యుగేందర్‌కు రజతం | Eugener win a silver medal | Sakshi
Sakshi News home page

యుగేందర్‌కు రజతం

Nov 17 2017 12:53 AM | Updated on Nov 17 2017 12:53 AM

Eugener win a silver medal - Sakshi

ఏఎన్‌యూ (గుంటూరు): జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు ఎస్‌. యుగేందర్‌ ఆకట్టుకున్నాడు. గురువారం ప్రారంభమైన ఈ పోటీల్లో ట్రయాథ్లాన్‌ ఈవెంట్‌లో రజత పతకాన్ని సాధించాడు. స్థానిక ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌ను అర్జున అవార్డు గ్రహీత పీటీ ఉష ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అండర్‌–14 బాలుర ట్రయాథ్లాన్‌లో రెండో స్థానాన్ని దక్కించుకున్న యుగేందర్‌ 1739 పాయింట్లను సాధించాడు. ఈ ఈవెంట్‌లో ఢిల్లీకి శివాంగ్‌ మీనా 1779 పాయింట్లు స్కోర్‌ చేసి విజేతగా నిలిచాడు. హరియాణాకు చెందిన అజయ్‌ 1724 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement