-
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
ఇస్తాంబుల్: పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు భారత రెజ్లర్లు ఆఖరి ప్రయత్నం చేయనున్నారు. గురువారం నుంచి ఇస్తాంబుల్లో జరిగే వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత రెజ్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో 6 బెర్త్లు, గ్రీకో రోమన్ విభాగంలో 6 బెర్త్లు ఉన్నాయి. ఈ రెండు కేటగిరీల్లో ఇప్పటి వరకు భారత రెజ్లర్లకు ఒక్క బెర్త్ కూడా దక్కలేదు. మహిళల విభాగంలో 6 బెర్త్లకుగాను నాలుగు బెర్త్లు (అంతిమ్–53 కేజీలు, వినేశ్ ఫొగాట్–50 కేజీలు, అన్షు మలిక్–57 కేజీలు, రీతిక–76 కేజీలు) భారత రెజ్లర్లు సంపాదించారు. -
వినేశ్పైనే దృష్టి
బిషె్కక్ (కిర్గిస్తాన్): భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వరుసగా మూడోసారి ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు సమాయత్తమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో వినేశ్ బరిలోకి దిగనుంది. వినేశ్ రెగ్యులర్ వెయిట్ కేటగిరీ 53 కేజీలు అయినప్పటికీ ఈ విభాగంలో ఇప్పటికే భారత్ నుంచి అంతిమ్ పంఘాల్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. దాంతో వినేశ్ 50 కేజీల విభాగంలో పోటీపడాలని నిర్ణయం తీసుకుంది. గత ఏడాది భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపులకు సంబంధించిన వివాదంలో సాక్షి మలిక్, బజరంగ్ పూనియాలతో కలిసి వినేశ్ పోరాడింది. -
ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నికి వినేశ్
పాటియాలా: వచ్చే నెలలో కిర్గిస్తాన్లో జరిగే పారిస్ ఒలింపిక్స్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నిలో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ బరిలోకి దిగనుంది. ఈ టోర్నిలో పాల్గొనే భారత మహిళల జట్టును ఎంపిక చేసేందుకు సోమవారం నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్లో వినేశ్ 50 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. వినేశ్ రెగ్యులర్ వెయిట్ కేటగిరీ 53 కేజీలు కాగా... ఇప్పటికే ఈ కేటగిరీలో అంతిమ్ పంఘాల్ ఒలింపిక్ బెర్త్ దక్కించుకుంది. దాంతో వినేశ్ సెలెక్షన్ ట్రయల్స్ టోర్నిలో 50 కేజీలతోపాటు 53 కేజీల విభాగంలోనూ పోటీపడింది. ఒక రెజ్లర్ ఒకే రోజు ఒకే వెయిట్ కేటగిరీలో పోటీపడాలన్న నిబంధన ఉన్నా అడ్హక్ కమిటీ వినేశ్ను రెండు కేటగిరీల్లో పోటీ పడేందుకు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమైంది. అయితే వినేశ్ 53 కేజీల విభాగం సెమీఫైనల్లో ఓడిపోయింది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నిలో పాల్గొనే భారత జట్టులో అన్షు మలిక్ (57 కేజీలు), మాన్సి అహ్లావత్ (62 కేజీలు), నిషా దహియా (68 కేజీలు), రితిక (76 కేజీలు) కూడా ఎంపికయ్యారు. -
భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై విధించిన సస్పెన్షన్ను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) మంగళవారం ఎత్తివేసింది. మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై న్యాయపోరాటం చేసిన రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్లపై ఎలాంటి వివక్ష చూపరాదని పేర్కొంది. అదే విధంగా.. కక్ష్యసాధింపు చర్యలు చేపట్టకుండా అందరు రెజర్లకు సమాన అవకాశాలు కల్పించాలని డబ్ల్యూఎఫ్ఐకి యూడబ్ల్యూడబ్ల్యూ సూచించింది. సస్పెన్షన్ తొలగిపోవడంతో పారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్లంతా మన జెండా కిందే పోటీపడొచ్చు. పతకం గెలిస్తే పోడియంలో మన పతాకమే రెపరెపలాడతుంది. గడువులోగా డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్ని నిర్వహించలేకపోవడంతో గత ఆగస్టులో సస్పెన్షన్ వేటు వేసింది. -
ఇది మహిళలందరి విజయం..మాకూ ధైర్యం: రెజ్లర్ వినేష్ ఫోగట్
బిల్కిస్ బానో కేసులో దోషుల క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ మెడల్ విజేత వినేష్ ఫోగట్ (Vinesh Phogat) స్పందించారు. ఇది మహిళల విజయం అంటూ ఆమె ట్వీట్ చేశారు.ఈ పోరాటంలో విజయం సాధించిన బిల్కిస్ బానోకు అభినందనలు తెలిపారు. “బిల్కిస్ జీ, ఇది మన మహిళలదరి విజయం. మీరు సుదీర్ఘ పోరాటం చేశారు. మీ విశ్వాసం చూసి మాకూ ధైర్యం వచ్చింది” అని ఫోగట్ ట్విటర్లో పేర్కొంది. बिलकिस जी ये हम सब महिलाओं की जीत है। आपने लंबी लड़ाई लड़ी है। आपको देखकर हमें भी हिम्मत मिली है। 🙏 pic.twitter.com/zKWsPMjdhF — Vinesh Phogat (@Phogat_Vinesh) January 8, 2024 బీజేపీ ఎంపీ,మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు నిరసనగా మహిళా రెజ్లర్లు చేసిన చాలా పెద్ద పోరాటమే చేశారు. దాదాపు ఏడుగురుమహిళా రెజర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపించిన సుదీర్ఘ పోరాటం చేసిన వినేష్ ఫోగట్ ఒకరు. అయితే ఆ ఆరోపణలను సింగ్ ఖండిస్తూ వచ్చారు. (బిల్కిస్ బానో కేసు: ఎవరీ సంచలన మహిళా జడ్జి?) ఇది ఇలా ఉంటే ఇటీవల బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ను ఆ పదవిలో నియమించడం పెద్ద దుమారాన్ని రేపింది. దీంతో తమకు న్యాయం జరగలేదంటూ మహిళ రెజర్లు తీవ్ర అసంతృప్తిని ప్రకటించారు. ముఖ్యంగా ఈ పోరాటంలో మరో కీలక రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. అలాగే వినేష్ ఫోగట్ ప్రతిష్టాత్మక అర్జున, ఖేల్ రత్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. వీరికి మద్దతుగా రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా తన అవార్డులను వెనక్కి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. (హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా!) కాగా ఫోగట్ కామన్వెల్త్ , ఆసియా క్రీడలలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్, అలాగే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లలో అనేక ప తకాలు చాటుకుని భారతీయ సత్తా చాటిన ఏకైక భారతీయ మహిళా రెజ్లర్ కూడా. -
ఆమె కన్నీళ్లకు మించిందా.. మీ విలువ?: రాహుల్ గాంధీ
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఖేల్రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇవ్వడానికి శనివారం ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెను కర్తవ్వపథ్లో పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. దేశంలోని ప్రతి ఆడబిడ్డకు ఆత్మగౌరవం ముందు వస్తుంది. మరేదైనా పతకం లేదా గౌరవం ఆ తర్వాత వస్తుందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనను తాను బాహుబలిగా ప్రకటించుకునే వ్యక్తి విలువ.. వీరత్వంతో ఈ ఆడబిడ్డల కన్నీళ్లను మించిందా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ తాను భారతజాతికి కాపలాదారని అంటారని మండిపడ్డారు. మరీ మోదీ పాలనలో ఇలాంటి క్రూరత్వం కనిపించడం చాలా బాధాకరమని అన్నారు. అయితే నిన్న వినేష్ ఫోగాట్ను పోలీసులు అడ్డుకున్న వీడియోను ఆయన ‘ఎక్స్’ ట్విటర్ పోస్ట్ చేశారు. देश की हर बेटी के लिये आत्मसम्मान पहले है, अन्य कोई भी पदक या सम्मान उसके बाद। आज क्या एक ‘घोषित बाहुबली’ से मिलने वाले ‘राजनीतिक फायदे’ की कीमत इन बहादुर बेटियों के आंसुओं से अधिक हो गई? प्रधानमंत्री राष्ट्र का अभिभावक होता है, उसकी ऐसी निष्ठुरता देख पीड़ा होती है। pic.twitter.com/XpoU6mY1w9 — Rahul Gandhi (@RahulGandhi) December 31, 2023 -
వినేశ్ కూడా వెనక్కిచ్చేసింది!
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కూడా కేంద్ర క్రీడా అవార్డులను వెనక్కి ఇచ్చేసింది. శనివారం కర్తవ్యపథ్ వద్ద ఆమె ‘ఖేల్రత్న’, అర్జున అవార్డులను వదిలేసి వెళ్లింది. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్లలో పతకాలతో ఆమె దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఫొగాట్ ఘనతలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న’, అర్జున అవార్డులను ఇచ్చింది. అయితే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)లో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ వర్గమే కొత్తగా ఎన్నికైంది. ఆయన విధేయుడైన సంజయ్ సింగ్ అధ్యక్షుడు అయ్యారు. దీన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ నిమిషాల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించింది. బజరంగ్ ‘పద్మశ్రీ’ని వెనక్కిచ్చాడు. బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా తన పురస్కారాన్ని వెనక్కిస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఫొగాట్ కూడా ముందు ప్రకటించినట్లే ఖేల్రత్న, అర్జున అవార్డుల్ని వెనక్కి ఇచ్చేందుకు ప్రధానమంత్రి నివాసానికి బయల్దేరింది. కర్తవ్యపథ్ వద్ద ఢిల్లీ పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో అవార్డుల్ని రోడ్డుపైనే వదిలేసింది. ఆ పురస్కారాలు ఇప్పుడు పోలీసుల ఆ«దీనంలో ఉన్నాయి. -
‘కుస్తీ’ పట్టిన రాహుల్ గాంధీ
హర్యానా: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రముఖ రెజ్లింగ్ క్రీడాకారుడు బజరంగ్ పూనియా, ఇతర రెజ్లింగ్ క్రీడాకారులను హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఛారా గ్రామంలొ కలుసుకున్నారు. ఆయన బుధవారం ఉదయమే.. రెజ్లింగ్ క్రీడాకారులు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష ఎన్నికకు సంబంధించి.. రెజ్లింగ్ క్రీడాకారులు నిరసన తెపుతున్న విషయం తెలిసిందే. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎంపికను నిరసిస్తూ... బజరంగ్ పూనియా తనకు వచ్చిన పద్మశ్రీ అవార్డును ఎనక్కి ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయాలో బుధవారం ఎంపీ రాహుల్ గాంధీ క్రీడాకారులతో భేటీ అయి వారికి మద్దతుగా నిలిచారు. దీంతో ఎంపీ రాహుల్ గాంధీ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. वर्षों की जीतोड़ मेहनत, धैर्य एवं अप्रतिम अनुशासन के साथ अपने खून और पसीने से मिट्टी को सींच कर एक खिलाड़ी अपने देश के लिए मेडल लाता है। आज झज्जर के छारा गांव में भाई विरेंद्र आर्य के अखाड़े पहुंच कर ओलंपिक पदक विजेता बजरंग पूनिया समेत अन्य पहलवान भाइयों के साथ चर्चा की। सवाल… pic.twitter.com/IeGOebvRl6 — Rahul Gandhi (@RahulGandhi) December 27, 2023 ‘ఎంపీ రాహుల్ గాంధీ రెజ్లర్ల రోజువారి సాధన, కార్యకలాపాలను తెలుసుకోవడానికి మా వద్దకు వచ్చారు. కాసేపు మాతో పాటు రెజ్లింగ్ కూడా చేశారు’ అని క్రీడాకారుడు బజరంగ్ పూనియా తెలిపారు. ‘రాహుల్ గాంధీ ఇక్కడ వస్తున్నట్లు మాకు ఎవరూ సమాచారం అందించలేదు. మేము రెజ్లింగ్ ప్రాక్టిస్ చేస్తున్న క్రమంలో అకస్మత్తుగా మా వద్దకు ఆయన చేరుకున్నారు. ఆయన ఉదయమే 6.15 గంటలకు ఇక్కడికి వచ్చారు. మాతో పాటు కాసేపు వ్యాయామం చేశారు. ఆయనకు క్రీడల పట్ల ఉన్న అనుభవాలను మాతో పంచుకున్నారు. రాహుల్ గాంధీకి క్రీడాల పట్ల చాలా పరిజ్ఞానం ఉంది’ అని రెజ్లింగ్ కోచ్ వీరేంద్ర ఆర్య పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్కు నమ్మినబంటుగా పేరున్న సంజయ్ కుమార్ను.. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికపై నిరసన తెలుపుతూ.. తాజాగా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కూడా అర్జున, మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డులు వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. రెజ్లర్లు రోడ్డెక్కి పోరాడుతున్న క్రీడాశాఖ నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడం గమనార్హం. #WATCH | Haryana: On Congress MP Rahul Gandhi visits Virender Arya Akhara in Chhara village of Jhajjar district, Wrestler Bajrang Poonia says, "He came to see our wrestling routine...He did wrestling...He came to see the day-to-day activities of a wrestler." pic.twitter.com/vh0aP921I3 — ANI (@ANI) December 27, 2023 చదవండి: వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం -
వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం.. ‘ఖేల్రత్న... అర్జున’ వెనక్కి
న్యూఢిల్లీ: ఇప్పుడు వినేశ్ ఫొగాట్ వంతు వచ్చింది. ఈ స్టార్ రెజ్లర్ కూడా తన ఘనతలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వెనక్కివ్వాలని నిర్ణయించుకుంది. రోడ్డెక్కి పోరాడినా... క్రీడాశాఖ నుంచి స్పష్టమైన హామీ లభించినా... మళ్లీ రెజ్లర్లకు అన్యాయమే జరిగిందని వాపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పురస్కారాలను అట్టిపెట్టుకోవడంలో అర్థమేలేదని వినేశ్ తెలిపింది. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా తన ఆవేదనను ప్రధానికి లేఖ ద్వారా తెలియజేసింది. ‘ఇంత జరిగాక ఇక నా జీవితంలో ఈ రెండు అవార్డులకు విలువే లేదు. ఎందుకంటే ఏ మహిళ అయినా ఆత్మ గౌరవాన్నే కోరుకుంటుంది. నేనూ అంతే... నా జీవితానికి ఆ అవార్డులు ఇకపై భారం కాకూడదనే ఉద్దేశంతోనే నాకు మీరిచ్చిన అవార్డుల్ని వెనక్కి ఇస్తున్నాను ప్రధాని సార్’ అని ఆమె ‘ఎక్స్’లో లేఖను పోస్ట్ చేసింది. మహిళా సాధికారత, సమ సమానత్వం అనే ప్రకటనలకే ప్రభుత్వం పరిమితమని తీవ్రంగా ఆక్షేపించింది. మేటి రెజ్లర్ ఫొగాట్ ప్రపంచ చాంపియన్షిప్లో రెండు కాంస్య పతకాలు సాధించింది. మూడు (2014, 2018, 2022) కామన్వెల్త్ క్రీడల్లోనూ చాంపియన్గా నిలిచింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం (2018), కాంస్యం (2014) చేజిక్కించుకుంది. కుస్తీలో ఆమె పతకాల పట్టును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2016లో అర్జున, 2020లో ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న’ అవార్డులతో సత్కరించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో లైంగిక ఆరోపణల కేసులో నిందితుడైన వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ వర్గమే గెలిచింది. ఆయన విధేయుడు సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో సాక్షి మలిక్ ఉన్న పళంగా రిటైర్మెంట్ ప్రకటించింది. రెజ్లర్ బజరంగ్ పూనియా, బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ ‘పద్మశ్రీ’ పురస్కారాలను వెనక్కి ఇచ్చారు. అయితే కేంద్ర క్రీడాశాఖ నియమావళిని అతిక్రమించడంతో డబ్ల్యూఎఫ్ఐని సస్పెండ్ చేసింది. -
నేరుగా ఆసియా క్రీడల్లో అడుగు.. అనూహ్య రీతిలో ఓటమి! ఎవరూ ఊహించలేరు..
Asian Games 2023: ఆసియా క్రీడల రెజ్లింగ్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు అనూహ్య ఓటమి ఎదురుకాగా... అమన్ (57 కేజీలు), మహిళల విభాగంలో సోనమ్ మలిక్ (62 కేజీలు), కిరణ్ (76 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. కాంస్య పతక బౌట్లలో అమన్ 11–0తో లియు మింగు (చైనా)పై, సోనమ్ 7–5తో జియా లాంగ్ (చైనా)పై, కిరణ్ 6–3తో అరియున్జర్గాల్ (మంగోలియా)పై నెగ్గారు. బజరంగ్ విఫలం సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనకుండా నేరుగా ఆసియా క్రీడల్లో ఆడే అవకాశం దక్కించుకున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా నిరాశపరిచాడు. చైనా నుంచి అతను రిక్తహస్తాలతో స్వదేశానికి రానున్నాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన బజరంగ్ పూనియా కాంస్య పతక బౌట్లో 4 నిమిషాల 31 సెకన్లలో ఓడిపోయాడు. జపాన్ ప్లేయర్ కైకి యామగుచి 10–0తో బజరంగ్ను చిత్తుగా ఓడించాడు. రెండునెలల పాటు నిరసనలో రెజ్లింగ్ నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సంపాదించిన వెంటనే రిఫరీ బౌట్ను నిలిపివేసి ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బజరంగ్ తన సహచర రెజ్లర్లతో కలిసి దాదాపు రెండునెలలపాటు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. దాంతో కొంతకాలంపాటు ఆటకు దూరంగా ఉన్న అతను ఆసియా క్రీడల్లో పూర్తిస్థాయి ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాడు. 2014 ఏషియాడ్లో బజరంగ్ 61 కేజీల్లో రజతం, 2018 ఏషియాడ్లో 65 కేజీల్లో స్వర్ణం నెగ్గాడు. ఎవరూ ఊహించలేరు కూడా! కాగా ఆసియా క్రీడల్లో విఫలమైన బజరంగ్కు మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ అండగా నిలిచారు. ‘‘బజరంగ్.. ఇప్పుడూ.. ఎప్పుడూ చాంపియనే! మహిళా రెజ్లర్ల పోరాటంలో అతడు అందించిన సహకారం మరువలేనిది. మాకోసం తను ఎంతగా కష్టపడ్డాడో ఎవరూ ఊహించలేరు కూడా!’’ అని వినేశ్ బజరంగ్ పునియాను ప్రశంసించారు. నేరుగా ఆసియా క్రీడల్లో అడుగుపెట్టి ఓటమిపాలైన నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ మద్దతుదారులు బజరంగ్ను విమర్శిస్తున్న తరుణంలో.. లైంగిక వేధింపుల పోరాటంలో అతడు తమకు మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ వినేశ్ ఉద్వేగానికి లోనయ్యారు. -
‘పసిడి’ ఆశలు ఆవిరి! ఇక ఏ గొడవా లేదు..
Asia Games 2023- న్యూఢిల్లీ: ట్రయల్స్ లేకుండా ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు మినహాయింపు పొందిన మహిళా స్టార్ రెజ్లర్, డిఫెండింగ్ చాంపియన్ వినేశ్ ఫొగాట్ తాజాగా ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకొంది. మోకాలు గాయం వల్ల హాంగ్జౌ ఈవెంట్లో పాల్గొనడం లేదని మంగళవారం ఆమె ప్రకటించింది. దీంతో మినహాయింపు అనుచితమంటూ కోర్టుకెక్కిన అంతిమ్ పంఘాల్కు 53 కేజీల కేటగిరీలో లైన్ క్లియరైంది. ఆ విభాగంలో ట్రయల్స్లో నెగ్గి ఆసియా ఈవెంట్కు అర్హత సంపాదించినప్పటికీ... వినేశ్ బరిలో ఉండటం వల్ల ఆమె స్టాండ్బైగా కూర్చోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వినేశ్ తనంతట తానుగా తప్పుకోవడంతో ఇక ఏ గొడవా లేకుండా అంతిమ్ ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. ‘పసిడి’ ఆశలు ఆవిరి ‘ట్రెయినింగ్లో ఎడమ మోకాలుకు గాయమైంది. స్కానింగ్లో గాయం తీవ్రత దృష్ట్యా సర్జరీ తప్పనిసరని వైద్యులు సూచించడంతో ఈ నెల 17న ముంబైలో ఆపరేషన్ చేయించుకుంటాను. దీనివల్ల జకార్తా ఆసియా క్రీడల్లో (2018) సాధించిన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలనుకున్న నా ఆశలు ఆవిరయ్యాయి’ అని వినేశ్ వాపోయింది. రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులపై వినేశ్, భజరంగ్, సాక్షి మాలిక్ తదితరులు పలుమార్లు జంతర్మంతర వద్ద నిరసనకు దిగారు. డబ్లూఎఫ్ఐ అడ్హక్ కమిటీ వినేశ్, భజరంగ్లకు నేరుగా ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశమివ్వడం వివాదానికి కారణమైంది. దీనిపై ట్రయల్స్ గెలిచిన అంతిమ్ కోర్టును ఆశ్రయించింది. చదవండి: కలలు నిజమైన వేళ: వాళ్లు మెరిశారు..! ఇక అందరి దృష్టి అతడిపైనే.. -
ఆసియా క్రీడలకు ముందు భారత్కు బిగ్ షాక్.. స్టార్ రెజ్లర్ ఔట్
2023 ఆసియా క్రీడలకు ముందు భారత్కు బిగ్ షాక్ తగిలింది. ఏషియన్ గేమ్స్ నుంచి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మోకాలి గాయం కారణంగా పోటీల్లో పాల్గొనడం లేదని ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఆగస్ట్ 13న రిహార్సల్స్ సమయంలో ఎడమ మోకాలికి తీవ్ర గాయమైందని.. స్కాన్లు, పరీక్షల అనంతరం డాక్టర్లు సర్జరీ అనివార్యమని చెప్పారని, ఆగస్ట్ 17న ముంబైలో సర్జరీ చేయించుకోబోతున్నానని పేర్కొంది. కాగా, చైనాలోని హ్యాంగ్ఝౌలో త్వరలో (సెప్టెంబన్ 23-అక్టోబర్ 8) జరుగనున్న ఆసియా క్రీడల్లో వినేశ్ ఫోగట్పై భారీ అంచనాలే ఉన్నాయి. మహిళల రెజ్లింగ్లో ఆమె స్వర్ణం సాధించడం ఖాయమని అంతా ఆశించారు. ఇప్పుడు వినేశ్ గాయపడటంతో భారత్ తప్పక గెలవాల్సిన గోల్డ్ మెడల్ను కోల్పోవాల్సి వచ్చింది. వినేశ్ స్థానంలో అంతిమ్ పంగాల్ ఆసియా క్రీడల్లో పాల్గొనవచ్చని తెలుస్తుంది. 28 ఏళ్ల వినేశ్ 2018 ఏషియన్ గేమ్స్ 50 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. -
'ట్రయల్స్ నెగ్గింది కూర్చోవడానికి కాదు.. సుప్రీంకు వెళతాం'
న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్లకు సెలక్షన్స్నుంచి మినహాయింపునిస్తూ నేరుగా ఆసియా క్రీడలకు ఎంపిక చేయడంపై నమోదైన రిట్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ తీర్పునిచ్చారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటలకే సెలక్షన్ ట్రయల్స్లో అంతిమ్ పంఘాల్ గెలిచింది. శనివారం నిర్వహించిన 53 కేజీల సెలక్షన్ ట్రయల్స్లో ఆమె విజేతగా నిలిచింది. అయితే ఇదే కేటగిరీలో వినేశ్ను ఇప్పటికే ఎంపిక చేయడంతో అంతిమ్ స్టాండ్బైగా మాత్రమే ఉండే అవకాశం ఉంది. కానీ తాను స్టాండ్బైగా కూర్చునేందుకు సిద్ధంగా లేనని ఆమె ప్రకటించింది. హైకోర్టులో ప్రతికూలంగా వచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పోరాడతానని 19 ఏళ్ల పంఘాల్ తెలిపింది. ‘కష్టపడి ట్రయల్స్ నెగ్గిన నేను ఎందుకు స్టాండ్బైగా ఉండాలి. దర్జాగా మినహాయింపు పొందినవారే కూర్చోవాలి’ అని వినేశ్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది. బజరంగ్, వినేశ్లను రెజ్లింగ్ సమాఖ్య అడ్హాక్ కమిటీ ట్రయల్స్ లేకుండానే ఆసియా క్రీడలకు ఎంపిక చేసింది. దీనిని సవాల్ చేస్తూ యువ రెజ్లర్లు అంతిమ్ పంఘాల్, సుజీత్ కల్కాల్ ఈ నెల 19న కోర్టును ఆశ్రయించారు. EXCLUSIVE 🎥 "I will appeal to Supreme Court." said Antim Panghal After Vinesh Phogat, Bajrang Punia's Asian Games Trials Exemption Allowed By Delhi High Court. #AntimPanghal #wrestling #AsianGames2023 #AsianGames pic.twitter.com/v2XuiyVCAZ — nnis (@nnis_sports) July 22, 2023 చదవండి: #koreaOpen: సాత్విక్-చిరాగ్ జోడి సంచలనం.. కొరియా ఓపెన్ కైవసం -
బ్రిజ్భూషణ్కు బెయిల్; ఏ ప్రాతిపదికన వారికి మినహాయింపు?
న్యూఢిల్లీ: నేరుగా ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్లకు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అడ్హక్ కమిటీ ఇచ్చిన మినహాయింపు అంశం కోర్టుకెక్కింది. అండర్–20 ప్రపంచ చాంపియన్ అంతిమ్ పంఘాల్, అండర్–23 ఆసియా చాంపియన్ సుజీత్ కల్కల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్ వీరిద్దరికి మినహాయింపు ఇవ్వడానికి గల కారణాలు, ప్రాతిపదిక ఏమిటని రెజ్లింగ్ సమాఖ్య వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అడ్హక్ కమిటీని ప్రశ్నించారు. డబ్ల్యూఎఫ్ఐ మార్గదర్శకాల ప్రకారం అన్ని వెయిట్ కేటగిరీలకు సెలక్షన్ ట్రయల్స్ తప్పనిసరి అని పిటిషనర్ల తరఫు న్యాయ వాది వినిపించగా, జడ్జి తదుపరి విచారణన నేటికి వాయిదా వేశారు. బ్రిజ్భూషణ్కు బెయిల్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ సీనియర్ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు గురువారం ఢిల్లీ కోర్టు పూర్తిస్థాయి బెయిల్ను మంజూరు చేసింది. మైనర్ రెజ్లర్ సహా పలువురు రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్భూషణ్పై ఎట్టకేలకు గత నెల 15న పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్ని విచారించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ షరతులతో కూడిన బెయిల్ ఇచి్చంది. మంగళవారం కేవలం మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా తాజాగా పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చింది. అయినప్పటికీ కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లేందుకు అవకాశం లేదు. -
వినేశ్ ఫొగాట్, భజరంగ్ల వ్యవహారంపై హైకోర్టుకు అంతిమ్ పంఘల్
ఒలింపిక్ పతక విజేత బజరంగ్, ఆసియా గేమ్స్ చాంపియన్ వినేశ్ ఫొగాట్ ట్రయల్స్ లేకుండానే ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు బెర్త్లు పొందిన సంగతి తెలిసిందే. పురుషుల 65 కేజీల కేటగిరీలో బజరంగ్... మహిళల 53 కేజీల విభాగంలో వినేశ్ చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో పోటీ పడతారు. అయితే ఈ విభాగాల్లోనూ ట్రయల్స్ నిర్వహించి విజేతలను స్టాండ్బైగా అక్కడికి తీసుకెళ్తారు. ఈ విషయం పక్కనబెడితే.. వినేశ్ ఫొగాట్కు ఎలాంటి ట్రయల్స్ లేకుండానే నేరుగా ఆసియా గేమ్స్లో పాల్గొనడంపై యువ రెజ్లర్ అంతిమ్ పంఘల్ తప్పుబడుతూ హైకోర్టులో చాలెంజ్ చేశాడు. ఇదే విషయంపై అంతిమ్ పంఘల్ చిన్ననాటి కోచ్ వికాష్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ''ట్రయల్స్ లేకుండానే వినేశ్, భజరంగ్లను ఆసియా గేమ్స్ ఆడనివ్వడంపై హైకోర్టుకు వెళ్తున్నాం. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేసిన ఆందోళనలో యువ రెజ్లర్లు కూడా ఉన్నారు. కానీ డబ్ల్యూఎఫ్ఐ కేవలం సీనియర్లకు మాత్రమే అవకాశమిచ్చి సాక్షి మాలిక్ లాంటి జూనియర్లకు ఆసియా గేమ్స్కు ఎందుకు ట్రయల్స్ లేకుండా పంపించడం లేదు. ఇది కరెక్ట్ కాదు. అందరికి ట్రయల్స్ నిర్వహించాల్సిందే. ఎవరిని డైరెక్ట్గా ఎంపిక చేయకూడదు. దీనిపై పోరాడుతాం'' అంటూ తెలిపారు. ఇక అంతిమ్ పంఘల్ ఆసియా గేమ్స్లో బాక్సింగ్ విభాగంలో 53 కేజీలో కేటగిరిలో పోటీ పడనుండగా.. రెజ్లర్లు భజరంగ్ పూనియా 65 కేజీలు.. వినేశ్ ఫొగాట్ 53 కేజీల విభాగంలో ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జూ వేదికగా జరగనున్నాయి. చదవండి: DopingTest: రెండేళ్లలో 114 మంది క్రికెటర్లకు మాత్రమేనా.. WADA అసహనం -
Asian Games: వినేశ్, బజరంగ్లకు ప్రత్యేక మినహాయింపు ఉంటుందా?
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లింగ్ జట్లను ఎంపిక చేసేందుకు ఈనెల 22, 23 తేదీల్లో సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్హక్ కమిటీ ప్రకటించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి... నిరసన చేపట్టిన రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్, సాక్షి మలిక్, సంగీత ఫొగపాట్, సత్యవర్త్, జితేందర్లకు ట్రయల్స్లో ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలా వద్దా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని అడ్హక్ కమిటీ అధ్యక్షుడు భూపేందర్ సింగ్ బజ్వా తెలిపారు. అభిషేక్కు కాంస్యం బ్యాంకాక్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్ తొలి రోజు భారత్కు ఒక కాంస్య పతకం లభించింది. పురుషుల 10 వేల మీటర్ల విభాగంలో అభిషేక్ పాల్ కాంస్య పతకం సాధించాడు. అభిషేక్ 29 నిమిషాల 33.26 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి (59.10 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచింది. -
బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ కీలక నిర్ణయం.. క్రీడా శాఖ ఆమోదం
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్ సెలెక్షన్ ట్రయల్స్కు సమాయత్తమయ్యేందుకు భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ విదేశాల్లో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించగా వాటికి ఆమోదం లభించింది. బజరంగ్ 36 రోజుల శిక్షణ కోసం కిర్గిస్తాన్ను... వినేశ్ 18 రోజుల శిక్షణకు హంగేరిని ఎంచుకున్నారు. ఆగస్టు రెండో వారంలో ట్రయల్స్ జరగనుండగా... వచ్చే వారంలో వీరు విదేశాలకు బయలుదేరుతారు. వినేశ్ వెంట ఫిజియోథెరపిస్ట్ అశ్విని జీవన్ పాటిల్, కోచ్ సుదేశ్, ప్రాక్టీస్ భాగస్వామిగా సంగీత ఫొగాట్... బజరంగ్ వెంట కోచ్ సుజీత్ మాన్, ఫిజియోథెర పిస్ట్ అనూజ్, ప్రాక్టీస్ భాగస్వామి జితేందర్, స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ నిపుణుడు కాజీ హసన్ వెళతారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బ్రిజ్భూషణ్పై లైంగిక ఆరోపణల కేసును కోర్టులోనే తేల్చుకుంటామని బజరంగ్, వినేశ్ ప్రకటించారు. చదవండి: Ashes 2023: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్ -
ఇకపై రోడ్డెక్కం... కోర్టులోనే తేల్చుకుంటాం
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రెండుసార్లు నిరసన దీక్ష చేపట్టిన స్టార్ రెజ్లర్ల వైఖరి మారింది. తమకు న్యాయం దక్కేవరకు ఆయనపై పోరాటం కొనసాగుతుందని, అయితే అది కోర్టులోనే తేల్చుకుంటామని... ఇకపై రోడ్డెక్కబోమని రెజ్లర్లు ప్రకటించారు. ‘డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ప్రక్రియ ముగిశాక మాకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆ మేరకు మేం వేచిచూస్తాం. కానీ బ్రిజ్భూషణ్పై మా పోరాటాన్ని మాత్రం విరమించే ప్రసక్తేలేదు’ అని వినేశ్ ఫొగాట్ ట్వీట్ చేసింది. అనంతరం కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటామని వినేశ్తో పాటు సాక్షి మలిక్ తెలిపింది. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలపై స్టే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు చాలాసార్లు వాయిదా పడ్డాయి. తాజాగా ఇప్పుడు గువాహటి హైకోర్టు స్టేతో మరో వాయిదా తప్పేలాలేదు. అస్సాం సంఘం తమ సభ్యత్వాన్ని గుర్తించకపోవడం, ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఇవ్వకపోవడంతో హైకోర్టులో పిటీషన్ వేయగా వచ్చే నెల 11న జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలపై కోర్టు స్టే విధించింది. -
బ్రిజ్భూషణ్ ఎంగిలి మెతుకులు తినే బతుకు తనది!
న్యూఢిల్లీ: లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్ ఆరుగురు స్టార్ రెజ్లర్లకు ట్రయల్స్లో ఇచ్చిన మినహాయింపును తప్పుబట్టాడు. ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్ల కోసం నిర్వహించే సెలక్షన్ ట్రయల్స్లో వినేశ్, సంగీత, సాక్షి మలిక్, సత్యవర్త్, బజరంగ్, జితేందర్లకు కేవలం ఒక్క బౌట్ పోటీ పెట్టారు. భారత ఒలింపిక్ సంఘం అడ్హక్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం అనుచితమని బీజేపీ నేత కూడా అయిన యోగేశ్వర్ దత్ అన్నాడు. ‘దేని ఆధారంగా ఇలాంటి మినహాయింపు నిర్ణయం తీసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. కమిటీ నిర్ణయం ఏమాత్రం సరికాదు. నా సలహా ఏంటంటే జూనియర్ రెజ్లర్లంతా నిరసన చేపట్టో, ప్రధానికి లేఖ రాసో దీనిపై పోరాడాలి’ అని యోగేశ్వర్ ట్వీట్ చేశాడు. రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులపై నియమించిన కమిటీలో యోగేశ్వర్ సభ్యుడిగా ఉన్నాడు. బ్రిజ్భూషణ్ కీలుబొమ్మ దత్.. తమ విన్నపాన్ని మన్నించి అడ్హక్ కమిటీ ఇచ్చిన మినహాయింపును తప్పుబట్టిన యోగేశ్వర్ దత్పై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అతనో వెన్నెముక లేని మనిషని, బ్రిజ్భూషణ్ చేతిలో కీలుబొమ్మని విమర్శించింది. ‘బ్రిజ్భూషణ్ ఎంగిలి మెతుకులు తినే బతుకు యోగేశ్వర్ది. అతని అడుగులకు మడుగులొత్తే తొత్తు యోగేశ్వర్. ఇతని చరిత్ర రెజ్లింగ్ లోకానికి బాగా తెలుసు’ అని ట్విట్టర్లో వినేశ్ మండిపడింది. విచారణ కమిటీలో ఉంటూ ఎవరెవరు బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా మాట్లాడారో వారి పేర్లను అతనికి చేరవేశాడని దుయ్యబట్టింది. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్టేట్మెంట్ ఇచి్చన రెజ్లర్లతో రాజీకొచ్చేలా ప్రవర్తించాడని ఆరోపించింది. గ్యాంజస్ గ్రాండ్మాస్టర్స్ గెలుపు దుబాయ్: గ్లోబల్ చెస్ లీగ్లో గ్యాంజస్ గ్రాండ్మాస్టర్స్ జట్టు రెండో విజయం నమోదు చేసింది. అల్పైన్ వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గ్యాంజస్ గ్రాండ్మాస్టర్స్ జట్టు 11–6తో గెలిచింది. ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (అల్పైన్ వారియర్స్)తో జరిగిన గేమ్లో గ్యాంజస్ జట్టు ప్లేయర్, భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్తో 44 ఎత్తుల్లో ఓడిపోయినా... రాపోర్ట్, బెలా గ్యాంజస్ జట్టు తరఫున నెగ్గడంతో ఆ జట్టుకు విజయం దక్కింది. ఇతర మ్యాచ్ల్లో బాలన్ అలస్కాన్ నైట్స్ 14–5తో అప్గ్రాడ్ ముంబా మాస్టర్స్ జట్టుపై, త్రివేని కాంటినెంటల్ కింగ్స్ 8–7తో చింగారి గల్ఫ్ టైటాన్స్పై, అల్పైన్ వారియర్స్ 9–7తో బాలన్ అలస్కాన్ నైట్స్పై గెలిచాయి. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ ఓటమి సించ్ టెన్నిస్ చాంపియన్íÙప్ ఏటీపీ–500 టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ కథ ముగిసింది. లండన్లో జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 3–6, 6–7 (5/7)తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్స్కీ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. బోపన్న జోడీకి 18,190 యూరోల (రూ. 16 లక్షల 24 వేలు) ప్రైజ్మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రణయ్ పరాజయం భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి ని్రష్కమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 19–21, 8–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. చదవండి: KP Chowdary Case: మా బిడ్డకు కేపీ చౌదరితో అసలు పరిచయమే లేదు.. వారం రోజులు ఇల్లు కావాలంటే: సిక్కిరెడ్డి తల్లి -
హర్షనీయం.. ఒక్క బౌట్తోనే అర్హతకు అవకాశం
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్పై కొన్ని నెలలుగా న్యాయ పోరాటం చేస్తున్న స్టార్ రెజ్లర్లకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్హక్ కమిటీ గొప్ప ఊరటనిచ్చింది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్లలో పాల్గొనే భారత జట్టు ఎంపిక కోసం నిర్వహించే ట్రయల్స్లో ఆరుగురు రెజ్లర్లకు కేవలం ఒకే బౌట్ ద్వారా అర్హత పొందే అవకాశం కల్పించింది. స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, సంగీత ఫొగాట్, సత్యవర్త్ కడియాన్, బజరంగ్ పూనియా, జితేందర్ కిన్హాలు మిగతా సెలక్షన్ ట్రయల్స్ విజేతలతో తలపడి గెలిస్తే చాలు ప్రతిష్టాత్మక క్రీడలకు ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు దీనికి సంబంధించిన ట్రయల్స్ నిర్వహిస్తారు. అంతర్జాతీయ వేదికలపై భారత్కు పతకాలు తెచ్చిపెట్టిన వీరంతా కేంద్ర క్రీడాశాఖను నేరుగా ఆయా క్రీడల్లో పాల్గొనే వెసులుబాటు కల్పించాలని కోరారు. దీంతో స్టార్ రెజ్లర్ల విన్నపాన్ని కేంద్ర క్రీడాశాఖ, ఐఓఏ మన్నించాయి. అయితే ఈ నామమాత్ర బౌట్పై ఇతర ఔత్సాహిక రెజ్లర్లు విమర్శిస్తున్నారు. -
Wrestlers Protest: ఆమె మైనర్ కాదంటూ వీడియో! మండిపడ్డ స్వాతి.. వెంటనే
Wrestlers’ protest against Brij Bhushan: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో రాజధాని ఢిల్లీ వేదికగా మహిళా రెజ్లర్లు, వారికి మద్దతుగా బజ్రంగ్ పునియా తదితరులు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. కాగా బ్రిజ్ భూషణ్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. వీరిలో ఓ మైనర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తాను ఆమె అంకుల్నంటూ వీడియో విడుదల చేశాడు. ఆమె మైనర్ కాదంటూ వీడియో అందరూ అనుకుంటున్నట్లు సదరు రెజ్లర్ మైనర్ కాదని, ఆమె వయసు దాదాపు 20 ఏళ్లకు పైనే అంటూ ఆధారాలుగా కొన్ని డాక్యుమెంట్లు చూపించాడు. ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ సదరు వ్యక్తిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అతడిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మండిపడ్డ స్వాతి మలివాల్.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఈ మేరకు.. ‘‘బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా కేసు పెట్టిన మైనర్కు అంకుల్నంటూ ఓ వ్యక్తి మీడియా ముందు ఆమె ఐడెంటీని బయటపెట్టాడు. చట్టవిరుద్ధ చర్యకు పాల్పడిన అతడిపై పోక్సో చట్టప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులకు నేను నోటీస్ జారీ చేస్తున్నాను. ఎందుకంటే.. ఇప్పుడు బ్రిజ్ భూషణ్ బయటే స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. కాబట్టి ఆయన బాధితురాలిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’’ అని స్వాతి మలివాల్ బుధవారం ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఈ విషయంలో సింగ్ ప్రమేయం కూడా ఉందేమో విచారించి.. ఆయనను అరెస్టు చేయాల్సిందిగా మహిళా కమిషన్ తరఫున డిమాండ్ చేశారు. రెజ్లర్ల పట్ల పోలీసుల చర్యపై ఆగ్రహం కాగా భారత రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా తదితరులు గత కొన్ని రోజులుగా బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలనే డిమాండ్తో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. సాధారణ ప్రజలు సహా కొంతమంది క్రీడాకారులు వారికి మద్దతుగా సంఘీభావం ప్రకటించగా.. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లపై పోలీసులు కఠినంగా ప్రవర్తించారు. దీంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో తాము సాధించిన పతకాలు గంగలో నిమజ్జనం చేస్తామంటూ వాళ్లు హరిద్వార్ బయల్దేరగా.. చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఆ ప్రయత్నం విరమించారు. ఇదిలా ఉంటే.. భారత రెజ్లర్లపై పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తూ ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య విచారం వ్యక్తం చేసింది. భారత్లో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. చదవండి: WTCFinal2023: ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన ఆ ఐదుగురు! ఫోటోలు వైరల్ WTC: నెట్స్లో శ్రమిస్తున్న యశస్వి.. దగ్గరకొచ్చి సలహాలు ఇచ్చిన కోహ్లి! వీడియో -
Wrestlers Protest: వాళ్లనలా చూశాక నిద్రే రాలేదు: బింద్రా
న్యూఢిల్లీ: పోలీసు నిర్బంధం నుంచి ఆదివారం రాత్రి విడుదలైన భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ‘మా తదుపరి కార్యాచరణ ఏంటనేది త్వరలోనే వెల్లడవుతుంది. మేమంతా ఇంకా కలుసుకోలేదు. మమ్మల్ని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. నన్ను అర్ధరాత్రి దాటాక విడిచి పెట్టారు. మిగతా రెజ్లర్లను రాత్రి 11 గంటలకు విడుదల చేశారు. అందువల్లే అందరం కలువలేకపోయాం. అంతా కలిసి చర్చించుకున్నాకే తదుపరి పోరాటానికి దిగుతాం’ అని బజరంగ్ తెలిపాడు. మరోవైపు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు రెజ్లర్లు మళ్లీ నిరసన చేసేందుకు అనుమతి కోరితే ఇస్తామని, అయితే జంతర్మంతర్ వద్ద మాత్రం శిబిరానికి అనుమతి లేదని, ఢిల్లీలో ఇంకెక్కడైనా దీక్ష చేపట్టవచ్చని ట్విట్టర్లో పేర్కొన్నారు. వాళ్లనలా చూశాక నిద్రే రాలేదు: బింద్రా దేశానికి ఒలింపిక్, ఆసియా క్రీడల్లో పతకాలు తెచ్చిపెట్టిన రెజ్లర్లతో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని బీజింగ్ ఒలింపిక్స్ (2008) చాంపియన్ షూటర్ అభినవ్ బింద్రా అన్నాడు. మహిళా రెజ్లర్లపై దాష్టీకానికి పాల్పడిన దృశ్యాలు తనను కలచివేశాయని రాత్రంత నిద్రేలేకుండా చేసిందని ట్వీట్ చేశాడు. స్టార్ రెజ్లర్లతో ఖాకీల కాఠిన్యం ఏమాత్రం ఆమోదయోగ్యం కానే కాదని భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి అన్నాడు. రెజ్లర్లను పోలీసులు ఈడ్చుకెళ్లిన చిత్రాలు తనను బాధించాయని, సాధ్యమైనంత త్వరలో వారి సమస్య పరిష్కరించాలని మాజీ క్రికెట్ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్లో కోరారు. చదవండి: ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు -
'అది మేము కాదు.. మా ఫోటోలను మార్ఫింగ్ చేశారు!'
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా టాప్ రెజ్లర్లు నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. చాన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వైపు శాంతియుత ర్యాలీ చేపట్టారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీకి వెళ్తున్న రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియాతో పాటు ఇతర ఆందోళనకారులను నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, రెజ్లర్లను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని బస్సుల్లో ఎక్కించి వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఫొటోల్లో వినేశ్ ఫోగట్, సంగీత ఫోగట్ పోలీసు వ్యాన్లో కూర్చుని నవ్వుతూ సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఉంది. ఈ ఫొటోలపై రెజ్లర్లు స్పందించారు. తమ ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆరోపించారు. ''కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI Technology) ఉపయోగించి మొహాలనే మార్చేస్తున్నారు.. మేమెంత చెప్పండి.. మా నిరసనపై బురద జల్లే ప్రయత్నంలో కొందరు గిట్టని వ్యక్తులు ఇలాంటి తప్పుడు చిత్రాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ నకిలీ ఫొటోను పోస్ట్ చేసిన వారిపై ఫిర్యాదు చేస్తాం'' అని భజరంగ్ పునియా ట్వీట్ చేశాడు. దీనిపై సాక్షి మలిక్ స్పందిస్తూ..''అవి నిజమైన ఫొటోలు కావు. కొందరు కావాలనే మార్ఫింగ్ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావట్లేదు. మాకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు'' అని మండిపడ్డారు. IT Cell वाले ये झूठी तस्वीर फैला रहे हैं। हम ये साफ़ कर देते हैं की जो भी ये फ़र्ज़ी तस्वीर पोस्ट करेगा उसके ख़िलाफ़ शिकायत दर्ज की जाएगी। #WrestlersProtest pic.twitter.com/a0MngT1kUa — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) May 28, 2023 చదవండి: శాంతియుత నిరసన.. రెజ్లర్లకు ఘోర అవమానం -
శాంతియుత నిరసన.. రెజ్లర్లకు ఘోర అవమానం
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు కొన్ని వారాలుగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. లైంగికంగా వేధించిన రెజ్లర్ సంఘ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్పై చర్యలు తీసుకోవాలని మహిళా రెజ్లర్లు గత కొన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికి పలు వర్గాల నుంచి పూర్తి మద్దతు లభించింది. అయితే ఆదివారం రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు ఆదివారం కొత్త పార్లమెంటు వైపు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. ఇవాళే కొత్తగా ప్రారంభమైన నూతన పార్లమెంట్ భవనం ముందు బ్రిజ్భూషణ్పై చర్యలకు డిమాండ్ చేస్తూ ''మహిళా మహాపంచాయత్'' నిర్వహించాలని రెజ్లర్లు నిర్ణయించారు. ఈ మేరకు నూతన పార్లమెంట్ భవనం వైపు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను పోలీసులు జంతర్మంతర్ వద్ద అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న పలువురు రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్, మరో రెజ్లర్ బజరంగ్ పూనియా ఉన్నారు. కాగా, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని రెజ్లర్లు మండిపడుతున్నారు. మేం బారీకేడ్లు విరగొట్టామా..? ఇంకేమైనా హద్దులు మీరామా..? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. #WATCH | Delhi: Security personnel stop & detain protesting wrestlers as they try to march towards the new Parliament from their site of protest at Jantar Mantar.Wrestlers are trying to march towards the new Parliament as they want to hold a women's Maha Panchayat in front of… pic.twitter.com/3vfTNi0rXl— ANI (@ANI) May 28, 2023 #WATCH | Mahapanchayat will certainly be held today. We're fighting for our self-respect.They're inaugurating the new Parliament building today, but murdering democracy in the country.We appeal to the administration to release our people detained by police: Wrestler Bajrang Punia pic.twitter.com/VI4kGLxGWV— ANI (@ANI) May 28, 2023 To all my international fraternity Our Prime Minister is inaugurating our new parliamentBut on the other hand, Our supporters has been arrested for supporting us.By arresting people how we can call us “mother of democracy”India’s daughters are in pain.— Sakshee Malikkh (@SakshiMalik) May 28, 2023 जंतर मंतर पर सरेआम लोकतंत्र की हत्या हो रही एक तरफ़ लोकतंत्र के नये भवन का उद्घाटन किया है प्रधानमंत्री जी ने दूसरी तरफ़ हमारे लोगों की गिरफ़्तारियाँ चालू हैं. pic.twitter.com/ry5Wv9xn5A— Vinesh Phogat (@Phogat_Vinesh) May 28, 2023 చదవండి: స్కూటీపై చక్కర్లు; ఆ ఇద్దరు గుజరాత్ బలం.. జాగ్రత్త -
నార్కో టెస్ట్ చేయాలంటూ రెజ్లర్లు డిమాండ్.. బీజేపీ ఎంపీ స్పందన ఇదే
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్(డబ్ల్యూఎఫ్ఐ), బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ని లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు జంతమంతర్ వద్ద నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్యానాలోని మెహమ్లో జరిగిన ఖాప్ పంచాయతీ సమావేశం బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నార్కో పరీక్ష చేయించుకునేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ విషయంపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సానుకూలంగా స్పందించారు. నార్కో టెస్ట్, పాలిగ్రాఫ్ టెస్ట్ లేదా లై డిటెక్టర్ తదితరాలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఐతే అందుకు తనకు ఒక షరతు ఉందంటూ.. వినేష్ ఫోగట్, బజరంగ్పునియా కూడా ఆ పరీక్షలు చేయించుకోవాలన్నారు. రెజ్లర్లు ఇద్దరూ తమ పరీక్షను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడూ కాల్ చేసి ప్రకటించండని చెప్పారు. ఆ వెంటనే తాను కూడా అందుకు సిద్ధంగా ఉండటమే గాదు చేయించుకుంటానని వాగ్దానం కూడా చేస్తున్నానని ఫేస్బుక్ పోస్ట్లో తెలిపారు. ఇదిలా ఉండగా డబ్ల్యూఎఫ్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని రెజ్లర్లు కావాలనే తనను ఇరికించారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై సుప్రీం కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు ఆయనపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేయడం జరిగింది. అయినా తాను 2014లో రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నానని, కానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పట్టుపట్టడం వల్లే కొనసాగానని శరణ్ సింగ్ చెప్పుకొచ్చారు. కాగా, గోండాలో ఉన్న కైసర్గంజ్కు చెందిన బీజేపీ ఎంపీ శరణ్ సింగ్ తన లోక్సభ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలను కలవడమే గాక జూన్ 5న అయోధ్యలో నిర్వహించనున్న చేతన మహా ర్యాలీకి ప్రజల మద్దతును కోరడం విశేషం. రెజ్లర్ల విషయమే ఆయన్ను ప్రశ్నించగా..అబద్ధాలు చెప్పాలనుకుంటే వారు చెప్పగలరని, ఎవ్వరు వారిని ఆపలేరని బీజేపీ ఎంపీ శరణ్ సింగ్ విమర్శించారు. (చదవండి: కేంద్రంతో వివాదంలో మా మద్దతు మీకే)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement