యాభై పరుగుల మార్క్‌ దాటిన భారత్‌.. ఆధిక్యం ఎంతంటే? | Sri Lanka Vs India 1st Test Match Day 4 Live Score Updates And Highligts, India Begin Second Innings After Taking 178-Run Lead | Sakshi
Sakshi News home page

SL Vs IND: యాభై పరుగుల మార్క్‌ దాటిన భారత్‌.. ఆధిక్యం ఎంతంటే?

Aug 18 2026 9:58 AM | Updated on Aug 18 2026 10:50 AM

Sri Lanka Vs India 1st Test Match Day-4 Live Updates-Highligts-Galle

SL Vs IND 1st Test Day-4 Live Updates: గాలే వేదికగా శ్రీలంక, భారత్‌ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది.

ఫిఫ్టీ మార్క్‌ దాటిన టీమిండియా
రెండో ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్‌ నష్టానికి 59 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 30, పడిక్కల్‌ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు భారత్‌ 237 పరుగుల ఆధిక్యంలో ఉంది.

తొలి వికెట్‌ డౌన్‌
గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 178 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. అశితా ఫెర్నాండో బౌలింగ్‌లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్‌ నష్టానికి 9 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (1), పడిక్కల్‌ (10) పరుగులతో క్రీజులో ఉన్నారు. 

అంతకముందు శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. దినూష (100) శతకంతో రాణించగా, నిరోషన్‌ డిక్‌వెల్లా (80) అర్ధసెంచరీ చేశాడు. ఒకదశలో లంక 90/5 వద్ద కష్టాల్లో ఉండగా వీరిద్దరు ఆరో వికెట్‌కు 36.1 ఓవర్లలో 146 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో మానవ్‌ సుతార్‌కు 4, జడేజాకు 3 వికెట్లు దక్కాయి. 

భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు ఆడాల్సి ఉన్నా... వెలుతురులేమి వల్ల ఆట సాధ్యం కాలేదు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 460/9తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్‌ మరో 4 బంతులాడి తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement