యుగేందర్‌కు రజతం

Eugener win a silver medal - Sakshi

జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌  

ఏఎన్‌యూ (గుంటూరు): జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు ఎస్‌. యుగేందర్‌ ఆకట్టుకున్నాడు. గురువారం ప్రారంభమైన ఈ పోటీల్లో ట్రయాథ్లాన్‌ ఈవెంట్‌లో రజత పతకాన్ని సాధించాడు. స్థానిక ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌ను అర్జున అవార్డు గ్రహీత పీటీ ఉష ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అండర్‌–14 బాలుర ట్రయాథ్లాన్‌లో రెండో స్థానాన్ని దక్కించుకున్న యుగేందర్‌ 1739 పాయింట్లను సాధించాడు. ఈ ఈవెంట్‌లో ఢిల్లీకి శివాంగ్‌ మీనా 1779 పాయింట్లు స్కోర్‌ చేసి విజేతగా నిలిచాడు. హరియాణాకు చెందిన అజయ్‌ 1724 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top