breaking news
-
బీజేపీపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వికారాబాద్: బీజేపీలో కొంత మంది తనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని.. ఆ పార్టీలో తప్పులు జరుగుతున్నాయి కాబట్టే రాజీనామా చేశానంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని అందుకే పార్టీకి రాజీనామా ఇచ్చానన్న రాజాసింగ్.. కొన్నిసార్లు తనను ఢిల్లీ పిలిచి వార్నింగ్ కూడా ఇప్పించారన్నారు. ‘‘బీజేపీ స్టేట్ కమిటీలో 10 నుంచి 12 మంది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పదవులు ఇచ్చారు. జిల్లాలో ఉండే కార్యకర్తకు పదవులు ఇవ్వాలని నేను ప్రతిపాదించాను. బీజేపీ రాష్ట్ర కమిటీ రామచందర్ రావు వేశారా? కిషన్ రెడ్డి వేశారా?. బీజేపీ రాష్ట్ర కమిటీతో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా?’’ అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు.‘‘బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీని సర్వ నాశనం చేసేందుకు కమిటీ వేసినట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర కమిటీపై బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సంతృప్తిగా లేరు. బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని దెబ్బతీస్తున్నారు. రామచందర్ రావు మంచి మనిషి.. కానీ రబ్బర్ స్టాంప్’’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.‘‘బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అశోక్ మాట్లాడిన తీరు బాగాలేదు. ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వేముల అశోక్ డబ్బులు వసూలు చేశారు. బీజేపీ కార్యకర్తలే నాలుగో సారి కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారు. నా కార్యకర్తల కోసం మాట్లాడుతున్నా. బీజేపీనీ పండబెట్టారు. పార్టీ కోసం కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా లేరు. నేను రాజీనామా చేయను.. పీక్కొండి’’ అంటూ రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాకు పార్టీలో మర్యాద దక్కలేదు. కార్యకర్తల్లో పనిచేసేవారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ఢిల్లీ నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నా. ఎన్నికల్లో పార్టీ సపోర్ట్ చేయలేదు. కార్యకర్తలకు అనుకూలంగా నేను మాట్లాడతా. అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు 15 మందిని తీసుకువస్తే వాళ్లను దాచిపెట్టారు. వెనక ఉన్న వాళ్ళు బయటకు రండి. తెలంగాణలో ఈ కమిటీతో బీజేపీ అధికారంలోకి రాదు’’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థి ఫిక్స్?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. తాజాగా బీఆర్ఎస్ కార్యకర్త సమావేశంలో కేటీఆర్ సహా సునీత పాల్గొన్నారు.తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాగంటి గోపీనాథ్ సతీమణి.. మాగంటి సునీత పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ఆమె పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ ఇంచార్జ్లను నియమించింది. కార్యకర్తలకు కేటీఆర్.. దిశానిర్దేశం చేస్తున్నారు. -
‘సీఎం రేవంత్ నోరు విప్పితే గోబెల్ ప్రచారం’
హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి నోరు విప్పితే గోబెల్ ప్రచారమేనని, మొత్తం అబద్ధాలేనని మండిపడ్డారు. అసత్యాల ప్రచారంలో సీఎం రేవంత్ ఉన్నారని విమర్శించారు హరీష్. ఈ రోజు(మంగళవారం, సెప్టెంబర్ 9వ తేదీ) తెలంగాణ భవన్లో హరీష్ మాట్లాడారు. ‘ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మేమే కట్టం అంటున్నావు.. కత్తెర పట్టుకొని కేసీఆర్ కట్టినవి కట్ చేస్తున్నావ్.. పేర్లు మార్చుడు, కత్తెర పట్టుకొని కేసీఆర్ తిరగలేదు. ఎల్లంపల్లి కోసం 2వేల కోట్లు ఖర్చు పెట్టాము. రేవంత్ ప్రారంభోత్సవం చేసిన ఫ్లై ఓవర్లు, డ్యాములు కేసీఆర్ హాయంలోనివే. ఎల్లంపల్లి ద్వారా 20టిఎంసి హైదరాబాద్కు ఎలా తెస్తావ్?, సీఎం కుర్చీకి గౌరవం పోగొడుతున్నావ్. కాళేశ్వరం మోటర్లతోనే నీళ్లు ప్రాజెక్టులకు వస్తున్నాయి. కేసీఆర్ ముందుచూపుతో మల్లన్నసాగర్ నిర్మించారు. గండిపేట, హిమాయత్ సాగర్ కి వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లే. కాళేశ్వరం లో 12రిజర్వాయర్లు.. అందులో భాగమే మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తెస్తా అంటే నీళ్లు ఎక్కడివి..?, కాళేశ్వరం నీళ్లే మల్లన్న సాగర్కి వస్తాయి. కేసీఆర్ హయాంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ చేపడితే... రేవంత్ నియామక పత్రాలు ఇస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగం.. మల్లన్నసాగర్. కాళేశ్వరంను తిడుతావ్ అక్కడి నుండే నీళ్లు వచ్చేవి’ అని హరీష్ కౌంటర్ ఇచ్చారు. -
నేను లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం.. రేవంత్ సిద్ధమా? కేటీఆర్
హైదరాబాద్: తనపై పెట్టిన ఫార్మాలా ఈ-కార్ రేసు ఒక లొట్టపీస్ కేసని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు ఆనాడు ఈ-కార్ రేస్ నిర్వహించామన్నారు. లొట్టపీస్ కేసులో ఎటువంటి చార్జ్షీటైనా వేసుకోమనండి, అందులో అవినీతే జరగలేదన్నారు. ఈరోజు(మంగళవారం, పెప్టెంబర్ 9వ తేదీ) ఫార్మాలా ఈ-కార్ రేస్ చార్జ్షీటు దాఖలుపై కేటీఆర్ స్పందించారు. ‘ ఫార్ములా ఈ కార్ రేస్ లో అవినీతే జరగలేదు. ేను లైట్ డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధం , రేవంత్ రెడ్డి సిద్ధమా?, దమ్ముంటే రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ టెస్ట్ కు రావాలి. రేవంత్ వస్తారా.. ఏసీబీ డీజీ వస్తారా.. లై డిటెక్టర్ సిద్ధం. ూ. 45 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశించింది నేనే. ఎక్కడా కూడా రూపాయి తారుమారు కాలేదు. ప్రాసిక్యూషన్, చార్జిషీట్, జైలు.. ఏదైనా చేసుకోండి.. నేను సిద్ధం’ అని కేటీఆర్ సవాల్ చేశారు. కాగా, అంతకుముందు ప్రెస్మీట్లో మాట్లాడిన కేటీఆర్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ‘కొందరు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేదని దుస్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మీటింగ్లకు ఎందుకు రావడం లేదు?.కాంగ్రెస్ కండువా వేసుకుని సిగ్గులేకుండా బీఆర్ఎస్లో ఉన్నానంటున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటువేయాలి’అని డిమాండ్ చేశారు. -
ఇంతకీ ఆ ఎమ్మెల్యేది ఏ పార్టీ : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: కొందరు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేదని దుస్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మీటింగ్లకు ఎందుకు రావడం లేదు?.కాంగ్రెస్ కండువా వేసుకుని సిగ్గులేకుండా బీఆర్ఎస్లో ఉన్నానంటున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటువేయాలి’అని డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం చర్చాంశనీయంగా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో గత వారం తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. వీరి భేటీలో ఏం చర్చించారనే అంశం గురించి తెలియాల్సి ఉంది.‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్’ అంటే ఒప్పుకోం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.మూడు నెలల్లోగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్కు ఆదేశించింది. పదో షెడ్యూల్ ప్రకారం, స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదని పేర్కొంది. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. తద్వారా స్పీకర్ నిర్ణయం ఆలస్యం చేయడం సరికాదని స్పష్టం చేసింది. ‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్’ అనే పరిస్థితిని అంగీకరించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనర్హత పిటిషన్లను సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచడం సమంజసం కాదని పేర్కొంది.పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని సూచించింది.ఫిరాయింపులు ఎమ్మెల్యేలు వీళ్లేనా? 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్లో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్లు ఉన్నారు.వీరిలో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ఏ పార్టీలో ఉన్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. తాను ఇప్పటికీ గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని కృష్ణమోహన్రెడ్డి అంటుంటే.. కేటీఆర్ మాత్రం గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్నని చెప్పుకుని.. పార్టీ కార్యక్రమాలకు ఎందుకు గైర్హాజరవుతున్నారని ప్రశ్నిస్తున్నారు. -
