athletics championship
-
24 పతకాలతో భారత్కు రెండో స్థానం
గుమి (దక్షిణ కొరియా): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆఖరి రోజు కూడా భారత్ పతకాల వేట కొనసాగింది. శనివారం జరిగిన చివరి రోజు పోటీల్లో అథ్లెట్లు మరో అర డజను (6) పతకాలు సాధించారు. జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్, మహిళల 5000 మీ. పరుగులో పారుల్ చౌదరి రజతం గెలుపొందగా. మరో రజత పతకం మహిళల 4్ఠ100 మీ. రిలేలో లభించింది. పురుషుల 200 మీ. స్ప్రింట్లో అనిమేశ్ కుజూర్, మహిళల 800 మీ. పరుగులో పూజ సింగ్, మహిళల 400 మీ. హర్డిల్స్లో విత్య రామ్రాజ్ కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీల్లో రెండో పతకం గెలవాలని గంపెడాశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ మేటి రన్నర్ జ్యోతి యర్రాజీకి 200 మీటర్ల పరుగులో నిరాశ ఎదురైంది. 100 మీ. హర్డిల్స్లో పసిడి పతకాన్ని నిలబెట్టుకున్న ఆమె... స్ప్రింట్లో మాత్రం 23.47 సెకన్ల టైమింగ్తో ఐదో స్థానానికి పరిమితమైంది. భారత్కు రెండో స్థానం ఓవరాల్గా భారత్ 24 పతకాలతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. గత బ్యాంకాక్ (2023లో 27 పతకాలు) ఈవెంట్తో పోల్చితే 3 పతకాలు తగ్గినా... బంగారంలో భారత్ మెరుగైంది. నాటి క్రీడల్లో 6 స్వర్ణాలు సాధిస్తే... తాజా ఈవెంట్లో 8 పసిడి పతకాలు సహా 10 రజతాలు, 6 కాంస్య పతకాలను భారత బృందం గెలిచింది. చైనా 32 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. బీజింగ్ బృందం 19 స్వర్ణాలు, 9 రజతాలు, 4 కాంస్య పతకాలు సాధించింది.28 పతకాలు గెలుచుకున్న జపాన్ మూడో స్థానంలో ఉంది. జపనీస్ అథ్లెట్లు రజతాలు (11), కాంస్యాలు (12) ఎక్కువగా సాధించినప్పటికీ స్వర్ణాల్లో (5) వెనుకబడటంతో మూడో స్థానం దక్కింది. ఈ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్ చరిత్రలో భారత్ 2017లో 29 పతకాలతో అగ్ర స్థానంలో నిలిచిన ఘనతను సొంతం చేసుకుంది. సొంతగడ్డ (భువనేశ్వర్)పై జరిగిన ఆ ఈవెంట్లో 10 స్వర్ణాలు, 6 రజతాలు, 13 కాంస్య పతకాలను భారత్ చేజిక్కించుకుంది. పారుల్కు రెండో రజతం ఈ పోటీల్లో ఇదివరకే మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో రజత పతకం సాధించిన పారుల్ చౌదరి డబుల్ ధమాకా సాధించింది. తాజాగా ఆమె మహిళల 5000 మీటర్ల పరుగు పందెంలో రెండో స్థానంతో పోడియంలో నిలిచింది. సుదీర్ఘ పరుగు పోటీని ఆమె 15 నిమిషాల 15.33 సెకన్లలో ముగించి రెండో రజత పతకాన్ని చేజిక్కించుకుంది. పురుషుల జావెలిన్ త్రోలో రైజింగ్ స్టార్ సచిన్ యాదవ్ ఈటెను 85.16 మీటర్ల దూరంలో విసిరి రజతం అందుకున్నాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (84.39 మీ.)ను అధిగమించాడు. సచిన్ సహచరుడు... ఫైనల్ బరిలో నిలిచిన యశ్వీర్ సింగ్ కూడా అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన (82. 57 మీటర్లు) నమోదు చేసినప్పటికీ ఐదో స్థానంలో నిలిచాడు. మహిళల 4x100 మీటర్ల రిలే ఈవెంట్లో తెలంగాణ అథ్లెట్ నిత్య గంధె, అభినయ, స్నేహ, శ్రావణి నందతో కూడిన భారత బృందం సీజన్ బెస్ట్ ప్రదర్శన 43.86 సెకన్లతో రెండో స్థానంతో రజత పతకాన్ని గెలుచుకుంది. విత్య, పూజలకు కాంస్యాలు ఆసియా క్రీడల కాంస్య పతక విజేత విత్య రామ్రాజ్ కాంస్య పతకం గెలిచింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల అథ్లెట్ పోటీని 56.46 సెకన్లలో పూర్తిచేసి మూడో స్థానంతో ‘పోడియం’లో నిలిచింది. శనివారం ఈ ఫైనల్స్ బరిలో నిలిచిన మరో భారత అథ్లెట్ అను రాఘవన్కు ఏడో స్థానం దక్కింది. ఆమె పోటీని 57.46 సెకన్లలో పూర్తి చేసింది. మహిళల ఈవెంట్లో మరో కాంస్యాన్ని పూజ సింగ్ సాధించింది. మహిళల 800 మీటర్ల పరుగులో పోటీపడిన ఆమె రేస్ను 2 నిమిషాల 01.89 సెకన్లలో పూర్తిచేసి మూడో స్థానంలో నిలిచింది.స్ప్రింట్లో దశాబ్దం తర్వాత...కొరియన్ గడ్డపై స్పింట్లో పతకానికి పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. పురుషుల 200 మీటర్ల పరుగులో అనిమేశ్ కుజూర్ కాంస్య పతకం సాధించాడు. శనివారం జరిగిన పోటీలో 21 ఏళ్ల ఒడిశా స్ప్రింటర్ పరుగును 20.32 సెకన్లలో పూర్తిచేసి జాతీయ రికార్డు నెలకొల్పాడు. కానీ వెంట్రుక వాసిలో 00.01 సెకన్ తేడాతో రజతం గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే అతని వ్యక్తిగత అత్యుత్తమ వేగాన్ని (20.40 సెకన్లు) మెరుగుపర్చుకున్నాడు. ఈ ఏడాది సీనియర్ అథ్లెటిక్స్లో ఆ టైమింగ్ను నమోదు చేశాడు. అబ్దుల్ అజీజ్ (సౌదీ అరేబియా; 20.31 సె.) రజతం నెగ్గారు. సరిగ్గా పదేళ్ల క్రితం (2015లో) 200 మీ. పరుగులో ధరమ్వీర్ సింగ్ కాంస్యంతో స్ప్రింట్లో భారత్ తొలి పతకం అందించాడు. ఆ తర్వాత నాలుగుసార్లు 2017, 2019, 2021, 2023 ఆసియా ఈవెంట్ జరిగినా... ఎవరూ స్ప్రింట్లో పతకం నెగ్గలేకపోయారు. -
‘స్వర్ణ’ నందిని
గుమి (దక్షిణ కొరియా): తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పసిడి మెరుపులతో అదరగొడుతున్నారు. పోటీల మూడో రోజు ఆంధ్ర అథ్లెట్ జ్యోతి యర్రాజీ బంగారు పతకం సాధిస్తే... ఇప్పుడు నాలుగో రోజు శుక్రవారం తెలంగాణ అథ్లెట్ నందిని అగసార స్వర్ణ పతకం సాధించింది. మొత్తం మీద కొరియన్ గడ్డపై భారత బృందం స్వర్ణభేరి మోగిస్తోంది. నాలుగో రోజు పోటీల్లో మన నందినితో పాటు... లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్, హైజంపర్ పూజ సింగ్లు కూడా బంగారు పతకాలు గెలుపొందారు. దీంతో భారత్ ఇప్పటికే 18 పతకాలు సాధించింది. ఇందులో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్య పతకాలున్నాయి. ఇదే జోరు కొనసాగితే... గత 2023–బ్యాంకాక్ చాంపియన్షిప్లో పట్టుకొచ్చిన 27 పతకాల రికార్డును భారత్ అధిగమించే అవకాశముంది. ఇదివరకు 100 మీటర్ల హర్డిల్స్లో విజేతగా నిలిచిన జ్యోతి యర్రాజీ మరో పతకంపై గురిపెట్టింది. ఆమె 200 మీటర్ల పరుగులో ఫైనల్స్కు అర్హత సంపాదించింది. నిత్య గంధే కూడా ఫైనల్ చేరింది. పురుషుల 200 మీటర్ల స్ప్రింట్లో అనిమేశ్ కుజూర్ ఫైనల్ పరుగుకు సిద్ధమయ్యాడు. చైనా అథ్లెట్ను అధిగమించి... తెలంగాణ తేజం నందిని హెప్టాథ్లాన్లో పతకం కోసం పెద్ద పోరాటమే చేసింది. ఏడు క్రీడాంశాల సమాహారమైన ఈ ఈవెంట్లో నందిని చైనా అథ్లెట్ ఇచ్చిన గట్టి పోటీని తట్టుకొని... అగ్రస్థానం సాధించడం గొప్ప విశేషం. అందుకే ఎనిమిదేళ్ల తర్వాత ఈ క్లిష్టమైన హెప్టాథ్లాన్లో భారత్ బంగారు పతకం సాధించగలిగింది. 2017లో స్వప్న బర్మన్ తర్వాత ఆసియా ఈవెంట్లో బంగారం నెగ్గిన ఘనత మన నందినిదే కావడం గమనార్హం. సోమ బిస్వాస్ (2005లో) తర్వాత సుదీర్ఘ నిరీక్షిణకు ఆమె తెరదించితే... నందిని తాజాగా భారత్కు పసిడి పతకం తీసుకొచ్చింది. 100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్పుట్, 200 మీటర్ల పరుగు, లాంగ్జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్ల పరుగు ఇలా... ఈ ఏడు క్రీడాంశాల్లో మొత్తంగా కలిపి నందిని 5941 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆరో ఈవెంట్ అయిన జావెలిన్ త్రోలో కేవలం 34.18 మీటర్ల పేలవ ప్రదర్శన తర్వాత రేసు (మొత్తం పాయింట్లు)లో వెనుకబడిన తెలంగాణ అథ్లెట్ ఆఖరి పోటీ అయిన 800 మీటర్ల పరుగును 2 నిమిషాల 15.54 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలువడంతో తిరిగి అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. నందినికి ఆఖరిదాకా సవాల్ విసిరిన చైనా హెప్టాథ్లెట్ లియు జింగ్యి 5869 పాయింట్లతో రజత పతకానికి పరిమితమైంది. నిజానికి చైనా క్రీడాకారిణి జావెలిన్ త్రో తర్వాత ఆధిక్యంలోకి వచ్చింది. అయితే నందిని 800 మీటర్ల పరుగులో పుంజుకోవడంతో చైనా అథ్లెట్ ‘బంగారు’ ఆశలు గల్లంతయ్యాయి. అనర్హతకు గురైన పురుషుల రిలే జట్టు మూడో రోజు పోటీల్లో మహిళలు, పురుషుల రిలే జట్లు పతకాలు సాధించగా... తాజాగా 4్ఠ100 మీటర్ల రిలే ఈవెంట్లో భారత పురుషుల జట్టు అనర్హతకు గురైంది. ప్రణవ్ గౌరవ్, రాహుల్, మణికంఠ, అమ్లన్ బొర్గొహైన్లతో కూడిన రిలే జట్టు ప్రిలిమినరీ రౌండ్లోనే అనర్హతకు గురైంది. ఒకరి నుంచి మరొకరు బ్యాట్ను అందుకునేందుకు అనుమతించే చోటు (చేంజ్ ఓవర్ జోన్)ని దాటి బ్యాటన్ను తీసుకోవడంతో (ప్రణవ్నుంచి రాహుల్) టీమ్ డిస్క్వాలిఫై అయింది. అయితే పురుషుల జావెలిన్ త్రోలో సచిన్, యశ్వీర్ ఫైనల్ పోటీలకు అర్హత సాధించారు.గుల్వీర్ అ‘ద్వితీయ’ంఆసియా చాంపియన్షిప్ మొదలైన రోజే 10 వేల మీటర్ల సుదీర్ఘ పరుగులో బంగారు పతకం సాధించిన గుల్వీర్ సింగ్ నాలుగో రోజు మరో పసిడిని పట్టాడు. శుక్రవారం పురుషుల 5000 మీటర్ల పరుగులో అతను విజేతగా నిలిచాడు. గుల్వీర్ 13 నిమిషాల 24.77 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. వెంట్రుక వాసిలో థాయ్లాండ్ అథ్లెట్ కీరన్ తుంతివతే (13:24.97 సెకన్లు)ను రజతానికి పరిమితం చేశాడు. పూజ ‘హై’జంప్హరియాణాకు చెందిన 18 ఏళ్ల టీనేజ్ అథ్లెట్ పూజ సింగ్ హైజంప్లో పసిడి శోభ తెచ్చింది. మహిళల హైజంప్లో ఆమె తన ఐదవ ప్రయత్నంలో 1.89 మీటర్ల ఎత్తులో జంప్ చేయడం ద్వారా తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన నమోదు చేసింది. దీంతో ఆమెకు బంగారు పతకం లభించింది. పూజ ‘షో’తో ఉజ్బెకిస్తాన్ హైజంపర్ సఫినా సదుల్లెవా (1.86 మీటర్లు) రెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. భవన నిర్మాణ కూలీ కుమార్తె అయిన పూజ రెండేళ్ల క్రితం ఆసియా అండర్–23 చాంపియన్షిప్ (2023)లోనూ బంగారు పతకంతో సత్తా చాటుకుంది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో పారుల్ చౌదరి రజతం గెలుపొందింది. 9 నిమిషాల 12.46 సెకన్లలో పోటీని పూర్తిచేసిన ఆమె జాతీయ రికార్డు నెలకొల్పింది. కేవలం 2 సెకన్ల తేడాతో పారుల్ స్వర్ణావకాశం చేజారింది. కజకిస్తాన్ అథ్లెట్ నోరా జెరుతో తనుయ్ (9:10.46 సెకన్లు) బంగారు పతకం గెలుచుకుంది. -
ఏపీ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి: ఏపీ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణం గెలుచుకున్న జ్యోతి యర్రాజీకి హృదయపూర్వక అభినందనలు. మీ గెలుపు భారత్, ఆంధ్రప్రదేశ్కు గర్వ కారణం’ అని పేర్కొన్నారు. Heartiest congratulations to @JyothiYarraji on winning the Gold in Women’s 100m Hurdles at the 26th Asian Athletics Championships in Gumi, South Korea! A proud moment for both India and Andhra Pradesh. Wishing you many more accolades ahead!#AAC2025 pic.twitter.com/IlVI79is5d— YS Jagan Mohan Reddy (@ysjagan) May 29, 2025 -
జ్యోతి ‘పసిడి’ పరుగు
గుమి (దక్షిణ కొరియా): భారత క్రీడాకారులు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పతకాల పంట పండిస్తున్నారు. రెండో రోజు అర డజను (6) పతకాలు సాధించిన భారత బృందం మూడో రోజు కూడా మరో ఆరు పతకాలను గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి పతకాన్ని నిలబెట్టుకుంది. పురుషుల 3000 మీ. స్టీపుల్చేజ్లో అవినాశ్ సబ్లే విజేతగా నిలువగా, 4x400 మీటర్ల రిలే ఈవెంట్లో భారత మహిళల బృందం స్వర్ణం సాధిస్తే... పురుషుల జట్టేమో రజతంతో సరిపెట్టుకుంది. మహిళల లాంగ్జంప్లో ఆన్సీ సోజన్ రజతం, శైలీ సింగ్ కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్గా ఈ మూడు రోజుల్లోనే భారత్ మొత్తం 14 పతకాలతో సత్తా చాటుకుంది. తొలి రోజు రెండు పతకాలు నెగ్గిన భారత బృందం ఈ చాంపియన్షిప్లో బుధవారం పోటీలు ముగిసే సరికి పతకాల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. తెలుగు తేజం కొత్త రికార్డు రెండేళ్ల క్రితం బ్యాంకాక్ (థాయ్లాండ్)లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో జ్యోతి యర్రాజీ బంగారు పతకాన్ని సాధించింది. తాజాగా ఇప్పుడు సరికొత్త రికార్డుతో తెలుగుతేజం స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. గురువారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో పోటీని 12.96 సెకన్లలో పూర్తిచేసిన ఏపీ అథ్లెట్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ఆమె 1998లో కజకిస్తాన్ అథ్లెట్ ఓల్గా షిషిజినా (13.04 సె.) రికార్డును అధిగమించింది. ఈ టైమింగ్నే 2011లో చైనా క్రీడాకారిణి సున్ యావె (13.04 సె.) నమోదు చేసింది. 2023–బ్యాంకాక్ ఈవెంట్లో జ్యోతి (13.09 సె.) బంగారు పతకాన్ని గెలిచింది. తద్వారా ఆసియా చాంపియన్షిప్ చరిత్రలో హర్డిల్స్లో స్వర్ణాలు నిలబెట్టుకున్న అరుదైన ఐదుగురు అథ్లెట్ల క్లబ్లో చేరింది. ఎమి అకిమొతొ (జపాన్; 1979, 1981, 1983), జాంగ్ యు (చైనా; 1991, 1993), సు యిన్పింగ్ (చైనా; 2003, 2005), సున్ యావె (చైనా; 2009, 2011)ల సరసన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి నిలిచింది. 36 ఏళ్ల తర్వాత బంగారం భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే ఈ సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో భారత్కు 36 ఏళ్ల తర్వాత స్టీపుల్చేజ్లో పసిడి పతకాన్ని తెచ్చిపెట్టాడు. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్ పోటీని 8:20.92 సెకన్ల టైమింగ్తో అగ్ర స్థానంలో నిలిచాడు. గత ఏడాది భారత ఆటగాడు 8:09.91 సెకన్లతో జాతీయ రికార్డును నెలకొల్పాడు.చివరిసారిగా భారత్ ఈ క్రీడాంశంలో 1989లో బంగారు పతకం గెలిచింది. దినరామ్ విజేతగా నిలువగా, తొలిసారిగా పసడి నెగ్గిన ఘనత హర్బల్ సింగ్ (1975లో)కు దక్కింది. మహిళల 10వేల మీటర్ల పరుగులో ‘పోడియం’కు దూరమైన సంజీవని జాదవ్ (33:08.17 సె.), సీమా (33:08.23 సె.) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. రిలేలో పతకాల జోరు మూడో రోజు పోటీల్లో రిలే బృందాలు సత్తా చాటుకున్నాయి. మహిళల 4x400 మీటర్ల రిలే ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ కుంజా రజిత సహా జిస్నా మాథ్యూ, రూపల్ చౌదరి, శుభా వెంకటేశన్లతో కూడిన బృందం బంగారు పతకం సాధించింది. పోటీని అందరికంటే ముందుగా భారత జట్టు 3 నిమిషాల 34.18 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. పురుషుల 4x400 మీటర్ల రిలే ఈవెంట్లో తృటిలో స్వర్ణావకాశం చేజారడంతో రజతం దక్కింది. జయ్ కుమార్, ధర్మ్వీర్ చౌదరి, మనూ తెక్కినలిల్, విశాల్లతో కూడిన భారత బృందం 3 నిమిషాల 03.67 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. కేవలం 0.15 సెకన్ల తేడాతో ఖతర్ జట్టు (3 ని.03.52 సె) బంగారు పతకం సాధించింది. మహిళల లాంగ్జంప్ ఈవెంట్లో ఆన్సీ సోజన్ రజతం గెలుపొందగా, షైలీ సింగ్ కాంస్య పతకం నెగ్గింది. ఆన్సీ 6.33 మీటర్లు దూకి రెండో స్థానం సాధించగా, షైలీ సింగ్ 6.30 మీటర్లతో ఆమె వెనక నిలిచింది. ఈ ఈవెంట్లో ఇరాన్ అథ్లెట్ మొబిని అరని (6.40 మీ.) స్వర్ణం గెలుచుకుంది. -
పతకమే లక్ష్యంగా...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కోసం ముమ్మరంగా సాధన చేస్తోంది. ఈ నెల 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరగనున్న ఈ టోర్నీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో జ్యోతి డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. 2023లో బ్యాంకాక్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తెలుగమ్మాయి స్వర్ణం సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో నిరాశజనక ప్రదర్శన తర్వాత గాయాల నుంచి కోలుకున్న 25 ఏళ్ల జ్యోతి పూర్తి స్థాయిలో సత్తా చాటేందుకు తన టెక్నిక్లో మార్పులు చేసుకొని పాత పద్ధతిలోనే ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించింది. ‘పారిస్ విశ్వక్రీడల కోసం ‘సెవెన్ స్ట్రయిడ్’ టెక్నిక్ ప్రయత్నించాను. కానీ అది నాకు ఉపయోగపడలేదు. దాని వల్ల రెండుసార్లు గాయపడ్డా. అందుకే పాత పద్దతైన ‘ఎయిట్ స్ట్రయిడ్’లోనే పరుగెత్తాలని నిర్ణయించుకున్నా. గాయాల బారిన పడకుండా ఉంటే 13 సెకన్ల లోపే లక్ష్యాన్ని చేరుతాననే నమ్మకముంది’ అని జ్యోతి చెప్పింది. హర్డిల్స్ మధ్య అడుగుల వ్యూహాన్ని స్ట్రయిడ్ అంటారు. 100 మీటర్ల హర్డిల్స్లో జాతీయ రికార్డు (12.78 సెకన్లు) కలిగిన జ్యోతి... గత ఆసియా చాంపియన్షిప్ 200 మీటర్ల పరుగులో రజత పతకం కూడా నెగ్గింది. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు 59 మందితో కూడిన భారత అథ్లెట్ల బృందం గురువారం దక్షిణ కొరియాకు బయల్దేరింది. -
ఆసియా అథ్లెటిక్స్ పోటీలకు జ్యోతి, నిత్య, నందిని, రజిత
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షి ప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. కొచ్చిలో గురువారం ముగిసిన ఫెడరేషన్ కప్లో రాణించిన క్రీడాకారులను, ఇంతకుముందు ఆసియా చాంపియన్షి ప్ అర్హత ప్రమాణాలను అధిగమించిన ప్లేయర్లను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఎంపిక చేసింది. మే 27 నుంచి 31వ తేదీ వరకు దక్షిణ కొరియాలోని గుమీ నగరంలో జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత్ నుంచి వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 59 మంది బరిలోకి దిగుతారు. పలువురు అథ్లెట్స్ ఒకటికి మించి ఈవెంట్స్లో పోటీపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జ్యోతి యర్రాజీ, కుంజ రజిత... తెలంగాణ నుంచి నిత్య గంధే, అగసార నందిని భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆసియా పోటీలకు దూరంగా ఉంటున్నాడు. స్వదేశంలో మే 24న తన పేరిట జరగనున్న నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ బరిలోకి దిగనుండటంతో అతడిని ఆసియా పోటీలకు ఎంపిక చేయలేదని ఏఎఫ్ఐ వివరించింది. 2023లో బ్యాంకాక్లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ పోటీల్లో భారత్ 6 స్వర్ణాలు, 12 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 27 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణం, 200 మీటర్లలో రజతం సాధించింది. భారత అథ్లెటిక్స్ జట్టుపురుషుల విభాగం: అనిమేశ్ కుజుర్ (200 మీటర్లు), అను కుమార్, కృషన్ కుమార్ (800 మీటర్లు), యూనుస్ షా (1500 మీటర్లు), అవినాశ్ సాబ్లే (3000 మీటర్ల స్టీపుల్ఛేజ్), గుల్వీర్ సింగ్, అభిషేక్ పాల్ (5000 మీటర్లు), గుల్వీర్ సింగ్, సావల్ బర్వాల్ (10000 మీటర్లు), ప్రవీణ్ చిత్రావెల్, అబ్దుల్లా అబూబకర్ (ట్రిపుల్ జంప్), సర్వేశ్ కుషారే (హైజంప్), సచిన్ యాదవ్, యశ్వీర్ సింగ్ (జావెలిన్ త్రో), సమర్దీప్ సింగ్ (షాట్పుట్), తేజస్విన్ శంకర్ (డెకాథ్లాన్), సెర్విన్ సెబాస్టియన్, అమిత్ (20 కిలోమీటర్ల నడక). 4గీ100 మీటర్ల రిలే: ప్రణవ్ ప్రమోద్ గౌరవ్, అనిమేశ్ కుజుర్, మణికంఠ హొబ్లీదార్, అమ్లాన్ బొర్గోహైన్, తమిళరసు, రాగుల్ కుమార్, గురీందర్వీర్ సింగ్. 4గీ400 మీటర్ల రిలే: విశాల్, జై కుమార్, టీఎస్ మనూ, రిన్సీ జోసెఫ్, తుషార్ మన్నా, సంతోష్ కుమార్, ధరమ్వీర్ చౌధరీ, మోహిత్ కుమార్. మహిళల విభాగం: నిత్య గంధే (200 మీటర్లు), జ్యోతి యర్రాజీ (100 మీటర్ల హర్డిల్స్), రూపల్ చౌధరీ, విత్యా రాంరాజ్ (400 మీటర్లు), ట్వింకిల్ చౌధరీ, పూజ (800 మీటర్లు), లిల్లీ దాస్, పూజ (1500 మీటర్లు), పారుల్ చౌధరీ, అంకిత (3000 మీటర్ల స్టీపుల్ఛేజ్), సంజీవని జాధవ్, సీమా (10000 మీటర్లు), విత్యా రాంరాజ్, అను (400 మీటర్లు), శైలి సింగ్, అన్సీ సోజన్ (లాంగ్జంప్), పూజ (హైజంప్), సీమా (డిస్కస్ త్రో), అన్ను రాణి (జావెలిన్ త్రో), అగసార నందిని (హెప్టాథ్లాన్). 4గీ100 మీటర్ల రిలే: నిత్యా గంధే, అభినయ రాజరాజన్, స్నేహ, శ్రాబణి నందా, దానేశ్వరి, సుధీక్ష. 4గీ400 మీటర్ల రిలే: రూపల్, స్నేహ, శుభ, జిస్నా మాథ్యూస్, కుంజ రజిత, సాండ్రామోల్ సాబు. -
నందిని, జ్యోతి యర్రాజీలకు స్వర్ణ పతకాలు
జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. కొచ్చిలో జరుగుతున్న ఈ మీట్లో మంగళవారం మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన అగసార నందిని పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్పుట్, 200 మీటర్లు, లాంగ్జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్లో నందిని మొత్తం 5813 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. పూజ (హరియాణా; 5401 పాయింట్లు) రజతం, మౌమిత మండల్ (రిలయన్స్; 5373 పాయింట్లు) కాంస్యం సాధించారు. మరోవైపు మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ బంగారు పతకాన్ని దక్కించుకుంది. రిలయెన్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.23 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. విజేతగా నిలిచే క్రమంలో జ్యోతి ఆసియా చాంపియన్షిప్ అర్హత ప్రమాణ సమయాన్ని (13.26 సెకన్లు) కూడా అధిగమించింది. -
పసిడి పతకం నెగ్గిన హిమాన్షు
దమ్మామ్ (సౌదీ అరేబియా): ఆసియా అండర్–18 యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్కు తొలి స్వర్ణ పతకం లభించింది. శుక్రవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో హిమాన్షు భారత్కు పసిడి పతకాన్ని అందించాడు. 17 ఏళ్ల హిమాన్షు జావెలిన్ను 67.57 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. లు హావో (చైనా; 63.45 మీటర్లు) రజతం... రుసియన్ సాదుల్లాయెవ్ (ఉజ్బెకిస్తాన్; 61.96 మీటర్లు) కాంస్యం సాధించారు.హరియాణా మహిళా అథ్లెట్ ఆర్తి తన ఖాతాలో రెండో కాంస్య పతకాన్ని జమ చేసుకుంది. 200 మీటర్ల విభాగంలోనూ ఆర్తి కాంస్య పతకాన్ని సాధించింది. ఆర్తి 24.31 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. 100 మీటర్ల విభాగంలోనూ ఆర్తి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు పురుషుల హైజంప్లో దేవక్ భూషణ్ రజత పతకాన్ని గెల్చుకున్నాడు. భూషణ్ 2.03 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల షాట్పుట్లో నిశ్చయ్ రజత పతకం దక్కించుకోగా... పురుషుల మెడ్లీ రిలేలో చిరంత్, సయ్యద్ సాబీర్, సాకేత్ మింజ్, కదీర్ ఖాన్లతో కూడిన భారత బృందం రజత పతకాన్ని హస్తగతం చేసుకుంది. -
రేస్ వాక్లో ఆర్తికి కాంస్యం
లిమా (పెరూ): ప్రపంచ అండర్ 20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్ పతకాల బోణీ కొట్టింది. మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్ ఈవెంట్లో భారత అథ్లెట్ ఆర్తి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 17 ఏళ్ల ఆర్తి 10,000 మీటర్ల దూరాన్ని 44 నిమిషాల 39.39 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 47ని:21.04 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. జుమా బైమా (చైనా; 43ని:26.60 సెకన్లు) స్వర్ణం, మీలింగ్ చెన్ (చైనా; 44ని:30.67 సెకన్లు) రజతం గెలిచారు. -
National Inter State Senior Athletics Championships 2024: జ్యోతి, నందినిలకు స్వర్ణాలు
పంచ్కులా (హరియాణా): జాతీయ సీనియర్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో చివరి రోజు తెలంగాణకు ఒక స్వర్ణం, ఆంధ్రప్రదేశ్కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. మహిళల విభాగంలో ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్పుట్, 200 మీటర్లు, లాంగ్జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్లో తెలంగాణ క్రీడాకారిణి నందిని అగసార పసిడి పతకాన్ని దక్కించుకుంది. నందిని ఓవరాల్గా 5806 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో అంతర్జాతీయ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి యర్రాజీ విజేతగా నిలిచింది. వైజాగ్కు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.06 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. పురుషుల 200 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్కే చెందిన నలుబోతు షణ్ముగ శ్రీనివాస్ రజత పతకాన్ని సాధించాడు. ఫైనల్లో షణ్ముగ 20.95 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని పొందాడు. -
భారత్కు పతకాల పంట
దుబాయ్లో జరుగుతున్న ఆసియా అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రెండో రోజు భారత్కు నాలుగు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలు లభించాయి. మహిళల లాంగ్జంప్లో పావన నాగరాజ్ (6.32 మీటర్లు)... షాట్పుట్లో అనురాగ్ (19.23 మీటర్లు)... 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో రణ్వీర్ (9ని:22.62 సెకన్లు), ఏక్తా డే (10ని:31.92 సెకన్లు) పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. -
దీపాంశుకు స్వర్ణం
దుబాయ్: ఆసియా అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తొలి రోజు భారత్కు ఒక స్వర్ణం, మూడు రజతాలతో కలిపి మొత్తం నాలుగు పతకాలు లభించాయి. పురుషుల జావెలిన్ త్రోలో దీపాంశు శర్మ పసిడి పతకం సాధించాడు. దీపాంశు జావెలిన్ను 70.29 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.భారత్కే చెందిన రోహన్ యాదవ్ 70.03 మీటర్లతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. పురుషుల 1500 మీటర్ల విభాగంలో ప్రియాంశు రజత పతకం నెగ్గాడు. ప్రియాంశు 3 నిమిషాల 50.85 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల డిస్కస్ త్రోలో రితిక్ (53.01 మీటర్లు) రజత పతకం గెలిచాడు. -
గుల్వీర్ సింగ్ స్వర్ణం వెనక్కి...
ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పురుషుల 3000 మీటర్ల విభాగంలో తాను గెల్చుకున్న స్వర్ణ పతకాన్ని భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ కోల్పోయాడు. టెహ్రాన్లో జరిగిన ఈ ఈవెంట్లో గుల్వీర్ రేసు సందర్భంగా తాను పరిగెడుతున్న వరుస నుంచి పక్క వరుసలోకి వెళ్లినట్లు తేలడంతో అనర్హత వేటు వేశారు. నిర్వాహకుల నిర్ణయాన్ని భారత బృందం అప్పీల్ చేయగా.. గుల్వీర్ నిబంధన లకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తేలడంతో అప్పీల్ను కొట్టివేశారు. -
100 మీటర్ల రేసు పరువు తీసింది.. చరిత్రలోనే అత్యంత చెత్త అథ్లెట్
సాధారణంగా అంతర్జాతీయ అథ్లెటిక్స్లో వంద(100) మీటర్ల స్ప్రింట్ రేసుకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ వంద మీటర్ల స్ప్రింట్లో ప్రపంచ రికార్డులు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా పరుగుల చిరుతగా పేరు పొందిన ఉసెన్ బోల్ట్ వంద మీటర్ల రేసులో ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. వంద మీటర్ల రేసు ప్రపంచ రికార్డు ఇప్పటికి బోల్ట్ పేరిటే పదిలంగా ఉంది. 2009 ఆగస్టు 16న బెర్లిన్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో బోల్ట్ వంద మీటర్ల రేసును కేవలం 9.58 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ విభాగంలో బోల్ట్ మూడు ఒలింపిక్స్లో వరుసగా మూడు గోల్డ్ మెడల్స్ కొట్టి మరెవరికి సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మహిళల విభాగంలోనూ వంద మీటర్ల స్ప్రింట్కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అలాంటి వంద మీటర్ల రేసు ప్రాధాన్యతను గంగలో కలిపింది సోమాలియాకు చెందిన అథ్లెట్ నస్రా అబుకర్ అలీ. విషయంలోకి వెళితే.. చైనాలోని చెంగ్డూ వేదికగా 31వ సమ్మర్ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా వంద మీటర్ల రేసు నిర్వహించారు. ఈ రేసులో సోమాలియాకు చెందిన అబుకర్ అలీ కూడా పాల్గొంది. అసలు ఆమెను చూస్తే ఏ కోశానా అథ్లెట్లా కనిపించలేదు. తన పక్కన ఉన్న సహచర అథ్లెట్లు మంచి ఫిట్గా కనిపిస్తుంటే ఆమె మాత్రం ఏ లక్ష్యం లేకుండా నిలబడింది. రేసుకు సిద్ధమైన మిగతా అథ్లెట్లు స్టాన్స్కు పొజిషన్ ఇవ్వగా.. అబుకర్ అలీ మాత్రం కనీసం స్టాన్స్ పొజిషన్ తీసుకోవడానికి కూడా బద్దకించింది. ఇక బజర్ రింగ్ మోగగానే తోటి అథ్లెట్లు రేసును తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నించగా.. అబుకర్ అలీ మాత్రం మెళ్లిగా పరిగెత్తింది. ఇంకా నయం రేసు మధ్యలోనే వైదొలగకుండా మొత్తాన్ని పూర్తి చేసింది. సరైన ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి దిగిన ఆమె వంద మీటర్ల రేసును పూర్తి చేయడానికి 21 సెకన్లు తీసుకుంది. రేసు పూర్తి అయిన తర్వాత చిన్నపిల్లలా ట్రాక్పై జంప్ చేస్తూ వెళ్లడం అందరిని ఆశ్చర్యపరిచింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చూసిన అభిమానులు దానిని ట్విటర్లో షేర్ చేస్తూ సోమాలియా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ను ఏకిపారేశారు. ''ఒక అంతర్జాతీయ ఈవెంట్కు కనీస అవగాహన లేని వ్యక్తిని పంపించడం తప్పు.. సరైన ప్రాక్టీస్ లేకుండానే ఆమెను దేశం తరపున బరిలోకి దించడం అవమానం కిందే లెక్క.. మీ దేశం పరువును మీరే తీసుకుంటున్నారు..''అంటూ కామెంట్ చేశారు. The Ministry of Youth and Sports should step down. It's disheartening to witness such an incompetent government. How could they select an untrained girl to represent Somalia in running? It's truly shocking and reflects poorly on our country internationally. pic.twitter.com/vMkBUA5JSL — Elham Garaad ✍︎ (@EGaraad_) August 1, 2023 చదవండి: Ind vs WI 3rd ODI: 18 ఏళ్ల రికార్డు తిరగరాసిన టీమిండియా! ఒక్కొక్కరు ఇలా.. -
పారిస్ ఒలింపిక్స్కు అవినాశ్ సాబ్లే అర్హత
భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్ ఈవెంట్లో అర్హత సాధించాడు. పోలాండ్లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల అవినాశ్ 8 నిమిషాల 11.63 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయాన్ని (8ని:15.00 సెకన్లు) అవినాశ్ అధిగమించాడు. టోక్యో ఒలింపిక్స్లో హీట్స్లోనే వెనుదిరిగిన అవినాశ్ 2022 కామన్వెల్త్ గేమ్స్లో, 2019 ఆసియా చాంపియన్షిప్లో రజత పతకాలు గెలిచాడు. -
పారుల్, తజిందర్లకు స్వర్ణ పతకాలు
బ్యాంకాక్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో మూడో రోజు భారత్కు మూడు పతకాలు లభించాయి. ఇందులో రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం ఉన్నాయి. మహిళల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్ ఈవెంట్లో పారుల్ చౌధరీ విజేతగా నిలిచి పసిడి పతకం సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన పారుల్ 9 నిమిషాల 38.76 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సుధా సింగ్ (2013, 2017), లలితా బబర్ (2015) తర్వాత ఆసియా చాంపియన్షిప్లో 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో స్వర్ణం నెగ్గిన మూడో భారతీయ అథ్లెట్గా పారుల్ నిలిచింది. మహిళల లాంగ్జంప్ ఈవెంట్లో ఉత్తరప్రదేశ్కే చెందిన 19 ఏళ్ల శైలీ సింగ్ రజత పతకం గెలిచింది. శైలీ సింగ్ 6.54 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల షాట్పుట్ ఈవెంట్లో తజిందర్పాల్ సింగ్ తూర్ తన టైటిల్ను నిలబెట్టుకున్నాడు. పంజాబ్కు చెందిన 28 ఏళ్ల తజిందర్పాల్ ఇనుప గుండును 20.23 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. బిలాల్ సాద్ ముబారక్ (ఖతర్), ఘరీబ్ అల్ జిన్కావి (కువైట్) తర్వాత ఆసియా చాంపియన్షిప్లో వరుసగా రెండుసార్లు షాట్పుట్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు నెగ్గిన మూడో అథ్లెట్గా తజిందర్పాల్ గుర్తింపు పొందాడు. మూడో రోజు పోటీల తర్వాత భారత్ ఐదు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో తొమ్మిది పతకాలతో మూడో స్థానంలో ఉంది. -
జ్యోతి యర్రాజీకి సీఎం జగన్ అభినందనలు
తాడేపల్లి: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన జ్యోతి యర్రాజీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మెహన్రెడ్డి అభినందనలు తెలిపారు. థాయిలాండ్ వేదికగా గురువారం జరిగిన 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో జ్యోతి 100 మీటర్ల హార్డిల్స్లో స్వర్ణ పతకం సాధించింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ''వైజాగ్కు చెందిన జ్యోతి యర్రాజీకి నా శుభాకాంక్షలు. 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించి ఎవరికి సాధ్యం కాని రికార్డును అందుకున్నావు. మీ ప్రదర్శనతో అందరినీ గర్వపడేలా చేశారు.. కంగ్రాట్స్ జ్యోతి యర్రాజీ'' అంటూ ట్వీట్ చేశారు. ఇక థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గురువారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.09 సెకన్లలో ముగించి చాంపియన్గా అవతరించింది. తద్వారా 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్గా జ్యోతి గుర్తింపు పొందింది. విశాఖ జిల్లాకు చెందిన జ్యోతి ఈ ప్రదర్శనతో వచ్చే నెలలో బుడాపెస్ట్లో జరిగే ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం భువనేశ్వర్లోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఇంగ్లండ్కు చెందిన కోచ్ జేమ్స్ హీలియర్ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది. గత రెండేళ్లుగా జ్యోతి జాతీయ, అంతర్జాతీయ మీట్లలో నిలకడగా పతకాలు సాధిస్తోంది. 23 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది. అసుక తెరెదా (జపాన్; 13.13 సెకన్లు) రజత పతకం, ఆకి మసుమి (జపాన్; 13.26 సెకన్లు) కాంస్య పతకం గెలిచారు. వర్షం కారణంగా తడిగా ఉన్న ట్రాక్పై జరిగిన ఫైనల్ రేసులో జ్యోతి ఆద్యంతం ఒకే వేగంతో పరిగెత్తి అనుకున్న ఫలితం సాధించింది. 50 ఏళ్ల చరిత్రగల ఆసియా చాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్గా గుర్తింపు పొందింది. My congratulations and best wishes to our very own @JyothiYarraji from Vizag, on winning gold at the 25th Asian Athletics Championships held in Thailand. You’ve made us all very proud Jyothi! pic.twitter.com/mMvq0afPjG — YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2023 చదవండి: జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో విజేతగా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి -
జ్యోతికి రెండో స్వర్ణం
భువనేశ్వర్: జాతీయ సీనియర్ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రెండో స్వర్ణ పతకంతో మెరిసింది. శుక్రవారం 100 మీటర్ల విభాగంలో బంగారు పతకం నెగ్గిన జ్యోతి... శనివారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ రేసులోనూ విజేతగా నిలిచి తన ఖాతాలో రెండో పసిడి పతకాన్ని జమ చేసుకుంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి అందరికంటే వేగంగా 12.92 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణ అమ్మాయి అగసార నందిని (13.55 సెకన్లు) కాంస్య పతకాన్ని గెల్చుకుంది. మహిళల 4గీ100 మీటర్ల రిలే ఫైనల్లో జ్యోతి యర్రాజీ, భగవతి భవాని యాదవ్, బొద్దిపల్లి దుర్గా, చెలిమి ప్రత్యూషలతో కూడిన ఆంధ్రప్రదేశ్ బృందం (46.61 సెకన్లు) రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన అగసార నందిని 5703 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల అర్హత ప్రమాణాన్ని (5654 పాయింట్లు) కూడా అధిగమించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సౌమ్య మురుగన్ (5323 పాయింట్లు) కాంస్యం సాధించింది. -
సత్తా చాటిన ఆంధ్ర అథ్లెట్స్.. స్వర్ణం నెగ్గిన జ్యోతి యర్రాజీ
భువనేశ్వర్: జాతీయ సీనియర్ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్కు ఒక స్వర్ణ పతకం, ఒక కాంస్య పతకం లభించాయి. మహిళల 100 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ విజేతగా నిలువగా... ట్రిపుల్ జంప్లో మల్లాల అనూష గౌడ్ (13.24 మీటర్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 100 మీటర్ల రేసును అందరికంటే వేగంగా 11.46 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శ్రాబణి నందా (ఒడిశా; 11.59 సెకన్లు) రజతం, హిమశ్రీ రాయ్ (హరియాణా; 11.71 సెకన్లు) కాంస్య పతకం సాధించారు. తెలంగాణ అమ్మాయి నిత్య గాంధె (11.79 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచింది. మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో నాలుగు ఈవెంట్లు (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్పుట్, 200 మీటర్లు) ముగిశాక తెలంగాణకు చెందిన అగసార నందిని 3450 పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉంది. నేడు మిగిలిన మూడు ఈవెంట్లు (లాంగ్జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) పూర్తయ్యాక అత్యధిక పాయింట్లు సాధించిన అథ్లెట్ విజేతగా నిలుస్తుంది. -
400 మీ. పరుగుపందెంలో చరిత్ర.. 31 ఏళ్ల రికార్డు బద్దలు
ఇండోర్ అథ్లెటిక్స్ 400మీ. పరుగుపందెంలో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. నెదర్లాండ్స్కు చెందిన ఫెమ్కె బోల్ డచ్ ఇండోర్ చాంపియన్షిప్లో గమ్యాన్ని 49.26 సెకండ్లలో చేరుకుని నూతన రికార్డును సృష్టించింది. 1982లో చెక్ అథ్లెట్ జర్మిల అక్రతొచిలోవ నెలకొల్పిన 49.59సె. రికార్డును బోల్ చెరిపేసింది. 22 ఏళ్ల బోల్ విజయంపై హర్షం వ్యక్తంచేస్తూ ఇక్కడ హాజరైన ప్రేక్షకుల ప్రోత్సాహంతో రికార్డును సాధించగలిగానని తెలిపింది. ప్రేక్షకుల హర్షధ్వానాలతో తాను రికార్డును నెలకొల్పినట్లు తెలిసిందంటూ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఔట్డోర్లో జర్మనీ అథ్లెట్ మారిట కోచ్ 1985లో నెలకొల్పిన 47.60సె. రికార్డు ఇంకా చెక్కుచెదరలేదు. ¡Boom! Femke Bol, récord mundial de 400 en pista cubierta. 49.26 en Apeldoorn (Países Bajos) y borra el tope de Kratochvilova. 49.26 Femke Bol (2023) 49.59 Kratochvilova (1982) 49.68 Nazarova (2004) 49.76 Kocembova (1984)pic.twitter.com/RhuWkuBwcE — juanma bellón (@juanmacorre) February 19, 2023 -
Asian indoor athletics championships: షాట్పుట్లో తజీందర్ పాల్కు స్వర్ణం
అస్తానా (కజకిస్తాన్): ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తొలి రోజే భారత్ నాలుగు పతకాలతో అదరగొట్టింది. పురుషుల షాట్పుట్లో తజీందర్ పాల్ సింగ్ తూర్ పసిడి పతకం గెలిచాడు. తజీందర్ ఇనుప గుండును 19.49 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. కరణ్వీర్ సింగ్ 19.37 మీటర్లతో రెండో స్థానంలో నిలిచి భారత్కు రజతం అందించాడు. ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రావెల్ 16.98 మీటర్ల దూరం గెంతి జాతీయ ఇండోర్ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకం సాధించాడు. మహిళల పెంటాథ్లాన్లో స్వప్నా బర్మాన్ 4119 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకుంది. -
సరికొత్త ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 319 కిలో మీటర్లు
అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఇటలీలోని వెరోనాలో మంగళవారం జరిగిన యురోపియన్ ఛాంపియన్షిప్లో లిథువేనియాకు చెందిన 41 ఏళ్ల అలెగ్జాండర్ సోరోకిన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. 24 గంటల్లో సోరోకిన్ 319.614 కిలోమీటర్ల దూరం పరిగెత్తి ప్రపంచ రికార్డు లిఖించాడు. కాగా అలెగ్జాండర్ సగటున ఒక కిలోమీటర్ దూరాన్ని 4.30 నిమిషాల్లో దాటేశాడు.ఇంతకముందు అతని పేరిటే ఉన్న రికార్డుపే సోరోకిన్ బద్దలు కొట్టడం విశేషం. గతేడాది ఆగస్టులో 24 గంటల్లో అతను 303.506 కిలోమీటర్ల దూరాన్ని పరుగెత్తాడు. తాజా రికార్డుపై 40 ఏళ్ల సోరోకిన్ ఇన్స్టాగ్రామ్లో స్పందించాడు. ''చాలా అలిసిపోయా.. కానీ రికార్డుతో డబుల్ ఆనందంతో ఉన్నా. విషయమేంటనేది అర్థమయిందిగా.. ప్రపంచ రికార్డు కొట్టడం ఒక ఎత్తయితే.. నా రికార్డును నేనే బద్దలు కొట్టడం మరింత సంతోషాన్నిచ్చింది.'' అంటూ తెలిపాడు. ఇక పొలాండ్కు చెందిన అథ్లెట్ పియోట్రోస్కీ 24 గంటల్లో 301.858 కిలోమీటర్ల దూరం పరిగెత్తి రెండో స్థానంలో నిలవగా.. ఇటలీకి చెందిన మార్కో విసినిటీ 288 కిలోమీటర్ల దూరం పరిగెత్తి మూడో స్థానంలో నిలిచాడు. Ultrarunning legend Aleksandr Sorokin has just smashed his own record (192.252 miles) of distance covered in 24 hours of running 🔥🇱🇹 The Lithuanian has just covered 318.8km / 198.1 miles (unofficial) – 7:15/mile and 4:30/km pace...over a day 🤯 pic.twitter.com/35pWdAE3Ug — AW (@AthleticsWeekly) September 18, 2022 View this post on Instagram A post shared by Aleksandr Sorokin (@ultrarunner_aleksandr_sorokin) చదవండి: Karman Kaur: భారత నంబర్వన్గా కర్మన్ కౌర్ ICC New Rules: అక్టోబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్.. టి20 ప్రపంచకప్లో తొలిసారిగా -
World U-20 Athletics Championships: భారత్కు మరో పతకం
ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. పురుషుల ట్రిపుల్జంప్లో సెల్వ తిరుమారన్ రజత పతకం గెల్చుకున్నాడు. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల సెల్వ 16.15 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 4X400 మీటర్ల రిలేలో సుమ్మీ, ప్రియా హబ్బతనహల్లి మోహన్, కుంజ రజిత, రూపల్ చౌదరీలతో కూడిన భారత బృందం ఫైనల్ చేరింది. ఇప్పటి వరకు భారత్కు ఈ టోర్నీలో 4గX400 మిక్స్డ్ రిలేలో రజతం, మహిళల 400 మీటర్ల విభాగంలో కాంస్యం లభించాయి. -
World U20 Championship: కాంస్యం నెగ్గిన రూపల్ చౌదరీ
ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్కు రెండో పతకం వచ్చింది. కొలంబియాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో మహిళల 400 మీటర్ల విభాగంలో ఉత్తర ప్రదేశ్కు చెందిన రూపల్ చౌదరీ కాంస్య పతకాన్ని సాధించింది. 17 ఏళ్ల రూపల్ 400 మీటర్ల దూరాన్ని 51.85 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. యెమీ మేరీజాన్ (బ్రిటన్; 51.50 సెకన్లు) స్వర్ణం గెలిచింది. ఈ పతకంతో రూపల్ ప్రపంచ అండర్–20 చాంపియన్షిప్లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్గా గుర్తింపు పొందింది. 4X400 మీటర్ల మిక్స్డ్ రిలే ఈవెంట్లో రజతం నెగ్గిన భారత బృందంలో రూపల్ సభ్యురాలిగా ఉంది. -
భారత రిలే జట్టుకు రజతం
కలి (కొలంబియా): ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత మిక్స్డ్ రిలే జట్టు 4X400 మీటర్ల పరుగులో రజత పతకం సాధించింది. శ్రీధర్, ప్రియా మోహన్, కపిల్, రూపల్ చౌదరీలతో కూడిన భారత జట్టు రేసును 3 నిమిషాల 17.67 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. వరల్డ్ అండర్–20 అథ్లెటిక్స్లో భారత మిక్స్డ్ టీమ్ మెరుగైన ప్రదర్శనతో పతకంతో నిలబెట్టుకుంది. గతేడాది నైరోబీలో మొదటిసారిగా నిర్వహించిన ప్రపంచ అండర్ –20 అథ్లెటిక్స్లో మిక్స్డ్ జట్టు కాంస్యం గెలిచింది. అప్పుడు రూపల్ మినహా భరత్, ప్రియా, కపిల్ ముగ్గురు కాంస్యం గెలిచిన బృందంలో ఉన్నారు. 🇮🇳The Indian U-20 4x400m mixed relay team of Bharath, Priya, Kapil & Rupal make the nation proud💥 They finish with a timing of 3.17.76, a new Asian U-20 record, to win 🥈 at the #U20WorldChampionships #Athletics pic.twitter.com/2890EMphNM — The Bridge (@the_bridge_in) August 2, 2022 That effort by #TeamIndia 🇮🇳🫡 pic.twitter.com/gkOW1y1MZk — Athletics Federation of India (@afiindia) August 3, 2022 -
100 మీటర్ల రేసులో 105 ఏళ్ల బామ్మ కొత్త చరిత్ర
100 మీటర్ల పరుగు పందెంలో 105 ఏళ్ల రామ్బాయి కొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం వడోదర వేదికగా జరిగిన నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో ఈ బామ్మ వంద మీటర్ల రేసులో భాగంగా 45.40 సెకన్లలోనే గమ్యాన్ని చేరింది. అయితే సమాచారం ప్రకారం ఈ రేసులో రామ్బాయి తప్ప మరెవరు పాల్గొనలేదంట. కేవలం 100 ఏళ్లు పైబడిన వారికే నిర్వహించిన రేసులో రామ్బాయి ఒక్కరే పాల్గొన్నారు. ఎవరు పోటీ లేకపోవడం.. తన రికార్డును తానే బద్దలు కొట్టి గమ్యాన్ని చేరిన రామ్బాయికి స్వర్ణ పతకం అందజేశారు. కాగా అదే రోజున నిర్వహించిన 200 మీటర్ల స్ప్రింట్ను ఒక నిమిషం 52.17 సెకన్లలో గమ్యాన్ని అందుకొని స్వర్ణం సాధించడం విశేషం. కాగా 100, 200 మీటర్ల రేసులో విజయం సాధించిన తర్వాత రామ్బాయిని స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు చప్పట్లు, కేరింతలతో అభినందించారు. అనంతరం ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఇక ఇదే గుంపులో రామ్బాయి మనవరాలు.. అథ్లెట్ అయిన షర్మిలా సంగ్వాన్ కూడా ఉంది. తన నానమ్మ విజేతగా నిలవడంతో ఆమె ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఆమె మాట్లాడుతూ.. ''మా నానమ్మ విజయం మాకు గర్వకారణం. ఈ విజయానికి ఆమె అర్హురాలు. ఎందుకంటే సాధారణ రోజుల్లో ఉదయాన్నే లేచి 3-4 కిలో మీటర్లు ఆగకుండా పరిగెత్తడం ఆమెకు అలవాటు. ఇది ఆమెను మరింత బలంగా తయారయ్యేలా చేసింది.'' అంటూ పేర్కొంది. At 105 years, super grandma sprints new 100m record. #Rambai ran alone in #Vadodara as there was no competitor above 85 competing at the National Open Masters Athletics Championship pic.twitter.com/iCIPTOkuFt — TOI Bengaluru (@TOIBengaluru) June 21, 2022 చదవండి: Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే Manoj Tiwary On Work And Cricket: పొద్దంతా క్రికెట్.. రాత్రిళ్లు నియోజకవర్గం పని -
Avinash Sable: 30 ఏళ్ల జాతీయ రికార్డు బద్దలు
కాలిఫోర్నియా: మూడు దశాబ్దాల నిరీక్షణ ముగిసింది. 30 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న పురుషుల 5000 మీటర్ల భారత జాతీయ రికార్డు బద్దలైంది. మహారాష్ట్రకు చెందిన అవినాశ్ సాబ్లే తన పేరిట మరో జాతీయ రికార్డును లిఖించుకున్నాడు. అమెరికాలో జరిగిన సౌండ్ రన్నింగ్ ట్రాక్ మీట్లో 27 ఏళ్ల అవినాశ్ 5000 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డును సృష్టించాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న ఈ ఇండియన్ ఆర్మీ అథ్లెట్ 5000 మీటర్ల దూరాన్ని 13 నిమిషాల 25.65 సెకన్లలో పూర్తి చేసి 12వ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 1992లో బర్మింగ్హమ్ వేదికగా భారత అథ్లెట్ బహదూర్ ప్రసాద్ 13 నిమిషాల 29.70 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును అవినాశ్ సవరించాడు. అవినాశ్ ఖాతాలో ఇది మూడో జాతీయ రికార్డు కావడం విశేషం. ప్రస్తుతం అవినాశ్ పేరిట 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్, హాఫ్ మారథాన్ జాతీయ రికార్డులు ఉన్నాయి. వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్లో భాగమైన సౌండ్ రన్నింగ్ ట్రాక్ మీట్లో అవినాశ్కు పతకం రాకపోయినా జాతీయ రికార్డును తిరగరాశానన్న సంతృప్తి లభించింది. అంతేకాకుండా ఈ ఏడాది జూలై 15 నుంచి 24 వరకు అమెరికాలో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు ముందు అవసరమైన ఆత్మవిశ్వాసం దక్కింది. #BreakingNews 🚨 Olympian & #TOPScheme 🏃♂️ #AvinashSable breaks 30-yr old long standing record of Bahadur Prasad (13:29.70/1992) in 5000m, setting a new #nationalrecord with a brilliant performance of 13:25.65 in Sound Running Track meet in San Juan Capistrano 🇺🇸 #Athletics 1/2 pic.twitter.com/vNxWGhi7mT — SAI Media (@Media_SAI) May 7, 2022 -
యర్రాజి జ్యోతికి స్వర్ణం
కోజికోడ్: జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి యర్రాజి జ్యోతి పసిడితో మెరిసింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో జ్యోతి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని అందుకుంది. 13.08 సెకన్ల టైమింగ్తో ఆమె రేస్ను పూర్తి చేసింది. నిజానికి జ్యోతి నమోదు చేసిన టైమింగ్కు జాతీయ రికార్డుగా గుర్తింపు దక్కాలి. 2002లో అనురాధ బిశ్వాల్ నమోదు చేసిన 13.38 సెకన్లను ఆమె సవరించింది. అయితే నిబంధనల ప్రకారం గాలి వేగంలో ఉండే మార్పుతో అదనపు ప్రయోజనం కలిగే అవకాశం ఉండటం వల్ల (టెయిల్ విండ్) దానిని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. టెయిల్ విండ్ను 2 మీటర్/సెకన్ వరకు అనుమతిస్తుండగా, ఈ రేస్ సమయంలో అది 2.1 మీటర్/సెకన్గా నమోదు కావడంతో జ్యోతికి నిరాశ తప్పలేదు. మహేశ్వరికి కాంస్యం... మహిళల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో తెలంగాణ అథ్లెట్ జి. మహేశ్వరి కాంస్యం గెలుచుకుంది. 10 నిమిషాల 47.30 సెకన్లలో రేస్ను పూర్తి చేసిన మహేశ్వరి మూడో స్థానంలో నిలిచింది. -
ద్యుతీ చంద్కు నిరాశ
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత మహిళా స్టార్ అథ్లెట్ ద్యుతీ చంద్కు నిరాశ ఎదురైంది. 60 మీటర్ల విభాగంలో ఆమె సెమీఫైనల్కు అర్హత పొందలేకపోయింది. ఆరో హీట్లో పోటీపడ్డ ఈ ఒడిశా అథ్లెట్ 7.35 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచింది. ఓవరాల్గా ఈ విభాగంలో 46 మంది బరిలోకి దిగగా ద్యుతీ చంద్కు 30వ ర్యాంక్ దక్కింది. -
23 ఏళ్ల పీటీ ఉష రికార్డు బద్దలు
పాటియాలా: ఫెడరేషన్ కప్ మహిళల 200 మీటర్ల పరుగులో 23 ఏళ్లుగా అథ్లెటిక్స్ దిగ్గజం పీటీ ఉష పేరు మీద చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును తమిళనాడుకు చెందిన ఎస్ ధనలక్ష్మి తిరగరాసింది. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భాగంగా గురువారం జరిగిన 200 మీటర్ల సెమీఫైనల్ హీట్ను అందరి కంటే ముందుగా 23.26 సెకన్లలో ముగించిన ధనలక్ష్మి మొదటి స్థానంలో నిలిచి ఫైనల్స్కు అర్హత సాధించింది. దాంతో 1998లో ఇదే మీట్లో పీటీ ఉష నెలకొల్పిన 23.30 సెకన్ల రికార్డు కనుమరుగైంది. రెండు రోజుల కిందట 100 మీటర్ల పరుగులో ద్యుతీచంద్కు షాక్ ఇస్తూ స్వర్ణం నెగ్గిన ధనలక్ష్మి... 200 మీటర్ల సెమీస్ హీట్లోనూ మరో స్టార్ స్ప్రింటర్ హిమదాస్ (24.39 సెకన్లు) కంటే మెరుగైన టైమింగ్ను నమోదు చేసింది. -
పోల్వాల్ట్లో ప్రపంచ రికార్డు
టోరన్ (పోలాండ్): ఒర్లెన్ కోపెర్నికస్ కప్–2020 వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ మీట్లో స్వీడన్కు చెందిన అర్మాండ్ డుప్లాన్టిస్ పోల్వాల్ట్లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 20 ఏళ్ల డుప్లాన్టిస్ 6.17 మీటర్ల ఎత్తుకు ఎగిరి... 2014లో రెనాడ్ లావిలెని (ఫ్రాన్స్–6.16 మీటర్లు) నెలకొలి్పన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. -
దివ్యా రెడ్డికి రెండు పతకాలు
ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ మహిళా అథ్లెట్ దివ్యా రెడ్డి రెండు పతకాలు సాధించింది. మలేసియాలోని సారావక్లో జరుగుతున్న ఈ చాంపియన్షిప్లో దివ్యా రెడ్డి 40 ఏళ్ల వయో విభాగంలో 800 మీటర్ల కేటగిరీలో విజేతగా నిలిచి స్వర్ణం సొంతం చేసుకోగా... 400 మీటర్ల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 800 మీటర్ల ఫైనల్లో దివ్యా రెడ్డి అందరికంటే ముందుగా 2 నిమిషాల 53.64 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్గా అవతరించింది. గో తెంగ్ యిన్ (మలేసియా– 2ని:54.15 సెకన్లు) రజతం... అమితా కనెగాంకర్ (భారత్–2ని:54.73 సెకన్లు) కాంస్యం సాధించారు. -
‘ట్రాక్’ మార్చిన ద్యుతీచంద్
సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు, జాతీయ స్థాయిలో మరెన్నో రికార్డులు భారత మహిళా స్ప్రింటర్ ద్యుతీచంద్ సొంతం. కానీ ఒలింపిక్స్లో పతకం మాత్రం ఆమెను ఇంకా ఊరిస్తూనే ఉంది. ఈసారి ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా ద్యుతీచంద్ సిద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 100 మీటర్ల రేసులో 11.22 సెక్లనలో లక్ష్యాన్ని పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పిన ద్యుతీచంద్ తన ప్రాక్టీస్ను ముమ్మరం చేశారు. తన రికార్డులను తానే బ్రేక్ చేస్తూ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్కు వన్నె తెచ్చిన ద్యుతీచంద్.. వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరుగనున్న ఒలింపిక్స్లో పతకాన్ని గెలిచి తీరాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ‘ట్రాక్’ మార్చిన ద్యుతీచంద్ దాదాపు ఐదేళ్లుగా హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ప్రాక్టీస్ చేస్తున్న ద్యుతీచంద్ చాలాకాలం తర్వాత తన ప్రాక్టీస్ను భువనేశ్వర్కు మార్చారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని సింథటిక్ ట్రాక్ ప్రాక్టీస్కు అనుకూలంగా లేకపోవడంతో భువనేశ్వర్లో ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించారు. గచ్చిబౌలి గట్టిగా మారిపోవడంతో ప్రాక్టీస్ చేయడం కష్టంగా మారింది. ప్రాక్టీస్ చేసే సమయంలో కాళ్లకు అసౌకర్యంగా మారడంతో పాటు గాయం అయ్యే అవకాశాలు కూడా ఉండటంతో తన ప్రాక్టీస్ను కొన్ని రోజుల పాటు భువనేశ్వర్లో కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. టోక్యో ఒలింపిక్స్ సమయం దగ్గర పడుతున్న సమయంలో ప్రతీక్షణం ముఖ్యమేనని భావిస్తున్న ద్యుతీచంద్.. తాత్కాలికంగా తన సొంత రాష్టంలో ప్రాక్టీస్ కొనసాగించనున్నారు. హైదరాబాద్లో ప్రాక్టీస్ తర్వాతే ఆమె కెరీర్ ఉన్నత స్థాయికి వెళ్లడంతో ఇక్కడే ప్రాక్టీస్కు తొలి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. కాగా, ప్రస్తుతం గచ్చిబౌలి సింథటిక్ ట్రాక్ పేలవంగా మారిపోవడంతో ఇక్కడ ఆమె ప్రాక్టీస్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇక్కడ పరిస్థితులు మెరుగైన తర్వాత మళ్లీ గచ్చిబౌలిలోనే ఆమె తిరిగి ప్రాక్టీస్ చేయనున్నారు. ఎంతోమందికి ద్యుతినే స్ఫూర్తి భారత అథ్లెట్లలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ద్యుతీచంద్ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. భారత్లో అథ్లెట్లకు తగినంత ప్రాచుర్యం లభిస్తుందంటే అందుకు ద్యుతీచంద్ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తన ప్రాక్టీస్ను ద్యుతీచంద్ ఆకస్మికంగా భువనేశ్వర్కు ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ ఆమె కోచ్ నాగపురి రమేశ్ను ఫోన్లో సంప్రదిస్తే.. ఇక్కడ ప్రాక్టీస్కు తాత్కాలికంగా విరామం మాత్రమే ఇచ్చారన్నారు. ట్రాక్ ప్రాక్టీస్కు అనుకూలంగా లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకొచ్చారు. ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్కు సన్నద్ధమయ్యే క్రమంలో ట్రాక్ కారణంగా ఏమైనా గాయాలైతే తేరుకోవడం కష్టమని భావించడంతోనే గచ్చిబౌలిలో ప్రాక్టీస్కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారన్నారు. పరిస్థితులు మెరుగైన తర్వాత ద్యుతీచంద్ యథావిధిగా ఇక్కడ ప్రాక్టీస్ కొనసాగిస్తారని పేర్కొన్నారు. ద్యుతీచంద్ను చూసి చాలామంది అథ్లెట్లుగా రాణిస్తున్నారన్నారు. ప్రధానంగా తెలంగాణ నుంచి పలువురు అథ్లెటిక్స్ను ఎంచుకోవడానికి ద్యుతీనే ప్రధాన కారణమన్నారు. ఓవరాల్గా భారత్లో అథ్లెటిక్స్కు మరింత గుర్తింపు రావడానికి ద్యుతీచంద్ కీలక పాత్ర పోషించారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. 40 మంది అథ్లెట్లకు శిక్షణ హైదరాబాద్లో ఏర్పాటైన భారత క్రీడాప్రాధికార సంస్థ(సాయ్)- గోపీచంద్-మైత్ర ఫౌండేషన్ ఎంతోమంది ప్రతిభావంతులకు అండగా నిలుస్తుందని నాగపూరి రమేశ్ అన్నారు. తెలంగాణ అథ్లెట్లు దీప్తి, శ్రీనివాస్లు అంతర్జాతీయ-జాతీయ స్థాయిలో పతకాలు సాధించడంలో ఈ ఫౌండేషన్ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. మార్చిలో జరిగిన యూత్ ఆసియా చాంపియన్షిప్లో దీప్తి, శ్రీనివాస్లు రెండేసి పతకాలు సాధించిన విషయాన్ని రమేశ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 200 మీటర్ల పరుగులో దీప్తి కాంస్యం సాధించగా, మెడ్లే రిలేలో రజతం సాధించిందన్నారు. ఇక శ్రీనివాస్ కూడా ఇదే ఈవెంట్లో రజతం, స్వర్ణాలు గెలుచుకున్నారన్నారు. ప్రస్తుతం గోపీచంద్-మైత్ర ఫౌండేషన్లో దాదాపు 40 మంది అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారని తెలంగాణ నుంచి తొలి ద్రోణాచార్య అవార్డు అందుకున్న నాగపూరి రమేశ్ తెలిపారు. -
రాగ వర్షిణికి రెండు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో సెయింట్ జోసెఫ్ (కింగ్కోఠి)కు చెందిన రాగ వర్షిణి సత్తా చాటింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో అండర్–16 బాలికల 100, 200 మీటర్ల విభాగాల్లో విజేతగా నిలిచి రెండు పసిడి పతకాలను హస్తగతం చేసుకుంది. 100 మీ. పరుగును రాగ వర్షిణి అందరి కన్నా ముందుగా 13.0 సెకన్లలోనే పూర్తిచేసి చాంపియన్గా నిలిచింది. అలీషా (సెయింట్ ఆండ్రూస్; 13.4సె.), జోషిత (సెయింట్ జోసెఫ్; 14.1సె.) వరుసగా రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. 200 మీ. పరుగును రాగ వర్షిణి 28.0 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని అందుకుంది. 29.3 సెకన్ల టైమింగ్ నమోదు చేసిన అలీషా రెండో స్థానంలో నిలవగా, రితికా రెడ్డి (30.9సె.) మూడో స్థానాన్ని అందుకుంది. 400 మీ. పరుగులో పి. శ్రీయ (శ్రీ గాయత్రి జూ. కాలేజి; 1ని.05.9సె.), స్నేహా కుమార్ (సెయింట్ ఆండ్రూస్; 1ని.09.5సె.), నిధి (సెయింట్ జోసెఫ్; 1ని.11.4సె.) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘం (హెచ్డీఏఏ) ఉపాధ్యక్షుడు ఆల్బర్ట్ జేవియర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్డీఏఏ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి చిస్తీ తదితరులు పాల్గొన్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు ∙ అండర్–16 బాలికల 1000 మీ. పరుగు: 1. పి. శ్రీయ, 2. స్నేహా, 3. షర్మిష్ట; బాలురు: 1. మొహమ్మద్ అలీ, 2. యు«ద్వీర్ సింగ్, 3. సాయి. ∙ లాంగ్జంప్ బాలికలు: 1. సత్యశ్రీ ఆశ్రిత, 2. ఆకాంక్ష, 3. ప్రసన్న; బాలురు: 1. అన్మోల్ రాణా, 2. కె. హర్షవర్ధన్, 3. పి. శ్రీకాంత్. ∙ షాట్పుట్ బాలికలు: 1. అదితి సింగ్, 2. శేష సాయి, 3. భవిష్య; బాలురు: 1. రాహుల్ గౌడ్. ∙ డిస్కస్ త్రో బాలికలు: 1. సుప్రజ. ∙ 100 మీ. పరుగు బాలురు: 1. టి. రాహుల్, 2. ఎ. రేవంత్, 3. ఆర్. సాయి కుమార్. ∙ 200 మీ. పరుగు బాలురు: 1. టి. రాహుల్, 2. రేవంత్, 3. మణిహర్షిత్. ∙ 400 మీ. పరుగు బాలురు: 1. ఎం. సాయి, 2. వాయునందన్, 3. వినయ్ కుమార్. ∙ అండర్–14 బాలుర 100మీ. పరుగు: 1. హర్షవర్ధన్, 2. అనిరుధ్ బోస్, 3. గణేశ్; బాలికలు: 1. కృతి, 2. జి. ప్రీతి, 3. స్నేహా. ∙ 600 మీ. పరుగు: 1. వి. వివేక్, 2. బద్రి, 3. విశాల్; బాలికలు: 1. ఝాన్సీబాయి, 2. యువిక, 3. సంజన. ∙ లాంగ్ జంప్: 1. ఎన్. కార్తీక్, 2. ఆర్యన్ కుమార్, 3. గణేశ్; బాలికలు: 1. ఖుష్బు, 2. సంజన, 3. మహేశ్వరి. ∙ షాట్పుట్: 1. ఎన్. గణేశ్, 2. అనుజ్ఞ రాకేశ్, 3. అమిత్ కుమార్; బాలికలు: 1. సాయి శ్రీయ, 2. మనస్విని, 3. మనస్విత. -
నియా అలీకి స్వర్ణం...
దోహా: పోటీల చివరిరోజు ఏడు ఈవెంట్స్లో ఫైనల్స్ జరిగాయి. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో అమెరికా అథ్లెట్, ఇద్దరు పిల్లల తల్లి అయిన 30 ఏళ్ల నియా అలీ స్వర్ణం సాధించింది. ఆమె 12.34 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. మహిళల లాంగ్జంప్లో మలైకా మిహాంబో (జర్మనీ–7.30 మీటర్లు)... పురుషుల 1500 మీటర్లలో టిమోతీ చెరుయోట్ (కెన్యా–3ని:29.26 సెకన్లు)... పురుషుల జావెలిన్ త్రోలో పీటర్స్ (గ్రెనెడా–86.89 మీటర్లు)... పురుషుల 10,000 మీటర్లలో జోషువా చెప్టెగి (ఉగాండా–26ని:48.36 సెకన్లు)... మహిళల 4గీ400 మీటర్ల రిలే ఫైనల్స్లో అమెరికా బృందం (3ని:18.92 సెకన్లు)... పురుషుల 4గీ400 మీటర్ల రిలే ఫైనల్స్లో అమెరికా బృందం (2ని:56.69 సెకన్లు) స్వర్ణ పతకాలు గెల్చుకున్నారు. ఓవరాల్గా పతకాల పట్టికలో అమెరికా 14 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 29 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. -
స్టీపుల్చేజ్ విజేత మహేశ్వరి
సాక్షి, హైదరాబాద్: సౌత్జోన్ జాతీయ అథ్లెటిక్స్ టోర్నీలో జి. మహేశ్వరి రికార్డు స్వర్ణాన్ని సాధించింది. కర్ణాటకలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహేశ్వరి 2000మీ. స్టీపుల్ చేజ్లో కొత్త జాతీయ రికార్డుతో పాటు, మీట్ రికార్డును నెలకొల్పింది. ఆమె 6 నిమిషాల 41 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని... 2015లో నమోదైన 7ని. 1.72 సెకన్లతో ఉన్న జాతీయ రికార్డును తిరగరాసింది. 200మీ. పరుగులోనూ దీప్తి మీట్ రికార్డును సాధిం చింది. పరుగును 24.84సెకన్లలో ముగించి స్వర్ణాన్ని గెలుచుకుంది. దీంతో అన్సీ జోసెఫ్ (25.09సె.) రికార్డు తెరమరుగైంది. హెప్టాథ్లాన్లోనూ నూతన జాతీయ రికార్డు నమోదైంది. నందిని 5046 పాయింట్లు సాధించి జాతీయ రికార్డుతో పాటు మీట్ రికార్డును సృష్టించింది. గతంలో ఈ రికార్డు స్వప్నా బర్మన్ 4992 పాయింట్లు) పేరిట ఉండేది. ఈ టోరీ్నలో తెలంగాణ 7 స్వర్ణాలు, 14 రజతాలు, 12 కాంస్యాలు సాధించింది. -
హైజంప్లో ప్రణయ్కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: సౌత్జోన్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ తొలిరోజు తెలంగాణ అథ్లెట్లు పతకాల పంట పండించారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో జరుగుతోన్న ఈ టోర్నీలో మొత్తం 16 పతకాలను సాధించారు. ఇందులో 3 స్వర్ణాలు, 8 రజతాలు, 5 కాంస్యాలు ఉన్నాయి. అండర్–14 బాలుర హై జంప్లో కె. ప్రణయ్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. అతను అందరికన్నా ఎక్కువగా 1.75మీ. జంప్ చేసి విజేతగా నిలిచాడు. 100మీ. పరుగులో గౌతమ్ 11.8సెకన్లలో లక్ష్యాన్ని చేరి బంగారు పతకాన్ని అందుకున్నాడు. అండర్–18 బాలికల 100మీ. పరుగులో దీప్తి జీవంజి 12.11సెకన్లలో పరుగును పూర్తిచేసి చాంపియన్గా నిలిచింది. అండర్–14 బాలుర 100మీ. పరుగులో హర్ష (11.81సె.), అండర్–18 బాలికల 100మీ. పరుగులో కియాషా (12.41సె.), అండర్–16 బాలికల 400మీ. పరుగులో మైథిలీ (58.79సె.), బాలుర విభాగంలో మహేశ్ (50.28సె.), అండర్–20 బాలికల 1500మీ. పరుగులో మహేశ్వరి (4ని.42.00సె.), అండర్–16 బాలుర 2000మీ. పరుగులో యరమాకల రెడ్డి (5ని.57.13సె.), అండర్–18 బాలికల 100మీ. హర్డిల్స్లో నందిని (15.19సె.) రన్నరప్లుగా నిలిచి రజత పతకాలను సొంతం చేసుకున్నారు. అండర్–16 బాలుర 100మీ. పరుగులో దిలీప్ (11.53సె.), అండర్–18 బాలికల 100మీ. హర్డిల్స్లో శ్రీ పద్మ (15.34సె.), అండర్–20 బాలుర షాట్పుట్లో సత్యవాన్ (15.94మీ.) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను గెలుచుకున్నారు. -
సత్తా చాటిన రాగవర్షిణి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో బి. రాగవర్షిణి అద్భుత ప్రదర్శన కనబరిచింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో గురువారం జరిగిన అండర్–16 బాలికల 100మీ., 200మీ., పరుగులో ఆమె విజేతగా నిలిచి రెండు స్వర్ణ పతకాలను హస్తగతం చేసుకుంది. 100మీ. పరుగును 13.5 సెకన్లలో పూర్తి చేసిన ఆమె పసిడి పతకాన్ని అందుకోగా... జషిత సుంకరి (14.5సె.) రజతాన్ని, కీర్తన (15.2 సె.) కాంస్యాన్ని గెలుచుకున్నారు. 200మీ. పరుగులో రాగవర్షిణి ( 27.5 సె.), జషిత (30.9సె.), కీర్తన (32.4సె.) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు అండర్–16 బాలికల 400మీ. : 1. దివ్య, 2. ఆర్నవి, 3. సత్యశ్రీ; 800మీ.: 1. పి. శ్రీయ, 2. ఆర్నవి, 3. నైనిత రావు; డిస్కస్ త్రో: 1. సునయన, 2. పవిత్ర, 3. వేదప్రియ; షాట్పుట్: 1. నవ్య, 2. వేద ప్రియ, 3. పవిత్ర; లాంగ్జంప్: 1. పవిత్ర, 2. సత్యశ్రీ ఆశ్రిత, 3. క్షీరజ. అండర్–14 బాలికల 100మీ. పరుగు: 1. కృతి, 2. కియోనా, 3. విభారావు; 600మీ. పరుగు: 1. యువిక, 2. సంజన, 3. ప్రీతి తివారీ; లాంగ్జంప్: 1. సుగంధి, 2. తార, 3. ఖుష్బూ. అండర్–18 బాలికల 100మీ. పరుగు: 1. రియా గ్రేస్, 2. అనన్య, 3. శ్రుతి; 200మీ. పరుగు: 1. రియా గ్రేస్, 2. ప్రేరణ, 3. నిషిత; 800మీ. పరుగు: 1. నిషిత, 2. నందిని, 3. అక్షిత; షాట్పుట్: 1. కరిష్మా, 2. శ్రుతి తివారీ; లాంగ్జంప్: 1. అనన్య, 2. నందిని, 3. అక్షిత; అండర్–14 బాలుర 100మీ. పరుగు: 1. అనిరుధ్, 2. జాన్ డేవిడ్, 2. చోటు సింగ్; 600మీ. పరుగు: 1. అరవింద్, 2. చోటు సింగ్, 3. జాన్ డేవిడ్; షాట్పుట్: 1. వ్రజ్రాజ్, 2. ఆదిత్య, 3. అమిత్ కుమార్. అండర్–18 బాలుర షాట్పుట్: 1. దత్త ప్రసాద్, 2. అభినయ్, 3. శివదత్త; 100మీ. పరుగు: 1. శశాంక్, 2. మనో వెంకట్, 3. చాంద్బాషా; 400మీ. పరుగు: 1. శ్రీకాంత్, 2. హవిశ్, 3. ఆశిష్. -
కావ్య, నందినిలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఓపెన్ స్ప్రింట్స్ అండ్ జంప్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో కావ్య (‘సాయ్’), నందిని (టీఎస్డబ్ల్యూఆర్ఎస్, రంగారెడ్డి) సత్తా చాటారు. జీఎంసీ బాలయోగి స్టేడియంలో సోమవారం జరిగిన పోటీల్లో వీరిద్దరూ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. మహిళల 400మీ. పరుగును కావ్య అందరికన్నా వేగంగా 58.42 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. ‘సాయ్’ కేంద్రానికే చెందిన మహేశ్వరి (1ని.00.1సె.), సీహెచ్ పద్మశ్రీ (1ని.01.1సె.) వరుసగా రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. అండర్–16 బాలికల లాంగ్జంప్ ఈవెంట్లో నందిని 5.21మీ. దూరం జంప్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అదితి సింగ్ (జ్యోతి విద్యాలయ) 4.07 మీ. దూకి రెండో స్థానంలో నిలవగా... పవిత్ర (సెయింట్ ఆన్స్; 4.05మీ.) మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు పురుషుల 400మీ. పరుగు: 1. రిషబ్ మిశ్రా, 2. శ్రవణ్ కుమార్, 3. తేజ. అండర్–16 బాలుర లాంగ్ జంప్: 1. యోగేందర్, 2. పి. అంజి, 3. వరుణ్. అండర్–14 బాలుర 4/400మీ. రిలే: 1. టీఎస్డబ్ల్యూఆర్ఎస్, రంగారెడ్డి, 2. సీఎంఆర్, సూరారం, 3. మియాపూర్. అండర్–12 బాలుర 80మీ.పరుగు: 1. జె. అనిల్, 2. రామ్ శంకర్, 3. జి. లక్ష్మణ్. అండర్–10 బాలుర 60మీ. పరుగు: 1. హృషికేశ్ స్వామి, 2. కె. గౌతమ్, 3. ఆర్. శ్రీకాంత్; 300మీ. పరుగు: 1. రాము, 2. ప్రణయ్, 3. గౌతమ్. అండర్–16 బాలికల 400మీ. పరుగు: 1. శ్రేయ, 2. విజయ లక్ష్మి, 3. ప్రవళిక. అండర్–14 బాలికల 100 మీ. పరుగు: 1. రాగవర్షిణి, 2. ఆర్. ఝాన్సీ బాయి, 3. సవిత; 400మీ. పరుగు: 1. ఝాన్సీ బాయి, 2. రాగవర్షిణి, 3. శరణ్య; లాంగ్ జంప్: 1. సవిత, 2. నవ్య, 3. షీరజ. అండర్–12 బాలికల 80మీ.పరుగు: 1. విభా రావు, 2. రోహిత, 3. ప్రతీకా రెడ్డి. -
గోమతి డోపీ... సస్పెన్షన్
న్యూఢిల్లీ: గత నెల ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో గోమతి మరిముత్తు విజేత. సరిగ్గా నెలతిరిగేలోపే డోపీ. అప్పుడేమో స్వర్ణం తెచ్చింది. ఇప్పుడేమో భారత క్రీడారంగానికి మచ్చతెచ్చింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో మంగళవారం గోమతిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేశారు. తమిళనాడుకు చెందిన ఈ మహిళా రన్నర్ గత నెల 22న నిర్వహించిన 800 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం గెలిచింది. దోహా ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ సందర్భంగా 30 ఏళ్ల గోమతికి నిర్వహించిన పరీక్షల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. ఆమె ‘ఎ’ శాంపిల్ను ల్యాబ్లో పరీక్షించగా పట్టుబడింది. ఇప్పుడు మళ్లీ ‘బి’ శాంపిల్లోనూ పట్టుబడితే గరిష్టంగా ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశాలున్నాయి. నిజానికి ఆమె ఫెడరేషన్ కప్లోనే దొరికిపోయింది. మార్చిలో పాటియాలాలో జరిగిన ఈవెంట్ సందర్భంగా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఆమె రక్త,మూత్ర నమూనాల్ని పరీక్షించగా నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు రిపోర్టులో వచ్చింది. అయితే ‘నాడా’ ఈ విషయాన్ని సంబంధిత క్రీడా సంఘానికి తెలపడంలో విఫలమైంది. అçప్పుడే రిపోర్టు ఇచ్చివుంటే ఆసియా ఈవెంట్కు ఎంపిక చేయకుండా ఉండేవారమని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) తెలిపింది. దీనిపై ‘నాడా’ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ను సంప్రదించగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు. -
చిత్ర పసిడి పరుగు
దోహా (ఖతర్): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో చివరి రోజు కూడా భారత అథ్లెట్స్ పతకాల పంట పండించారు. బుధవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఆఖరి రోజు భారత అథ్లెట్స్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం సొంతం చేసుకున్నారు. ఓవరాల్గా భారత్కు ఈ పోటీల్లో మూడు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలు లభించాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. మహిళల 1500 మీటర్ల విభాగంలో చిత్ర ఉన్నికృష్ణన్ స్వర్ణం సాధించింది. ఈ పోటీల్లో భారత్కు లభించిన మూడో పసిడి పతకమిది. 1500 మీటర్ల రేసును చిత్ర 4 నిమిషాల 14.56 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఫినిషింగ్ లైన్కు కొన్ని మీటర్ల దూరంలో చిత్ర బహ్రెయిన్ అథ్లెట్ గషా టైగెస్ట్ను దాటి ముందుకెళ్లింది. మహిళల 200 మీటర్ల విభాగంలో ఒడిశా అథ్లెట్ ద్యుతీ చంద్ కాంస్య పతకాన్ని సాధించింది. తెలంగాణ కోచ్ నాగపురి రమేశ్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్న ద్యుతీ చంద్ 23.24 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. ఎడిడియోంగ్ ఒడియోంగ్ (బహ్రెయిన్) కూడా 23.24 సెకన్లలోనే గమ్యానికి చేరినా ఫొటోఫినిష్లో ద్యుతీ చంద్కు కాంస్యం ఖాయమైంది. మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో ప్రాచి, పూవమ్మ రాజు, సరితాబెన్ గైక్వాడ్, విస్మయలతో కూడిన భారత బృందం 3ని:32.21 సెకన్లలో రేసును ముగించి రజత పతకం గెల్చుకుంది. పురుషుల 1500 మీటర్ల రేసులో అజయ్ కుమార్ సరోజ్ 3ని:43.18 సెకన్లలో గమ్యానికి చేరి రజతం సాధించాడు. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలేలో కున్హు మొహమ్మద్, జీవన్, అనస్, అరోకియా రాజీవ్లతో కూడిన భారత బృందం 3ని:03.28 సెకన్లలో రేసును పూర్తి చేసి రజతం కైవసం చేసుకుంది. అయితే రేసు సందర్భంగా మూడో ల్యాప్లో చైనా అథ్లెట్ను భారత అథ్లెట్ అనస్ నిబంధనలకు విరుద్ధంగా ఢీకొట్టడంతో నిర్వాహకులు భారత జట్టుపై అనర్హత వేటు వేసి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో నవజీత్ కౌర్ (57.47 మీటర్లు) నాలుగో స్థానంలో... కమల్ప్రీత్ కౌర్ (55.59 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచారు. పురుషుల 5000 మీటర్ల రేసులో మురళి ఐదో స్థానంలో, అభిషేక్ ఆరో స్థానంలో నిలిచారు. -
గోమతి, తేజిందర్లకు స్వర్ణాలు
దోహా: ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గోమతి మరిముత్తు... తనపై పెట్టుకున్న ఆశలను నిజం చేస్తూ తేజిందర్ పాల్ సింగ్ తూర్ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో మెరిశారు. మహిళల 800 మీటర్ల రేసులో 30 ఏళ్ల గోమతి... పురుషుల షాట్పుట్ ఈవెంట్లో 24 ఏళ్ల తేజిందర్ స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. చెన్నైకు చెందిన గోమతి 800 మీటర్ల రేసును 2 నిమిషాల 02.70 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతేడాది జకార్తా ఆసియా క్రీడల్లో పసిడి పతకం నెగ్గిన తేజిందర్ అదే జోరును ఇక్కడ కూడా కనబరిచి విజేతగా నిలిచాడు. పంజాబ్కు చెందిన తేజిందర్ ఇనుప గుండును 20.22 మీటర్ల దూరం విసిరి స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నాడు. ఓవరాల్గా రెండో రోజు భారత్కు రెండు స్వర్ణాలు, రజతం, రెండు కాంస్యాలతో కలిపి ఐదు పతకాలు వచ్చాయి. మహిళల 100 మీటర్ల రేసును భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ 11.44 సెకన్లలో ముగించి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల జావెలిన్ త్రోలో బరిలోకి దిగిన శివ్పాల్ సింగ్ రజతం దక్కించుకున్నాడు. శివ్పాల్ జావెలిన్ను 86.23 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో సరితాబెన్ గైక్వాడ్ 57.22 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్లో జాబిర్ 49.13 సెకన్లతో కాంస్య పతకాన్ని నెగ్గాడు. తొలి రోజు ఆలస్యంగా జరిగిన పురుషుల 10,000 మీటర్ల రేసులో మురళీ కుమార్ (28ని:38.34 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. -
అన్ను రాణి, అవినాశ్లకు రజతం
దోహా (ఖతర్): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తొలి రోజే భారత్ పతకాల ఖాతా తెరిచింది. మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి... పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో అవినాశ్ ముకుంద్ రజత పతకాలు నెగ్గగా... 5000 మీటర్ల విభాగంలో పారుల్ చౌదరీ... 400 మీటర్ల విభాగంలో పూవమ్మ రాజు కాంస్య పతకాలు సాధించారు. అన్ను రాణి జావెలిన్ను 60.22 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది. 3000 మీటర్ల స్టీపుల్చేజ్ ఫైనల్లో అవినాశ్ 8 నిమిషాల 30.19 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానాన్ని పొందాడు. మరోవైపు మహిళల 5000 మీటర్ల ఫైనల్ రేసును పారుల్ 15 నిమిషాల 36.03 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. 400 మీటర్ల ఫైనల్లో పూవమ్మ రాజు 53.21 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. మహిళల 100 మీటర్ల హీట్స్లో ద్యుతీ చంద్ 11.28 సెకన్లలో గమ్యానికి చేరి 11.29 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టి సెమీఫైనల్కు చేరింది. -
కీర్తన, ప్రేమ్కుమార్లకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో కీర్తన, ప్రేమ్ కుమార్ విజేతలుగా నిలిచారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ టోర్నీలో అండర్–14 బాలికల షాట్పుట్లో కీర్తన, అండర్–16 బాలుర లాంగ్జంప్లో ప్రేమ్ కుమార్ స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. లాంగ్జంప్ ఈవెంట్లో వరంగల్కు చెందిన ప్రేమ్ కుమార్ 5.92మీ. దూరం జంప్ చేసి విజేతగా నిలిచాడు. జయశంకర్ భూపాలపల్లికి చెందిన అథ్లెట్ ఎం. రేవంత్ (5.85మీ.), అబిద్ ఖురేషి (రంగారెడ్డి, 5.85మీ.) వరుసగా రజత కాంస్యాలను సొంతం చేసుకున్నారు. అండర్–14 బాలికల షాట్పుట్లో వీఎస్ఎస్ కీర్తన్ గుండును అందరికంటే దూరంగా 9.44మీ. దూరం విసిరి చాంపియన్గా నిలిచింది. తేజస్విని (మంచిర్యాల, 8.78మీ.), అనీశ్ కుమార్ (‘సాయ్’, 8.10మీ.) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో గచ్చిబౌలి పోలీస్ ఇన్స్పెక్టర్ ఆర్. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి ప్రొఫెసర్ కె. రంగారావు, హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ రాజేశ్ కుమార్, కార్యదర్శి భాస్కర్రెడ్డి, ఉపాధ్యక్షుడు బికాస్ కరార్ తదితరులు పాల్గొన్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు ∙అండర్–20 బాలికల 100మీ. పరుగు: 1. నిత్య (12.5సె., హైదరాబాద్), 2. భానుచంద్రిక (13.4 సె., సాయ్), 3. రమ (13.8 సె., వికారాబాద్). ∙400మీ. పరుగు బాలికలు: 1. పి. కావ్య (సాయ్), 2. అనురాగ (వికారాబాద్), 3. కె. మంజుల (మహబూబ్నగర్). ∙షాట్పుట్ బాలికలు: 1. కె. మాన్విత (భద్రాద్రి), 2. టి. అనూష (భద్రాద్రి), 3. ఆర్. శ్రీలత (నిజామాబాద్); బాలురు: 1. యశ్వంత్ (వరంగల్ అర్బన్), 2. అలెక్స్ జోసెఫ్ (వికారాబాద్), 3. హెచ్. సునీల్ (నిజామాబాద్). ∙లాంగ్జంప్ బాలురు: 1. ప్రసన్న కుమార్ (సూర్యాపేట్), 2. ఖాసిమ్ షరీఫ్ (హైదరాబాద్), 3. జి. సైదులు (యాదాద్రి). ∙డిస్కస్ త్రో బాలురు: 1. అనిల్ నాయక్ (నిజామాబాద్), 2. అలెక్స్ జోసెఫ్ (వికారాబాద్), 3. సునీల్ (నిజామాబాద్) ∙అండర్–18 బాలికల 400మీ. పరుగు: 1. సుష్మా బాయి (సాయ్), 2. టి. హనీ (మంచిర్యాల), 3. పి. మౌనిక (నల్లగొండ). ∙షాట్ఫుట్: 1. తేజస్విని (హైదరాబాద్), 2. సు జిత (మంచిర్యాల), 3. సంధ్య (మహబూబాబాద్). ∙లాంగ్జంప్ బాలురు: 1. అనురాగ్ (బీఎస్సీ), 2. బి. జగదీశ్ (వరంగల్), 3. తేజ (మెదక్). ∙ డిస్కస్ త్రో బాలురు: 1. అభిషేక్ (బీఎస్సీ), 2. రాజు (వికారాబాద్), 3.రాఘవేంద్ర (కరీంనగర్). ∙10,000 మీ. రేస్వాక్: 1. దుర్గారావు (వరంగల్ అర్బన్), 2. ఎస్. అజయ్ (ఆదిలాబాద్), 3. బి. కుమార్ (మహబూబాబాద్). ∙అండర్–16 బాలికల షాట్పుట్: 1. ఆర్. సుజంత (నాగర్కర్నూల్), 2. కావ్య (నల్లగొండ), 3. ఎం. సాయి వర్షిత (మంచిర్యాల). ∙డిస్కస్ త్రో బాలురు: 1. అజయ్ (బీఎస్సీ), 2. మన్దీప్ (బీఎస్సీ), 3. విశాల్ (వికారాబాద్). ∙500మీ. రేస్ వాక్: 1. ప్రిన్స్ (బీఎస్సీ), 2. భా స్కర్ (మంచిర్యాల), 3. రంజిత్ (వరంగల్). -
సురేశ్, కావ్యలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఇ. సురేశ్, పి.కావ్య సత్తా చాటారు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో 800మీ. పరుగులో వీరిద్దరూ స్వర్ణా లను సాధించారు. పురుషుల 800మీ. పరుగులో వివేకానంద ప్రభుత్వ కాలేజీకి చెందిన సురేశ్ విజేతగా నిలవగా... కె. అజయ్ కుమార్ (ఎస్పీ కాలేజి), ఎం. రాము (జీసీపీఈ) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. మహిళల విభాగంలో పి. కావ్య (ఎస్.ఎన్. వనిత), ఎన్. సుచిత్ర (సెయింట్ ఆన్స్), ఎ. కీర్తి (భవన్స్ కాలేజి) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలను గెలుచుకున్నారు. నిజాం కాలేజి ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ టోర్నీ ప్రారంభోత్స వంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఎల్. రామచంద్రారావు ముఖ్య అతిథులుగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిజాం కాలేజి ప్రిన్సిపాల్ ఎల్.బి. లక్ష్మీకాంత్ రాథోడ్, ఓయూ ఐయూటీ సెక్రటరీ ప్రొఫెసర్ బి. సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు లాంగ్ జంప్: 1. పి. శ్రీకాంత్ రెడ్డి (లయోలా), 2. ఆర్. సతీశ్ (జీసీపీఈ), 3. తేజ (బీజేఆర్). షాట్పుట్: 1. జె. సంధ్య (జీసీపీఈ), 2. ఎం. అంబిక (జీసీపీఈ), 3. ఎం. సుమన (బీవీసీ). మహిళల 4–400మీ. రిలే : 1. సెయింట్ ఆన్స్, 2. జీసీపీఈ, 3. భవన్స్ వివేకానంద డిగ్రీ కాలేజి. పురుషుల 4–400మీ. రిలే: 1. నిజాం కాలేజి, 2. జీసీపీఈ, 3. హిందీ మహావిద్యాలయ. షాట్పుట్: 1. అలెక్స్ జోసెఫ్ (బీవీసీ), 2. శ్రీశైలం (ఎస్డీసీపీఈ), 3. మోహన్లాల్ (ఓయూ పీజీ కాలేజి). లాంగ్జంప్: 1. ఎస్కే హిజ్రత్ (ఓసీపీఈ), 2. ఇరిన్ దిల్నా (సెయింట్ పాయ్స్), 3. రమా వాసవి (వెస్లీ డిగ్రీ కాలేజి). 400మీ. హర్డిల్స్: 1. బి. మమత (నిజాం కాలేజి), 2. హఫీజా బేగం (సెయింట్ ఆన్స్), 3. పి. ప్రియ (జీసీపీఈ). 200మీ. పరుగు: 1 జి. నిత్య (సెయింట్ ఆన్స్), 2. ఆర్. భవాని (కేశవ్ మెమోరియల్), 3. దివ్యశ్రీ (డీవీఎం). -
దిలీప్కు స్వర్ణం
గచ్చిబౌలి: జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో గచ్చిబౌలి స్టేడియానికి చెందిన క్రీడాకారులు దిలీప్, మహేశ్రెడ్డి, సీహెచ్ రాఘవి, రామకృష్ణ మెరుగైన ప్రదర్శనతో రాష్ట్రానికి పతకాలు అందించారు. గుంటూరులో జరిగిన సౌత్జోన్ జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీ అండర్–14 బాలుర 100మీ. పరుగులో దిలీప్ స్వర్ణాన్ని గెలుచుకోగా... అండర్–18 బాలుర కేటగిరీ 2000 మీటర్ల స్టీపుల్చేజ్లో మహేశ్రెడ్డి రజతాన్ని, అండర్–20 బాలుర 4–100 మీటర్ల రిలేలో రామకృష్ణారెడ్డి రన్నరప్గా నిలిచి వెండి పతకాన్ని అందుకున్నారు. అండర్–16 బాలికల 2000 మీ. పరుగులో రాఘవి రజతాన్ని సాధించింది. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియం ఏఓ శ్రీనివాస్, కోచ్ శ్రీనివాసులు క్రీడాకారులను అభినందించారు. -
లాంగ్జంప్లో సోనమ్కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఓపెన్ స్ప్రింట్స్, జంప్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో హైదరాబాద్ అమ్మాయి సోనమ్ స్వర్ణంతో మెరిసింది. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో సోనమ్ లాంగ్జంప్ ఈవెంట్లో విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన మహిళల లాంగ్జంప్ ఈవెంట్లో సోనమ్ అత్యధికంగా 5.13మీ. దూరం జంప్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అచ్యుత కుమారి (హైదరాబాద్) 4.99 మీటర్లు జంప్ చేసి రజతాన్ని గెలుచుకోగా... 4.47 మీటర్ల దూరం జంప్ చేసిన సింధు (మేడ్చల్)కు కాంస్యం దక్కింది. మరోవైపు పురుషుల 400మీ. పరుగులో రిషబ్ మిశ్రా (హైదరాబాద్) విజేతగా నిలిచాడు. అతను లక్ష్యాన్ని 51.0సెకన్లలో పూర్తి చేసి పసిడి పతకాన్ని అందుకున్నాడు. వరంగల్కు చెందిన ఇంద్రసేన్ (52.4 సెకన్లు) రజతాన్ని, అభిషేక్ (ఎంఎల్ఆర్ఐటీ) కాంస్యాలను గెలుచుకున్నారు. ఈ పోటీలను సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. ఇతర వయోవిభాగాల విజేతల వివరాలు అండర్–10 బాలుర 300 మీ. పరుగు: 1. ఎల్. రాము (వరంగల్), 2. కె. సాయి ఆనంద్ (ఐఈసీఎస్), 3. ప్రణయ్ (ఏఈసీఎస్); బాలికలు: 1. విభా రావు (చిరెక్), 2. ఆర్. రాగిణి (వరంగల్), 3. సంజన (చిరెక్). లాంగ్జంప్: 1. ఎం. నవదీప్ (జీపీఎస్టీ), 2. ప్రణవ్ (డీపీఎస్), 3. కె. అమోఘ్ (సారథి). అండర్–12 బాలుర 300మీ. పరుగు: 1. జె. రాఘవ (వరంగల్), 2. ఎం. శంకర్ (వరంగల్), 3. బి. మోహిత్కృష్ణ (కొత్త గూడెం); బాలికలు: 1. శరణ్య (ఫోనిక్స్), 2. పి. దీప్తి, 3. శ్రేయశ్రీ (ఐఎస్). అండర్–14 బాలుర 400మీ. పరుగు: 1. టి. సురేశ్ (ఎస్డబ్ల్యూ), 2. వి.శ్రీనివాస్ (జెడ్పీహెచ్ఎస్), 3. ఉదయ్ కిరణ్ (హెచ్పీఎస్–ఆర్); బాలికలు: 1. ఎం. ఇందు (జీహెచ్ఎస్), 2. సి. వాణి (టీఎస్డబ్ల్యూ), 3. యువిక (కెన్నడీ). అండర్–16 బాలుర 400మీ. పరుగు: 1. కె. మహేశ్ (వెస్లీ), 2. బి. హరి (వరంగల్), 3. నితిన్ (రంగారెడ్డి); బాలికల లాంగ్జంప్: 1. వి. సంధ్య (టీఎస్డబ్ల్యూ), 2. రంజిత (టీఎస్డబ్ల్యూ), 3. శ్రేయ మీనన్ (సెయింట్ ఆన్స్). -
నవ్య, రాఘవిలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ‘గోల్డెన్ మైల్ రన్’ ఈవెంట్లో నవ్య, సీహెచ్ రాఘవి స్వర్ణాలను సాధించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ పోటీలను మాజీ ఎమ్మెల్యే జి. బాల్రాజ్ ప్రారంభించారు. మహిళల విభాగంలో నల్లగొండకు చెందిన నవ్య పరుగును 5 నిమిషాల 35.4 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచింది. హైదరాబాద్కు చెందిన కీర్తి (5ని.46.2సె.), కె. తిరుపతమ్మ (5ని.46.6సె., రంగారెడ్డి) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. అండర్–16 బాలికల విభాగంలో సీహెచ్ రాఘవి (హైదరాబాద్, 5ని.10.4సె.), మహిత (5ని.32.0సె.), పుష్పలత (5ని. 32.4సె.) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. బహుమతి ప్రదాన కార్యక్రమంలో నిజాం కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ సి. వీరేందర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు పురుషులు: 1. యోగేందర్ (హైదరాబాద్), 2. వై. రాఘవేంద్ర (‘సాయ్’), 3. ఎన్. శివ (‘సాయ్’). అండర్–16 బాలురు: 1. ప్రియాన్షు (జీఐఓ), 2. కె. సంతోష్ నాయక్ (వికారాబాద్), 3. రంజిత్ (ఉత్తరప్రదేశ్); అండర్–13 బాలురు: 1. బి. మహేశ్ (రంగారెడ్డి), 2. ఎం. సాయి (రంగారెడ్డి), 3. నిషాంత్ కుమార్ (మేడ్చల్); బాలికలు: 1. శరణ్య (హైదరాబాద్), 2. కె. ఇందు ప్రియ (నాగర్కర్నూల్), 3. అఖిల (రంగారెడ్డి). అండర్–10 బాలురు: 1. ఆర్. శ్రీకాంత్ (వరంగల్), 2. ఎం.నవదీప్ (వరంగల్), 3. వి. కౌశిక్ (మెదక్); బాలికలు: 1. ఎం. శ్రీవిద్య (గీతాంజలి), 2. ఎం. రేవతి (ప్రగతి), 3. అంబిక (హైదరాబాద్). మాస్టర్ మెన్: 1. విజయ్ రాఘవన్ (హైదరాబాద్), 2. జగన్మోహన్ రెడ్డి (మేడ్చల్), 3. ప్రశాంత్ (మేడ్చల్). మాస్టర్ ఉమెన్: 1. డి. బొల్లారెడ్డి (మేడ్చల్), 2. శిల్పా రాజు (హైదరాబాద్), 3. రాజేశ్వరి (హైదరాబాద్). -
100 మీ. పరుగు విజేతలు సురేశ్, మహేశ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఓపెన్ స్ప్రింట్స్, జంప్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో టి. సురేశ్, కె. మహేశ్ స్వర్ణాలను సాధించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన అండర్– 14 బాలుర 100 మీ. పరుగును సురేశ్ 12.01 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు. బి. భానుప్రసాద్ (12.07 సెకన్లు) రజతాన్ని గెలుచుకోగా... స్వేజన్ (12.61 సెకన్లు) కాంస్యాన్ని దక్కించుకున్నాడు. అండర్–16 బాలుర 100 మీ. పరుగులో మహేశ్ 11.52 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకాన్ని సాధించాడు. జి. గణేశ్ 11.95 సెకన్లతో రజతాన్ని, మీనల్ 11.96 సెకన్లతో కాంస్యాన్ని గెలుచుకున్నారు. లాంగ్జంప్ ఈవెంట్లో హెచ్. మురళీ (5.40 మీ.), ఎం. చంద్ర కుమార్ (5.33 మీ.), జి. అజయ్ (5.16 మీ.) వరుసగా తొలి మూడు స్థానాలను సాధించారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి, కోచ్ నాగపురి రమేశ్, తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి ప్రొఫెసర్ కె. రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–10 బాలుర 60 మీ. పరుగు: 1. ఎం. రిషికేశ్ (జెనెసిస్ స్కూల్), 2. పార్థ్ (గార్డియన్), 3. ఎం. రిషికేశ్ (భారతీయ విద్యాభవన్). అండర్–12 బాలుర 80 మీ. పరుగు: 1. జె. అనిల్ (వరంగల్), 2. వి. గోపాల్ (బీసీడబ్ల్యూ), 3. కె. ఆనంద్ (బీసీడబ్ల్యూ). లాంగ్జంప్: 1. జి. లక్ష్మణ్ (ఎల్బీహెచ్ఎస్), 2. జె. అనిల్ (జీపీహెచ్ఎస్), 3. కె. ఆనంద్ (ఎంజేపీ). అండర్–16 బాలుర లాంగ్జంప్: 1. వి. స్వామి (జీజేసీ), 2. మొహమ్మద్ మన్సూరి (ఏఈసీఎస్), 3. వాసు (హెచ్పీఎస్). పురుషుల 100 మీ. పరుగు: 1. కె. రాజు (రంగారెడ్డి), 2. అమ్లాన్ (రంగారెడ్డి), 3. షర్మిన్ (హైదరాబాద్). లాంగ్జంప్: 1. రాజు (రంగారెడ్డి), 2. సి. ఫణీంద్రనాథ్ (రంగారెడ్డి), 3. అమ్లాన (రంగారెడ్డి). అండర్–10 బాలికల 60 మీ. పరుగు: 1. విభా రావు (చిరెక్), 2. రాజశ్రీ (ఎస్డబ్ల్యూఎస్), 3. సంజన (చిరెక్). లాంగ్జంప్: 1. ఎస్. రాజశ్రీ (టీఎస్డబ్ల్యూఆర్ఎస్), 2. ప్రీతిక (హైదరాబాద్), 3. జె. పండు (వరంగల్). అండర్–12 బాలికల 80 మీ. పరుగు: 1. శ్రీయాని (ఇంటర్నేషనల్ స్కూల్), 2. సహన (చిరెక్), 3. ఎం. హర్ష వర్ధిని (ఏఈసీఎస్). అండర్–14 బాలికల 100మీ. పరుగు: 1. ఆర్. మేఘన (సెయింట్ గాబ్రియెల్), 2. నిఖిల (టీఎస్డబ్ల్యూఆర్ఎస్), 3. కృతి. లాంగ్జంప్: 1. కె. నిఖిల (టీఎస్డబ్ల్యూఆర్ఈటీఎస్), 2. అంజలి (హైదరాబాద్), 3. అదితి (సంగారెడ్డి). అండర్–16 బాలికల 100 మీ. పరుగు: 1. రియా గ్రేస్ (సెయింట్ ఆన్స్), 2. ఎం. అక్షయ, 3. సంధ్య (టీఎస్డబ్ల్యూఆర్ఎస్). 400 మీ. పరుగు: 1. రియాగ్రేస్ (సెయింట్ఆన్స్), 2. పి. వసంత (బీహెచ్ఈఎల్), 3. శర్వాణి (చిరెక్). మహిళల 100 మీ. పరుగు: 1. జి. నిత్య (హైదరాబాద్), 2. సోనమ్ (హైదరాబాద్), 3. అచ్యుత కుమారి (హైదరాబాద్). 400 మీ. పరుగు: 1. జి.నిత్య (హైదరాబాద్), 2. కె. రమాదేవి, 3. అనురాఘ. -
అంతా కలలా అనిపిస్తోంది: హిమ
న్యూఢిల్లీ: ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గిన భారత అథ్లెట్ హిమ దాస్ తాను కలలో విహరిస్తున్నట్లు ఉందని అంటోంది. ఫిన్లాండ్లో గురువారం జరిగిన ఈ చాంపియన్షిప్ 400 మీటర్ల పరుగులో అస్సాంకు చెందిన హిమ దాస్ 51.46 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ మెగా ఈవెంట్లో స్వర్ణం నెగ్గిన తొలి మహిళా అథ్లెట్గా ఆమె కొత్త చరిత్ర సృష్టించింది. ‘దేశం కోసం ఏదో సాధించాలనే సానుకూల దృక్పథంతోనే ముందడుగు వేశాను. ప్రస్తుతం ఈ విజయం నాకు కలలో ఉన్న భావన కలిగిస్తోంది’ అని తెలిపింది. స్వర్ణం నెగ్గిన హిమ దాస్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘ప్రపంచ చాంపియన్షిప్లో పసిడి పతకం గెలిచిన హిమకు శుభాకాంక్షలు. నీ ఘనతను చూసి దేశం గర్విస్తోంది. నీ విజయం రాబోయే కాలంలో యువకులకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని ట్విట్టర్లో ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ‘హిమ దాస్కు అభినందనలు. ఇది యావత్ భారత జాతి గర్వించే సమయం. ఒలింపిక్ పోడియంపై నిలవాలని ఆశిస్తున్నాం’ అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. -
ద్యుతీచంద్కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ శిష్యురాలు ద్యుతీచంద్ మహిళల 100 మీటర్ల విభాగంలో సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. గువాహటిలో జరుగుతున్న జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆమె సెమీఫైనల్ రేసును 11.29 సెకన్లలో గమ్యానికి చేరింది. 11.30 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును తిరగరాసింది. ఫైనల్లో ద్యుతీచంద్ 11.32 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా ఆసియా క్రీడలకు కూడా అర్హత సాధించింది. -
పృథ్వీర్, పద్మశ్రీలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ (ఆర్ఎఫ్వైఎస్) అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పృథ్వీర్ (తెలంగాణ మైనారిటీ స్కూల్), పద్మశ్రీ (సెయింట్ పాల్స్ స్కూల్) సత్తా చాటారు. గచ్చిబౌలిలో ఆదివారం జరిగిన 200 మీ. పరుగు జూనియర్ బాలబాలికల విభాగాల్లో వీరిద్దరూ స్వర్ణాలను సొంతం చేసుకున్నారు. పృథ్వీర్ 24.24 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఆర్. శ్రీకాంత్ (24.26 సె.) రెండోస్థానాన్ని, రేవంత్ (24.99 సె.) మూడో స్థానాన్ని సాధించారు. బాలికల విభాగంలో పద్మశ్రీ 27.55 సెకన్లలో, మానస (టీఎస్ఆర్ఎస్) 29.44 సెకన్లలో, శిల్ప (టీఎస్ఆర్ఎస్) 29.59 సెకన్లలో రేసును పూర్తిచేసి తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ టోర్నీలో భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజి సత్తా చాటింది. సీనియర్ బాలబాలికల విభాగాల్లో ఆర్ఎఫ్వైఎస్ హైదరాబాద్ ‘రోల్ ఆఫ్ ఆనర్’ విజేతగా నిలిచింది. ఇతర ఈవెంట్ల ఫలితాలు సీనియర్ బాలుర 200 మీ. పరుగు: 1. వై. హరికృష్ణ (తెలంగాణ మైనారిటీస్ స్కూల్), 2. కె. అరవింద్ (తెలంగాణ మైనారిటీస్ స్కూల్), 3. చందు (భవన్స్ శ్రీ అరబిందో). 5000 మీ. పరుగు: 1. సౌరవ్ (ఆర్మీ పబ్లిక్ స్కూల్), 2. రవికిరణ్ (జాన్సన్ గ్రామర్ స్కూల్), 3. కేశవ్ (భవన్స్ శ్రీ అరబిందో). సీనియర్ బాలికల 5000 మీ. పరుగు: 1. గంగోత్రి (భవన్స్ శ్రీ అరబిందో), 2. శ్రావణి (భవన్స్ శ్రీ అరబిందో). కాలేజి బాలుర 5000 మీ. పరుగు: 1. బి. రమేశ్ (ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజి), 2. చిదుర్ల (వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి), 3. అజయ్ (రైల్వే డిగ్రీ కాలేజి). ఆర్ఎఫ్వైఎస్ హైదరాబాద్ రోల్ ఆఫ్ ఆనర్ విజేతల వివరాలు జూనియర్ బాలురు: 1. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, 2. తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ బాలుర పాఠశాల. జూనియర్ బాలికలు: 1. తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, 2. ఢిల్లీ పబ్లిక్ స్కూల్. సీనియర్ బాలురు: 1. భవన్స్ శ్రీ అరబిందో, 2. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్. బాలికలు: 1. భవన్స్ శ్రీ అరబిందో, 2. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్. కాలేజి బాలురు: 1. సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ కాలేజి, 2. హిందీ మహావిద్యాలయ. బాలికలు: 1. ప్రభుత్వ డిగ్రీ కాలేజి, 2. ఫారెస్ట్ కాలేజ్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. -
యుగేందర్కు రజతం
ఏఎన్యూ (గుంటూరు): జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ కుర్రాడు ఎస్. యుగేందర్ ఆకట్టుకున్నాడు. గురువారం ప్రారంభమైన ఈ పోటీల్లో ట్రయాథ్లాన్ ఈవెంట్లో రజత పతకాన్ని సాధించాడు. స్థానిక ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ మెగా ఈవెంట్ను అర్జున అవార్డు గ్రహీత పీటీ ఉష ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అండర్–14 బాలుర ట్రయాథ్లాన్లో రెండో స్థానాన్ని దక్కించుకున్న యుగేందర్ 1739 పాయింట్లను సాధించాడు. ఈ ఈవెంట్లో ఢిల్లీకి శివాంగ్ మీనా 1779 పాయింట్లు స్కోర్ చేసి విజేతగా నిలిచాడు. హరియాణాకు చెందిన అజయ్ 1724 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. -
‘లండన్’లో రెండు ఈవెంట్స్లో పోటీ పడతా: బోల్ట్
మోంటెకార్లో (మొనాకో): వచ్చే నెలలో లండన్లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తాను 100 మీటర్లు, 4గీ100 మీటర్ల రిలే విభాగాల్లో పాల్గొంటానని జమైకా విఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్ స్పష్టం చేశాడు. ‘లండన్లో గెలవడమే నా లక్ష్యం. విజయంతో నా కెరీర్కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నాను’ అని ఒలింపిక్స్ క్రీడల్లో మొత్తం ఎనిమిది స్వర్ణాలు నెగ్గిన ఈ జమైకా స్టార్ తెలిపాడు. -
దమ్నీత్కు రజతం
ప్రపంచ అండర్–18 అథ్లెటిక్స్ నైరోబి (కెన్యా): ప్రపంచ అండర్–18 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత కుర్రాడు దమ్నీత్ సింగ్ మెరిశాడు. అతను హ్యామర్ త్రోలో రజత పతకం గెలిచాడు. ఈ టోర్నీలో భారత్కిదే తొలి పతకం కావడం విశేషం. అతను హ్యామర్ను 74.20 మీటర్ల దూరం విసిరి రెండో స్థానం పొందాడు. మిఖాయిలో కొఖన్ (ఉక్రెయిన్– 82.31 మీటర్లు) స్వర్ణం, రాఫెల్ వింకెల్వోస్ (జర్మనీ–71.78 మీటర్లు) కాంస్యం నెగ్గారు. బాలికల 400 మీటర్ల విభాగంలో బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతిక శ్రీ హీట్స్లోనే వెనుదిరిగింది. రెండో హీట్లో పోటీపడిన జ్యోతిక శ్రీ 57.15 సెకన్లలో గమ్యానికి చేరి ఐదో స్థానంలో నిలిచింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 19 మంది అథ్లెట్లతో కూడిన భారత బృందం బరిలోకి దిగింది. -
దుతీ చంద్ జాతీయ రికార్డు
అబ్దుల్ నజీబ్కు కాంస్యం న్యూఢిల్లీ: ఫెడరేషన్ కప్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తొలి రోజు రెండు జాతీయ రికార్డులు బద్దలయ్యాయి. అయితే ఏ అథ్లెట్ కూడా రియో ఒలింపిక్స్ అర్హత ప్రమాణాలను అందుకోలేకపోయాడు. మహిళల 100 మీటర్ల విభాగం ఫైనల్లో దుతీ చంద్ (ఒడిషా) 11.33 సెకన్లతో గమ్యానికి చేరడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 2000లో 11.38 సెకన్లతో రచిత మిస్త్రీ నెలకొల్పిన జాతీయ రికార్డును దుతీ చంద్ తెరమరుగు చేసింది. హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో వ్యక్తిగత కోచ్ నాగపురి రమేశ్ వద్ద దుతీ చంద్ శిక్షణ తీసుకుంటోంది. 0.01 సెకన్లతేడాతో దుతీ చంద్ రియో ఒలింపిక్స్ అర్హతను కోల్పోయింది. మరోవైపు పురుషుల 100 మీటర్ల విభాగంలో ఓఎన్జీసీ తరఫున బరిలోకి దిగిన తెలంగాణ అథ్లెట్ అబ్దుల్ నజీబ్ ఖురేషీ 10.50 సెకన్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. అంతకుముందు హీట్స్లో అమియా కుమార్ మలిక్ (ఒడిషా) 10.26 సెకన్లతో ఈ విభాగంలో కొత్త జాతీయ రికార్డును సృష్టించాడు. 2010లో 10.30 సెకన్లతో అబ్దుల్ నజీబ్ నెలకొల్పిన రికార్డును అమియా బద్దలు కొట్టాడు. అయితే ఫైనల్లో అమియా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
స్ఫూర్తి పెంచే ‘మెర్రిట్’
అతని రెండు కిడ్నీలు చెడిపోయాయి. ఆపరేషన్ చేసి ఓ కిడ్నీ మారిస్తే తప్ప బతకడు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరైనా తల్లడిల్లిపోతారు. కానీ అమెరికా అథ్లెట్ యారిస్ మెర్రిట్ మాత్రం ఏమాత్రం డీలా పడలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిల్లోనూ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొన్నాడు. అంతేకాదు... 110 మీటర్ల హర్డిల్స్లో కాంస్య పతకం సాధించాడు. 30 ఏళ్ల మెర్రిట్ ఈ విభాగంలో ఒలింపిక్ చాంపియన్. ప్రపంచ రికార్డు కూడా అతని పేరిటే ఉంది. 2013లో తన కిడ్నీలు పాడయ్యాయని మెర్రిట్కు తెలిసింది. ఆ సమయంలో ఇక కెరీర్ను ముగిస్తే మంచిదని వైద్యులు సూచించారు. కానీ తను మాత్రం మొండిగా శిక్షణ కొనసాగించాడు. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ముగియగానే సెప్టెంబరు 1న మెర్రిట్కు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరుగుతుంది. అతడి సోదరి తన కిడ్నీని మెర్రిట్కు ఇస్తోంది. తన చెల్లి చేస్తున్న త్యాగానికి విలువ ఉండాలంటే రియో ఒలింపిక్స్లో తాను పతకం గెలవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. ఏమైనా తన పట్టుదలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. -
రాష్ట్ర అథ్లెటిక్ మీట్కు హైదరాబాద్ జట్టు ఎంపిక
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్ చాంపియన్షిప్లో పాల్గొనే హైదరాబాద్ జిల్లా జట్టును ప్రకటించారు. ఈ పోటీలు ఈనెల 3 నుంచి రెండు రోజులపాటు వరంగల్లో జరుగుతాయి. పురుషుల జట్టు: ఎం.అఖిలేష్, విధాతరెడ్డి,ఎస్.సంతోష్, రాకేష్, పి.ఎన్.సాయి కుమార్, జి.శ్రీనివాస్, ఎస్.వెంకటేష్, విజ్ఞాష్, సి.హెచ్.బుచ్చయ్య, సయ్యద్ వజార్ ఘోరి,జె,రజనీకాంత్, చంద్రబాగు, బాలస్వామి, అకింత్ కుమార్ పఠక్, ప్రవీణ్ మూర్తి, ఎస్.కె.ముజిహిద్, భరత్ రాజ్, బి.సంతోష్, నిసార్ అహ్మద్. మహిళల జట్టు: జి.ఉమామహేశ్వరి, జరీనా బేగం, సయ్యద్ ఆఫ్రీనా, బి.సాహితి, శ్రీలత, డి.హెమలత. తెలంగాణ టి20 జట్టు ఎంపిక తెలంగాణ ట్వంటి-20 క్రికెట్ జట్టు కెప్టెన్గా కిషోర్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టు ఆలిండియా నేషనల్ టి20 చాంపియన్షిప్లో పాల్గొంటుంది. ఈ టోర్నీ ఆగ్రాలో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు జరగనుంది. జట్టు: కిషోర్ (కెప్టెన్), విజయ్ కుమార్ (వైస్ కెప్టెన్), ప్రశాంత్ కుమార్, ఓబులేశ్, రాజ్కుమార్, నాగరాజు, రాంబాబు, వీరబాబు, సాయిరాం, చంద్రమౌళి, గణేష్, చైతన్య, సాయి సంకేశ్, ప్రశాంత్రెడ్డి, ప్రసాద్.