-
Jay Shah: 32 ఏళ్ల వయసులో తొలిసారి.. ముచ్చటగా మూడోసారి
బీసీసీఐ కార్యదర్శి జై షా మరోసారి ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇండోనేషియాలోని బాలిలో ఏసీసీ బుధవారం వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఇందులో భాగంగా జై షాను తమ చీఫ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 32 ఏళ్ల వయసులో తొలిసారి.. కాగా జై షా ఏసీసీ బాస్గా ఎన్నికకావడం ఇది వరుసగా మూడోసారి. నజ్ముల్ హుసేన్ స్థానంలో 2021లో తొలిసారిగా అధ్యక్ష పదవిని చేపట్టిన ఆయన.. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచారు. అప్పటికి జై షాకు 32 ఏళ్లు. ఇక తాజా సమావేశంలో సభ్యుల నిర్ణయానికి అనుగుణంగా జై షా పదవీ కాలం కొనసాగనుంది. కాగా బీసీసీఐలో కీలక వ్యక్తిగా ఉన్న ఆయన.. ఏసీసీలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. కోవిడ్ సమయంలో బాస్గా బాధ్యతలు స్వీకరించి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రతీ విషయంలోనూ తనదైన ముద్ర ఇక గతేడాది ఆసియా కప్-2023 హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడంలో జై షా కీలక పాత్ర పోషించారు. ఈవెంట్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న పాకిస్తాన్కు టీమిండియాను పంపే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. పాక్ పంతం వీడకపోతే.. ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సి ఉంటుందని హెచ్చరించి శ్రీలంక- పాక్ వేదికగా టోర్నీని నిర్వహించేలా జై షా ఏర్పాట్లు చేశారు. టీమిండియా ఆడే మ్యాచ్లన్నింటికీ లంక ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఈ దఫా వన్డే ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్ ఈవెంట్ ఫైనల్లో టీమిండియా శ్రీలంకను ఓడించి విజేతగా అవతరించింది. కాగా భారత హోం మంత్రి అమిత్ షా కుమారుడే జై షా అన్న విషయం తెలిసిందే. చదవండి: Ind vs Eng 2nd Test: ఇంగ్లండ్కు షాక్.. కీలక స్పిన్నర్ దూరం -
సెమీస్లో భారత్ను ఓడించి.. కట్చేస్తే ఇప్పుడు ఏకంగా ఛాంపియన్స్గా
అండర్-19 ఆసియాకప్ 2023 ఛాంపియన్స్గా బంగ్లాదేశ్ నిలిచింది. దుబాయి వేదికగా జరిగిన ఫైనల్లో యూఏఈను 195 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్.. తొలిసారి అండర్-19 ఆసియాకప్ టైటిల్ను ముద్దాడింది. తుది పోరులో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ అషికర్ రెహ్మాన్ షిబ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 149 బంతులు ఎదుర్కొన్న అషికర్ రెహ్మాన్.. 12 ఫోర్లు, 1 సిక్సర్తో 129 పరుగులు చేశాడు. అతడితోపాటు రిజ్వాన్(60), అరిఫుల్ ఇస్లాం(50) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో ఆయామన్ ఆహ్మద్ 4 వికెట్లతో చెలరేగగా.. ఒమిడ్ రెహ్మద్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. బంగ్లా బౌలర్ల దాటికి కేవలం 87 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో రోహనత్, మరూఫ్ మిర్దా తలా మూడు వికెట్లు పడగొట్టగా... ఇక్భాల్, షేక్ ఫవీజ్ చెరో రెండు వికెట్లు సాధించారు. కాగా సెమీఫైనల్లో భారత్ను బంగ్లాదేశ్ ఓడించిన సంగతి తెలిసిందే. చదవండి: IND VS SA 1st ODI: ఏ భారత కెప్టెన్కు సాధ్యం కాని ఘనతను సాధించిన కేఎల్ రాహుల్ -
ఒకే రోజు రెండు సంచలనాలు.. పసికూనల చేతిలో భారత్, పాక్లకు పరాభవం
అండర్-19 ఆసియా కప్లో ఒకే రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. పసికూనలైన బంగ్లాదేశ్, యూఏఈల చేతుల్లో మాజీ ఛాంపియన్లు భారత్, పాకిస్తాన్ ఓటమిపాలయ్యాయి. ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో తొలుత యూఏఈ పాకిస్తాన్ను మట్టికరిపించగా.. ఆతర్వాతి మ్యాచ్లో బంగ్లాదేశ్ టీమిండియాకు షాకిచ్చింది. ఫలితంగా యూఏఈ, బంగ్లాదేశ్ జట్లు ఫైనల్కు చేరాయి. దుబాయ్ వేదికగా డిసెంబర్ 17న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ల విషయానికొస్తే.. పాకిస్తాన్తో జరిగిన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. 47.5 ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్ పేసర్ ఉబెయిద్ షా (4/43) యూఏఈ పతనాన్ని శాశించాడు. యూఏఈ ఇన్నింగ్స్లో కెప్టెన్ అయాన్ ఖాన్ (55) అర్దసెంచరీతో రాణించగా.. ఓపెనర్ ఆర్యాన్ష్ శర్మ (46), డిసౌజా (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. యూఏఈ బౌలర్లు మూకుమ్మడిగా అటాకింగ్ చేయడంతో 49.3 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో కెప్టెన్ సాద్ బేగ్ (50), అజాన్ అవైస్ (41) మాత్రమే రాణించారు. యూఏఈ బౌలర్లలో అయ్మాన్ అహ్మద్, హార్దిక్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రెహ్మాన్, ధృవ్, బదామీ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక బంగ్లాదేశ్తో జరిగిన రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్.. 42.4 ఓవర్లలో 188 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో ముషీర్ ఖాన్ (50), మురుగన్ అభిషేక్ (62) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్ మరూఫ్ 4 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్.. అరీఫుల్ ఇస్లాం (94) చెలరేగడంతో 42.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అరీఫుల్కు అహ్రార్ అమీన్ (44) సహకరించాడు. నమన్ తివారీ (3/35), రాజ్ లింబానీ (2/47) చివరి వరకు ప్రయత్నించినప్పటికీ టీమిండియాను గెలిపించలేకపోయారు. -
ఏడు వికెట్లతో చెలరేగిన భారత పేసర్.. 52 పరుగులకే ప్రత్యర్థి ఆలౌట్
ACC U19 Asia Cup, 2023- India U19 vs Nepal U19: అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో భారత యువ జట్టు ఘన విజయం సాధించింది. నేపాల్ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసి సెమీస్ రేసులో ముందుకు దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గ్రూప్-‘ఏ’లో ఉన్న భారత్ తొలుత అఫ్గనిస్తాన్తో తలపడింది. ఈ మ్యాచ్లో అఫ్గన్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ఉదయ్ సహారన్ సేన.. రెండో మ్యాచ్లో మాత్రం ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీస్ చేరాలంటే.. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఏడు వికెట్లతో చెలరేగిన రాజ్ లింబాని ఈ నేపథ్యంలో మంగళవారం నేపాల్తో తలపడ్డ భారత జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్ రాజ్ లింబాని ఏడు వికెట్లతో చెలరేగి నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. 