ఆ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం: కేటీఆర్
గత పదేళ్లుగా బీజేపీకి బలంగా మద్దతు ఇచ్చిన రెండు పార్టీలు ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఇది రాబోయే రాజకీయ దిశకు సంకేతమా? అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఘాటుగా స్పందించారు. జైరాం జీ, మీ అహంకార భావం.. అధికారం మీద అధిక హక్కు ఉన్నట్టు భావించడం వల్లే కాంగ్రెస్ పార్టీ సమకాలీన రాజకీయాల్లో విఫలమైంది. ‘మీతో లేకపోతే వారితో’ అనే వాదన దేశం రెండు ధృవాలుగా ఉందన్నట్టుగా చూపించే అర్థహీనమైన వాదన. మేము కాంగ్రెస్కో, బీజేపీ బీ-టీమ్ కూడా కాదు. మేము తెలంగాణ ప్రజల ఏ-టీమ్.దయచేసి మీ వైఫల్యాలపై దృష్టి పెట్టండి, మమ్మల్ని వదిలేయండి అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన.ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్, ఒడిశా బీజేడీలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. ఈ వ్యవహారాన్నే ప్రస్తావిస్తూ జైరాం రమేష్.. ఓటింగ్కు దూరంగా ఉండే పార్టీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లే అని అన్నారు. అందుకే కేటీఆర్ ఇలా స్పందించారు. Two parties who have stood with the BJP staunchly over the past decade in Parliament have decided to abstain in the Vice Presidential election tomorrow. The shape of things to come?— Jairam Ramesh (@Jairam_Ramesh) September 8, 2025Jairam Ji, This sense of entitlement and arrogance is what made Congress fail in contemporary politics ‘Either you are with us or else you’re with them’ claim is a silly argument posturing as if the nation is bipolarWe are neither B-team of Congress or BJPWe are the A-team… https://t.co/xrIvSE7AeZ— KTR (@KTRBRS) September 9, 2025 -
అంచనాలు పెంచి ప్రజాధనం లూటీ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్కు గోదావరి జలాలను తరలించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో రూ.1,100 కోట్లతో అంచనాలను రూపొందించగా.. రేవంత్రెడ్డి ప్రభుత్వం దాన్ని రూ.7,390 కోట్లకు పెంచి ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీ రామారావు ఆరోపించారు. రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును రూ.లక్షన్నర కోట్లకు పెంచడాన్ని బీఆర్ఎస్ అడ్డుకుందని.. దీంతో రూటు మార్చిన రేవంత్రెడ్డి విడతల వారీగా జనం సొమ్మును దోచుకునేందుకే గోదావరి జలాల తరలింపు పనులు మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. న్యాయ పోరాటం చేస్తాం.. ‘సము‘ద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా రావల్కోల్ చెరువుకు, అక్కడి నుంచి 540 మీటర్ల ఎత్తున ఉన్న గండిపేటకు తరలించడం ద్వారా మూసీతో అనుసంధానం చేసే వీలుంది. అయినా 560 మీటర్ల ఎత్తులో ఉన్న మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించేలా ప్రతిపాదనలు మార్చి నీటి శుద్ధి కేంద్రాలు, పంప్ హౌస్లు ఎవరి లాభం కోసం కడుతున్నారో ప్రభుత్వం చెప్పాలి. కాంట్రాక్టర్లకు దోచిపెట్టి కమీషన్లు దండుకునేందుకే సీఎం ఈ పనులు చేపడుతున్నారా? హైదరాబాద్కు గోదా వరి జలాల తరలింపులో అవినీతిపై న్యాయ పోరాటం చేస్తాం..’అని కేటీఆర్ చెప్పారు. కుర్చీ కాపాడుకునేందుకే.. ‘కాళేశ్వరం ప్రాజెక్టును విఫల పథకంగా ప్రచారం చేసిన రేవంత్, కాంగ్రెస్ నేతలు ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీబీఐ విచారణకు ఆదేశించిన రేవంత్రెడ్డి.. అదే ప్రాజెక్టు ఆధారంగా నిర్మించిన మల్లన్నసాగర్, మూసీ నదుల అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అయితే కాళేశ్వరంపై చెప్పిన అబద్ధాలను కప్పి పుచ్చుకునేందుకు మల్లన్నసాగర్కు బదులుగా గండిపేట దగ్గర శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్టు చేసిన కాంట్రాక్టు కంపెనీకి. రేవంత్ తాను నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖలో అంతర్భాగమైన హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ బోర్డు నుంచి రూ.7 వేల కోట్ల విలువైన కాంట్రాక్టును ఇచ్చారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేల కోట్లు దోచుకుని ఢిల్లీకి మూటలు పంపి, వాటాలు పంచి తన సీఎం కురీ్చని కాపాడుకునేందుకే ఇదంతా చేస్తున్నారు..’అని మాజీమంత్రి ఆరోపించారు. యూరియా కొరతపై స్పందించని బీజేపీ, కాంగ్రెస్ ‘ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరూ మంచి అభ్యర్థులే. అయితే మేము రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉన్న యూరియా కొరతపై బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా స్పందించక పోవడంతో ఉప రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాం. నోటా ఉంటే దానికే వేసేవాళ్లం కానీ, ఆ అవకాశం లేనందున ఓటింగ్కు దూరంగా ఉంటున్నాం. కవిత విషయంలో అవసరమైన నిర్ణయం తీసుకున్నాం.. ఎమ్మెల్సీ కవిత విషయంలో పార్టీ వేదికపై, అంతర్గతంగా చర్చించి అవసరమైన నిర్ణయం తీసుకున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఓ టీవీ చర్చలో అంగీకరించి అప్రూవర్గా మారాడు. నేరాంగీకారం తర్వాత ఇంకా విచారణ ఎందుకు? వేటు వేయాల్సిందే. మహారాష్ట్ర పోలీసులు ఫ్యాక్టరీ కార్మీకులుగా అవతారం ఎత్తి తెలంగాణలో రూ.12 వేల కోట్లు విలువైన డ్రగ్స్ను పట్టుకుంటే తెలంగాణ పోలీసులు, ఇంటెలిజెన్స్, ఈగిల్, హైడ్రాలు ఏం చేస్తున్నాయి? డ్రగ్స్ వ్యవహారంలో సీఎం రేవంత్కు ముడుపులు ముట్టినందునే తెలంగాణ పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించారా?..’అని కేటీఆర్ ప్రశ్నించారు. మాజీ మంత్రులు జి.జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సు«దీర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమావేశంలో పాల్గొన్నారు. -
22 మందితో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గం కొలువుదీరింది. 22 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా ఆదేశాలకు అనుగుణంగా ఈ కమిటీలో పదాధికారులుగా 8 మంది ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది కార్యదర్శులు, ఒక కోశాధికారి, ఒక సంయుక్త కోశాధికారి, ఒక ప్రధాన అధికార ప్రతినిధిని నియమించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ⇒ ప్రధాన కార్యదర్శులుగా డా.ఎన్.గౌతమ్రావు, టి.వీరేందర్గౌడ్, వేముల అశోక్ ⇒ ఉపాధ్యక్షులుగా డా.బూర నర్సయ్యగౌడ్, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్, బండారి శాంతికుమార్, ఎం.జయశ్రీ,, కొల్లి మాధవి, మాజీమేయర్ బండా కార్తీకరెడ్డి, డా.జె.గోపి(కల్యాణ్నాయక్), రఘునాథరావు ⇒ కార్యదర్శులుగా డా.ఓ.శ్రీనివాస్రెడ్డి, కొప్పుబాషా, భరత్ ప్రసాద్, బండారు విజయలక్ష్మి స్రవంతిరెడ్డి, కరణం పరిణిత, బద్దం మహిపాల్రెడ్డి, డా.టి.రవికుమార్, కోశాధికారిగా దేవకి వాసుదేవ్ ⇒ సంయుక్త కోశాధికారిగా విజయ్ సురానా జైన్, ప్రధాన అధికార ప్రతినిధిగా ఎనీ్వ.సుభాష్ నియమితులయ్యారు. వివిధ మోర్చాలకు వీరే... మహిళామోర్చా అధ్యక్షురాలిగా డా.మేకల శిల్పారెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా గంథమళ్ల ఆనంద్గౌడ్ను మళ్లీ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ⇒ యువమోర్చా అధ్యక్షుడిగా గణేశ్ కుందే, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బి.లక్ష్మీనరసయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కాంతి కిరణ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా నేనావత్ రవినాయక్, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా సర్దార్ జగన్మోహన్సింగ్లను నియమించారు. రాంచందర్రావు టీమ్లో ఐదుగురే పాతవారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్.రాంచందర్రావు తన టీమ్ను ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా అన్ని సామాజికవర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించే ప్రయత్నం చేశారు. కొత్త కార్యవర్గంలో కేవలం ఐదుగురు పాతవారికే అవకాశం దక్కింది. వారిలో డా.కాసం వెంకటేశ్వర్లుయాదవ్, బండారి శాంతికుమార్, ఎం.జయశ్రీ,, కొల్లి మాధవి, టి.వీరేందర్గౌడ్ ఉన్నారు. అయితే అందరూ ఊహించిన విధంగా కాకుండా కొత్త వారికి ఆఫీస్ బేరర్ల లిస్ట్లో చోటు దొరికింది. గత రెండుమూడు కమిటీల్లో కొనసాగుతూ వచ్చిన చాలామందికి ఈసారి అవకాశం లభించలేదు. అయితే మొత్తానికి మొత్తం ముగ్గురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా కొత్తవారినే నియమించడంతో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, సమన్వయంపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రమంత్రులదే ముద్ర ? రాష్ట్ర పదాధికారుల ఎంపికలో కేంద్ర మంత్రులు జి,కిషన్రెడ్డి, బండిసంజయ్ కీలకపాత్ర పోషించారని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. తమ అనుయాయులకు పెద్దపీట వేసేలా వారు పైచేయి సాధించారనే చర్చ పార్టీలో అంతర్గతంగా సాగుతోంది. అయితే రాష్ట్ర కమిటీ కూర్పు విషయంలో ఆరుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీల సిఫార్సులు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. లోక్సభ నియోజకవర్గాల పరిధిలో బలపడేందుకు తమ అనుచరులకు రాష్ట్ర కమిటీతోపాటు జిల్లా కార్యవర్గాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలనే విజ్ఞప్తులను జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు పట్టించుకోలేదనే వారు వాపోతున్నారు. -
చుక్క నీరు తేలేదు! : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్లలో కృష్ణా, గోదావరి నదుల నుంచి చుక్క నీరు కూడా హైదరాబాద్కు తరలించలేదు. గత పాలకులు నగర ప్రజల దాహార్తిని పట్టించుకోలేదు. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారు. నెత్తి మీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవు..’ అని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. సోమవారం గోదావరి రెండు, మూడో దశ తాగునీటి సరఫరా, మూసీ నది పునరుజ్జీవం పథకాలకు గండిపేట వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. నిజాం దూరదృష్టి వల్లే నగరానికి తాగునీళ్లు ‘శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాద్కు తరలిస్తున్నాం. కానీ ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్ అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో అప్పటి సీఎం వైఎస్సార్ చొరవతోనే కృష్టా, గోదావరి జలాలు హైదరాబాద్కు వచ్చాయి. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మరోసారి గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడింది. వందేళ్లకు పైగా ఈ నగరానికి తాగు నీరు అందుతోందంటే ఆనాటి నిజాం సర్కార్ దూరదృష్టే కారణం. నగరానికి ప్రతి ఏటా 3 శాతం చొప్పున వలసలు పెరుగుతున్నాయి. జనాభా కోటిన్నర దాటడంతో అందుకు తగ్గట్టుగా భవిష్యత్తు ప్రణాళికలు అవసరం..’ అని సీఎం పేర్కొన్నారు. ‘తుమ్మిడిహెట్టి’పై మహారాష్ట్రను ఒప్పిస్తాం ‘గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల కట్టి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తాం. దివంగత వైఎస్సార్ తుమ్మిడిహెట్టి వద్దే దీనిని ప్రారంభించారు. అయితే గత బీఆర్ఎస్ పాలకులు కాసుల కక్కుర్తితో తలను తొలగించి చేవెళ్ల, తాండూరు, పరిగికి సాగునీరు అందకుండా చేశారు. త్వరలో ఈ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర సీఎంను కలిసి చర్చించి ఒప్పిస్తాం..’ అని రేవంత్ చెప్పారు. మూసీ ప్రక్షాళన చేసి తీరతాం.. ‘మూసీ మురికికూపంగా మారి విషం చిమ్ముతోంది. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లో నీరు తాగితే పశువులే కాదు, మనుషుల ప్రాణాలు సైతం పోతున్నాయి. పుట్టబోయే బిడ్డలు కూడా అంగవైకల్యంతో పుడుతున్నారు. నల్లగొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు ఎలాగైనా సరే మూసీని పునరుజ్జీవింపజేయాలని స్థానికులు కోరారు. వారికిచ్చిన మాట ప్రకారం మూసీ ప్రక్షాళన చేసి తీరతాం. గోదావరి జలాల తరలింపు ద్వారా జంట నగరాల తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా మూసీ కాలుష్యాన్ని నివారించడం ద్వారా ఆ సమస్య నుంచి నల్లగొండ జిల్లా ప్రజలకు విముక్తి కల్పిస్తాం. ఫ్యాక్టరీల కాలుష్యం మూసీలో కలవకుండా నియంత్రిస్తాం. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు నిర్వాసితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. హైదరాబాద్ను సుందర నగరంగా తీర్చిదిద్దుతాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు. డిసెంబర్ 9న విజన్ డాక్యుమెంట్ విడుదల ‘వందేళ్లకు సరిపడా ప్రణాళికతో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేసి తెలంగాణ సమాజానికి అంకితం ఇవ్వబోతున్నాం. గేట్ వే ఆఫ్ హైదరాబాద్ ప్రాజెక్టు కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. రాబోయే పదేళ్లలో హైదరాబాద్ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మహానగరాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలి. ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసిరావాలి..’ అని సీఎం పిలుపునిచ్చారు. నియో పొలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ప్రారంభం కోకాపేట వద్ద నియో పొలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ను సోమవారం సీఎం ప్రారంభించారు. అదేవిధంగా గండిపేట వద్ద హెదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 రిజర్వాయర్లను కూడా ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్టు ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. -
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీని తాజాగా ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు వెల్లడించారు. 22 మందితో కూడిన రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఏడు మోర్చాలకు రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించారు. మహిళా మోర్చా అధ్యక్షురాలిగా శిల్పారెడ్డి, యువ మోర్చా అధ్యక్షుడిగా గణేష్, బిసి మోర్చా అధ్యక్షుడిగా ఆనంద్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా లక్ష్మీ నర్సయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కాంతి కిరణ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా రవి నాయక్లను నియమించారు. అదే సమయంలో ఎనిమిది మంది వైస్ ప్రెసిడెంట్లు, ముగ్గురు జనరల్ సెక్రటరీలు, ఏడుగురు సెక్రటరీలు.ట్రెజరరి, జాయింట్ ట్రెజరరీ, చీఫ్ స్పొక్స్ పర్సన్స్ను నియమించారు. ప్రధాన కార్యదర్శలుగా వీరేందర్ గౌడ్, గౌతమ్ రావు, వేముల అశోక్లను నియమించారు. ఇక కార్యదర్శలుగా ఓ శ్రీనివాస్రెడ్డి, కొప్పు భాషా, బండారు విజయలక్ష్మి, స్రవంత్రెడ్డి, పరిణిత, బద్ధం మహిపాల్ను, ఉపాధ్యక్షులుగా బూరి నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, కొల్లి మాధవి, జయశ్రీ, కళ్యాణ్ నాయక్, రఘునాథరావు, బండ కార్తీకరెడ్డిలను ఎంపిక చేశారు. కోశాధికారిగా వాసుదేవ్ను నియమించారు. -
‘రండి.. మా పార్టీలో చేరండి’
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇతర పార్టీల నేతల్ని చేర్చుకునేందుకు పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయంటూ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తామన్న ఆమె.. త్వరలోనే నామినేటెడ్,కార్పొరేషన్ పోస్టులు భర్తీ చేస్తామని సూచించారు. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆమె పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చేసిన ప్రకటనల ఆధారంగా, ఇది కేవలం నేతలను చేర్చుకోవడమే కాకుండా, పార్టీలో అంతర్గత సమీకరణలను సమతుల్యం చేయడానికి కూడా ఒక వ్యూహంగా కనిపిస్తోంది. ఇందుకోసంపార్టీలోని నేతలను మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నవారు,ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చినవారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరినవారు ఇలా మూడు వర్గాలుగా విభజించారు.వాటి ఆధారంగా పదేళ్లుగా పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత, కేటగిరీల వారీగా నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతుంది. అంటే పార్టీలో ఉన్న కాలం, నిబద్ధత ఆధారంగా అవకాశాలు కల్పించనున్నారు. -
‘ఆ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా’
ఢిల్లీ: బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తుననానని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణకుమార్రెడ్డి స్పష్టం చేశారు. పోలీస్ అధికారిగా ఉండి, తన తోటి పోలీసు చేస్తున్న విధులను కించపరిచేలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. ‘గత ప్రభుత్వంలో డ్రగ్ కేసులు కాలేదు, విచ్చల విడిగా డ్రగ్స్ ఉపయోగించారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు బీఎస్పీ నేతగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడింది మర్చి పోయారా?, అప్పట్లో డ్రగ్స్ స్వేచ్చగా దొరుకుతున్నాయంటూ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఇపుడు పార్టీ మారాక బిఆర్ఎస్ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్ చేస్తున్నారు. సీఎంగా రేవంత్ బాధ్యత తీసుకున్నాక, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపారు. మీరు యదేచ్చగా వదిలి పెట్టిన వాళ్లపై కేసులు పెడుతున్నాం. తెలంగాణ ప్రజలను ప్రవీణ్ కుమార్ తప్పు దోవ పట్టిస్తున్నారు’ అని మండిపడ్డారు. -
కవిత ఎపిసోడ్పై కుండబద్ధలు కొట్టిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సోదరి, పార్టీ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తొలిసారి పెదవి విప్పారు. పార్టీలో చర్చించిన తర్వాతే తమ అధినేత ఆ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత తొలిసారి మీడియాతో మాట్లాడుతూ.. హరీష్రావు, సంతోష్ రావు టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ‘‘రామన్నా.. హరీష్, సంతోష్ మీతో ఉన్నట్టు కనిపించవచ్చు కానీ.. మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు .. వాళ్లను పక్కనపెడితేనే పార్టీ బతుకుతుంది.. నాన్న పేరు నిలబడుతుంది..’’ అంటూ కవిత పేర్కొన్నారు.తాజా రాజకీయ పరిణామాలపై సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో కవిత ఆరోపణలపై ప్రశ్న ఎదురైంది. కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చించిన తర్వాతనే అధినేత నిర్ణయం తీసుకున్నారని, ఇంక ఆమెపై స్పందించడానికి ఏం లేదు అని కేటీఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారాయన. తాజాగా కవిత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. తనను అక్రమంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. తానెప్పుడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. తనపైపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినప్పుడు.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనీసం ఫోన్ చేసి అడగాల్సిన బాధ్యత కూడా తీసుకోలేదు. 103 రోజులుగా కేటీఆర్ తనతో మాట్లాడలేదని అన్నారామె. అయితే తనకు నోటీసు ఇవ్వడంపై బాధ కలగడం లేదని.. ఈ వ్యవహారంపై ఎన్నడూ లేనిది తెలంగాణ భవన్లో మహిళా నేతలు స్పందించడమే తనకు కొంత ఊరట కలిగించిందని వ్యంగ్యంగా మాట్లాడారామె. -
అదే ‘కూలేశ్వరం’ నీళ్లను హైదరాబాద్కు తెస్తున్నారు.. రేవంత్పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శనాస్త్రాలు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కక్షగట్టారని, కమిషన్ పేరుతో టైంపాస్ చేశారని అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయకసాగర్. కాళేశ్వరం ద్వారా 240 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. అలాంటి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష గట్టారు. కాంగ్రెస్ కాళేశ్వరంపై ఎన్నికల ముందు నుండే అడ్డమైన ఆరోపణలు చేస్తోంది. సీబీఐ, ఈడీలు బీజేపీ జేబు సంస్థలంటూ రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. కానీ, ఆయన విమర్శించే సీబీఐకే రేవంత్ కాళేశ్వరం కేసు అప్పగించారు. ఇవాళేమో మూసీ పునరుజ్జీవం(జలాల అనుసంధానం) పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తోంది. మల్లన్న సాగర్ వద్ద కాకుండా తలాతోకా లేకుండా గండిపేట వద్ద శంకు స్థాపన చేస్తున్నారు. కాళేశ్వరం కూళేశ్వరం అయ్యింది అని తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ అదే ప్రాజెక్టు నీళ్లను హైదరాబాద్కు తెస్తున్నారు. అదే కాళేశ్వరం ద్వారా గంధమల్ల రిజర్వాయర్కి సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారు. కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూనే.. కాళేశ్వరంపై సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ తెస్తున్న నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టువి అవునో.. కాదా ఆయన సమాధానం చెప్పాలి..కాళేశ్వరం ప్రాజెక్టుకు 94 వేల కోట్ల రూపాయల ఖర్చు అయ్యింది. మరి లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎక్కడ జరిగింది?. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను బద్నాం చేస్తున్న వారు ముక్కు నేలకు రాయాలి. ఎల్లకాలం మోసం చేయలేమని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి అని కేటీఆర్ అన్నారు. అదే సమయంలో.. విడతల వారిగా భారీ అవినీతికి ప్రభుత్వం తెరతీసిందని ఆరోపించారాయన. మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన సంస్థనే కూలిన పిల్లర్లను నిర్మిస్తామని ముందుకు వస్తే.. ప్రభుత్వం అడ్డుకుంటోంది. కొండ పోచమ్మ ద్వారా రూ.1,100 కోట్లతో హైదరాబాద్కి నీళ్లు తేవోచ్చు. కానీ, ఈ రోజు రూ. 7,700 కోట్లకు వ్యయం.. అంటే 7 రెట్లు ఎలా పెరిగింది?. కేవలం కమిషన్ ల కోసమే వ్యయం పెంచారు. అవినీతే కాదు ఇందులో క్రిమినల్ కోణం కూడా ఉంది. సుంకిశాల రైటింగ్ వాల్ కూలిన సంస్థకే రూ.7,400 కోట్ల ప్రాజెక్ట్ ఎలా ఇస్తున్నారు?. వారిపైన చర్యలు తీసుకోక పోగా వారికే మళ్ళీ కాంట్రాక్ట్ లు ఎలా ఇస్తున్నారు?. ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఆరోపణలు చేసిన వారికి ఇప్పుడు బెస్ట్ ఇండియా కంపెనీ ఎలా అయ్యింది అని కేటీఆర్ ప్రశ్నించారు.ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్థ వైఖరి అవలంభిస్తోందని కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. ఫిరాయింపుల వ్యవహారంపై స్పందిస్తూ.. ప్రజాస్వామాన్ని ఈ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని అన్నారాయన. ‘‘బీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నాం అని టీపీసీసీ అధ్యక్షుడే ఒప్పుకున్నారు. అలాంటప్పుడు ఇంక విచారణ దేనికి?. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటు వేయాలి’’.. కేటీఆర్ డిమాండ్ చేశారు. -
ఉప రాష్ట్రపతి ఎన్నిక.. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం?
సాక్షి, హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఎన్డీయే, ఇండియా కూటమి.. రెండూ తెలంగాణకు ద్రోహం చేశాయని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్దంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నోటా ఆప్షన్ లేకపోవడంతో తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, బీఆర్ఎస్కు రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, దామోదర్ రావ్, పార్థ సారథి రెడ్డి ఎంపీలుగా కొనసాగుతున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ..‘ఉపరాష్ట్రపతి ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తుంది. మా అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మా కార్యకర్తలపై దాడులకు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది . అందులో భాగంగానే ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వం. కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెట్టే చర్యలకు పాల్పడుతోంది. యూరియా సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ ఓట్లు అక్కర్లేదని మాట్లాడిన తీరుకు వాళ్ళ అభ్యర్థికి మద్దతు ఇవ్వం. రెండు కూటముల అభ్యర్థులు సమర్థులైనప్పటికీ.. కూటములు చేసే చర్యల వల్ల ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పుకొచ్చారు. -
ఆ పార్టీ అద్భుతాలు రేవంత్కే తెలియాలి!
రాజకీయంగా అనూహ్యంగా ఉన్నత స్థానానికి చేరుకున్న వ్యక్తుల్లో ఒకరైన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించినా పాత వాసనలు మాత్రం పోగొట్టుకోలేక పోతున్నట్లు అనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన ఒక్కోసారి ఆత్మరక్షణలో పడిపోతున్నారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఏర్పడ్డ సంక్షోభంలో తన పాత్ర లేదని చెప్పే ప్రయత్నంలో ఆయన ఆ పార్టీ నేతలపై కొన్ని అభ్యంతరకరమైన పదాలు ప్రయోగించడం, తెలుగుదేశం పార్టీని పొగడటం ఇలాంటిదే. కొందరి కుట్రల వల్ల తెలంగాణలో తెలుగుదేశం ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది కానీ అదో అద్భుతమైన పార్టీ అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతవరకూ ఓకే. కానీ అందుకు ప్రకృతి ప్రతీకారం తీర్చుకుందని, అన్ని దుర్మార్గాలు చేసిన మీరు (బీఆర్ఎస్) మాత్రం ఎలా మనుగడ సాగిస్తారని ప్రశ్నించడంపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అంత గొప్ప పార్టీనే అయితే రేవంత్ ఎందుకు వదిలిపెట్టారు? దాన్ని వృద్ధిలోకి తీసుకురాకుండా కాంగ్రెస్లో చేరారు ఎందుకు? ఇదిలా ఉంటే.. ఆయా సందర్భాల్లో రేవంత్ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పనిగట్టుకుని ప్రశంసించడం కాంగ్రెస్ నేతలు చాలామందికి రుచించడం లేదు. సీఎం కాబట్టి పెద్దగా ప్రశ్నించడం లేదని అంటున్నారు. కాంగ్రెస్లో ఒకసారి విమర్శించడం మొదలైందంటే గోల, గోల అవుతుందన్న సంగతి రేవంత్కు తెలియనిది కాదు. తెలంగాణలో గత ఎన్నికల్లో టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్కు సహకరించిందన్నది వాస్తవం. కొంతమంది టీడీపీ జెండాలు పట్టుకుని ఏకంగా గాంధీభవన్కే వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో సత్సంబంధాలు ఉన్నాయని అంటారు. ఈ అంశం కూడా కలిసిరావడంతో రేవంత్ సీఎం కాగలిగారని చాలా మంది అభిప్రాయం. రేవంత్ టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ లో చేరడానికి ముందుగా చంద్రబాబు అనుమతి తీసుకున్నారన్నది బహిరంగ రహస్యమే. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మిగిలి ఉన్న టీడీపీ అభిమానుల మద్దతు పొందడానికి ఆయన ఇలా మాట్లాడారా? స్థానిక ఎన్నికలలో కాని, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాని వారి సహకారం పొందడానికి ఈ వ్యూహంలో వెళుతున్నారా ? అన్న సంశయం వస్తుంది. అయితే రేవంత్ వ్యాఖ్యలు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు చికాకు తెప్పిస్తాయి. కాంగ్రెస్ సీఎంగా ఉండి టీడీపీని పొగుడుతుంటే నష్టం కదా? అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చాక, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండే వారు. రహస్య సంబంధాలు పెట్టుకున్నా, బయటికి మాత్రం ఘాటుగా మాట్లాడేవారు. కానీ రేవంత్ ఆ పార్టీతో ఏ స్థాయిలో సంబంధాలు కొనసాగిస్తున్నారో తెలియదు కాని, ఇలా వేరే పార్టీని బహిరంగంగా పొగడడమేమిటని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. 1982లో ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం రాజకీయ పోరు కాంగ్రెస్, టీడీపీల మధ్యే సాగింది. రేవంత్ ఈ విషయాన్ని ఎలా విస్మరిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో చంద్రబాబు వ్యూహం కారణంగానే టీడీపీ కనుమరుగైంది కానీ నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ల వల్ల కాదని కొందరి విశ్లేషణ. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనో, ఇరుకున పెట్టాలనో చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలని ప్రయత్నించడం, దానికి రేవంత్ను వాడుకోవడం, పోలీసులు నిఘా పెట్టి పట్టుకుని కేసు పెట్టడం, రేవంత్ జైలుకు వెళ్లడం.. ఇదంతా చరిత్రే. ఆ తర్వాత కేసీఆర్తో రాజీలో భాగంగా చంద్రబాబు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదలుకుని ఏపీకి వెళ్లిపోయారు. పలితంగా ఆయనపై కేసు లేకుండా చేసుకోగలిగారు. ఇన్ని దుర్మార్గాలు చేసిన వారు ఎలా మనుగడ సాగించగలరని అనడం ద్వారా బీఆర్ఎస్కు ఇక భవిష్యత్తు లేదన్న అభిప్రాయం కలిగించారు. బిఆర్ఎస్ను చచ్చిన పాముతో పోల్చారు. ఒకసారి ఓడిపోతేనే ఏ పార్టీకైనా ఫ్యూచర్ లేకపోతే, కాంగ్రెస్ పదేళ్ల తర్వాత మళ్లీ ఎలా అధికారంలోకి వచ్చింది? కాంగ్రెస్ తెలంగాణలో 2014 నుంచి రెండుసార్లు ఓడిపోయింది. అయినా మూడోసారి విజయం సాధించింది. దేశంలోనే తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. 2014 నుంచి కేంద్రంలో అధికారానికి దూరమైంది. అంతమాత్రాన ఇక కాంగ్రెస్ దేశంలో ఉండదని చెప్పగలమా? 2024 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారం రాకపోయినా, ప్రతిపక్ష హోదా సాధించే స్థితిలో గెలవగలిగింది కదా? తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని కేసీఆర్ కూడా అనేవారు.అయినా ఇప్పుడు అధికారంలోకి ఎలా వచ్చింది? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన లక్ష్యమని చెప్పే రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీని, దాని అధినేత చంద్రబాబును పదే, పదే ప్రశంసించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏపాటి మేలు జరుగుతుందో కూడా చెప్పాలి. వ్యక్తిగతంగా ఆయనకు ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో తెలియదు. కొద్ది రోజుల క్రితం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సభలో మాట్లాడుతూ రెండు రూపాయలకు కిలో బియ్యం స్కీమ్ ఎన్టీఆర్దని అని చెప్పారు. అది టీడీపీ వారు చెప్పుకోవలసిన విషయం. నిజానికి ఎన్టీఆర్ ఈ స్కీమ్ ప్రతిపాదించి ప్రచారం ఆరంభించగానే, ఆనాటి కాంగ్రెస్ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి రూపాయి తొంభై పైసలకే పేదలకు బియ్యం అందించే పథకాన్ని అమలు చేశారు. కాంగ్రెస్ వారు ఆ విషయం చెప్పుకోకుండా టీడీపీ స్కీమ్ అని వ్యాఖ్యానించడం ఏ మాత్రం తెలివి అవుతుంది. అలాగే అంతకుముందు ఒక కార్యక్రమంలో హైటెక్ సిటీ నిర్మాణం ప్రస్తావన తెచ్చి చంద్రబాబు ను మెచ్చుకున్నారు. చంద్రబాబు ఒక భవనం నిర్మించిన మాట నిజమే. కాని అంతకు ముందే నేదురుమల్లి జనార్ధనరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాప్ట్ వేర్ టెక్నాలజీ పార్కు కు శంకుస్థాపన చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలే మర్చిపోతే ఏమి చేయాలన్న అసంతృప్తి పార్టీలో ఏర్పడుతోంది. చంద్రబాబు తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే వంటివి నిర్మించారు. రేవంత్ వైఎస్ ప్రస్తావనను తెస్తున్నప్పటికి, చంద్రబాబుకు ఇస్తున్న ప్రాధాన్యత మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి రేవంత్ రెడ్డి బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలో తొలుత పనిచేశారు. తదుపరి టీఆర్ఎస్లో క్రియాశీలం అయ్యారు. జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచారు. తదుపరి టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. లోక్సభ ఎన్నికలలో టీడీపీ పక్షాన 2014లో మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని ఆయన ప్రయత్నించారు. ఆ సమయంలో విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డికి టీడీపీ టిక్కెట్ లభించినప్పుడు పార్టీపై, నాయకత్వంపై రేవంత్ చేసిన విమర్శలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అద్భుతమైన పార్టీ అయితే సొంత అల్లుడు ఎన్టీఆర్ను ఎందుకు కూలదోశారో చెప్పాలి. కొన్నిసార్లు వామపక్షాలు, మరికొన్నిసార్లు బీజేపీ, ఇంకోసారి కాంగ్రెస్తో, మరోసారి టీఆర్ఎస్తో టీడీపీ ఎలా పొత్తుపెట్టుకున్నదో, అది ఏపాటి అద్భుతమో చెప్పాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని లేఖ ఇచ్చి, ఆ తర్వాత తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని దెయ్యంతో పోల్చిన టీడీపీ ఎలా అద్భుతమో రేవంత్కే తెలియాలి. బీఆర్ఎస్పై రాజకీయ విమర్శలు చేయడం తప్పుకాదు. కాని వ్యక్తిగతంగా నేతలను ఉద్దేశించి చెత్తగాళ్లు అని వ్యాఖ్యానించడం సీఎం హోదాకు తగదని చెప్పాలి. బీఆర్ఎస్లో తాను సంక్షోభం సృష్టించలేదని చెబుతున్నప్పటికీ రాజకీయ వర్గాలలో మాత్రం నమ్మకం కుదరడం లేదు. బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతుందని రేవంత్ భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఆ ప్రయత్నం చేయడం తప్పుకాదు. కాని రాజకీయాలలో ఒక పార్టీ మనుగడ సాగించడానికి, కాలగర్భంలో కలిసిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. బీఆర్ఎస్ స్వయంకృతాపరాధం కాంగ్రెస్కు ,రేవంత్ కు కలిసి వచ్చింది. తనకు వచ్చిన అవకాశాన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న దానిపై రేవంత్ దృష్టి పెడితే మంచిది. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కాంగి‘రేసు’ మల్లగుల్లాలు!
సాక్షి, హైదరబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక అభ్యర్థిత్వం ఖరారుపై మల్లగుల్లాలు పడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ఉపఎన్నిక కావడంతో సీరియస్గా తీసుకొని ప్రతి అడుగూ ఆచితూచి వేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందుగానే గెలుపు మార్గాలను సుగమం చేసుకునేందుకు ముగ్గురు మంత్రులు, 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లను రంగంలోకి దింపి అభివృద్ధి మంత్రం జపిస్తోంది. ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను గమనిస్తూ వారి ఊహలకు అందని విధంగా పావులు కదుపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదేస్థానంలో పోటీ చేసి ఓటమి పాలైన భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ అజారుద్దీన్న్ తిరిగి బరిలో నిలిచేందుకు ఆసక్తి కనబర్చారు. అయితే మైనారిటీ అభ్యరి్థని బరిలోకి దింపితే హిందూత్వ ఎజెండాతో బీజేపీ బలపడే ప్రమాదం ఉందని భావించి టికెట్ రేసు నుంచి ఆయనను తప్పించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసింది.మైనారిటీయేతర అభ్యర్థిని బరిలో నిలిపేందుకు సిద్ధమైంది. ఇటీవల హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ‘స్థానిక’అభ్యరి్థత్వాన్ని పరిశీలిస్తామని ప్రకటించి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. అయితే తాజాగా పారీ్టలో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు, కొత్త, పాత కేడర్ మధ్య ఆధిపత్య పోరు, అమాత్యుల ముందే అమీతుమీలకు దిగడం వంటి వ్యవహారాలు గుదిబండగా తయారయ్యాయి. టికెట్ రేసులో ఉన్న స్థానిక ఆశావహులు కూడా కేవలం మంత్రుల పర్యటన కార్యక్రమాలకే పరిమితమై ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించినట్లు కనిపిస్తోంది. దీంతో అభ్యర్థిత్వం ఎంపిక విషయంలో స్థానికత అంశంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. బీసీ అభ్యర్థిత్వం వైపు మొగ్గు కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. తాజాగా అసెంబ్లీలో తీసుకున్న బీసీ రిజర్వేషన్ పెంపు నిర్ణయం పార్టీకి కలిసి వచ్చి ఉపఎన్నికల్లో లబ్ధి చేకూర్చే విధంగా బీసీ అభ్యరి్థత్వాన్ని పరిశీలిస్తోంది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో విజయబావుట ఎగరవేయడమే లక్ష్యంగా గెలుపుగుర్రం అన్వేషణలో పడింది. ఒకవైపు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ఏకరవు పెడుతూ అన్నివర్గాల ప్రజలను మెప్పించేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు బలమైన బీసీ అభ్యర్థిని బరిలో దింపేందుకు కసరత్తు చేస్తోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువనేత నవీన్ యాదవ్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎంపీ అంజన్కుమార్ యా దవ్, విద్యావేత్త భవానీశంకర్ తదితరులు ఆసక్తి కనబర్చుతున్నారు. వారి ఆరి్థక బలాబలాలు, రాజకీయ, కుటుంబ నేపథ్యం, ప్రజల్లో వారిపై గల పలుకుబడి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యరి్థత్వాన్ని పరిశీలిస్తోంది. అందరికీ అమోదయోగ్యంగా.. అందరికీ ఆమోదయోగ్యమైన, బలమైన అభ్యర్థి పేరును పరిశీలించేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. నియోజకవర్గంలో గెలుపు, ఓటములకు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, విద్యావంతులు, నివసించే పలు కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు కీలకమే. ఈ ప్రాంతాల ఓటర్లు సైతం ఆమోదించే అభ్యరి్థని రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ అధిష్టానం ఈ ప్రాంతాల్లో పలువురి అభ్యరి్థత్వాలపై సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆశల పల్లకిలో... అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన నవయువ నిర్మాణ సంస్థ వ్యవస్థాపక చైర్మన్, యువనేత నవీన్ యాదవ్ టికెట్ తనకే దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. అగ్రనేతల నుంచి గ్రీన్ సిగ్నల్ ఉన్నట్లు ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో రెండుసార్లు పోటీ చేసిన అనుభవం, స్థానిక పరిచయాలు కలిసి వస్తాయని ఆయన భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం బీసీ అభ్యర్థత్వాన్ని పరిశీలిస్తుండటంతో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. ఐదేళ్లపాటు మేయర్గా సమర్థవంతంగా అందించిన సేవలు, నియోజకవర్గంలోని అన్ని వర్గాలతో ఉన్న పరిచయాలు తన అభ్యరి్థత్వం పరిశీలనకు బలం చేకూర్చవచ్చని ఆయన భావిస్తున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ టికెట్పై ఆశలు పెట్టుకొని నియోజకవర్గంలో సుడిగాలిలా పర్యటిస్తున్నారు. రెండు పర్యాయాలు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి ప్రాతినిథ్యం వహించిన నేపథ్యంలో అసెంబ్లీ సెగ్మెంట్లోని పరిచయాలు, పదేళ్లపాటు డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అభ్యరి్థత్వం పరిశీలనకు కలిసి రావచ్చని ఆయన ఆశలు పెట్టుకున్నారు. దివంగత నేత పీజేఆర్ శిష్యుడు, విద్యావేత్త భవానీశంకర్ కాంగ్రెస్ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. దశాబ్దాల కాలంగా పారీ్టకి అంకితభావంతో సేవలందిస్తున్నందున స్థానికులకు టికెట్ ఇవ్వదల్చుకుంటే తన పేరు పరిశీలించవచ్చని భావిస్తున్నారు. స్థానికంగా ప్రజల్లో పట్టు, కేబుల్ నెట్వర్క్, విద్యాసంస్థల కారణంగా పరిచయాలు మరింత కలిసి వచ్చే అంశాలుగా ఆయన భావిస్తున్నారు. -
అవసరమైతే ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధం: రాజ్గోపాల్రెడ్డి హాట్ కామెంట్స్
తెలంగాణలో రాజకీయాలు హాట్హాట్గా ఉన్నాయి. సొంత పార్టీలోనే నిరసన గళం వినిపిస్తోంది. తమ పార్టీలోని సొంత నాయకులపైనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సందర్భాలు మరింత వివాదంగా మారుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్లో కవిత చేసిన కామెంట్స్తో ఆ పార్టీకి చెందిన నేతలు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక కాంగ్రెస్లో మునుగోడు ఎమ్మెలయే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎపిసోడ్. పార్టీలో ఆందోళన కల్గిస్తోంది. తనకు మంత్రి పదవి ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారని, ఇప్పటివరకూ తనకు మంత్రి పదవి ఇవ్వలేదనేది నిన్న మొన్నటి వరకూ రాజ్గోపాల్రెడ్డి నుంచి వచ్చిన మాట. ఇప్పుడు అదే రాజ్గోపాల్రెడ్డి పదవి కోసం ఎంత కాలమైనా ఎదురుచూస్తానంటున్నారు. కాకపోతే మునుగోడు ప్రజల కోసం ప్రభుత్వంపై పోరాటానికైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. దీనిలో భాగంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ‘ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోను. అవసరమైతే ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధం. మునుగోడు కోసం ఎంత త్యాగమైనా చేస్తా. ట్రిపుల్ ఆర్ నిర్వాసితులకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చారు. ఆలస్యమైనా ఫర్వాలేదు.. ఎదురుచూస్తా’ అని పేర్కొన్నారు. ఒకవైపు మునుగోడు ప్రజల కోసం ప్రభుత్వం పోరాటం చేస్తానని, అదే సమయంలో తన మంత్రి పదవి కోసం ఎదురుచూస్తానంటూ సంయమనంతో మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పెద్దల్ని ఆలోచనలో పడేయడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మునుగోడు ప్రజల కోసం ఎంతటి త్యాగమైనా చేస్తానని, అవసరమై ప్రభుత్వంపై పోరాడటానికి సిద్ధమనే వ్యాఖ్యలు మరోసారి హీట్ పుట్టించేవిగా ఉన్నాయని, రాజ్గోపాల్రెడ్డి తన వ్యూహాన్ని మార్చుకున్నారనే దానికి ఈ వ్యాఖ్యలే నిదర్శమనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం. -
‘కామారెడ్డి సభ జనసంద్రం అవుతుంది.. అది కేంద్రం చూస్తుంది’
కామారెడ్డి జిల్లా : ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీ సభను విజయవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. రెండు లక్షల మందితో బీసీ సభను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను కామారెడ్డిలో నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఆ సభకు పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యలను టీపీసీసీ ఆహ్వానించనుంది. దీనిలో భాగంగా ఈరోజు(ఆదివారం, సెప్టెంబర్ 7వ తేదీ) కామారెడ్డిలో ముఖ్య నాయకులతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, శ్రీహరి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. దీనిలో భాగంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిందన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ కామారెడ్డిలో భారీ వర్షం పడి చాలా నష్టం జరిగింది. దేశంలోని ఏ వర్గం వారు ఎంత ఉంటే అంత శాతం ఫలాలు పొందాలి. అదే నినాదంతో సీఎం రేవంత్రెడ్డి పనిచేస్తున్నారు. అందుకే అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అన్ని వర్గాల వారు మద్దతు తెలుపుతున్నారు. బండి సంజయ్, కిషన్రెడ్డిల భరతం పట్టడానికి కామారెడ్డిలో బీసీ సభను పెడుతున్నాం. బండి సంజయ్ లేచిన మొదలు ఆలయాలు చుట్టూ తిరుగుతూ ఓట్లు అడుక్కుంటున్నారు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీసీ బిల్లును సాధించుకుంటాం. 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధించుకుంటాం. బండి సంజయ్ ఒక దేశ్ముఖ్ల వ్యవహరిస్తున్నారు. బండి సంజయ్ సెక్యూరిటీ లేకుండా తిరుగు.. నేను సెక్యూరిటీ లేకుండా తిరిగేందుకు సిద్ధంగా ఉన్నా. ఈనెల 15న జరిగే సభ ద్వారా బీజేపీ దొంగ ఆట కట్టిస్తాం. అరవింద్ ఒక్కసారి అయినా బీసీల గురించి మాట్లాడలేదు. బండి సంజయ్.. బీసీ బిల్లును మోదీ కాళలు పట్టుకుని ఆమోదింపజేసే సత్తా ఉందా?, మోదీ టెక్నికల్గా బీసీ.. కానీ బీసీలపై ప్రేమ లేదు. ఈనెల 15వ తేదీన కామారెడ్డి సభ జనసంద్రం అవుతుంది.. అది కేంద్రం చూస్తుంది. బీసీ జీవితాలను మలుపు తిప్పే సభ కామారెడ్డిలో జరగబోతుంది’ అని పేర్కొన్నారు. -
కవిత ఆరోపణలపై స్పందించిన హరీష్రావు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని, అందులో దాపరికాలు ఏం లేవని అన్నారాయన.విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన ఆయనకు శంషాబాద్ ఎయిర్పోర్టులో మీడియా నుంచి ఈ వ్యవహారంపై ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది. గత కొంతకాలంగా మా పార్టీ పైన, నా పైన కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ఆ వ్యాఖ్యలనే కవిత ప్రస్తావించారు. వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగుతున్నా. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు’’ అని అన్నారాయన.ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు. మరొకవైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ హయాంలో ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకోవడం మా కర్తవ్యం. ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంత ఉంటుంది. మేం ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళు కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళు, సో, మా సమయాన్ని అంత కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటాం. ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం అని హరీష్రావు అన్నారు.ఇదిలా ఉంటే.. హరీష్ రావు, సంతోష్ రావుల వల్లే తాను పార్టీ నుంచి సస్పెండ్ అయ్యానని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ క్రమంలో హరీష్రావుకు బంగారు తెలంగాణపై చిత్తశుద్ధి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారామె. హరీష్రావు మొదటి నుంచి పార్టీలో ఏం లేరని, బీఆర్ఎస్పై ఎప్పటి నుంచో హరీష్రావు కుట్రలు చేస్తున్నారని, కాంగ్రెస్..బీజేపీలతో టచ్లో ఉంటూ కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చి పార్టీని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని, స్వలబ్ధి కోసమే తనను బయటకు పంపించేశారని ఆరోపించారామె. ఆరడుగుల బుల్లెట్టుగా బీఆర్ఎస్ అభివర్ణిస్తున్న హరీష్రావు తనకు గాయం చేశారని పేర్కొంటూ.. ఈ క్రమంలో హరీషన్నతో జాగ్రత్త అంటూ కేసీఆర్, కేటీఆర్లకు సూచిస్తూ పార్టీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారామె. -
రాజ్గోపాల్రెడ్డి విషయంలో కొంత కన్ఫ్యూజన్: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో బ్రేకులే కాదు సడెన్ బ్రేకులు కూడా ఉంటాయని అంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కాళేశ్వరం సీబీఐ విచారణ, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై ఆయన శుక్రవారం మీడియా చిట్చాట్లో మాట్లాడారు. సీబీఐతో కాకుండా రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే బద్నాం చేసేవారు. సీబీఐ కంటే మరో మార్గం కనిపించడం లేదు. ఆ దర్యాప్తు సంస్థలోనూ అనేక లొసుగులు ఉన్నాయి. కానీ కాళేశ్వరం విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాం అని అన్నారాయాన. అదే సమయంలో రాజ్గోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యవహారంపైనా స్పందించారు. ‘‘ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం కోమటిరెడ్డి బ్రదర్స్ కి అలవాటు. కానీ, రాజ్గోపాల్రెడ్డి విషయంలో కొంత కొంత కన్ఫ్యూజన్ ఉంది’’ అని అన్నారు. నాగేందర్ రిజైన్ చేసి పోటీ చేస్తానని చెప్తున్నారు. నాగేందర్ సభ్యత్వం పోతుందని అనుకోవడం లేదు. మంత్రి పదవి ఇస్తామంటే వద్దని చెప్పాను. నాకు కులమంటే అభిమానమే కానీ కుల పిచ్చి లేదు. బీసీలు కొన్ని రోజులు కులాన్ని పక్కన పెట్టాలి. వచ్చే ఎన్నికల్లోనూ రేవంత్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని మహేష్గౌడ్ అన్నారు. -
కేసీఆరే సుప్రీం.. తుది నిర్ణయం పార్టీదే: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో మాజీ సీఎం కేసీఆరే సుప్రీం అని స్పష్టం చేశారు. ఎవరి విషయంలోనైనా తుది నిర్ణయం పార్టీదే అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం లండన్లో ఉన్నారు. తన కూతురి అడ్మిషన్ కోసం ఆయన లండన్ వెళ్లారు. ఈ సందర్భంగా లండన్లో బీఆర్ఎస్ NRI నేతల మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘బీఆర్ఎస్లో మాజీ సీఎం కేసీఆరే సుప్రీం లీడర్. కలిసి పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ మాకు నేర్పించారు. ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపైనా హరీశ్ రావు విమర్శలు చేశారు.మరోవైపు.. ఈ క్రమంలోనే అక్కడ మీడియా ఆయనను కవిత ఇష్యూపై ప్రశ్నించింది. కానీ, ఆయన సమాధానం చెప్పలేదు. ఇండియా వెళ్లిన తరువాతనే మాట్లాడతానని చెప్పినట్టు తెలిసింది. రేపు ఆయన ఇండియాకు రాబోతున్నట్టు సమాచారం. అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తే ఏం మాట్లాడుతారు అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
ప్చ్.. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు!
శత్రువులు ఎక్కడో ఉండరు.. ఇంట్లో మనచుట్టూనే తిరుగుతూంటారని ఈ మధ్య వచ్చిన ఒక సినిమా డైలాగుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు ఈ మాట ఇప్పుడు అనుభవంలోకి వచ్చి ఉంటుందని అనిపిస్తోంది. కేసీఆర్ కుమార్తె కవిత అంత పని చేశారు మరి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి, సీబీఐ విచారణ ప్రయత్నాలతోనే కేసీఆర్ సతమతమవుతున్న తరుణంలో ఉరుము లేని పిడుగు మాదిరి కవిత విరుచుకుపడ్డారు. నేరుగా ఏమీ అనకపోయినా, ఆమె వ్యాఖ్యలన్నిటికి కేసీఆర్ బాధ్యుడవుతారన్నది బహిరంగ రహస్యం. కవిత వైఖరి కొన్ని నెలలుగా పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. సోదరుడు పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ను విమర్శించడమే కాకుండా.. అధినేత కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ దనుమాడిన సంగతి ప్రజలందరికీ తెలుసు. వీటన్నింటినీ ఓపికగా సహించిన కేసీఆర్ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు ఆయుధాన్నిచ్చేలా వ్యవహరించడంతో సహించలేకపోయారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత కూడా పార్టీకి రాజీనామా చేసి ఒక రకంగా తండ్రితో బంధాలు తెంచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్రావులతోపాటు ప్రముఖ కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డిలపై కూడా కవిత ఆరోపణలు చేశారు. హరీశ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నారని, వీరిద్దరూ ఢిల్లీ నుంచి విమానంలో కలిసి వచ్చారని, ఆ సందర్భంలో రాజకీయాలు మాట్లాడుకున్నారని ఆమె అంటున్నారు. బీఆర్ఎస్లో కాని,ఆయా రాజకీయ వర్గాలలో కాని, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ సలహా, సంప్రదింపులతోనే కవిత తన సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. దానిని పూర్వపక్షం చేయడానికి ఆమె ప్రయత్నించినట్లు కనిపించినా, ఎవరూ పెద్దగా నమ్మకపోవచ్చు. తన తండ్రిపై సీబీఐ విచారణ పడిన తర్వాత పార్టీ ఉంటే ఎంత?, పోతే ఎంత అని ప్రశ్నించడం ద్వారా ఆమె తన మనసులో మాట చెప్పారన్న భావన కలుగుతుంది. కేసీఆర్పై అవినీతి మరక పడిందని కవిత కూడా చెప్పడం సహజంగానే బీఆర్ఎస్లో కలకలం రేపుతుంది.పైకి హరీశ్, సంతోష్ల గురించి ప్రస్తావించినా, వారు కేసీఆర్ను దెబ్బతీస్తారని అంటున్నా, ఆమె చేసే ప్రతి వ్యాఖ్య కేసీఆర్కు తగులుతుంది. కాకపోతే ఆమె నేరుగా ఈ మాట చెప్పకపోవచ్చు. ఈ మధ్య కాలంలో పార్టీకి దూరమైన కవిత ఇప్పుడు ఆ పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత అని ప్రశ్నించారు. దానికి తగిన విధంగా సస్పెన్షన్ తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. పార్టీపై, తండ్రిపై గౌరవం ఉంటే అలా మాట్లాడగలిగేవారా?. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం వివాదంపై మాజీ మంత్రి, కేసీఆర్ అల్లుడు హరీశ్రావు సమర్థంగా వాదించారన్న ఆనందం ఎంతో సేపు లేకుండా చేశారు కవిత తన వ్యాఖ్యలతో!. పోనీ ఆమె అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడారని అనుకున్నా, ఆమె పై కొంతకాలం క్రితం వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ అభియోగాలు, కొద్ది నెలలపాటు జైలులో ఉన్న పరిస్థితి కూడా సహజంగానే చర్చకు వస్తాయి. కాళేశ్వరం దెబ్బతినడంతోపాటు, కవిత లిక్కర్ స్కామ్లో అరెస్టు అవడం కూడా బీఆర్ఎస్ను ఎన్నికలలో దెబ్బతీసిందన్నది చాలామంది భావన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పాత్ర ఉందని ఏ బీఆర్ఎస్ నేత అయినా బహిరంగంగా అంటే ఒప్పుకుంటారా? కవిత చేసిన వ్యాఖ్యల గందరగోళాన్ని తగ్గించుకోవడానికి గాను ఆమెపై చర్య తీసుకోక తప్పని స్థితి ఏర్పడిందన్నది పార్టీలో ఉన్న అభిప్రాయం. అలా చేయలేకపోతే హరీశ్ సంతోష్ వంటివారికి అసంతృప్తి కలగవచ్చు. ఇప్పటికే కవిత దూరమైన నేపథ్యంలో వీరిని వదలుకునే పరిస్థితి ఉండదు. ఆమె తిరుగుబాటుకు పార్టీలో పెద్దగా అనుకూలత వచ్చినట్లు అనిపించదు. హరీశ్రావుకు పార్టీ అంతా అండగా ఉన్నట్లు తేలింది. వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ఒక వ్యాఖ్య చేస్తూ హరీశ్ను ఆరడగుల బుల్లెట్ అని, మాస్టర్ క్లాస్ అని అసెంబ్లీలో మాట్లాడిన తీరును ప్రశంసించారు. ఇవన్ని కవితకు బీఆర్ఎస్ ఇచ్చిన సమాధానాలే అవుతాయి. కవిత తొలుత తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా, ఆ తర్వాత కాలంలో తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి తన వంతు పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. కాని ఆ గెలుపును ఆమె నిలబెట్టుకోలేకపోయారు. నిజామాబాద్ లో మరోసారి పోటీచేసి ఓటమి పాలయ్యారు.అయినా కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. వ్యవహార శైలిపై కొంతమందిలో అసంతృప్తి ఉన్నప్పటికి, ఎవరూ పైకి మాట్లాడేవారు కారు. ఇప్పుడు వారు కూడా హరీశ్రావు పార్టీకి మూల స్తంభాలలో ఒకరని బదులు ఇస్తున్నారు. కొద్దికాలం క్రితం కవిత పై విమర్శలు చేయడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నాందీ కూడా పలికారు. కవిత సొంతంగా పార్టీ పెట్టుకుంటారా? లేక కాంగ్రెస్లో చేరతారా? అన్న చర్చకు ఆమె అవకాశం ఇస్తున్నారు. తనను అరెస్టు చేయించింది బీజేపీనే అన్న భావనలో ఉన్నందున ఆ పార్టీ వైపు వెళతారా అన్నది అప్పుడే చెప్పలేం. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సంక్షోభం వెనుక తమకు ఎలాంటి పాత్ర లేదని, అది అవినీతి సొమ్ము పంచాయతీ అని సమాధానం ఇచ్చారు. కవిత తనకు తెలిసిన అవినీతి సమాచారం అంతటిని సీబీఐకి ఇవ్వాలని బీజేపీ ఎంపీలు అరవింద్, రఘునందన్ వంటివారు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్లో గొడవలు ఆ రెండు పార్టీలకు సహజంగానే సంతోషం కలిగిస్తాయి. కవిత ఒకరకంగా తండ్రినే బ్లాక్ మెయిల్ చేసినట్లు కనిపిస్తోంది. పైకి ఆయనను గొప్పవాడుగా ప్రొజెక్టు చేసినట్లు అనిపించినా.. మొత్తం ఆయనను దృష్టిలో ఉంచుకుని చేశారన్న భావన కలుగుతుంది. రేవంత్ ను ఉద్దేశించి కొంత అనుచిత వ్యాఖ్య చేసినట్లు కనిపించినా, కవిత తీరు వల్ల కాంగ్రెస్ కు రాజకీయంగా లబ్ది చేకూరే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన చేస్తూ కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం అవినీతి రుజువైందని వ్యాఖ్యానించారు.అందులో మామ వాటా ఎంతో అల్లుడి వాటా ఎంతో తేలాలి అని కూడా ఆయన అన్నారు. తనను కాంగ్రెస్, బీజేపీ, రేవంత్, బండి సంజయ్ నడిపిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఖబడ్దార్ అని కవిత హెచ్చరించారు. తాను ఎవరో చెబితే ఆడే తోలుబొమ్మను కాదని, తనది కేసీఆర్ రక్తమని కవిత పేర్కొనడం బాగానే ఉన్నా, ఏ లక్ష్యంతో ఆమె ఈ వివాదాన్ని సృష్టించారన్న దానిపై ఎవరికి వారు ఊహించుకుంటారు. చర్చించుకుంటారు. గతంలో ఆమె కేసీఆర్కు ఒక లేఖ రాసి పార్టీలో అసమ్మతికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు పార్టీకి దూరం అయ్యారు. కవిత భవిష్యత్తు రాజకీయం అంత తేలికగా ఉండదు. ఒక పెద్ద పార్టీ నీడలో, అది కూడా సొంత పార్టీలో, తండ్రి చెంత ఉండడం వేరు. సొంతంగా పార్టీని పెట్టుకున్నా, మరో పార్టీలో చేరినా, అది ముళ్లబాటే అవుతుంది. వాటన్నిటిని దాటుకుని కవిత తన రాజకీయ లక్ష్యాన్ని చేరుకుంటే అది గొప్ప విషయమే అవుతుంది. కాని చరిత్రలో అలా సఫలం అయిన ఘట్టాలు చాలా తక్కువే అని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘నేను అందుకే బీఆర్ఎస్ నుంచి బయటకి వచ్చా’
హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు బయటకి వచ్చింది కేసీఆర్, కేటీఆర్ వల్లేనని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు. కవిత చెప్పినట్లు హరీష్రావు వల్ల ఎవరూ పార్లీని వీడలేదని, కేవలం కేసీఆర్, కేటీఆర్ల వల్లే పార్టీనే వీడారన్నారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 4వ తేదీ) సాక్షి టీవీతో మాట్లాడిన కొండా విశ్వేశ్వర్రెడ్డి.. ‘కేసీఆర్, కేటీఆర్ అహంకారం, అవినీతి వల్లే నేను బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చాను. కంట్రోల్ మొత్తం కేసీఆర్, కేటీఆర్ చేతిలోనే ఉంది. కవిత ఏమైనా సుద్ధపుసనా.. ఆమె అవినీతి చేయలేదా?, కాళేశ్వరం అవినీతి మొత్తం కేసీఆర్దే. హరీష్ కూడా కేవలం సంతకాలు చేయడానికే పరిమితం. రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ ఒక్కటే సీబీఐకి ఇచ్చారు. కాళేశ్వరం మొత్తం సీబీఐకి ఇవ్వాలి . కవితను బీజేపీ వైపు కూడా చూడనివ్వం. తమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్ట్ కడతానని రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నా. ప్రాణహిత జలాలు చేవెళ్ల వరకు తేవడం తెలివి తక్కువతనమే. ఎకరాకు రెండు లక్షలకు పైగా ఖర్చు చేసి చేవెళ్ల కు నీళ్ళిచ్చే బదులు... చేవెళ్ల రైతులకు ఎకరాకు 20 వేల రూపాయల రైతుబంధు ఇవ్వాలి’ అని అన్నారు.