
భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్కు నిరాశ ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ ఇవ్వాలన్న ఆమె అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తిరస్కరించింది.
మహిళల రెజ్లింగ్ 50 కేజీల కేటగిరీ ఫైనల్కు ముందు నిర్దిష్ట బరువు కంటే 100 గ్రాముల ఎక్కువగా ఉందన్న కారణంగా వినేశ్ ఫోగట్ అనర్హతకు గురైన విషయం తెలిసిందే. ఫైనల్కు చేరిన నేపథ్యంలో సంయుక్తంగా రజత పతకం ఇవ్వాలని వినేశ్ సీఏఎస్ను ఆశ్రయించింది.