2022 World U-20 Athletics Championships | Selva Thirumaran Wins Silver In Triple Jump - Sakshi
Sakshi News home page

2022 World U-20 Athletics Championships: భారత్‌కు మరో పతకం

Published Sun, Aug 7 2022 6:03 AM

World U-20 Athletics Championships: Selva Thirumaran wins silver in triple jump - Sakshi

ప్రపంచ అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో మూడో పతకం చేరింది. పురుషుల ట్రిపుల్‌జంప్‌లో సెల్వ తిరుమారన్‌ రజత పతకం గెల్చుకున్నాడు. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల సెల్వ 16.15 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు.

మహిళల 4X400 మీటర్ల రిలేలో సుమ్మీ, ప్రియా హబ్బతనహల్లి మోహన్, కుంజ రజిత, రూపల్‌ చౌదరీలతో కూడిన భారత బృందం ఫైనల్‌ చేరింది. ఇప్పటి వరకు భారత్‌కు ఈ టోర్నీలో 4గX400 మిక్స్‌డ్‌ రిలేలో రజతం, మహిళల 400 మీటర్ల విభాగంలో కాంస్యం లభించాయి. 

Advertisement
Advertisement