొలి టెస్టు మొదలైంది.పడిక్కల్ సెంచరీతో..టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ భారీ శతకం (167)తో చెలరేగగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంకను 284 పరుగులకే కట్టడి చేసింది.అయితే, రెండో ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ (66)తో రాణించగా.. భారత్ 193 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో... తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం లభించిన కారణంగా శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.ధనంజయ, దినుష పోరాటంఈ నేపథ్యంలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. టాపార్డర్లో ఓపెనర్లు నిశాన్ మధుష్క (6), లాహిరు ఉదార (16)తో పాటు.. అనూహ్య రీతిలో అరంగేట్రం చేసిన వన్డౌన్ బ్యాటర్ పసిందు సూరియబండారా (0) పూర్తిగా విఫలమయ్యాడు.సీనియర్ బ్యాటర్ కమిందు మెండిస్ (2) కూడా చేతులెత్తేశాడు. ఇలాంటి తరుణంలో కెప్టెన్ ధనంజయ డి సిల్వ, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో సొనాల్ దినుష పట్టుదలగా నిలబడ్డారు. బుధవారం నాటి ఐదో రోజు ఆటలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని భారత బౌలర్ల సహనాన్ని వీరిద్దరు పరీక్షించారు.జడ్డూ మ్యాజిక్ఈ క్రమంలో రవీంద్ర జడేజా ధనంజయ డి సిల్వ (59)ను అవుట్ చేసి బ్రేక్ ఇవ్వగా.. ప్రసిద్ కృష్ణ నిరోషన్ డిక్వెల్లా (10)ను అవుట్ చేశాడు. దీంతో భోజన విరామ సమయానికి శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.India needed a way through, and Ravindra Jadeja found it. 🤩 Watch #SLvIND, 1st Test | Day 5, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/tCm8qzqmBb— Sony Sports Network (@SonySportsNetwk) August 19, 2026ఆరేసిన మానవ్ సుతార్అయితే, లంచ్ తర్వాత కూడా సొనాల్ దినుష పట్టువీడకుండా క్రీజులో పాతుకుపోయాడు. సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ మానవ్ సుతార్ అతడికి ఊహించని షాకిచ్చాడు. 76వ ఓవర్లో తొలి బంతిని లెగ్ స్టంప్ అవుట్సైడ్ దిశగా సంధించగా.. షాట్ ఆడే క్రమంలో దినుష (84) విఫలమయ్యాడు. ఈ క్రమంలో ధ్రువ్ జురెల్ క్యాచ్ అందుకోగా.. టీమిండియా సంబరాలు అంబరాన్నంటాయి.Manav Suthar cleaned up the tail in a flash! ⚡Three wickets in one over to put the finishing touches on a sensational bowling effort. Watch #SLvIND, 1st Test | Day 5, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/LwSc4NGRW2— Sony Sports Network (@SonySportsNetwk) August 19, 2026ఇక ఆ తర్వాత మరుసటి బంతికే మానవ్ సుతార్ ప్రభాత్ జయసూర్య (0)ను బౌల్డ్ చేశాడు. తర్వాతి ఓవర్లో లాహిరు కుమార (0)ను కూడా పెవిలియన్కు పంపాడు. ఇక 78వ ఓవర్లో నాలుగో బంతికి కేశారా నువాంత (20)ను కూడా బౌల్డ్ చేసిన మానవ్ సుతార్ తన ఆరో వికెట్తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.ఇక తొలి ఇన్నింగ్స్లో మానవ్ సుతార్ నాలుగు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ మ్యాచ్లో మొత్తంగా పది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్. ఇదిలా ఉంటే.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. కాగా టెస్టుక్రికెట్లో భారత్కు ఇది 600వ మ్యాచ్ కావడం విశేషం.శ్రీలంక వర్సెస్ భారత్ తొలి టెస్టు👉వేదిక: గాలె ఇంటర్నేషనల్ స్టేడియం, గాలె.👉టాస్: టీమిండియా.. బ్యాటింగ్సంక్షిప్త స్కోర్లు👉భారత్: 462 &193👉శ్రీలంక: 284 &206👉ఫలితం: శ్రీలంకపై 165 పరుగుల తేడాతో భారత్ జయభేరి👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: దేవదత్ పడిక్కల్ (167 & 44).చదవండి: వివాదంలో రింకూ సింగ్! -
ఇదేం గేమ్ ప్లాన్?: టీమిండియాపై విమర్శలు
టీమిండియా- శ్రీలంక మధ్య తొలి టెస్టు తుది అంకానికి చేరుకుంది. వర్షం వల్ల గనుక అంతరాయం కలగకుంటే.. ఆటకు చివరి రోజైన బుధవారం ఫలితం తేలే అవకాశం ఉంది. కాగా భారత్ ఈ మ్యాచ్లో గెలవాలంటే ఆఖరి రోజు వీలైనంత త్వరగా ఆరు వికెట్లు తీయాల్సి ఉంది.టార్గెట్ 372గాలె వేదికగా శనివారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌట్ అయిన గిల్ సేన.. శ్రీలంకను 284 పరుగులకు కట్టడి చేసింది.తద్వారా 178 పరుగుల భారీ ఆధిక్యంతో మంగళవారం నాడు నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. 193 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా శ్రీలంకకు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో మంగళవారం ఆట ముగిసే సరికి లంక నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ఆరంభంలో లంక త్వరత్వరగా వికెట్లు కోల్పోయినప్పటికీ.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ, సొనాల్ దినుష పట్టుదలగా నిలబడి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.వాన వల్ల అంతరాయం కలిగితే?ఈ నేపథ్యంలో మంగళవారం ఆట సందర్భంగా టీమిండియా నాయకత్వ బృందం అనుసరించిన వ్యూహాన్ని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే విమర్శించాడు. వర్షం ముప్పు ఉన్న ఈ మ్యాచ్లో భారత్కు ఆఖరి రోజు లంకను ఆలౌట్ చేసే అవకాశాలు తక్కువని పేర్కొన్నాడు. టీమిండియాపై విమర్శలునిజానికి రెండో ఇన్నింగ్స్లో కాస్త వేగంగా ఆడటం లేదంటే.. ఇన్నింగ్స్ కాస్త ముందుగానే డిక్లేర్ చేసి ఉంటే బాగుండేదని హర్ష అభిప్రాయపడ్డాడు. ‘‘నాలుగో రోజు ఆటలో ఆఖరి నలభై నిమిషాల్లో టీమిండియా వైఖరి నాకెందుకో అంతుపట్టలేదు. బ్యాటర్లు చాలా సమయం తీసుకున్నారు. కానీ స్కోరు బోర్డు మీద కావాల్సినన్ని పరుగులు జమచేయలేకపోయారు.వాతావరణం అసలే బాగాలేదు. అలాంటపుడు ఇలా చేయడం ఎంతమాత్రం సరికాదు. గ్రౌండ్ సిబ్బంది కవర్లు కప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అయినా కూడా టీమిండియా మాత్రం నెమ్మదిగా ఆడింది’’ అని హర్షా భోగ్లే భారత జట్టు ఆట తీరును తప్పుబట్టాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. కాగా బుధవారం నాటి ఆటలో ధనంజయ డి సిల్వ, సొనాల్ దినుష అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. డ్రింక్స్ బ్రేక్ సమయానికి శ్రీలంక విజయానికి 234 పరుగుల దూరంలో నిలిచింది.చదవండి: శుభవార్త చెప్పిన గ్లెన్ మాక్స్వెల్ -
తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 165 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 77.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. సోనాల్ దినూష (84) టాప్ స్కోరర్గా నిలవగా, ధనంజయ డిసిల్వా (59) అర్ధసెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ ఆరు వికెట్లతో చెలరేగగా, ప్రసిధ్ క్రిష్ణ రెండు, జడేజా, సిరాజ్లు చెరో వికెట్ పడగొట్టారు. టెస్టులో రెండు ఇన్నింగ్స్లు కలిపి మానవ్ సుతార్ పది వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ విజయంతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది.సంక్షిప్త స్కోర్లుభారత్ 462 & 193 ఆలౌట్శ్రీలంక 284 & 206 ఆలౌట్తొమ్మిదో వికెట్ డౌన్అంకతముందు మానవ్ సుతార్ ఐదు వికెట్లతో చెలరేగడంతో లంక 199 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. విజయానికి భారత్ ఒక్క వికెట్ దూరంలో ఉంది.ఎనిమిదో వికెట్ డౌన్మానవ్ సుతార్ బౌలింగ్లో ప్రబాత్ జయసూరియా గోల్డెన్ డకౌట్ కావడంతో శ్రీలంక 199 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అంతకముందు ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్లో డిక్వెల్లా వెనుదిరిగాడు. భారత్ విజయానికి మరో 2 వికెట్లు అవసరం.లంచ్ తర్వాత మొదలైన ఆటశ్రీలంక స్కోరు: 196/6(74)దినుష 81, కేశారా 13 పరుగులతో ఉన్నారులంచ్ విరామంలంచ్ విరామ సమయానికి శ్రీలంక 67 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. సోనాల్ దినూష (65 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేస్తుండగా, కెషారా నువంతా 8 పరుగులతో ఆతడికి సహకరిస్తున్నాడు. ప్రసిధ్ క్రిష్ణ, మానవ్ సుతార్ రెండు వికెట్లు తీయగా, జడేజా ఒక వికెట్ పడగొట్టాడు. భారత్ విజయానికి మరో నాలుగు వికెట్ల దూరంలో ఉంది. ఇంకా రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉన్న లంక గెలుపుకు 197 పరుగులు అవసరం. ఆరో వికెట్ డౌన్10 పరుగులు చేసిన నిరోషన్ డిక్వెల్లా ప్రసిధ్ బౌలింగ్లో వెనుదిరగడంతో లంక 156 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. దినూష (54) ఒంటరిపోరాటం చేస్తున్నాడు. భారత్ విజయానికి నాలుగు వికెట్ల దూరంలో ఉంది.ఐదో వికెట్ డౌన్జడేజా బౌలింగ్లో ధనంజయ డిసిల్వా (59) ఔట్ కావడంతో శ్రీలంక 142 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి ఐదు వికెట్లు అవసరం కాగా, గెలుపుకు లంక 230 పరుగుల దూరంలో ఉంది.లంక బ్యాటర్ల అర్ధశతకాలులంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దినూషలు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ప్రస్తుతం లంక 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. లంక విజయానికి మరో 231 పరుగులు అవసరం.వంద పరుగుల మార్క్ దాటిన లంక372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక వంద పరుగుల మార్క్ను దాటింది. 43 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ధనంజయ (40), దినూష (33) క్రీజులో ఉన్నారు.ఐదోరోజు ఆట మొదలుగాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. ఈ నేపథ్యంలో ఐదో రోజు ఆట ప్రారంభం కాగా, భారత్ గెలుపుకు ఆరు వికెట్లు అవసరం. 372 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన లంక ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. కెప్టెన్ ధనంజయ డి సిల్లా 39 పరుగులు, సోనాల్ దినూష 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: IND vs SL: నాలుగో రోజు ఆట సాగిందిలా! -
జడ్డూ చర్యపై గంభీర్ అసహనం!
గాలే వేదికగా లంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికీ, భారత్ విజయానికి 6 వికెట్లు అవసరం. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ప్రస్తుతం 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. కెప్టెన్ ధనంజయ డి సిల్వా 31 పరుగులు, సోనాల్ దినూష 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదోరోజు గాలేలో గంటల తరబడి భారీ వర్షం పడితే తప్ప ఆట రద్దుకు ఆస్కారం లేకపోవడంతో, లంక ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పిచ్ స్పిన్నర్లకు విపరీతంగా అనుకూలిస్తుండడంతో స్పిన్ త్రయం జడేజా, కుల్దీప్, మానవ్ సుతార్లు వికెట్ల వేటలో పడిపోయారు. ఇదిలా ఉంటే రవీంద్ర జడేజా చర్య పట్ల హెడ్కోచ్ గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. నాలుగో రోజు ఆటలో జడేజా బౌలింగ్లో లంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో జడేజా వేసిన చివరి బంతి అద్భుతంగా టర్న్ తీసుకోవడంతో ఏడు పరుగులతో ఆడుతున్న ధనంజయ ఫస్ట్ స్లిప్లో సులభమైన క్యాచ్ ఇచ్చాడు. అయితే కీలక వికెట్ పడిందన్న ఆనందం టీమిండియాకు ఎంతోసేపు నిలవలేదు. కొంపముంచిన నో బాల్ఎందుకంటే జడేజా బంతిని వేసేటప్పుడు క్రీజు దాటి ముందుకు వెళ్లడంతో అంపైర్ దానిని నో బాల్గా ప్రకటించడంతో సంబరాలు ఆగిపోయాయి. అలా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ధనంజయ 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇదే సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న గంభీర్ ముఖ కవళికల్లో మార్పులు కనిపించాయి. కీలక వికెట్ పడిందన్న సంతోషం క్షణమైనా లేకుండా పోయిందే అన్న తరహాలో గంభీర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. పనిలో పనిగా వికెట్ పడిందనుకున్న చోట జడేజా నో బాల్ కావడంతో అతడిపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గంభీర్ అసహనం వ్యక్తం చేయడం వెనుక బలమైన కారణం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి ఇలాంటి తప్పులే మ్యాచ్ను లాగేసుకునేందుకు ఆస్కారముంటుందన్నారు.ఆ భయంతోనే..ఏడు పరుగుల వద్ద లైఫ్ లభించిన ధనంజయ రోజు ముగిసేరికి అజేయంగా నిలిచాడు. అతడికి అండగా తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దినూష కూడా ఉండడంతో భారత్ విజయంపై చిన్న అనుమానం నెలకొని ఉంది. ఒకవేళ ధనంజయ భారత్ గెలుపుకు అడ్డుపుల్లగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదనిపిస్తోంది. అవకాశం వచ్చినప్పుడే దానిని ఉపయోగించుకోవాలి.. లేదంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుందేమో. అందుకే గంభీర్ జడేజా చర్యపై అసహనం వ్యక్తం చేయడం కనిపించింది. అయితే స్పిన్కు విపరీతంగా అనుకూలిస్తున్న గాలే పిచ్పై చివరి రోజు బ్యాటింగ్ చేయడం అసాధ్యం. మరి ధనంజయ, దినూషలు భారత్ విజయానికి అడ్డుకట్ట వేస్తారా లేక టీమిండియా స్పిన్నర్ల ధాటికి వెనుదిరుగుతారా అన్నది చూడాలి.🚨Ravindra Jadeja’s No-Ball Turns Gambhir’s Celebration Into Heartbreak🚨Ravindra Jadeja thought he had dismissed Dhananjaya de Silva after KL Rahul completed the catch, and Gautam Gambhir was visibly delighted. But then came the heartbreak Jadeja had overstepped, and it was… pic.twitter.com/FbSG0mGhZq— Central Cricket (@arshdeep3444) August 18, 2026A costly overstep from Ravindra Jadeja.Dhananjaya de Silva gets another life.📸: Sony LIV pic.twitter.com/8GH6rQkf7g— CricTracker (@Cricketracker) August 18, 2026చదవండి: హాకీ ప్రపంచకప్: పాక్తో పోరు.. భారత్కు ‘డూ ఆర్ డై’ -
లంకతో తొలి టెస్టు.. మంజ్రేకర్, మురళీ కార్తిక్ మధ్య వాగ్వాదం!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. విజయానికి ఆరు వికెట్ల దూరంలో ఉన్న భారత్ ఐదోరోజు ఆటను వీలైనంత తొందరగా ముగించాలని చూస్తోంది. ఆన్ఫీల్డ్లో ఇలాంటి డ్రామా నడుస్తుంటే.. ఆఫ్ ఫీల్డ్ మాత్రం మరో డ్రామాకు వేదికైంది. తొలి టెస్టుకు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేక్, మురళీ కార్తిక్ల మధ్య కామెంటరీ బాక్స్లో బాడీ షేమింగ్ గురించి చిన్నపాటి యుద్ధం జరిగింది. ఇద్దరు మాట మాట అనుకోవడంతో ఫన్నీగా మొదలైన కామెంటరీ చివరకు మాటల యుద్ధానికి దారి తీసింది. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. విషయంలోకి వెళితే.. టెస్టు మ్యాచ్ లంచ్ బ్రేక్ సమయంలో, స్టూడియోలో ఉన్న మురళీ కార్తిక్ మైదానం వద్ద నుంచి మాట్లాడుతున్న సంజయ్ మంజ్రేకర్ ముఖకవళికలపై కామెంట్ చేశారు. "మీరు పెట్టే ఎక్స్ ప్రెషన్స్ వల్ల మీరు ఏం మాట్లాడుతున్నారో ఒక్కోసారి సరిగా అర్థం కావడం లేదు, అది కొంచెం తగ్గించండి" అంటూ కార్తిక్ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అసహనానికి గురైన సంజయ్ మంజ్రేకర్ వెంటనే స్పందిస్తూ.. "కెమెరాను నా నుంచి స్ప్లిట్ స్క్రీన్ చేసి పక్కనే ఉన్న అజింక్య రహానే వైపు తిప్పండి, ఆయన ముఖం చూడటానికి చాలా బాగుంటుంది, మాట్లాడటానికి కూడా మంచి వ్యక్తి" అని కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా మురళీ కార్తిక్ అద్దంలో చూసుకుంటూ తనను తాను చూసి మురిసిపోతుంటారని ఎద్దేవా చేశారు. దానికి కార్తిక్ "నేను అద్దంలో చూసుకోను, అది మీ అలవాటే" అని రీకౌంటర్ ఇచ్చారు.అయితే, పరిస్థితి మరింత చేయి దాటిపోయే సమయంలో ఇద్దరూ సంయమనం పాటించాడు. సోషల్ మీడియాలో దీనిపై రచ్చ జరుగుతుందని గ్రహించిన మంజ్రేకర్.. 'సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా ట్రోల్స్ వస్తాయి, ఫ్యాన్స్కు పండగే' అంటూ సరదగా వ్యాఖ్యానిస్తూ ఆ వివాదానికి తెరదించాడు.తొలి టెస్టులో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల టార్గెట్ను నిర్ధేశించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి లంక జట్టు 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. శ్రీలంక విజయానికి మరో 288 పరుగులు అవసరం కాగా, భారత్ గెలుపుకు ఆరు వికెట్లు అవసరం.Read: పెళ్లి చేసుకోనున్న సానియా మీర్జా? -
IND vs SL: గాలెలో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆల్రౌండ్ ప్రతిభతో ఆతిథ్య జట్టుకు 372 పరుగుల మేర మంచి లక్ష్యాన్ని విధించింది. కాగా గాలె వేదికగా భారత్- శ్రీలంక మధ్య శనివారం తొలి టెస్టు మొదలైన సంగతి తెలిసిందే.లంకకు సులువేనా?టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంకను 284 పరుగులకే కుప్పకూల్చింది. ఫలితంగా టీమిండియాకు 178 పరుగుల మేర భారీ ఆధిక్యం లభించింది.అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. మంగళవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా 193 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్లో దేవదత్ పడిక్కల్ 44, రిషభ్ పంత్ 66 పరుగులతో రాణించడంతో ఈ మేర టార్గెట్ సాధ్యమైంది. మరి టెస్టుల్లో శ్రీలంక అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?టెస్టుల్లో శ్రీలంక ఛేదించిన అత్యధిక లక్ష్యం ఎంతంటే?కొలంబో వేదికగా 2017లో జింబాబ్వేతో జరిగిన టెస్టులో శ్రీలంక 388 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు 2006లో కొలంబోలోనే సౌతాఫ్రికా విధించిన 352 పరుగుల టార్గెట్ను పూర్తి చేసింది.గాలెలో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాలేదుఅయితే, గాలెలో మాత్రం ఇప్పటి వరకు ఏ జట్టు కూడా టెస్టుల్లో 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించకపోవడం గమనార్హం. చివరగా 2022లో పాకిస్తాన్ ఆరు వికెట్లు కోల్పోయి 342 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఒకవేళ శ్రీలంక గనుక ఇప్పుడు టీమిండియా విధించిన టార్గెట్ పూర్తి చేస్తే గాలెలో అదే రికార్డు ఛేజింగ్ అవుతుంది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 21 పరుగులకే మూడు వికెట్లు ల్పోయింది. దీనిని బట్టి ఛేజింగ్ దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు. కాగా టీమిండియా- శ్రీలంక మధ్య తొలి టెస్టుకు బుధవారం (ఆగష్టు 19) ఆటకు చివరి రోజు.చదవండి: చరిత్ర సృష్టించిన పంత్ -
IND vs SL: విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్
SL Vs IND 1st Test Day-4 Updates: గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటైన టీమిండియా.. శ్రీలంకకు 372 పరుగుల టార్గెట్ విధించింది.గెలుపునకు 6 వికెట్ల దూరంలో భారత్శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో భారత్ గెలుపునకు 6 వికెట్ల దూరంలో ఉంది. 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో శ్రీలంక గెలవాలంటే చివరి రోజు 288 పరుగులు చేయాలి. ఇది అంతా సులువుగా జరిగే పని కాదు. భారత్ మాత్రం మరో 6 వికెట్లు తీస్తే విజయం సొంతం చేసుకుంటుంది. అయితే చివరి రోజు భారత గెలుపుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో సోనల్ దినుష (25), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (31) క్రీజ్లో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక21.4 ఓవర్: మానవ్ సుతార్ బౌలింగ్లో జురెల్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగిన లాహిరు ఉదార (16). శ్రీలంక స్కోరు: 47-4. సొనాల్ దినుష క్రీజులోకి రాగా.. ధనంజయ 19 పరుగులతో ఉన్నాడు.15 ఓవర్లలో శ్రీలంక స్కోరు: 33-3ఉదార 15, ధనంజయ 7 పరుగులతో ఉన్నారు. విజయానికి 339 పరుగుల దూరంలో శ్రీలంక.మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక10.4 ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించిన కమిందు మెండిస్. రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన కమిందు. లంక స్కోరు: 21-3. ఉదార 11 పరుగులతో ఉండగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ క్రీజులోకి వచ్చాడు.రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక7.2 ఓవర్: మానవ్ సుతార్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా పెవిలియన్ చేరిన పసిందు. అరంగేట్రంలోనే డకౌట్గా పసిందు. లంక స్కోరు 14-2. ఉదార 6 పరుగులతో ఉండగా.. కమిందు మెండిస్ క్రీజులోకి వచ్చాడు.తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక6.6: సిరాజ్ బౌలింగ్లో ప్రసిద్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన నిశాన్ మధుష్క (6). లంక స్కోరు 13-1 (7). విజయానికి ఇంకా 359 పరుగులు కావాలి. ఉదార 5 పరుగులతో ఉండగా.. పసిందు సూరియబండారా క్రీజులోకి వచ్చాడు.లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకఆరు ఓవర్లలో స్కోరు: 12-0ఉదార 4, నిశాన్ 6 పరుగులతో ఉన్నారు. విజయానికి ఇంకా 360 పరుగులు కావాలి.వర్షం వల్ల అంతరాయంశ్రీలంక లక్ష్య ఛేదనకు దిగాల్సి ఉండగా.. వాన వల్ల అంతరాయం కలిగింది193 పరుగులకు ఆలౌటైన టీమిండియాభారత్ రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటైంది. తద్వారా శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్ను ఉంచింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్190 పరుగుల వద్ద భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో ధనంజయ డిసిల్వకు క్యాచ్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ (5) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్188 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అశిత ఫెర్నాండో బౌలింగ్లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి మానవ్ సుతార్ (9) ఔటయ్యాడు.9 పరుగులు చేసిన జడేజాను లాహిరు కుమారా పెవిలియన్ చేర్చడంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 357 పరుగులుగా ఉంది.పంత్ (66) ఔట్66 పరుగులు చేసిన పంత్ కుమారా బౌలింగ్లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో టీమిండియా 174 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 352 పరుగులుగా ఉంది.సిక్సర్తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న పంత్లాహిరు కుమారా బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టిన పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 54 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న పంత్ ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. భారత్ ఆధిక్యం 336 పరుగులు.36 ఓవర్లలో టీమిండియా స్కోరు 151-5పంత్ 47, జడేజా 4 పరుగులతో ఉన్నారు. భారత్ ఆధిక్యం 329 పరుగులు.ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియాఅసితా ఫెర్నాండో బౌలింగ్లో నిరోషన్ డిక్విల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ధ్రువ్ జురెల్ (7). క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా. టీమిండియా స్కోరు 120-5 (31). పంత్ 23 పరుగులతో ఉన్నాడు.లంచ్ తర్వాత మొదలైన ఆటలంచ్ విరామంగాలే టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (21), ధ్రువ్ జురెల్ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 294 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో రాణించిన పడిక్కల్ (44) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా, రాహుల్ (35) పర్వాలేదనిపించాడు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 2 వికెట్లు తీయగా, కెషారా, అశితా ఫెర్నాండో చెరో వికెట్ పడగొట్టారు.పడిక్కల్ ఔట్.. నాలుగో వికెట్ డౌన్టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్లో తడబడుతోంది. వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు చేజార్చుకుంటుంది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో పడిక్కల్ 44 పరుగుల వద్ద కెషారా నువంతా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 111 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 289 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.మూడో వికెట్ కోల్పోయిన టీమిండియాఇన్నింగ్స్ 21వ ఓవర్లో శుబ్మన్ గిల్ (8) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. పడిక్కల్ (35), పంత్ (1) పరుగుతో ఆడుతున్నారు.రెండో వికెట్ డౌన్65 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (35) రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రబాత్ జయసూరియా బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన రాహుల్ మిలన్ రత్ననాయకేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 243 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.ఫిఫ్టీ మార్క్ దాటిన టీమిండియారెండో ఇన్నింగ్స్లో 14 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 30, పడిక్కల్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు భారత్ 237 పరుగుల ఆధిక్యంలో ఉంది.తొలి వికెట్ డౌన్గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 178 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. అశితా ఫెర్నాండో బౌలింగ్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (1), పడిక్కల్ (10) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌటైంది. దినూష (100) శతకంతో రాణించగా, నిరోషన్ డిక్వెల్లా (80) అర్ధసెంచరీ చేశాడు. ఒకదశలో లంక 90/5 వద్ద కష్టాల్లో ఉండగా వీరిద్దరు ఆరో వికెట్కు 36.1 ఓవర్లలో 146 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్కు 4, జడేజాకు 3 వికెట్లు దక్కాయి. భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 13 ఓవర్లు ఆడాల్సి ఉన్నా... వెలుతురులేమి వల్ల ఆట సాధ్యం కాలేదు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 460/9తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 4 బంతులాడి తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
చెలరేగిన భారత బౌలర్లు.. శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. ఫలితంగా భోజన విరామ సమయానికి శ్రీలంక సగం వికెట్లు కోల్పోయి కేవలం 99 పరుగులే చేయగలిగింది.కాగా గాలె వేదికగా 460/9 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. మరో రెండు పరుగులు జోడించి (462) ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక బ్యాటింగ్కు దిగగా ఆది నుంచే భారత బౌలర్లు చుక్కలు చూపించారు. Early breakthrough for Team India! 💥Mohammed Siraj strikes with just the second ball.Watch #SLvIND, 1st Test | Day 3, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #SLvIND #MohammedSiraj #BeautifulGameOfTestCricket pic.twitter.com/zHSQOGD0jj— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026సిరాజ్ మొదలు పెట్టగా..ఓపెనర్లలో నిశాన్ ఫెర్నాండోను పేసర్ మహ్మద్ సిరాజ్ డకౌట్ చేయగా.. లాహిరు ఉదార 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్పిన్నర్ మానవ్ సుతార్ బౌలింగ్లో అవుటయ్యాడు.మానవ్ సుతార్కు రెండుఇక వన్డౌన్లో వచ్చిన దినేశ్ చండిమాల్ (4)ను స్వల్ప స్కోరుకే మానవ్ పెవిలియన్కు పంపాడు. కమిందు మెండిస్ (14) కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఇచ్చిన క్యాచ్ను కెప్టెన్ శుబ్మన్ గిల్ అద్భుత రీతిలో ఒడిసిపట్టగా.. లంక నాలుగో వికెట్ కోల్పోయింది.Manav Suthar lures Chandimal into the edge, and Rishabh Pant makes no mistake behind the stumps! 🧤 Watch #SLvIND, 1st Test | Day 3, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #SLvIND #BeautifulGameOfTestCricket pic.twitter.com/Dsy7xz9Ciw— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026ఇక కెప్టెన్ ధనంజయ డి సిల్వ (21) రవీంద్ర జడేజా బౌలింగ్లో కేఎల్ రాహుల్కు ఊహించని రీతిలో క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్గా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో సోమవారం లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక 28 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులే చేసింది. సొనాల్ దినుష 14, నిరోషన్ డెక్విల్లా 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే లంక ఇంకా 363 పరుగులు వెనుకబడి ఉంది. ఇదిలా ఉంటే.. తొలి సెషన్లో భారత స్పిన్నర్లు మానవ్, కుల్దీప్, జడేజా కలిసి నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం.చదవండి: పంత్ చేయలేనిది.. బట్లర్ చేశాడు.. సంతోషం -
SL Vs IND: శ్రీలంక ఆలౌట్.. మూడో రోజు ముగిసిన ఆట
గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. సోమవారం బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక 284 పరుగులకు ఆలౌట్ అయింది. దినుష సెంచరీ (100), నిరోషన్ డిక్విల్లా 80 పరుగులతో అదరగొట్టారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అంతకు ముందు భారత్ 462 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక లంక 284 పరుగులకు ఆలౌట్ కావడంతో.. భారత్కు 178 పరుగుల మేర భారీ ఆధిక్యం లభించింది. కాగా ముగిసిన మూడో రోజు ఆటలంక ఇన్నింగ్స్ తర్వాత ఆకాశం నల్లని మబ్బులతో నిండిపోయింది. దీంతోగ్రౌండ్ సిబ్బంది వచ్చి కవర్లతో పిచ్ను కప్పివేశారు. భారీ వర్షం పడే సూచనలు ఉండటంతో మూడో రోజు ఆటను అంతటితో ముగించేశారు.UPDATESసొనాల్ దినుష అవుట్సెంచరీ పూర్తి చేసుకున్న సొనాల్ జడ్డూ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోగా.. అసిత ఫెర్నాండో క్రీజులోకి వచ్చాడు. లాహిరు కుమార 0 పరుగులతో ఉన్నాడు. లంక స్కోరు: 274-9.ఎనిమిదో వికెట్ డౌన్మానవ్ సుతార్ బౌలింగ్లో జురెల్కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన ప్రభాత్ జయసూర్య (10). లంక స్కోరు 274-8 (78). లాహిరు కుమార క్రీజులోకి రాగా.. దినుష 100 పరుగులతో ఉన్నాడు.శతక్కొట్టిన దినుష167 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్న దినుష. మానవ్ సుతార్ బౌలింగ్లో సింగిల్ తీసి టెస్టుల్లో తొలి శతకం నమోదు చేసిన దినుష.ఏడో వికెట్ డౌన్66.4: జడేజా బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్గా పెవిలియన్ చేరిన కేశారా (2). లంక స్కోరు: 243-7. ప్రభాత్ జయసూర్య క్రీజులోకి రాగా.. దినుష 79 పరుగులతో ఆడుతున్నాడు.ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంకక్రీజులో పాతుకుపోయిన నిరోషన్ డిక్వెల్లా- సొనాల్ దినుష జోడీని ప్రసిద్ కృష్ణ విడదీశాడు. ప్రసిద్ బౌలింగ్లో రిషభ్ పంత్కు క్యాచ్ ఇచ్చిన డిక్వెల్లా ఆరో వికెట్గా పెవిలియన్ చేరాడు. 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అతడి స్థానంలో కేశారా నువాంత క్రీజులోకి రాగా.. దినుష 74 పరుగులతో ఆడుతున్నాడు. లంక స్కోరు: 236-6 (61.5). కాగా దినుషతో కలిసి డిక్విల్లా ఆరో వికెట్కు 146 పరుగులు జోడించాడు.టీ విరామానికి శ్రీలంక స్కోర్: 214/5టీ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో సోనల్(62), డిక్వెల్లా(71) ఉన్నారు. లంక ఇంకా తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే 248 పరుగులు వెనకబడి ఉంది.సొనాల్ అర్ధ శతకంకుల్దీప్ బౌలింగ్లో సింగిల్ తీసి సొనాల్ దినుష.. 92 బంతులలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంకస్కోరు: 184-5 (49)ఫిఫ్టీ బాదిన డిక్వెల్లానిరోషన్ డిక్వెల్లా 68 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 5 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం లంక 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దినూష (39) అతడికి సహకరిస్తున్నాడు.దినూష, డిక్వెల్లా నిలకడలంచ్ విరామం అనంతరం లంక ఆట తిరిగి గాడిన పడింది. మిడిలార్డర్లో దినూష (34), డిక్వెల్లా (38) నిలకడగా ఆడుతుండడంతో లంక జట్టు 150 పరుగుల మార్క్ను దాటింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్కు లంక మరో 311 పరుగులు వెనుకబడి ఉంది.👉 లంచ్ విరామం అనంతరం ఆట తిరిగి ప్రారంభమైంది. 30 ఓవర్లు ముగిసేసరికి లంక ఐదు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. దినుష (20), నిరోషన్ డిక్వెల్లా (12) పరుగులతో క్రీజులో ఉన్నారు.లంచ్ విరామంలంచ్ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. సోనాల్ దినుష (14), నిరోషన్ డిక్వెల్లా (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. మానవ్ సుతార్ రెండు, కుల్దీప్, జడేజా, సిరాజ్ తలా ఒక వికెట్ తీశారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. లంక కోల్పోయిన ఐదు వికెట్లలో నాలుగు స్పిన్నర్లకే దక్కడం విశేషం. శ్రీలంక మరో 363 పరుగులు వెనుకబడి ఉంది.ఐదో వికెట్ డౌన్26.1: రవీంద్ర జడేజా బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ధనంజయ డి సిల్వ (21). లంక స్కోరు 90-5 (26.1). సొనాల్ 13 పరుగులతో ఉండగా.. నిరోషన్ డెక్విల్లా క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక16.1: కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శుబ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగిన కమిందు మెండిస్ (14). క్రీజులోకి వచ్చిన సొనాల్ దినుష. 17 ఓవర్లలో లంక స్కోరు: 62-4. మూడో వికెట్ డౌన్53 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక కష్టాల్లో పడింది. 27 పరుగులు చేసిన లాహిరు ఉదారా మానవ్ సుతార్ బౌలింగ్లో జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫిఫ్టీ మార్క్ దాటిన లంకశ్రీలంక 50 పరుగుల మార్క్ను దాటింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ, లాహిరు ఉదారా (27 బ్యాటింగ్), కమిందు మెండిస్ (12 బ్యాటింగ్) ఆడుతుండడంతో లంక కుదురుకుంది. ప్రస్తుతం 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.రెండో వికెట్ డౌన్తొలి టెస్టులో శ్రీలంక 27 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. మానవ్ సుతార్ బౌలింగ్లో 4 పరుగులు చేసిన దినేశ్ చందిమల్ కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లంక 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.👉6 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. లాహిరు ఉడారా (10), చందిమల్ (4) క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన లంకతమ ఇన్నింగ్స్ ఆరంభంలోనే శ్రీలంకకు షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్లో ఓపెనర్ నిశాన్ ఫెర్నాండో డకౌట్ అయ్యాడు. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైంది. 460 పరుగుల ఓవర్నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించిన అనంతరం చివరి వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (167) సెంచరీతో రాణించగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధశతకాలతో మెరిశారు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు తీయగా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు.👉అయితే రెండో రోజు ఆటలో దాదాపు సగం వర్షార్పణమయింది. దీంతో 47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే మూడో రోజు మాత్రం ఉదయం నుంచి ఎండ కాస్తుండడం శుభ పరిణామం. అయితే మూడో రోజు నుంచి పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే మాత్రం బ్యాటింగ్ కష్టంగా మారనుంది.👉ఇక తొలి రోజు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మంచి పునాది వేసుకున్న టీమిండియా... రెండో రోజు దాన్ని మరింత బలపరుచుకుంది. ఓవర్నైట్ స్కోరు 288/2తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండో రోజు 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది.👉 సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ (230 బంతుల్లో 167; 15 ఫోర్లు, 1 సిక్స్) క్రితం రోజు స్కోరుకు మరో 36 పరుగులు జోడించి అవుట్ కాగా... ధ్రువ్ జురేల్ (68 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. గాయం నుంచి కోలుకొని బ్యాటింగ్కు వచ్చిన కేఎల్ రాహుల్ (175 బంతుల్లో 82; 10 ఫోర్లు, 1 సిక్స్) మరో ఐదు పరుగులే చేశాడు.Innings Break!#TeamIndia post 4⃣6⃣2⃣ in the first innings 👏👏Devdutt Padikkal top-scores with 1⃣6⃣7⃣ 🫡Fifties from KL Rahul & Dhruv Jurel 👌Over to our bowlers 💪Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y#SLvIND pic.twitter.com/cdMA1JyumY— BCCI (@BCCI) August 17, 2026 -
క్రికెట్ చరిత్రలో అద్భుతం.. నాడు కోహ్లి, నేడు పడిక్కల్!
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా క్రికెటర్ దేవదత్ పడిక్కల్ అజేయ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో పడిక్కల్కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక రికార్డు విషయంలో మాత్రం పడిక్కల్ తన గురువు విరాట్ కోహ్లితో సమంగా నిలిచాడు. అదేంటంటే విరాట్ కోహ్లి తన తొలి టెస్టు సెంచరీని రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) రోజున చేశాడు. 2012 జనవరి 26న అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో కోహ్లి 116 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లికి టెస్టుల్లో అదే తొలి సెంచరీ కావడం విశేషం. తాజాగా దేవదత్ పడిక్కల్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన తొలి టెస్టు సెంచరీని బాదడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. ఇలా తన గురువు కోహ్లి రిపబ్లిక్ డే రోజున మెయిడెన్ టెస్టు శతకం సాధిస్తే.. శిష్యుడు పడిక్కల్ ఇండిపెండెన్స్ రోజున తొలి టెస్టు శతకం అందుకోవడం గమనార్హం. మరో విషయమేంటంటే.. రిపబ్లిక్ డే రోజున సెంచరీ చేసిన ఒకే ఒక్క బ్యాటర్గా కోహ్లి చరిత్ర సృష్టిస్తే.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున టీమిండియా తరఫున సెంచరీ బాదిన ఏకైక క్రికెటర్గా పడిక్కల్ రికార్డులకెక్కాడు. కోహ్లి ఇండిపెండెన్స్ రోజున కూడా సెంచరీ బాదినప్పటికీ, అది వన్డే ఫార్మాట్లో వచ్చింది.తొలి బ్యాటర్గా రికార్డుపడిక్కల్ కంటే ముందు భారత తరపున ఏ బ్యాటర్ కూడా ఇండిపెండెన్స్ డే రోజు టెస్టుల్లో మూడంకెల స్కోర్ను అందుకోలేదు. గతంలో విరాట్ కోహ్లి వెస్టిండీస్పై ఆగస్టు 15న వన్డే సెంచరీ చేయగా.. టెస్టు సెంచరీ చేసింది మాత్రం పడిక్కలే కావడం గమనార్హం. అదేవిధంగా 21వ శతాబ్దంలో టీమిండియా తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి టెస్ట్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్గా పడిక్కల్ రికార్డులెక్కాడు.పడిక్కల్ కంటే ముందు సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్గా భారత్ తరఫున నెంబర్ 3 పొజిషన్లో టెస్ట్ సెంచరీ సాధించిన ఎడమ చేతి వాటం బ్యాటర్గా సలీమ్ దురానీ, బాపూ నాడ్కర్ణి, అజిత్ వాడేకర్, ఏక్నాథ్ సోల్కర్, సురీందర్ అమర్నాథ్, వినోద్ కాంబ్లీ పడిక్కల్ చేరాడు.Virat Kohli was the only Indian batter to score a century on Republic Day, achieving the feat in 2012, which was also his maiden Test century. 🇮🇳Now, Devdutt Padikkal becomes the only Indian batter to score a century on Independence Day, and it’s his maiden Test century too!… pic.twitter.com/CxgE0Q3VnV— CREX (@Crex_live) August 15, 2026Read: మూడో స్థానంపై బేఫికర్.. గిల్ నమ్మినబంటు పడిక్కల్ -
IND vs SL: టీమిండియాకు ఊహించని షాక్!
శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఫామ్లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. టీ విరామం అనంతరం తిరిగి బ్యాటింగ్కు వచ్చిన అతడు.. కండరాలు పట్టేయడంతో వెంటనే మైదానాన్ని వీడాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా రెండు మ్యాచ్లు ఆడేందుకు శ్రీలంకకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలె వేదికగా శనివారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.77 పరుగులుఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (32) రనౌట్ కాగా.. కేఎల్ రాహుల్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టీ విరామానికి ముందు ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మొత్తంగా 162 బంతులు ఎదుర్కొని.. తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 77 పరుగులు సాధించాడు.చేయి నొప్పిఈ క్రమంలో రాహుల్ సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ్ల.. టీ బ్రేక్ నుంచి రాగానే ఒక్కసారిగా అసౌకర్యానికి గురయ్యాడు. బ్యాటింగ్కు వెళ్లే ముందే తన కుడిచేయి నొప్పిగా ఉందని అంపైర్కు ఫిర్యాదు చేశాడు. డ్రెసింగ్రూమ్ నుంచి ఫిజియో వచ్చేలోగా.. మరో ఎండ్లో ఉన్న దేవదత్ పడిక్కల్ వచ్చి.. రాహుల్ చేయిని స్ట్రెచ్ చేశాడు. దీంతో అతడికి నొప్పి మరింత ఎక్కువైంది.కుంటుకుంటూఇంతలో ఎడమ చేయి కూడా నొప్పి పుట్టడంతో రాహుల్ విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి పరిశీలించగా.. రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. వెళ్తున్నపుడు కూడా రాహుల్ కుంటుతూ నడవడం ఆందోళనకరంగా పరిణమించింది. ఫిజియో సాయం లేకుండా అతడు అసలు నిల్చోలేకపోయాడు. ఇక రాహుల్ స్థానంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ క్రీజులోకి రాగా.. వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ శతకం పూర్తి చేసుకున్నాడు. టెస్టు కెరీర్లో అతడికి ఇదే తొలి సెంచరీ.గాయాల బెడదఇదిలా ఉంటే.. ఇప్పటికే టీమిండియా గాయాల బెడదతో సతమతమవుతోంది. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ గాయాల బారిన పడి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్నారు. తాజాగా రాహుల్ కూడా గాయపడటం టీమిండియా శిబిరంలో కలకలం రేపుతోంది.చదవండి: జైసూను రనౌట్ చేయనా?.. తప్పేముంది?.. కానివ్వు! -
సెంచరీ కొట్టిన టీమిండియా
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా మెరుగైన ఆరంభం అందుకుంది. భోజన విరామ సమయానికి వంద పరుగుల మార్కు దాటింది. గాలె వేదికగా శనివారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.జైసూ రనౌట్ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతూ మంచి ఆరంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్తో సమన్వయ లోపం కారణంగా.. అనూహ్య రీతిలో రనౌట్ అయ్యాడు. ఇందుకు లంక బౌలర్ కేశారా నువాంత కూడా ఒక రకంగా కారణమే.ఇక మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్.. ఐదు ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసి.. తొలి వికెట్గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్తో కలిసి తొలి వికెట్కు 47 పరుగులు జోడించాడు. అనంతరం.. ఆచితూచి ఆడుతున్న రాహుల్కు జతైన దేవదత్ పడిక్కల్ దూకుడుగానే మొదలుపెట్టాడు.నిలకడగా..ఈ క్రమంలో భోజన విరామ సమయానికి 27 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 77 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 32 పరుగులు... పడిక్కల్ 49 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ బాది 35 పరుగులతో క్రీజులో నిలిచారు. UPDATEఇదిలా ఉంటే.. వర్షం వల్ల లంచ్ తర్వాత ఆటకు అంతరాయం కలిగింది. మైదానం తడిగా ఉన్నందున దాదాపు గంట సేపు ఆటను నిలిపివేశారు. రెండింటికి మళ్లీ ఆట మొదలైంది.తుది జట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.శ్రీలంకలాహిరు ఉదార, నిషాన్ మదుష్క, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), కేశర నువంత, ప్రబాత్ జయసూర్య, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.చదవండి: సన్రైజర్స్ కొంపముంచిన క్లాసెన్! -
IND vs SL: తొలి రోజు భారత్దే
Sri Lanka Vs India 1st Test Live Updates: గాలే వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత బ్యాటర్లు అదరగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్(131), రిషబ్ పంత్(27) ఉన్నారు.శుబ్మన్ గిల్ అవుట్61.5: ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో లాహిరు ఉదారకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్గా వెనుదిరిగిన గిల్ (16). స్కోరు 236-2. పడిక్కల్ 107 పరుగులతో ఉన్నాడు. పంత్ క్రీజులోకి వచ్చాడు.పడిక్కల్ సెంచరీటీమిండియా వన్డౌన్బ్యాటర్ దేవదత్ పడిక్కల్ శతక్కొట్టాడు. 134 బంతులలో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టీమిండియా స్కోరు: 235/1(61). పడిక్కల్ 106, గిల్ 16 పరుగులతో ఉన్నారు.కేఎల్ రాహుల్కు గాయంటీమిండియాకు భారీ షాక్ తగిలింది. సెంచరీ దిశగా దూసుకుపోతున్న కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. దీంతో అతడు రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అతడిస్థానంలో కెప్టెన్ గిల్ వచ్చాడు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీటీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీ మార్క్ను పూర్తి చేసుకున్నాడు. 46 ఓవర్లకు భారత్ స్కోర్: 166/1. క్రీజులో రాహుల్(53), పడిక్కల్(78) ఉన్నారు.పడిక్కల్ హాఫ్ సెంచరీదేవ్దత్త్ పడిక్కల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 81 బంతుల్లో తన రెండో ఆర్ధ శతకాన్ని అతడు అందుకున్నాడు. 37 ఓవర్లకు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్తో పాటు రాహుల్(41) ఉన్నాడు.తిరిగి మొదలైన ఆట2 PM: వాన తెరిపినివ్వడంతో ఆట మళ్లీ మొదలైంది.మొదలైన జల్లులు!12.38 PM: గాలెలో చిరుజల్లులు మొదలయ్యాయి. ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో గ్రౌండ్ సిబ్బంది వచ్చి పిచ్ను కవర్లతో కప్పుతున్నట్లు సమాచారం. వాన వల్ల ఆటకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.లంచ్ బ్రేక్: టీమిండియా స్కోరు 101/1లంకతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు లంచ్ సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. పడిక్కల్ (35), కేఎల్ రాహుల్ (32) పరుగులతో ఆడుతున్నారు. తొలి సెషన్లో జైస్వాల్ రనౌట్ మినహా భారత బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. Lunch on Day 1 of the First #SLvIND Test.A solid morning session as #TeamIndia move to 101/1 👌👌Stay tuned for the second session of the day. Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y pic.twitter.com/ru1NamfAn4— BCCI (@BCCI) August 15, 2026జైసూ స్థానంలోక్రీజులోకి పడిక్కల్👉18 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (22), పడిక్కల్ (20) పరుగులతో ఆడుతున్నారు.👉 లంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్తో జరిగిన సమన్వయ లోపంతో ఇద్దరు ఒకే ఎండ్కు రావడంతో జైస్వాల్ (32) రనౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.👉 8 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. జైస్వాల్ (23), కేఎల్ రాహుల్ (10) పరుగులతో ఆడుతున్నారు.రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గాలే వేదికగా శనివారం శ్రీలంక, భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సర్ఫరాజ్ ఖాన్ ఆడుతాడని అంతా భావించినప్పటికీ గిల్ మాత్రం ధ్రువ్ జురెల్వైపే మొగ్గుచూపాడు. ఇక ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్తో బరిలోకి దిగింది.తుది జట్లు:టీమిండియా : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.శ్రీలంక: లాహిరు ఉదార, నిషాన్ మదుష్క, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), కేశర నువంత, ప్రబాత్ జయసూర్య, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.1932లో తొలి టెస్టు ఆడిన టీమిండియాకు ఇది 600వ మ్యాచ్ కానుండగా... మైలురాయి మ్యాచ్లో విజయం సాధించాలని శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు టీమిండియా 9 టెస్టులు ఆడనుంది. ఇందులో ఏడింట గెలిస్తే భారత్ నేరుగా తుదిపోరుకు అర్హత సాధించనుంది. దీంతో విజయమే లక్ష్యంగా గిల్ సేన బరిలోకి దిగనుంది. గౌతమ్ గంభీర్ కోచింగ్లో టి20 ప్రపంచకప్, ఆసియాకప్, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియా... సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. దీంతో గంభీర్పై కూడా అదనపు ఒత్తిడి ఉంది. 2017లో విరాట్ కోహ్లి సారథ్యంలో లంకలో పర్యటించిన భారత జట్టు మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. ఆ సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్లతో దట్టంగా ఉండగా... ఇప్పుడు అలాంటి అనుభవజ్ఞులు కరువయ్యారు. Captain Shubman Gill wins the toss and elects to bat first at Galle.A look at our Playing XI for the game.Live - https://t.co/bg2q0J2x1f #SLvIND pic.twitter.com/ll2Xa9sTm3— BCCI (@BCCI) August 15, 2026 టీమిండియా పంద్రాగష్టు సంబరాలు హెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. On the occasion of Independence Day, #TeamIndia gathered at Galle to hoist the Tricolour 🇮🇳 ahead of the First #SLvIND Test.#IndependenceDay pic.twitter.com/tHKIggV6AU— BCCI (@BCCI) August 15, 2026 -
మాదే పైచేయి: టీమిండియాకు శ్రీలంక కెప్టెన్ వార్నింగ్
టెస్టు సిరీస్ నేపథ్యంలో శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వ టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు. సాధారణంగా లంకలో స్పిన్నింగ్ వికెట్లు ఉంటాయని.. కానీ ఈసారి వర్షాల వల్ల పరిస్థితిలో కాస్త మార్పు ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా భారత్- శ్రీలంక మధ్య రెండు టెస్టులకు షెడ్యూల్ ఖరారైంది.పిచ్లు అంత పొడిగా ఉండవుగాలె వేదికగా ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు మొదలుకానున్న నేపథ్యంలో లంక సారథి ధనంజయ డి సిల్వ మీడియాతో మాట్లాడాడు. ‘‘సాధారణంగా శ్రీలంకలో టర్నింగ్ వికెట్లు ఉంటాయి. అయితే, ప్రస్తుతం వాతావరణం వేరుగా ఉంది. వర్షాలు పడుతున్నాయి కాబట్టి పిచ్లు అంత పొడిగా ఉండవు.ఆట స్వరూపాన్నే మార్చివేయగలరుఇక మా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. పిచ్లు కాస్త అనుకూలంగా ఉన్నా.. ఆట మొదలైన 2-3 రోజులు ఉపయోగకరంగా ఉంటాయి. ఆతర్వాత పిచ్ టర్న్ కావడం మొదలవుతుంది. స్పిన్నర్లే మా ప్రధాన ఆయుధం అయినప్పటికీ.. మా జట్టులో కొంతమంది నైపుణ్యాలున్న సీమర్లు కూడా ఉన్నారు.కివీస్, సౌతాఫ్రికా చేతిలో వైట్వాష్లుఆట స్వరూపాన్నే వారు మార్చివేయగలరు’’ అని ధనంజయ డి సిల్వ గిల్ సేనకు హెచ్చరికలు జారీ చేశాడు. అదే విధంగా.. ‘‘ఇండియాలోనూ టర్నింగ్ వికెట్లు ఉంటాయి. అయితే, స్వదేశంలో టీమిండియా న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల చేతుల్లో వైట్వాష్ అయింది.మాదే పైచేయి.. అతడే మా బలంఈ సిరీస్లలో వాళ్లు విఫలమైనప్పటికీ పూర్తిగా టర్నింగ్ వికెట్ల మీద పట్టు కోల్పోయారని కాదు. తిరిగి పుంజుకునేందుకు వాళ్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, గణాంకాల పరంగా చూస్తే మాదే పైచేయి. ముఖ్యంగా ఇరుజట్లలోనూ గాలెలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా ప్రభాత్ జయసూర్య ఉన్నాడు.అతడి అనుభవం మాకు తప్పక ఉపయోగపడుతుంది. శ్రీలంకలో పర్యటిస్తున్న జట్ల బ్యాటర్లపై చాలా ఏళ్లుగా అతడు ఆధిపత్యం కనబరుస్తున్నాడు. ఈ స్పిన్ బౌలర్ మా ప్రధానం బలం.బుమ్రా లేకున్నా..ఇక టీమిండియా తమ ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలు కోల్పోయింది. వారికి అది అతిపెద్ద లోటు. అయితే, మిగతా బౌలర్లను ఎదుర్కొనేందుకు కూడా మేము బాగా హోంవర్క్ చేసి.. పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాము.ఏదేమైనా అంతర్జాతీయ మ్యాచ్లలో ఆడటం అంత తేలిక కాదు. నాలుగు, ఐదో రోజు కూడా ఆట పూర్తిగా మారిపోతుంది. టీమిండియాను ఓడించడానికి గొప్ప అవకాశం మా ముందుంది. మేము ఇది సాధిస్తామనే నమ్మకం నాకు ఉంది’’ అని ధనంజయ డి సిల్వ పేర్కొన్నాడు. కాగా 2017 తర్వాత టీమిండియా తొలిసారి శ్రీలంక గడ్డ మీద టెస్టు సిరీస్ ఆడుతోంది. కెప్టెన్ శుబ్మన్ గిల్ సహా జట్టులోని మెజారిటీ మంది ఆటగాళ్లకు లంకలో టెస్టులు ఆడటం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. తొలి టెస్టుకు ముందు శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో జరిగిన మ్యాచ్లో భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆరంభంలో పేసర్లు వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడ్డా ఆ తర్వాత ప్రభావం చూపగలిగారు. కొలంబో వికెట్ పాతబడే కొద్ది బ్యాటర్లకు కాస్త అనుకూలించింది. చదవండి: ఆసీస్ గడ్డ మీద చరిత్ర సృష్టించిన బంగ్లా పేసర్ -
తొలి టెస్టుకు వర్షం ముప్పు.. గాలే చేరుకున్న టీమిండియా
శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆగస్టు 5న లంక గడ్డపై అడుగుపెట్టింది. ఆగస్టు 7 నుంచి మూడు రోజుల పాటు కొలంబో వేదికగా లంక ఎలెవెన్తో వార్మప్ మ్యాచ్ ఆడిన టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. వార్మప్ మ్యాచ్ ఇచ్చిన విజయం జోష్తో టీమిండియా తొలి టెస్టు ఆడేందుకు గాలేలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా గాలే ఎయిర్పోర్టు నుంచి టీమిండియా ఆటగాళ్లు బయటికి వస్తున్న ఫొటోలను బీసీసీఐ బుధవారం ఎక్స్ వేదికగా పంచుకుంది. జడేజా, పంత్, జైస్వాల్, సిరాజ్, సర్ఫరాజ్ ఖాన్ సహా ఇతర ఆటగాళ్లు, కోచ్ గంభీర్ కనిపించారు. ఆ తర్వాత ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక బస్సులో గాలే స్టేడియం సమీపంలోని హోటల్కు చేరుకున్నారు. బుధవారం విశ్రాంతి తీసుకోనున్న గిల్ సేన గురువారం ప్రాక్టీస్ చేయనుంది. శనివారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.దంచికొట్టిన వాన..అయితే గాలేలో వాతావరణం రెండు రోజుల నుంచి చల్లగానే ఉంది. సోమవారం నుంచి మేఘావృతమై ఉన్న గాలేలో మంగళవారం వాన దంచికొట్టింది. రాబోయే రెండు, మూడు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉండడంతో తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ టెస్టు సిరీస్ రెండు జట్లకు కీలకమే. 2027లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్లో విజయం తప్పనిసరి. ఒక్క మ్యాచ్ రద్దయినా అవకాశాలు సంక్లిష్టం కానున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక ఆరో స్థానంలో కొనసాగుతోంది.కోహ్లి కెప్టెన్సీలో ఘన విజయంగాలేలో గతంలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. 2017లో కోహ్లి కెప్టెన్సీలో గాలే వేదికగా శ్రీలంకతో ఆడిన టెస్టులో ఇన్నింగ్స్ 304 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 600 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ (190), పుజారా (153) సెంచరీలతో చెలరేగారు. లంక తమ తొలి ఇన్నింగ్స్లో 291 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో కోహ్లి సెంచరీ, అభినవ్ ముకుంద్ 81 పరుగులు చేయడంతో టీమిండియా 241 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో లంక ముంగిట 550 పరుగుల భారీ టార్గెట్ను ఉంచగా, భారత బౌలర్ల ధాటికి లంక 245 పరుగులకే కుప్పకూలింది. దీంతో గాలే టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. జడేజా ఒక్కడే..కాగా అప్పటి జట్టులో సభ్యుడిగా ఉన్న జడేజాకు మాత్రమే గాలేలో ఆడిన అనుభవముంది. పడిక్కల్, గుర్నూర్ బ్రార్, సారాంశ్ జైన్, అకిబ్ నబీలు ఇటీవలే ఇదే గాలే వేదికగా లంక-ఏ జట్టుతో అనధికారిక టెస్టు ఆడిన సంగతి తెలిసిందే. ఇక తొలి టెస్టు శనివారం నుంచి జరగనుండగా, రెండో టెస్టు కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు జరగనుంది.Colombo 🚌 Galle#TeamIndia have arrived for the #SLvIND Test series opener 🙌 pic.twitter.com/UXoo0gTzCv— BCCI (@BCCI) August 12, 2026Read: బంగ్లాను తేలిగ్గా తీసుకోం.. బలమైన జట్టుతోనే బరిలోకి! -
టెస్టుల్లో ఎవరికీ సాధ్యం కాలేదు.. జైస్వాల్ సరికొత్త ఫీట్
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్లో ఒక అరుదైన ఫీట్ సాధించాడు. బహుశా జైస్వాల్ సాధించిన ఫీట్ ఎవరికీ సాధ్యం కాలేదనుకుంటా. ఇప్పటివరకు జైస్వాల్ తన కెరీర్లో 29 టెస్టు మ్యాచ్లు ఆడితే అవన్నీ వివిధ వేదికల్లోనే ఆడడం విశేషం. మాములుగా ఒక ఆటగాడు వేర్వేరు వేదికల్లోనే మ్యాచ్లు ఆడినప్పటికీ, కొన్నిసార్లు ఒకే మైదానంలో మ్యాచ్లు ఆడడం చూస్తుంటాం.కానీ జైస్వాల్ విషయంలో మాత్రం లెక్క మారింది. అతడు ఆడిన 29 టెస్టులకు సంబంధించిన వేదికలు మళ్లీ రిపీట్ కాకపోవమే ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో జైస్వాల్ ఫీట్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘటనగా నిలిచిపోనుంది. ఇక శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్లోని తొలి మ్యాచ్ ద్వారా అతను తన 30వ టెస్టు మ్యాచ్ను గాలే వేదికగా ఆడబోతున్నాడు. గాలేలో జైస్వాల్కు ఇదే తొలి మ్యాచ్ కావడంతో, ఈ 30వ మ్యాచ్ ద్వారా కూడా అతని వేదికల వైవిధ్యం సజీవంగా కొనసాగనుంది. ఇక శ్రీలంక ఎలెవెన్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో అర్ధసెంచరీ చేయడం ద్వారా జైస్వాల్ టచ్లోకి వచ్చినట్లు అనిపిస్తోంది. ఇప్పటివరకు జైస్వాల్ 29 టెస్టుల్లో 48.75 సగటుతో మొత్తం 2,535 పరుగులు చేశాడు. ఇందులో 7 శతకాలు, 13 అర్ధ శతకాలు ఉన్నాయి. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 214 పరుగులు కాగా, కెరీర్లో రెండు డబుల్ సెంచరీలు కూడా సాధించాడు.2023లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన జైస్వాల్ అఫ్గానిస్థాన్తో చివరి టెస్టు ఆడాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కూడా అవకాశాలు పొందినప్పటికీ, టెస్టుల్లో మాత్రం భారత జట్టుకు రెగ్యులర్ ఓపెనర్ గా మారాడు. ఇక శ్రీలంకతో టెస్టు సిరీస్లో భాగంగా గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి 19 వరకు తొలి టెస్టు, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్ట్ జరగనున్నాయి. మొత్తంగా ప్రపంచ క్రికెట్లో వరుసగా 30 మ్యాచ్లు వేర్వేరు స్టేడియాల్లో ఆడిన ఏకైక ఆటగాడిగా జైస్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు.చదవండి: ‘కెప్టెన్గా ఫెయిలైనా ఫిట్నెస్కు కొత్త అర్ధం చెప్పాడు’ -
అతడు లేకపోవడం టీమిండియాకు లోటు: శ్రీలంక మాజీ స్టార్
శ్రీలంక- టీమిండియా మధ్య టెస్టు సిరీస్కు రంగం సిద్ధమైంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక. కాగా భారత జట్టు శ్రీలంక గడ్డపై 2017 తర్వాత టెస్టు సిరీస్ ఆడటం ఇదే మొదటిసారి.ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ ఆల్రౌండర్ ఫర్వేజ్ మహరూఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ లేనిలోటు టీమిండియాకు తప్పక కనిపిస్తుందన్నాడు. IANSతో మాట్లాడుతూ..అశూ లేకపోవడం అతిపెద్ద లోటు‘‘ఈసారి టీమిండియా అశ్విన్ను బాగా మిస్సవుతుంది. శ్రీలంక గడ్డ మీద అతడు గతంలో అద్భుతంగా రాణించాడు. ఇక్కడి టర్నింగ్ పిచ్లు అతడికి స్వర్గధామం. శ్రీలంక పిచ్ పరిస్థితులకు అశూ సరైన బౌలర్’’ అని ఫర్వేజ్ మహరూఫ్ పేర్కొన్నాడు.కాగా 2015, 2017లో శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్లలో టీమిండియా గెలుపులో అశ్విన్దే కీలక పాత్ర. ఆరు మ్యాచ్లలో కలిపి అతడు 38 వికెట్లు కూల్చాడు. ఇందులో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అంతేకాదు బ్యాట్తోనూ అశూ దుమ్ములేపాడు. రెండు అర్థ శతకాలతో సత్తా చాటాడు.అదరగొడుతున్న సుతార్ ఇదిలా ఉంటే.. శ్రీలంక పర్యటనకు వెళ్లిన తాజా భారత జట్టులో ప్రస్తుతం నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లతో పాటు యువ స్పిన్నర్ మానవ్ సుతార్, వెటరన్ ఆటగాడు సారాంశ్ జైన్ కూడా ఉన్నారు. మానవ్ ఇప్పటికే అరంగేట్రం చేయగా.. సారాంశ్ టీమిండియాకు ఎంపిక కావడం ఇదే తొలిసారి.నాకు అవకాశం ఉంటే గనుక..ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు గురించి కూడా ఫర్వేజ్ మహరూఫ్ స్పందించాడు. ‘‘కొన్ని నెలల క్రితం అఫ్గానిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే రాణించాడు. ఇటీవల శ్రీలంక ఎలెవన్ జట్టుతో వార్మప్ మ్యాచ్లోనూ బంతి, బ్యాట్తో సత్తా చాటాడు.అయితే, తుదిజట్టులో రవీంద్ర జడేజాతో పాటు మానవ్ సుతార్కు కూడా చోటిస్తారా? అనేదే ప్రస్తుత ప్రశ్న. కుల్దీప్ యాదవ్ ఎలాగో తుదిజట్టులో ఉంటాడు. ఇక సారాంశ్ జైన్ ఇంకా అరంగేట్రం చేయలేదు. అయితే, అతడు డీసెంట్ బౌలర్. నాకే గనుక అవకాశం ఉంటే.. గాలె టెస్టుకు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్లను ఎంపిక చేస్తాను’’ అని ఫర్వేజ్ మహరూఫ్ చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంకతో సిరీస్ టీమిండియాకు అత్యంత ముఖ్యమైనది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో ఫైనల్ రేసులో ఉండాలంటే లంకను భారత్ 2-0తో వైట్వాష్ చేయాల్సిందే.చదవండి: T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్గా SRH మాజీ ప్లేయర్ -
IND vs SL: బ్యాటింగ్కు అనుకూలమే.. టీమిండియాకు నచ్చలేదు!
టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా ఇప్పటికే శ్రీలంకకు చేరుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్లు జరుగనుండగా.. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. అయితే, తొలి టెస్టు కంటే ముందు భారత్ శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో తలపడనుంది.టీమిండియా అసంతృప్తి కొలంబోలోని నోండెస్ప్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ (NCC)లో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనుంది. కాగా శ్రీలంకలో పిచ్లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయన్న అభిప్రాయాల నేపథ్యంలో.. ప్రాక్టీస్ మ్యాచ్ కోసం NCC తయారు చేసిన వికెట్ మాత్రం భారత శిబిరానికి అస్సలు నచ్చలేదని సమాచారం. పిచ్ మీద పచ్చిక ఉండటం ఏమిటని భారత బృందం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి NCC అధికారి ఫ్రాంకీ రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘వికెట్ మీద పచ్చిక ఎక్కువగా ఉందని భారత క్రికెట్ జట్టు చెప్పింది. నిజానికి ఇది మూడు రోజుల మ్యాచ్ కాబట్టే మేమిలా గ్రాస్ వదిలేశాము. పచ్చిక లేకుండా వికెట్ ఇవ్వడం సరికాదు. ఇదొక మంచి వికెట్.బ్యాటింగ్కు అనుకూలంఏదో ఒక జట్టుకు అనుకూలంగా ఉండేలా మేము ఇది తయారు చేయలేదు. ఆయా జట్ల సత్తాను బట్టే వాళ్లు ముందుకు వెళ్లగలరు. నిజానికి శ్రీలంక క్రికెట్ అభ్యర్థన మేరకే మేము ఇలాంటి పిచ్ తయారు చేశాము. NCC వికెట్లు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయి.ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతాయని మేము భావిస్తున్నాము. గాలె మ్యాచ్ కంటే ముందు భారత బ్యాటర్లకు ఇక్కడ మంచి ప్రాక్టీస్ లభిస్తుందని చెప్పగలను. మా వికెట్ రెండు లేదా మూడో రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలిస్తుందని చెప్పగలము.ఇరుజట్లకూ కీలకంఅయితే, ఇక్కడ టాస్ గెలిచిన వాళ్లు ముందుగా బ్యాటింగ్ చేస్తేనే మంచిది. మేము ఎల్లప్పుడూ మంచి వికెట్లనే రూపొందిస్తాము. పక్షపాతం ఉండదు’’ అని పేర్కొన్నారు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉండాలంటే టీమిండియా కచ్చితంగా శ్రీలంకను 2-0తో వైట్వాష్ చేయాల్సిందే.మరోవైపు.. శ్రీలంక సైతం సొంతగడ్డపై సత్తా చాటి తామూ పోటీలో నిలవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లకు ఈ సిరీస్ కీలకం కాగా.. పిచ్ రూపకల్పన కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: ఈ టీమిండియా క్రికెటర్లు ప్రభుత్వ ఉద్యోగులు.. ఎవరికి ఏ జాబ్? -
డబుల్ సెంచరీతో చెలరేగిన భారత ఓపెనర్
శ్రీలంక అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్లో భారత ఓపెనర్ లక్ష్య రాజేశ్ రాయ్చందాని మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. నిలకడగా ఆడుతూ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కాసేపటికే పెవిలియన్ చేరాడు.మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. వన్డే సిరీస్లో ఆతిథ్య జట్టు చేతిలో భారత్ 2-1 తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ఇరుజట్ల మధ్య సోమవారం తొలి యూత్ టెస్టు మొదలైంది.గాలె వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్కు దిగింది. వన్డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ డబుల్ సెంచరీ (267 బంతుల్లో 233)తో దుమ్ములేపగా.. కెప్టెన్ విమత్ దిన్సార (52), కవిజ గమాగె (45), ఒషాడా మనాహర (31*) రాణించారు. ఆధిక్యంలోకి భారత్ఫలితంగా శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ను 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తమ ఆట మొదలుపెట్టిన భారత్.. గురువారం భోజన విరామ సమయానికి 55 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 378/3 ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ఆరంభించిన భారత జట్టు లంచ్ బ్రేక్ టైమ్కి 149 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 479 పరుగులు చేసింది.లక్ష్య డబుల్ సెంచరీతోకాగా బుధవారం 196 పరుగుల వద్ద నిలిచిన లక్ష్య.. గురువారం ద్విశతక మార్కును అందుకున్నాడు. మొత్తంగా 324 బంతుల్లో 22 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 207 పరుగులు సాధించాడు. దిమత్ అబేయ్సింఘే బౌలింగ్లో బౌల్డ్ కావడంతో లక్ష్య మారథాన్ ఇన్నింగ్స్కు తెరపడింది.ఇక మిగలిన వారిలో మరో ఓపెనర్ సాగర్ విర్క్ శతకం (134) సాధించగా.. వన్డౌన్ బ్యాటర్ కుశాగ్రా ఓజా 24 పరుగులు చేశాడు. కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ (6) విఫలం కాగా.. కుశ్ పటేల్ 42 పరుగులతో రాణించాడు. గురువారం లంచ్ బ్రేక్ సమయానికి బీకే కిషోర్ 1, మానవ్ క్రిష్ణ 35 పరుగులతో క్రీజులో నిలిచారు. అంతకుముందు కావ్యా పటేల్ (8), జగన్నాథన్ హేంచుదేశన్ (0) అవుటయ్యారు. ఆటకు ఇదే చివరి రోజు కావడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం లాంఛనమే కానుంది.చదవండి: విధ్వంసకర శతకాలు.. పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డు బద్దలు -
IND vs SL: శతకాలతో చెలరేగిన భారత ఓపెనర్లు
శ్రీలంక అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్లో భారత యువ ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రాయ్చందాని, సాగర్ విర్క్ శతక్కొట్టారు. నిలకడగా, ఓపికగా ఆడుతూ భారీ సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది.శ్రీలంక భారీ స్కోరు కాగా భారత్- శ్రీలంక అండర్-19 జట్ల మధ్య సోమవారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్కు దిగింది. వన్డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ డబుల్ సెంచరీ (233)తో దుమ్ములేపగా.. కెప్టెన్ విమత్ దిన్సార (52) అర్ధ శతకం బాదాడు.మిగిలిన వారిలో కవిజ గమాగే (49), చమిక హీనతిగల (45), ఒషాడా మనాహర (12 బంతుల్లో 31 నాటౌట్) రాణించారు. ఈ క్రమంలో 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగులు చేసి శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ మంగళవారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి 58 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 186 పరుగులు చేసింది.ఈ క్రమంలో 186/0 ఓవర్నైట్ స్కోరుతో బుధవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన భారత జట్టుకు వర్షం మరోసారి ఆటంకం కలిగించింది. అయితే, కాసేపటి తర్వాత తెరిపినివ్వడంతో మళ్లీ మ్యాచ్ మొదలైంది. శతకాలతో చెలరేగిన భారత ఓపెనర్లుఈ క్రమంలో శతకం పూర్తి చేసుకున్న ఓపెనర్ సాగర్ (312 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్: 134 రన్స్).. లతేంద్ర ఆకాశ్ బౌలింగ్లో జేసన్ ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఇక వన్డౌన్ బ్యాటర్ కుశాగ్రా ఓజా 24 పరుగులే చేసి నిరాశపరచగా.. కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ (6) పూర్తిగా విఫలమయ్యాడు. అయితే, మరో ఓపెనర్ లక్ష్య మాత్రం నిలకడగా ఆడుతూ డబుల్ సెంచరీకి చేరువయ్యాడు.గాలేలో బుధవారం ఆట పూర్తయ్యేసరికి మొత్తంగా 306 బంతులు ఎదుర్కొన్న లక్ష్య.. 21 ఫోర్లు, మూడు సిక్స్ల సాయంతో 196 పరుగులు చేశాడు. అతడితో పాటు కుశ్ పటేల్ మూడు పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక కంటే ఇంకా 46 పరుగులు వెనుకబడి ఉంది. ఇక ఆటకు గురువారం చివరిరోజు. చదవండి: IND vs ENG: అతడిని ఆరోస్థానంలో ఆడిస్తారా? -
భారత ఓపెనర్ భారీ శతకం!.. పాపం పడిక్కల్!
శ్రీలంక- ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత్ జోరు కొనసాగిస్తోంది. గాలె వేదికగా శనివారం నాటి మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి.. 88 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 343 పరుగులు సాధించింది. శ్రీలంక కంటే తొలి ఇన్నింగ్స్లో 23 పరుగులు వెనుకబడి ఉన్నప్పటికీ తేలికగానే ఆధిక్యంలోకి వచ్చే స్థితిలో నిలిచింది.కాగా 247/1 ఓవర్నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టింది భారత్. ఈ క్రమంలో శతక వీరుడు, ఓపెనర్ సాయి సుదర్శన్ లంచ్ బ్రేక్ సమయానికి 153 పరుగులతో క్రీజులో నిలిచాడు. అయితే, దేవ్దత్ పడిక్కల్ మాత్రం సెంచరీకి ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. తన ఓవర్నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జతచేయకుండానే 94 పరుగుల వద్ద కేశర నువంతా బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ 13 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగగా.. కెప్టెన్ ధ్రువ్ జురెల్ 25 పరుగులతో.. సాయి సుదర్శన్తో కలిసి క్రీజులో ఉన్నాడు.రెండోరోజు ఆట సాగిందిలా..శ్రీలంకతో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో సాయి సుదర్శన్ (184 బంతుల్లో 104 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కాడు. అతడితో పాటు దేవదత్ పడిక్కల్ (151 బంతుల్లో 94 బ్యాటింగ్; 11 ఫోర్లు) కూడా రాణించాడు. ఈ ఇద్దరితో పాటు అమోన్ మోఖడే (38; 6 ఫోర్లు) కూడా ఫర్వాలేదనిపించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్స్లో 63 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 247 పరుగులు చేసింది.తొలి వికెట్కు 66 పరుగులు జోడించిన అనంతరం అమన్ అవుట్ కాగా... పడిక్కల్తో కలిసి సుదర్శన్ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ... నిలదొక్కుకున్న తర్వాత వేగం పెంచింది. లంక బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా... భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. రెండో వికెట్కు 181 పరుగులుఈ క్రమంలో గత మ్యాచ్లోనూ సెంచరీ బాదిన సుదర్శన్ మరో శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అతడికిది పదో సెంచరీ. పడిక్కల్ 94 పరుగుల వద్ద నిలిచాడు.వీరిద్దరూ అబేధ్యమైన రెండో వికెట్కు 181 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో కేశర నువంతా ఒక వికెట్ తీశాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 288/5తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక జట్టు చివరకు 110 ఓవర్లలో 366 పరుగులకు ఆలౌటైంది. లంక కెప్టెన్ సెంచరీకెప్టెన్ సహాన్ అరాచిగే (207 బంతుల్లో 127; 13 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ సాధించగా... తక్కినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, సారాన్ష్ జైన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా... యశ్ ఠాకూర్కు రెండు వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి అనధికారిక టెస్టు ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే.చదవండి: నిన్ను ఆడించడం కుదరదని అతడికి చెప్పేయండి! -
శ్రీలంకతో రెండో టెస్టు: భారత క్రికెట్ రికార్డు వీరుడి ‘అరంగేట్రం’!
భారత్- శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు మ్యాచ్ గురువారం మొదలైంది. గాలే వేదికగా టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ ధ్రువ్ జురెల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య శ్రీలంక భోజన విరామ సమయానికి 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది.ఓపెనర్లలో సోహాన్ డి లివెరా (28)ను యశ్ ఠాకూర్ పెవిలియన్కు పంపగా.. పవంత వీరసింగే (39) వికెట్ను గుర్నూర్ బ్రార్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంక- ‘ఎ’తో రెండో అనధికారిక టెస్టు సందర్భంగా భారత్- ‘ఎ’ తరఫున విదర్భ స్టార్ అమన్ మోఖడే ‘అరంగేట్రం’ చేశాడు.ఎవరీ అమన్ మోఖడే?విదర్భ తరఫున 2022లో అమన్ మోఖడే దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా అరంగేట్రం చేసిన అతడు.. అదే ఏడాది ఫస్ట్క్లాస్ క్రికెట్లోనూ అడుగుపెట్టాడు.ఆ మరుసటి ఏడాది లిస్ట్-‘ఎ’ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన అమన్ మోఖడే.. రంజీ తాజా ఎడిషన్, దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో కేవలం పది ఇన్నింగ్స్లోనే ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏకంగా 814 పరుగులు సాధించాడు.ప్రపంచ రికార్డు సమం చేసిన వీరుడుతద్వారా సీజన్లో టాప్ రన్ స్కోరర్గా నిలవడంతో పాటు విదర్భ ట్రోఫీ గెలవడంలోనూ ఓపెనింగ్ బ్యాటర్ అమన్ మోఖడే కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. భారత లిస్ట్- ‘ఎ’ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మార్కు అందుకున్న క్రికెటర్గా చరిత్రకెక్కాడు.కేవలం 16 ఇన్నింగ్స్లోనే అమన్ మోఖడే ఈ మైలురాయిని అందుకున్నాడు. తద్వారా సౌతాఫ్రికాకు చెందిన గ్రేమ్ పొలాక్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు. కాగా దేవ్దత్ పడిక్కల్, అభినవ్ ముకుంద్ పదిహేడు ఇన్నింగ్స్లో లిస్ట్-ఎ క్రికెట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకోగా.. అమన్ వారిద్దరిని అధిగమించడమే కాకుండా.. పొలాక్ రికార్డును సమం చేయడం విశేషం.రంజీలోనూ రాణించి..సెమీ ఫైనల్ మ్యాచ్లో కర్ణాటకపై శతక్కొట్టి.. అమన్ మోఖడే ఈ ఫీట్ అందుకున్నాడు. ఇక రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో పదకొండు ఇన్నింగ్స్ ఆడిన 25 ఏళ్ల అమన్ మోఖడే.. 760 పరుగులు సాధించాడు. 🚨 VIDARBHA QUALIFIED INTO THE FINAL OF VIJAY HAZARE TROPHY 🚨- They beat Mighty Karnataka, Aman Mokhade is the star of the Semi final. 🦁 pic.twitter.com/aKcyclAwhn— Johns. (@CricCrazyJohns) January 15, 2026ఈ క్రమంలోనే శ్రీలంక పర్యటనలో భాగంగా భారత్- ‘ఎ’ జట్టుకు తొలిసారి ఎంపికయ్యాడు. దేశీ క్రికెట్లో సత్తా చాటిన అమన్.. భారత్- ‘ఎ’ జట్టు తరఫున వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని.. త్వరలోనే టీమిండియాకూ ఆడే స్థాయికి చేరుకోవాలని ఆశిద్దాం!!చదవండి: ‘వైభవ్ను ఇపుడే ఆడించొద్దు’ -
కెప్టెన్ సూపర్ సెంచరీ.. భారత్ స్కోరెంతంటే?
శ్రీలంక- ‘ఎ’ జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్లో భారత్- ‘ఎ’ కెప్టెన్ ధ్రువ్ జురెల్ అద్భుత శతకం సాధించాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 181 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కాగా రెండు అనధికారిక టెస్టుల సిరీస్ ఆడేందుకు భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.తొలిరోజు ఇలాఇందులో భాగంగా శ్రీలంక- భారత్ మధ్య గురువారం గాలేలో తొలి టెస్టు మొదలు కాగా.. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలిరోజు ఆటలో ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 175 బంతులు ఎదుర్కొని పందొమ్మిది ఫోర్ల సాయంతో 132 పరుగులు సాధించాడు.మిగిలిన వారిలో ఓపెనర్ ఆయుశ్ పాండే (25) ఫర్వాలేదనిపించగా.. దేవ్దత్ పడిక్కల్ (12), రుతురాజ్ గైక్వాడ్ (22) మాత్రం నిరాశపరిచారు. అయితే, ధ్రువ్ జురెల్తో పాటు షేక్ రషీద్ అర్ధ శతకాలతో రాణంచడంతో.. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ 86 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది.శతక్కొట్టిన కెప్టెన్ఇక 333/4 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కాసేపటికే షేక్ రషీద్ (63) వికెట్ కోల్పోయింది. అయితే, కెప్టెన్ జురెల్ మాత్రం జోరు కొనసాగించాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 97 పరుగుల వద్ద ఉండగా వర్షం అంతరాయం కలిగించడంతో చాలాసేపు ఆటను నిలిపివేశారు.అయితే.. ఆ తర్వాత వర్షం తెరిపినిచ్చినా వెట్ఫీల్డ్ కారణంగా మరికొంతసేపు ఆట నిలిచిపోయింది. ఈ క్రమంలో కాసేపటికి మళ్లీ ఆట మొదలుకాగా.. జురెల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు.. హర్ష్ దూబే 30 పరుగులు చేసి అవుటయ్యాడు.ఈ క్రమంలో టీ బ్రేక్ సమయానికి భారత్ 111.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 452 పరుగులు స్కోరు చేసింది. ధ్రువ్ జురెల్ 141, సారాంశ్ జైన్ 3 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇక టీ బ్రేక్ తర్వాత భారత్.. అదే స్కోరు (452/6) వద్ద తమ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.చదవండి: వైభవ్ అరంగేట్రం కోసం వాళ్లను బలిచేయలేము -
శ్రీలంకతో తొలి టెస్టు: వర్షం వల్ల అంతరాయం
శ్రీలంక- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ ధ్రువ్ జురెల్ జోరు కొనసాగిస్తున్నాడు. గాలె వేదికగా రెండో రోజు నాటి ఆట సందర్భంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ శతకానికి చేరువయ్యాడు. అయితే, ఊహించని విధంగా ఆటకు వర్షం అంతరాయం కలిగించింది.వాన పడిందిఅప్పటికి ధ్రువ్ జురెల్ 177 బంతుల్లో ఎనిమిది ఫోర్ల సాయంతో 97 పరుగులు చేశాడు. ఇంతలో వర్షం రావడంతో ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక వాన పడే సమయానికి భారత్- ‘ఎ’ జట్టు 99 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. అప్పటికి జురెల్తో పాటు హర్ష్ దూబే (7*) క్రీజులో ఉన్నాడు.కాగా రెండు అనధికారిక టెస్టు మ్యాచ్లు ఆడేందుకు భారత్- ‘ఎ’ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా గురువారం గాలె అంతర్జాతీయ స్టేడియంలో గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ ధ్రువ్ జురెల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.సుదర్శన్ అద్భుత శతకంఈ క్రమంలో టాపార్డర్లో ఓపెనర్ ఆయుశ్ పాండే (25).. వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ (12) విఫలం కాగా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత శతకం సాధించాడు. మొత్తంగా 175 బంతుల్లో 19 బౌండరీలు బాదిల 132 పరుగులు చేశాడు.మిగిలిన వారిలో రుతురాజ్ గైక్వాడ్ (22) కూడా విఫలం కాగా.. జురెల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అతడికి తోడుగా గుంటూరు అబ్బాయి షేక్ రషీద్ అర్ధ శతకం (63)తో రాణించాడు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్కు 116 పరుగులు జోడించారు. ఫలితంగా తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ 86 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. ఈ క్రమంలో 333/4 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్ 92వ ఓవర్లో షేక్ రషీద్ వికెట్ కోల్పోయింది. చదవండి: వైభవ్ అరంగేట్రం కోసం వాళ్లను బలిచేయలేము -
శ్రీలంకతో తొలి టెస్టు.. భారత్ బ్యాటింగ్
శ్రీలంక పర్యటనలో ముక్కోణపు వన్డే సిరీస్ను భారత్- ‘ఎ’ జట్టు ఇటీవలే ముగించుకుంది. ఈ క్రమంలో తాజాగా లంకతో అనధికారిక టెస్టు సిరీస్కు సిద్ధమైంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య శ్రీలంక- ‘ఎ’ జట్టుతో భారత్ రెండు అనధికారిక టెస్టులు ఆడనుంది.ధ్రువ్ జురెల్ సారథ్యంలో..ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం తొలి టెస్టు మొదలైంది. గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన భారత్ లుత బ్యాటింగ్ ఎంచుకుంది. యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ ఈ సిరీస్లో భారత జట్టుకు కెప్టెన్, వికెట్ కీపర్గా వ్యవహరిస్తున్నాడు.వన్డే సిరీస్లో విజేతగాఈ జట్టులో జురెల్తో పాటు రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్, గుర్నూర్ బ్రార్ తదితర టీమిండియా స్టార్లు కూడా ఉన్నారు. కాగా శ్రీలంక, అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్లతో జరిగిన అనధికారిక వన్డే సిరీస్లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో లంక, అఫ్గాన్లపై ఒక్కో మ్యాచ్ గెలవడంతో పాటు.. ఒక్కో మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. అద్భుతమైన రన్రేటు కారణంగా తిలక్ వర్మ సేన ఫైనల్లో అడుగుపెట్టింది.టైటిల్ పోరులో శ్రీలంకపై ఘన విజయం సాధించి చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లోనే 94 పరుగులు సాధించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ సిరీస్ తర్వాత తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ టీమిండియాతో కలిశారు. సీనియర్ జట్టుతో కలిసి టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్లో అడుగుపెట్టారు.తుదిజట్లుభారత్సాయి సుదర్శన్, ఆయుశ్ పాండే, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, ధృవ్ జురెల్(కెప్టెన్/ వికెట్ కీపర్), షేక్ రషీద్, హర్ష్ దూబే, సారాంశ్ జైన్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆకిబ్ నబీ దర్శ్రీలంకపవంత వీరసింగే, నిరోషన్ డిక్విల్లా (వికెట్ కీపర్), నునానిదు ఫెర్నాండో, ఆషేన్ బండారా, సహాన్ అరాచిగే (కెప్టెన్), రవిందు ఫెర్నాండో, అంజాలా బండారా, కవిందు పతిరత్నె, దులాజ్ సముదిత, చమిక గుణశేఖర, దిలుమ్ సుదీర.చదవండి: రాణించిన నితీశ్ రెడ్డి.. కరీంనగర్పై నల్గొండ గెలుపు -
స్టీవ్ స్మిత్ సరికొత్త చరిత్ర.. ఆసీస్ తొలి బ్యాటర్గా అరుదైన ఫీట్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) అద్బుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. శ్రీలంక(Sri Lanka vs Australia)తో రెండో టెస్టులోనూ ఈ కుడిచేతి వాటం ఆటగాడు సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో ఇటీవలే టెస్టు ఫార్మాట్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న స్మిత్.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు.ఆల్టైమ్ రికార్డు బద్దలుఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్గా స్మిత్ నిలిచాడు. రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలోకి దూసుకువచ్చాడు. కాగా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా స్మిత్ మళ్లీ ఫామ్లోకి వచ్చిన విషయం తెలిసిందే.భారత్తో బ్రిస్బేన్ టెస్టులో 101 పరుగులు సాధించిన స్మిత్.. మెల్బోర్న్లో భారీ శతకం(140)తో చెలరేగాడు. అనంతరం.. శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులోనూ తాత్కాలిక స్మిత్ శతక్కొట్టాడు. గాలె మ్యాచ్లో 141 పరుగులతో చెలరేగి జట్టు భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ సందర్భంగానే టెస్టు ఫార్మాట్లో పదివేల పరుగుల క్లబ్లో కూడా చేరాడు.ఇక తాజాగా లంకతో రెండో టెస్టులోనూ స్టీవ్ స్మిత్ శతకం దిశగా పయనిస్తున్నాడు. ఈ క్రమంలో ఆసియా గడ్డ మీద పందొమ్మిది వందలకు పైగా పరుగులు పూర్తి చేసుకుని.. ఆస్ట్రేలియా తరఫున హయ్యస్ట్ రన్స్కోరర్గా నిలిచాడు. లంకతో రెండో టెస్టు భోజన విరామ సమయానికి స్మిత్.. ఆసియాలో 1917 పరుగులు పూర్తి చేసుకున్నాడు.కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిసిన స్మిత్ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో ఆతిథ్య లంకను ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో ఆసీస్ చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం నుంచి గాలెలో రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. ఆసీస్ బౌలర్ల విజృంభణ కారణంగా 257 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ఆలౌట్ అయింది.ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా అదరగొడుతోంది. ఓపెనర్లు ట్రవిస్ హెడ్(22 బంతుల్లో 21), ఉస్మాన్ ఖవాజా(57 బంతుల్లో 36) ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(4) మరోసారి విఫలమయ్యాడు.ఈ దశలో స్మిత్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. అతడికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ వేగంగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరి నిలకడైన ప్రదర్శన కారణంగా 55 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 215 పరుగుల వద్ద నిలిచింది.ఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లు 👉స్టీవ్ స్మిత్: 23 మ్యాచ్లలో సగటు 50.35తో 1917+ పరుగులు. అత్యధిక స్కోరు- 178*- శతకాలు ఆరు.👉రిక్కీ పాంటింగ్: 28 మ్యాచ్లలో సగటు 41.97తో 1889 పరుగులు- అత్యధిక స్కోరు 150- శతకాలు ఐదు👉అలెన్ బోర్డర్: 22 మ్యాచ్లలో సగటు 54.51తో 1799తో 1799 పరుగులు- అత్యధిక స్కోరు 162- శతకాలు ఆరు👉మాథ్యూ హెడెన్: 19 మ్యాచ్లలో 50.39 సగటుతో 1663 పరుగులు- అత్యధిక స్కోరు 203- శతకాలు నాలుగు👉ఉస్మాన్ ఖవాజా: 17 మ్యాచ్లలో 61.76 సగటుతో 1544 పరుగులు- అత్యధిక స్కోరు 232- శతకాలు ఐదు. -
శ్రీలంకతో తొలి టెస్టు: టీ20 తరహాలో ట్రవిస్ హెడ్ బాదుడు
శ్రీలంకతో తొలి టెస్టు(Sri Lanka Vs Australia)లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ట్రవిస్ హెడ్(Travis Head) ధనాధన్ దంచికొట్టాడు. తనను ఓపెనర్గా పంపినందుకు... అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకుని జట్టుకు శుభారంభం అందించాడు. మెరుపు అర్ధశతకంతో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఎడిషన్లో ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్కు చేరుకుంది. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో జూన్లో తలపడనుంది. అంతకంటే ముందు ఈ సీజన్లో ఆఖరిగా శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలె వేదికగా బుధవారం తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja)కు ఓపెనింగ్ జోడీగా ప్రమోట్ అయిన టీ20 వీరుడు ట్రవిస్ హెడ్ ఆది నుంచే లంక బౌలర్లపై అటాక్ చేశాడు.తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు.. మెరుపు ఫిఫ్టీఇన్నింగ్స్ ఆరంభంలోనే తన మార్కు చూపించిన హెడ్.. తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు బాదాడు. లంక పేసర్ అసిత ఫెర్నాండో బౌలింగ్లో మూడు, ఐదు, ఆరో బంతికి ఫోర్లు బాదాడు. అదే జోరులో వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 35 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.మొత్తంగా నలభై బంతులు ఎదుర్కొన్న ట్రవిస్ హెడ్.. 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. లంక స్పిన్నర్ ప్రబాత్ జయసూర్య బౌలింగ్లో చండీమాల్కు క్యాచ్కు ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక హెడ్ ఇన్నింగ్స్లో పది ఫోర్లతో పాటు.. ఒక సిక్సర్ కూడా ఉంది.టీ20 తరహా వీరబాదుడుఈ నేపథ్యంలో తనను టెస్టుల్లో ఓపెనర్గా ప్రమోట్ చేసినందుకు హెడ్.. మేనేజ్మెంట్కు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. టెస్టు ఫార్మాట్లోనూ టీ20 తరహా వీరబాదుడు బాదడం అతడికి మాత్రమే చెల్లుతుందంటూ కొనియాడుతున్నారు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే.. హెడ్ ఇప్పటి నుంచే ఐపీఎల్ మోడ్లోకి వెళ్లిపోయాడంటూ ఆకాశానికెత్తుతున్నారు.స్టీవ్ స్మిత్ సారథ్యంలోకాగా శ్రీలంకతో టెస్టులకు ఆస్ట్రేలియా రెగ్యులర్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మాజీ సారథి స్టీవ్ స్మిత్ ఈ సిరీస్లో కంగారూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇక తాజా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా శ్రీలంకతో రెండు టెస్టులతో పాటు.. కొలంబో వేదికగా రెండు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది. ఫిబ్రవరి 14న రెండో వన్డేతో ఆసీస్ లంక టూర్ ముగుస్తుంది. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో హెడ్తో పాటు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ అతడికి సహకారం అందిస్తున్నాడు. లంకతో తొలి రోజు ఆటలో భాగంగా 29 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 132 పరుగులు చేసింది.శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టుతుదిజట్లుశ్రీలంకదిముత్ కరుణరత్నే, ఓషద ఫెర్నాండో, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్), ప్రబాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో.ఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, ట్రవిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, బ్యూ వెబ్స్టర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, మాథ్యూ కుహ్నెమాన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ.చదవండి: Suryakumar Yadav: అతడొక వరల్డ్క్లాస్ బౌలర్.. మా ఓటమికి కారణం అదేA Travis Head half century inside the first hour of Day 1 👀#SLvAUS pic.twitter.com/e5QNF4FaK3— 7Cricket (@7Cricket) January 29, 2025 -
147 ఏళ్ల చరిత్రలో ఇది రెండోసారి..!
శ్రీలంక స్టార్ బ్యాటర్ కమిందు మెండిస్ కెరీర్లో ఉత్తమ దశలో ఉన్నాడు. జూలై 2022లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. తాను ఆడిన తొలి ఆరు మ్యాచ్లలో యాభైకి పైగా స్కోర్లు సాధించాడు. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్టులోనూ అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడేందుకు కివీస్ జట్టు శ్రీలంకకు వచ్చింది. ఈ క్రమంలో గాలె వేదికగా బుధవారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య లంక తొలుత బ్యాటింగ్ చేయగా.. టాపార్డర్ తేలిపోయింది. దిముత్ కరుణరత్నె(2), పాతుమ్ నిసాంక(27), దినేశ్ చండిమాల్(30) నిరాశపరిచారు.కమిందు మెండిస్ సంచలన శతకంఏంజెలో మాథ్యూస్(36), కుశాల్ మెండిస్(50) రాణించగా.. కమిందు మెండిస్ శతకంతో చెలరేగాడు. 173 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 114 పరుగులు సాధించాడు. తద్వారా కమిందు మెండిస్ సౌద్ షకీల్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. కెరీర్లో వరుసగా తొలి ఏడు టెస్టుల్లో యాభైకి పైగా పరుగులు సాధించిన రెండో క్రికెటర్గా నిలిచాడు.147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది రెండోసారి147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్ బ్యాటర్ సౌద్ షకీల్ తొలుత ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆ తర్వాత మళ్లీ కమిందుకే ఈ ఘనత సాధ్యమైంది. ఈ క్రమంలో అతడు టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ను కూడా అధిగమించాడు. గావస్కర్, సయీమ్ అహ్మద్(పాకిస్తాన్), బసిల్ బుచర్(వెస్టిండీస్), బర్ట్ సచ్లిఫ్(న్యూజిలాండ్) తమ తొలి ఆరు టెస్టుల్లో 50 ప్లస్ స్కోర్లు సాధించారు.ఐదు వికెట్లతో చెలరేగిన రూర్కీఇక కివీస్తో మొదటి టెస్టు తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 88 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు సాధించింది. కమిందు, కుశాల్ మెండిస్ (68 బంతుల్లో 50; 7 ఫోర్లు) కలిసి ఆరో వికెట్కు 103 పరుగులు జోడించారు. ఇతర ప్లేయర్లలో దినేశ్ చండీమల్ (30), ఏంజెలో మాథ్యూస్ (36), పాథుమ్ నిసాంక (27) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు.ఇక రెండో రోజు ఆటలో టెయిలెండర్లు రమేశ్ మెండిస్(14), ప్రబాత్ జయసూర్య(0), అసిత ఫెర్నాండో(0) పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా 91.5 ఓవర్లలో శ్రీలంక 305 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో రూర్కీ ఐదు వికెట్లతో చెలరేగగా.. కెప్టెన్ టామ్ లాథమ్ ఒకటి, అజాజ్ పటేల్ , గ్లెన్ ఫిలిప్స్ రెండేసి వికెట్లు కూల్చారు. కమిందు మళ్లీ మెరిసేనా?ఇక గురువారం న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కాగా కమిందు మెండిస్ ఇప్పటి వరకు ఆరు టెస్టులు పూర్తి చేసుకుని 695 పరుగులు సాధించాడు. ఏడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో శతకం బాదిన ఈ ఆల్రౌండర్.. రెండో ఇన్నింగ్స్లోనూ భారీ స్కోరు బాదాలని పట్టుదలగా ఉన్నాడు.చదవండి: చెత్త షాట్ సెలక్షన్!.. కోహ్లి అవుట్.. రోహిత్ రియాక్షన్ వైరల్ -
అంతుపట్టని డ్యాన్స్తో అదరగొట్టిన పాక్ బౌలర్
పాకిస్తాన్ స్టార్ బౌలర్ హసన్ అలీ అంతుపట్టని డ్యాన్స్తో అభిమానులను అలరించాడు. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో లంక బ్యాటింగ్ సమయంలో ఈ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. బ్రేక్ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న హసన్ అలీ.. మ్యాచ్కు దూరంగా ఉన్న హారిస్ రౌఫ్తో మాట్లాడుతూ కనిపించాడు. ఈ క్రమంలో ఏదో విషయమై చర్చకు రాగా.. కాసేపు చేతులు ముందుకు పెడుతూ డ్యాన్స్ మూమెంట్స్ ఇచ్చాడు. అయితే హసన్ అలీ చేసిన డ్యాన్స్ కాస్త విచిత్రమైన మూమెంట్స్లాగా అనిపించాయి. ఇది గమనించిన కామెంటేటర్ డానిసన్ మోరిసన్ ఈ అంతుపట్టని డ్యాన్స్ ఏంటా అని షాక్కు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్లో హసన్ అలీ 12 ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక లంక తొలి ఇన్నింగ్స్లో 222 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తర్వాత పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకు ఆలౌట్ అయింది. బాబర్ ఆజం వీరోచిత సెంచరీ పాక్ను తక్కువ స్కోరుకు ఆలౌట్ కాకుండా కాపాడింది. నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక రెండోరోజు ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. ఓషాడా ఫెర్నాండో 17, కాసున్ రజిత 3 పరుగులతో ఆడుతున్నారు. Hassan Ali's back!!!! pic.twitter.com/WoQjdftQmQ — Ramiya 2.0 (@yehtuhogaaa) July 16, 2022 చదవండి: Ian Chapell: 'రోజులో 90 ఓవర్లు వేయకపోతే కెప్టెన్ను సస్పెండ్ చేయాలి' -
సరిహద్దుల్లో సొరంగం
జమ్మూ: భారత్లో చొరబాట్లకు జిత్తుల మారి పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉంది. జమ్మూలోని సాంబా సెక్టార్లో గాలార్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాక్ వైపు వెళుతున్న ఒక సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్ఎఫ్) కనుగొన్నట్టు శనివారం అధికారులు వెల్లడించారు. 25 అడుగుల లోతు, 20 అడుగుల పొడవు, 3–4 అడుగుల వెడల్పున ఈ సొరంగ మార్గం ఉంది. భారత్లోకి చొరబాట్లు, నార్కోటిక్ డ్రగ్స్, ఆయుధాలు రవాణా చేయడం కోసమే పాక్ దీనిని నిర్మించిందని అధికారులు వెల్లడిం చారు. సరిహద్దుల నుంచి భారత్ భూభాగం వైపు 50 మీటర్ల దూరంలో ఈ సొరంగమార్గం ఉంది. పాకిస్తాన్లో తయారైనట్టుగా గుర్తులు ఉన్న ఆకుపచ్చ రంగు ఇసుక బస్తాలతో సొరంగ మార్గాన్ని కప్పి ఉంచినట్టుగా బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. దీంతో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ ఆస్తానా సాంబా సెక్టార్లో అణువణువు గాలించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ విస్తృతంగా సాగుతోంది. ఇటీవల కాలంలో భారీగా వర్షాలు కురవడంతో ఈ సొరంగ మార్గం ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో మట్టి వదులుగా మారింది. ఎందుకిలా మట్టి ఉందన్న అనుమానంతో అక్కడ అంతా పరిశీలించి చూడగా పాకిస్తాన్లో తయారీ అయినట్టుగా చిహ్నాలు ఉన్న ఇసుక బస్తాల్ని బలగాలు గుర్తించాయి. వాటిని తొలగించి చూడగా 170 మీటర్ల పొడవైన సొరంగం కనిపించింది. సాంబా సెక్టార్లో వేల్బ్యాక్ శిబిరానికి దగ్గరగా ఈ సొరంగం ఉంది. కరాచి, శంకర్గఢ్ అని పేర్లు ముద్రించి ఉన్న 8–10 ప్లాస్టిక్ ఇసుక బస్తాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. ఈ ప్లాస్టిక్ బస్తాలపై ఉన్న తేదీలను బట్టి అవి ఇటీవల తయారైనట్టుగా తెలుస్తోంది. ఈ సొరంగం పాకిస్తాన్ వైపు సరిహద్దు శిబిరం గుల్జార్ వరకు కొనసాగిం దని అధికారులు చెప్పారు. ఈ సొరంగం ద్వారా పాక్ ఉగ్రవాదులు చాలా సులభంగా చొరబాట్లు చేయవచ్చునని వివరించారు. పాక్కు తెలిసే చేసింది ఈ సొరంగం నిర్మాణం గురించి పాకిస్తాన్ ప్రభుత్వానికి బాగా తెలుసునని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఎన్ఎస్ జమ్వాల్ చెప్పారు. ఆ సొరంగాన్ని ఇటీవల తవ్వారని ప్రాథమిక విచారణలో తేలింద న్నారు. సాంబా సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి సొరంగాన్ని తవ్వారన్న సమా చారం తమకు అందగానే సరిహద్దు బలగాలు రంగం లోకి దిగాయన్నారు. శుక్రవారం సాయం త్రానికి దీన్ని గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం జమ్వాల్ సాంబ సెక్టార్లోనే ఉంటూ పాక్ ఇంకా ఎక్కడెక్కడ సొరంగాలు ఏర్పాటు చేసిందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
గాలె స్టేడియాన్ని కూల్చుతున్నారు!
గాలె: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ క్రికెట్ స్టేడియాల్లో శ్రీలంకలోని గాలె అంతర్జాతీయ స్టేడియం కూడా ఒకటి. ఈ స్టేడియాన్ని 1984లో నిర్మించారు. 1998లో తొలిసారి ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ జరిగింది. అయితే, 2004 డిసెంబర్లో వచ్చిన సునామీకి గాలె స్టేడియంలో చాలా భాగం దెబ్బతింది. ఆ తర్వాత ఈ స్టేడియానికి మరమ్మతులు చేశారు. అయితే, తాజాగా ఈ స్టేడియానికి ఆనుకొని ఉన్న 17వ శతాబ్దానికి చెందిన డచ్ఫోర్ట్ను కాపాడేందుకు గాను ప్రస్తుతం ఈ స్టేడియంలోని పెవిలియన్ స్టాండ్ను కూల్చేందుకు శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. స్టేడియంలోని పెవిలియన్ స్టాండ్ వల్ల కోట గోడ దెబ్బతినే అవకాశం ఉన్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ డచ్ ఫోర్ట్ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకుంది. కాగా, స్టేడియంలో నిర్మించిన 500 సీట్ల సామర్థ్యం కలిగిన పెవిలియన్ స్టాండ్ వల్ల వారసత్వ జాబితాలో చోటు కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఈ విషయాన్ని శ్రీలంక సాంస్కృతిక శాఖ మంత్రి విజయదాస రాజపక్సే పార్లమెంట్లో వెల్లడించారు. దక్షిణ కొలంబోకు 115 కిలోమీటర్ల దూరంలో గాలెలోనే మరొక స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన తెలిపారు. గాలె పిచ్ స్పిన్కు అనుకూలం. 1998 తరువాత గాలె వేదికగా జరిగిన చాలా మ్యాచ్ల్లో శ్రీలంక ఘన విజయాలు సాధించింది. శ్రీలంక జట్టుకు అదృష్ట స్టేడియంగా చెప్పొచ్చు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంక 278 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 'కోటకు ఉన్న వారసత్వ సంపద గుర్తింపును కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. క్రికెట్ మైదానానికి మరో ప్రత్యమ్నాయం చూడాలి' అని క్రీడా శాఖ మంత్రి ఫైజర్ ముస్తఫా చెప్పాడు. ఈ క్రమంలోనే నవంబర్లో ఇంగ్లండ్తో జరిగే టెస్టు మ్యాచ్ గాలె స్టేడియం వేదికగా జరిగే చివరి మ్యాచ్ కానుందని అధికార వర్గాలు తెలిపాయి. -
కోహ్లీసేన ప్రతీకార విజయం
రెండేళ్ల క్రితం ఇదే వేదికపై శ్రీలంక చేతిలో ఎదురైన దారుణ ఓటమికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. లంకతో జరిగిన తొలిటెస్టులో విరాట్ కోహ్లీ సేన 304 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 550 పరగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు తమ రెండో ఇన్నింగ్స్ లో 245 పరగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అశ్విన్, జడేజాలు చెరో మూడు వికెట్లు పడగొట్టగా, షమీ, ఉమేశ్ లకు ఒక్కో వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్లో భారీ సెంచరీ చేసిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (168 బంతుల్లో 190; 31 ఫోర్లు) కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. అంతకుముందు 188/3 పరుగుల వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ 53 ఓవర్లలో 240 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ కెప్టెన్ విరాట్ కోహ్లి 133 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు రహానే(23 నాటౌట్) క్రీజులో ఉండగా కెప్టెన్ కోహ్లీ తమ రెండో ఇన్నింగ్స్ ను 240/3 వద్ద డిక్లేర్ చేశాడు. దీంతో ఓవరాల్ గా భారత్ కు 550 పరుగుల ఆధిక్యం లభించింది. కరుణరత్నే పోరాటం వృథా భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక 29 పరుగులకే ఓపెనర్ తరంగ(10), గుణతిలక(2) వికెట్లను కోల్పోయింది. మరో ఓపెనర్ కరుణరత్నే (208 బంతుల్లో 97; 9 ఫోర్లు) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. కీపర్ డిక్ వెల్లా(67), కుశాల్ మెండిస్ (36) పరవాలేదనిపించారు. ఓటమి అంతరాన్ని తగ్గించడానికి లంక ఎంతో శ్రమించినా భారత బౌలర్ల సమిష్టి రాణింపుతో 245 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో రెండేళ్ల కింద గాలే టెస్టులో ఓటమికి కోహ్లీ సేన ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
కొహ్లీ సెంచరీ
గాలే: శ్రీలంక-భారత్ల మధ్య జరగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ శతక్కొట్టాడు. 133 బంతుల్లో కొహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇన్నింగ్స్ను డిక్లేర్ చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. దీంతో రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక లక్ష్యం 550 పరుగులు అయింది. అంతకుముందు 188/3 పరగుల వద్ద నాలుగో రోజు ఆటను భారత్ ప్రారంభించింది. నాలుగో రోజు 40 బంతులను ఎదుర్కొన్న భారత బ్యాట్స్మన్లు విరాట్ కొహ్లీ103(136), అజింక్య రహానే 23(18)లు 51 పరుగులు జోడించారు. దీంతో శ్రీలంక ముందు 550 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించగలిగింది. -
స్టెయిన్ రాణింపు, దక్షిణాఫ్రికా ఘనవిజయం
ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ రాణించడంతో శ్రీలంకపై దక్షిణాఫ్రికా 153 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి టెస్ట్ మ్యాచ్ లో స్టెయిన్ విజృంభించి 99 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టడంతో గాలే టెస్ట్ లో దక్షిణాఫ్రికా గెలిచింది. స్టెయిన్ కు మార్కెల్ అండగా నిలిచి నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో తొలిసారి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హషీం ఆమ్లా చిరస్మరణీయమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రెండవ ఇన్నింగ్స్ లో అత్యధికంగా సంగక్కర 76, సిల్వా 38 పరుగులు తప్పా.. మిగితా ఆటగాళ్లెవరూ పెద్గగా రాణించలేకపోవడంతో 216 పరుగులకు శ్రీలంక ఆటౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు సొంతం చేసుకున్న స్టెయిన్ రెండవ ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసుకున్నాడు. మార్కెల్ 4, డ్యుమినీ 2 వికెట్లు పడగొట్టారు. స్కోర్లు: తొలి ఇన్నింగ్స్: దక్షిణాఫ్రికా 455, శ్రీలంక: 292 రెండవ ఇన్నింగ్స్: దక్షిణాఫ్రికా 206, రెండవ ఇన్నింగ్స్ 216