9.1 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. లింబానికి తోడుగా.. ఆరాధ్య శుక్లా రెండు, అర్షిన్ కులకర్ణి ఒక వికెట్తో రాణించారు. ఈ ముగ్గురు అద్భుత ప్రదర్శన కారణంగా.. నేపాల్ 22.1 ఓవర్లలోనే చాపచుట్టేసింది. ఓపెనర్లే పూర్తి చేశారు భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టును ఓపెనర్లు ఆదర్శ్, అర్షిన్ కులకర్ణి విజయతీరాలకు చేర్చారు. ఆదర్శ్ 13 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలవగా.. అర్షిన్ 30 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టి భారత్ విజయాన్ని ఖరారు చేశాడు. ఇక ఈ గెలుపుతో భారత జట్టు సెమీస్ బెర్తును అనధికారికంగా ఖాయం చేసుకుంది. మరోవైపు.. గ్రూప్-‘ఏ’లో భాగమైన పాకిస్తాన్ మంగళవారం అఫ్గనిస్తాన్తో పోటీపడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 48 ఓవర్లలో 303 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిస్తే సెమీస్ చేరడం లాంఛనమే! దీంతో మరోసారి దాయాదులు భారత్- పాక్ మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. చదవండి: Virat Kohli: రాజు ఎక్కడైనా రాజే! టాప్లో కింగ్ కోహ్లి ACC Men's U19 Asia Cup | India-U19 vs Nepal-U19 | Highlights. https://t.co/6wE0HM9pDH#ACCMensU19AsiaCup #ACC — AsianCricketCouncil (@ACCMedia1) December 12, 2023 -
Ind vs Pak: మెగా క్రికెట్ టోర్నీ షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ ఆరోజే
దాయాదులు భారత్- పాకిస్తాన్ మరోసారి మెగా క్రికెట్ టోర్నీలో పోటీ పడనున్నాయి. ఆసియా మెన్స్ అండర్-19 వన్డే కప్లో భాగంగా డిసెంబరు 10న ముఖాముఖి తలపడనున్నాయి. దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ ఇందుకు వేదిక కానుంది. కాగా అండర్-19 మెన్స్ ఆసియా కప్-2023కి సంబంధించిన షెడ్యూల్ను ఆసియా క్రికెట్ మండలి శనివారం విడుదల చేసింది. దుబాయ్లో వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి శుక్రవారం(డిసెంబరు 8) తెరలేవనుంది. గ్రూప్-ఏలో భాగమైన భారత్- అఫ్గనిస్తాన్తో మ్యాచ్తో ఈ ఈవెంట్ ఆరంభం కానుంది. అదే రోజు మరో మ్యాచ్లో పాకిస్తాన్- నేపాల్తో తలపడనుంది. గ్రూప్ దశలో మ్యాచ్లన్నీ ఐసీసీ అకాడమీ గ్రౌండ్, ఐసీసీ అకాడమీ గ్రౌండ్-2లో జరుగనున్నాయి. అయితే, డిసెంబరు 17నాటి ఫైనల్కు మాత్రం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. ఇక మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఆరంభం కానున్నాయి. కాగా ఆసియా అండర్-19 కప్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్-ఏలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సహా పాకిస్తాన్, నేపాల్, అఫ్గనిస్తాన్ పోటీ పడనుండగా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, యూఏఈ తలపడనున్నాయి. భారత జట్టు కెప్టెన్గా ఉదయ్ సహారన్ ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమి కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాన్షు మొలియా, ముషీర్ ఖాన్, ధనుష్ గౌడ, అవినాష్ రావు (వికెట్ కీపర్), ఎం అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్ కీపర్), ఆర్ధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ. ట్రావెలింగ్ రిజర్వ్స్: ప్రేమ్ దేవ్కర్, అన్ష్ గోసాయి, మహ్మద్ అమన్. నాన్ ట్రావెలింగ్ రిజర్వులు: దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి.విఘ్నేష్, కిరణ్ చోర్మాలే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
చంద్రబాబుపై రైతుల ఆగ్రహం
ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అతి ప్రవర్తన.. ఇందులో నిజమెంత..?
పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
Satya Movie: ఆకట్టుకుంటున్న ‘నిజమా ప్రాణమా ..’ సాంగ్
ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు!
వేసవిలో నెయ్యిని తీసుకుంటే బోలెడన్ని లాభాలు!
తప్పక చదవండి
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement