breaking news
-
మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
సాక్షి, ఏలూరు: ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ మంత్రి ఆళ్ల నాని(57) గుండెపోటుతో మంగళవారం విశాఖ నివాసంలో కన్నుమూశారు. ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన.. వైఎస్సార్సీపీ హయాంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఏలూరు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నేత ఆళ్ల నాని(ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్). కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరి 2019లో మళ్లీ ఏలూరు నుంచి విజయం సాధించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. కోవిడ్ సమయంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన పాత్ర కూడా చర్చనీయాంశమైంది. ఏలూరు రాజకీయాల్లో ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. ఆయన మృతి పట్ల పలువురు వైఎస్సార్సీపీ నేతలు, పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
కూటమి నేతలకు షాక్ !
గుంటూరు: కొరిటెపాడు ట్యాంక్బండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సింగంశెట్టి కోటేశ్వరరావు భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన కన్నసాని బాజీపై సింగంశెట్టి కోటేశ్వరరావు 446 ఓట్లతో విజయభేరి మోగించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొరిటెపాడులోని కొరిటెపాడు ట్యాంక్బండ్ వాకర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. 2,700 వాకర్స్ ఓట్లకుగాను, 2,222 మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సింగంశెట్టి కోటేశ్వరరావు ప్యానెల్లో ఉపా«ధ్యక్షుడిగా ఏరువ ఇన్నారెడ్డి, తలతోటి సురేంద్ర, కార్యదర్శిగా చాగంటి విష్ణువర్థన్రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు, జాలీ వాకర్గా పి.శ్రీనివాస చక్రవర్తి, కోశాధికారిగా ఎల్.సత్యనారాయణ, ఈసీ సభ్యులుగా ఎస్.రామకృష్ణరెడ్డి (జిమ్), కె.శ్రీనివాస రావు (ట్రాక్–1), ఎన్.నరసింహారావు, (ట్రాక్–2), వై.శ్రీనివాసరావు (కల్చరల్) గెలవగా, గార్డెనింగ్ యేళ్ల రత్తయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో సింగంశెట్టి కోటేశ్వరరావుకి 1,307 ఓట్లు రాగా, కన్నసాని బాజికి 861 ఓట్లు పోలయ్యాయి.ఫలించని కుతంత్రాలు.. సమీప ప్యానెల్ అభ్యర్థులను ఓడించేందుకు కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. బాజీ గెలుపు కోరుతూ ఎమ్మెల్సీ ఆలపాటి, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, నగర మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, జనసేన గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు బొనబోయిన శ్రీనివాస్లు ఓటు వేసినప్పటికీ కూటమి కుతంత్ర రాజకీయాలను వాకర్స్ తిప్పికొట్టారు. రెండేళ్ల వరకు ట్రాక్వైపు చూడకుండా బుద్ధిచెప్పినట్లయిందని చెప్పుకొంటున్నారు. ఇదీ చదవండి: కుదేలైన ‘పొదుపు’! -
ఏడాదైనా చైర్మన్ లేరు.. బాబ్జీ సంచలన నిర్ణయం
విజయవాడ: నగరాల కార్పొరేషన్కు వెంటనే నూతన చైర్మన్ను నియమించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన బాబ్జీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నగరాల కార్పొరేషన్ గత చైర్మన్ మరణించి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు కొత్త చైర్మన్ను నియమించకపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాబ్జీ దీక్షను విరమింపజేసి ఆయన ప్రాణాలను కాపాడాలని కోరారు.నగరాల కులాన్ని బీసీ జాబితాలో చేర్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని వెల్లంపల్లి పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా నగరాల కార్పొరేషన్ను ఏర్పాటు చేశామని తెలిపారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విజయవాడ మేయర్గా రాయన భాగ్యలక్ష్మిని, దుర్గగుడి చైర్మన్గా పైలా సోమినాయుడిని నియమించడం ద్వారా నగరాల సామాజిక వర్గం ఆత్మగౌరవాన్ని పెంచామని చెప్పారు.నగరాల కార్పొరేషన్కు చైర్మన్ను నియమించే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లంపల్లి స్పష్టం చేశారు. బాబ్జీ ఆమరణ నిరాహార దీక్షపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు వాటర్ మెన్ కాదు.. క్వార్టర్ మెన్’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు వాటర్ మెన్ కాదు.. క్వార్టర్ మెన్.. మంచి నీరు ఇవ్వలేదు.. మందు మాత్రం ఇస్తున్నారంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఇవాళ (ఆదివారం) విశాఖ నగర వైఎస్సార్సీపీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, వరుదు కళ్యాణి, మాజీ మేయర్ హరి వెంకట కుమారి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించారు.ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. మూడు రోజులకు ఒకసారి మంచి నీరు ఇస్తున్నారు.. వేలాది బోర్లు ఎండిపోతున్నాయి. మంచి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత.. పోతే ఎంత? ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలంలో మంచి నీటి పరిస్థితి ఏమిటి? మంచి నీటి సమస్యను పరిష్కరించడంలో చంద్రబాబు విఫలమయ్యారు’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు నైజం యూజ్ అండ్ త్రో పాలసీ: కన్నబాబుకురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వెన్నుపోటు పార్టీ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ‘‘చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ అయితే వైఎస్సార్సీపీది వెన్ను చూపని పార్టీ. యాదవ సామాజిక వర్గానికి సాధారణ మహిళను జీవీఎంసీ మేయర్గా వైఎస్ జగన్ చేశారు.. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను చంద్రబాబు మేయర్ పీఠం నుంచి దించేశారు. చంద్రబాబు నైజం యూజ్ అండ్ త్రో పాలసీ...రుషి కొండపై భవనం కడితే తప్పుడు ప్రచారం చేశారు. కూటమి పాలనలో విశాఖ నగరంలో కొండలను పిండి చేస్తున్నారు. రూపాయికి చాక్లెట్ కూడా రాదు. కానీ ఎకరా భూమి 99 పైసలకు ఇచ్చేస్తున్నారు. మూడు రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చేవాడు వాటర్ మ్యాన్ నా? చంద్రబాబు చేసిన మోసాన్ని గడప గడపకు తీసుకువెళ్లాలి. పెన్షన్లు తీసుకొనే వారిని చంద్రబాబు తాగు బోతులుగా చిత్రీకరిస్తున్నారు. పేకాట ఆడే వారికి డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారు’’అని కన్నబాబు దుయ్యబట్టారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు: వరుదు కల్యాణివైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘‘అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం కోసం రూ.2 లక్షల 40 వేల కోట్లు ఖర్చు చేయాలి. మూడేళ్లలో కేవలం 32 వేల కోట్ల ఖర్చు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక సైనికుడులా పని చేయాలి. కూటమికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని ఆమె పేర్కొన్నారు.విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. స్థానిక సమస్యలు మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను ప్రజలకు వివరించాలి. చెప్పిన హామీలు కంటే ఎక్కువగా వైఎస్ జగన్ అమలు చేశారు. విశాఖకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. యాదవులకు విశాఖ మేయర్ పదవి వైఎస్ జగన్ ఇచ్చారు. జీవీఎంసీలో కీలకమైన పదవులు బడుగు బలహీన వర్గాలు వారికి ఇచ్చారు’’ అని ఆయన వివరించారు.ఇదీ చదవండి: ఏడు దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబూ? -
అందుకే కలెక్టర్లను చంద్రబాబు బెదిరిస్తున్నారు: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్ లెవల్కు చేరిందని.. అందుకే కలెక్టర్లను కూడా బెదిరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా ఐఏఎస్ సునీతను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని.. స్కిల్ కేసులో సునీత నిజాలు మాట్లాడారన్న కోపంతో చంద్రబాబు ఉన్నారన్నారు.‘‘చంద్రబాబు ఒత్తిడి చేయటం వలనే తాను సంతకాలు చేసినట్టు సునీత చెప్పారు. అందుకే తాను స్కిల్ కేసులో ఇరుక్కున్నానని చంద్రబాబు అనుమానిస్తున్నారు. అందుకే ప్రతిసారీ సునీతను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఒక దళిత ఐఏఎస్ అధికారిణిపై చంద్రబాబు నోరు పారేసుకోవటం సరికాదు. ఆమె తన బాధను మిగతా అధికారులతో చెప్పుకుంది. స్పోర్ట్స్ కోటాలో నారా లోకేష్ తన మనుషులకు అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ఆధారాలన్నీ బయట పడినా.. చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ టీజేఆర్ నిలదీశారు.‘‘డీఎస్సీ అక్రమాలను అధికారుల మీదకు నెట్టేశారు. అందుకే చంద్రబాబు మాటలు నమ్మి సంతకాలు చేయవద్దని పదేపదే చెప్పాం. మా పార్టీ అధికారంలోకి వచ్చాక లోకేష్ జైలుకు వెళ్లటం ఖాయం. నీట్ పేపర్ లీక్తో కేంద్రమంత్రి రాజీనామా చేశారు. మరి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయలేదు?. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో అధికారులు బాధ్యులు కావద్దు. ఐఏఎస్ అధికారిని సునీత లాగా స్ట్రాంగ్గా నిలబడాలి...ఎల్నినో ఎఫెక్ట్తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు పడవని ముందే ప్రపంచమంతా తెలుసు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేయటం సబబు కాదు. చంద్రబాబు చెప్పిన పెట్టుబడులు, ఉద్యోగాల లెక్కలన్నీ పచ్చి అబద్దాలు. రాష్ట్ర ప్రజలను దగా చేశారు. పెన్షనర్లను తాగుబోతులనటం దుర్మార్గం. వృద్దులు, వికలాంగులను తాగుబోతులు అంటూ అవహేళన చేయటం తగదు. ఆ మాటలను చంద్రబాబు వెంటనే వెనక్కు తీసుకోవాలి’’ టీజేఆర్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ఈ ఆటలేంటి చంద్రబాబూ?: వైఎస్ జగన్ ఫైర్ -
కుటుంబాలను విడదీసే చరిత్ర చంద్రబాబుది: అమర్నాథ్
సాక్షి, విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు కుటుంబాలను విడదీసే చరిత్ర ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని ఎవరూ టచ్ చేయలేరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, బొత్స సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వ విద్యాలయం అని ప్రశంసించారు.విజయనగరం జిల్లాలో నేడు వైఎస్సార్సీపీ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘విజయనగరం జిల్లా కార్యకర్తలు బొత్స 2.O కోసం ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నాయకులను నమ్మి పార్టీ పెట్టలేదు. వైఎస్సార్ అభిమానులను, ప్రజలను నమ్మి పార్టీ పెట్టారు. చంద్రబాబుకి కుటుంబాలను విడదీసే చరిత్ర ఉంది. అన్ని కుటుంబాల్లో ఇది జరగొచ్చు.కానీ బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని టచ్ చేయలేరు. లోకేష్ చుట్టూ ఐఏఎస్ అధికారులు తిరుగుతున్నారని, చంద్రబాబు అనుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు గాడిద కూడా గుర్రంలా కనిపిస్తుంది. ఇప్పుడు లోకేష్ చుట్టూ తిరిగిన అధికారులు, రేపు గాడిద చుట్టూ తిరిగాం అని అనుకునే రోజు వస్తుంది. బొత్స సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వ విద్యాలయం. ఎంతో మందిని సర్పంచ్ల నుంచి ఎమ్మెల్యేలను చేసిన చరిత్ర ఆయనది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, అమర్నాథ్.. చిన్న శ్రీను అంశం మాట్లాడుతుండగా బొత్స మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఇదీ చదవండి: ఆయన మనకెందుకు.. టీడీపీలో కొత్త చర్చ -
ఈ ఆటలేంటి చంద్రబాబూ?: వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, తాడేపల్లి: ఏపీ మెగా డీఎస్సీ స్కామ్పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మరోసారి స్పందించారు. వెరిఫికేషన్ పేరుతో అసలేం సాధించారంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏడు దశలు పెట్టినా.. ఒక్కో కేసులో ఒక్కో అంశం బయటపడుతోందన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుతో చంద్రబాబు సర్కార్ ఆటలాడుతోందంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.“వెరిఫికేషన్? నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్!” అంటూ జగన్ ట్వీట్ చేశారు. ముందుగా విజేతల జాబితాను పరిశీలిస్తే.. అందులో సంబంధిత అభ్యర్థుల పేర్లు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత ఖోఖో అధికారులను సంప్రదిస్తే.. సర్టిఫికెట్ నకిలీదని తేలిందని ఆరోపించారు. అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీని సంప్రదిస్తే.. అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలిందని జగన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను న్యాయమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియగా ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻? 𝗡𝗼, 𝗡𝗼 : 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻!Teacher aspirants’ careers have become a joke for you, @ncbn Garu ?𝗖𝗮𝘀𝗲 𝟭: Check the winners’ list: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗻𝗮𝗺𝗲𝘀 𝗮𝗿𝗲𝗻’𝘁 𝘁𝗵𝗲𝗿𝗲.𝗖𝗮𝘀𝗲 𝟮: Check with Kho-Kho… pic.twitter.com/NShMVPrVmh— YS Jagan Mohan Reddy (@ysjagan) September 12, 2026కేసు–1: మెరిట్ లిస్టులో పేర్లు పరిశీలిస్తే.. అసలు పేర్లే కనిపించ లేదు. కేసు–2: ఖో-ఖో అధికారులను సంప్రదిస్తే ఆ సర్టిఫికెట్ నకిలీదని చెబుతున్నారు. కేసు–3: నాగార్జున యూనివర్సిటీలో ఆరా తీస్తే అసలు ఆ స్పోర్ట్స్ ఈవెంటే జరగలేదని తేలింది. మరి 7 దశల్లో వెరిఫికేషన్ చేశామన్న ప్రభుత్వం.. ఆ తనిఖీలు ఎక్కడ చేశారు?, ఏం తనిఖీ చేశారు? అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా నిర్వహించామని ఎలా చెప్పగలరు? అని అన్నారు. ఈ లోపాలే డీఎస్సీ అక్రమాలకు అవకాశం కల్పించలేదా? దీనికి నైతిక బాధ్యతను మీరు తీసుకోరా?” అంటూ చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రశ్నించారు. #MegaDSCScam హ్యాష్ట్యాగ్తో ఆయన ఈ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: ఆ జీవోల మాయ ఏంటో అసలు! -
చంద్రబాబు వెన్నుపోటు నాయకుడు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు వెన్నుపోటు నాయకుడు అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కొడాలి నాని దుయ్యబట్టారు. 16 ఏళ్ల బాబు పాలనలో ఒక్కసారే స్థానిక ఎన్నికలు పెట్టాడు. ఎన్నికలకు వైఎస్ జగన్ భయపడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. భయమంటే ఏంటో తెలియని నాయకుడు జగన్. చంద్రబాబు, లోకేష్ల అవినీతికి అంతులేకుండా పోయింది. డీఎస్సీ పేరుతో ఉద్యోగాలను అమ్మేశారు. కొంతమంది దొంగల కోసం స్పోర్ట్స్ జీవోలను మార్చారు’’ అని కొడాలి నాని మండిపడ్డారు.‘‘వైఎస్ జగన్ను చర్చకు రమ్మనడానికి లోకేష్కు ఉన్నస్థాయి ఏంటి?. పేర్ని నాని చర్చకు వస్తానంటేనే లోకేష్ పారిపోయాడు. తండ్రి పేరు నిలబెట్టేందుకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి వైఎస్ జగన్. ప్రజలకు ఇచ్చిన మాటకోసం మడమతిప్పని నేత వైఎస్ జగన్. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి వైఎస్ జగన్. అధికారమే పరమావధిగా బతికే వ్యక్తి చంద్రబాబు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల్లో పెద్ద లిస్ట్ పట్టుకొచ్చాడు. చంద్రబాబు లాగా అబద్ధపు హామీలతో ఎన్నికలకు వెళ్లనని ధైర్యంగా చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబు ఒక్క వాగ్ధానమైనా నెరవేర్చాడా?. మోసంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు’’ అని కొడాలి నాని ధ్వజమెత్తారు.‘‘వెన్నుపోటు సామ్రాట్ను, వెన్నుపోటు పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి. పేర్ని నాని, ఆయన భార్య పై కేసులు పెట్టి వేధించారు. ఎన్ని కేసులు పెట్టినా పేర్ని నాని వెనక్కి తగ్గలేదు. వైఎస్ వెంట నిలిచి ఆయన గొంతును నిరంతరం వినిపిస్తున్నారు. వల్లభనేని వంశీని ఉద్ధేశపూర్వకంగా కేసులతో ఇబ్బంది పెట్టారు. వంశీకి హైదరాబాద్లో కోట్ల విలువైన ఆస్తులున్నాయ్. పేదల పట్టాలను అమ్ముకున్నాడని వంశీ పై దొంగ కేసులు పెట్టారు. భోగాపురం ఎయిర్ పోర్టు రాకతో ప్రజల కళ్లల్లో ఆనందం చూశానని సొల్లు కబుర్లు చెబుతున్నాడు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ ఎలా ఉంటుందో కూడా చంద్రబాబుకు తెలియదు. నీళ్ల కోసం కొండను ఎలా తవ్వుతారని విమర్శించింది చంద్రబాబే. చంద్రబాబు చేలో మేస్తే.. లోకేష్ గట్టుమీద మేస్తాడా?’’ అంటూ కొడాలి నాని నిలదీశారు. -
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రామచంద్రపురం జనసేన విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ‘‘జనసేన గెలిచిన చోట టీడీపీ వాళ్లను గౌరవించినా.. టీడీపీ గెలిచిన చోట జనసేన కార్యకర్తలను తొక్కుతున్నారు. ఈ విషయం మన నాయకుడు పవన్ కళ్యాణ్కు కూడా తెలుసు’’ అంటూ బొలిశెట్టి వ్యాఖ్యానించారు.బొలిశెట్టి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వాస్తవాన్నే నేను చెప్తా.. ఎవరికీ భయపడనంటూ బొలిశెట్టి తేల్చి చెప్పారు. బొలిశెట్టి కామెంట్స్పై టిడిపి వర్గాలు మండిపడుతున్నాయి. -
బూత్ల వారీగా సమగ్ర వివరాలు ఇవ్వండి: వైఎస్సార్సీపీ
తాడేపల్లి: రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)కి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి లేఖ రాశారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగించకుండా చూడాలని, అదే సమయంలో దొంగ ఓట్లను ఏరివేయాలని ఆ లేఖలో స్పష్టంగా కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో చోటుచేసుకున్న మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలను బూత్ స్థాయిలో బహిర్గతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశాఆరు. ఈ లేఖ ప్రతిని భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్కు కూడా పంపించారు.డౌన్ లోడ్ లింకులతో సరిపెట్టకుండా...ఎస్ఐఆర్లో భాగంగా కొత్తగా ఓటర్లను చేర్చడం, తొలగించడం, ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం, మరణించిన వారి ఓట్ల తొలగింపు, ఇతర సవరణలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నియోజకవర్గాల వారీగా, బూత్ల వారీగా సమగ్రంగా అందించాలని లేఖలో కోరారు. కేవలం డౌన్లోడ్ లింకులు ఇవ్వకుండా అధికారికంగా సమగ్ర వివరాలను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. మ్యాప్ కాని ఓటర్లు, ఇతర కేటగిరీల కింద జారీ చేసిన నోటీసులపై కూడా పూర్తి వివరాలను వెల్లడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఎన్ని నోటీసులు జారీ చేశారు, ఎన్ని కేసులు పరిష్కరించారు, ఎన్ని ఓటర్లను తొలగించారు, ఇంకా ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో బూత్, నియోజకవర్గాల వారీగా వెల్లడించాలని పేర్కొంది. దీనివల్ల బూత్ స్థాయి ఏజెంట్లు సంబంధిత ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని అనుమానిత ఓటర్లతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్ల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిందని లేఖలో అప్పిరెడ్డి పేర్కొన్నారు. వాటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, చట్ట ప్రకారం డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.కుటుంబ సభ్యులందరి ఓట్లూ ఒకే బూత్లో ఉండాలిపోలింగ్ కేంద్రాల పునర్విభజనలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు బూత్లకు, కొన్ని సందర్భాల్లో వేర్వేరు వార్డులకు కేటాయించబడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఒకే ఇంటి చిరునామాలో నివసించే కుటుంబ సభ్యులను సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉంచాలని కోరారు. ఓటర్లను ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి మార్చినప్పుడు అనుసరించిన ప్రమాణాలను కూడా స్పష్టంగా వెల్లడించాలని కోరింది. భౌగోళిక ప్రాంతం, ఇంటి నంబర్, ఓటరు వరుస సంఖ్య లేదా ఇతర ఏ ప్రమాణం ఆధారంగా ఓటర్లను బదిలీ చేశారో స్పష్టం చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల సంఖ్యలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నందున, ఎస్ఐఆర్ అనంతరం వచ్చిన తాజా ఓటర్ల డేటా ఆధారంగా పోలింగ్ కేంద్రాల పునర్విభజనను మరోసారి సమీక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.బూత్ మ్యాపింగ్ను పార్టీలకు అందించాలికొత్తగా ఏర్పాటు చేసిన లేదా పునర్విభజించిన పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పూర్తి బూత్ మ్యాపింగ్ను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రతి బూత్కు అనుసంధానించిన ప్రాంతాలు, బూత్ స్థాయి అధికారుల వివరాలు, పాత బూత్ల నుంచి కొత్త బూత్లకు ఓటర్ల బదిలీల వివరాలను అందులో పొందుపరచాలని కోరారు. అలాగే, కొత్తగా ఏర్పాటు చేసిన లేదా పునర్విభజించిన పోలింగ్ కేంద్రాలకు నియమించిన బూత్ స్థాయి అధికారుల పేర్లు, సంప్రదించాల్సిన నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ బూత్ స్థాయిలో పారదర్శకంగా జరగాలని, అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగించబడకుండా చూడాలని లేళ్ల అప్పిరెడ్డి కోరారు.ఇదీ చదవండి:‘అమరావతిలో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం’ -
‘టైమ్, డేట్ చెప్పమన్న లోకేష్ ఎక్కడున్నాడు?’
సాక్షి, కృష్ణా జిల్లా: ‘టైమ్, డేట్ చెప్పమన్న లోకేష్ ఎక్కడున్నాడు?. తప్పులు చేసి అధికారుల మీద నెట్టేస్తున్నారు. జీవో ఇచ్చింది ఎవరు? అధికారులకు ఏంటి సంబంధం?. తండ్రి కొడుకుల వేషాలు చూడలేకపోతున్నామంటూ కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఇవాళ మచిలీపట్నంలో జరిగిన వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు, పెడన వైఎస్సార్సీపీ ఇంఛార్జి ఉప్పాల రాము, పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి, జడ్పీచైర్ పర్సన్ ఉప్పాల హారిక, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబును నమ్మొద్దని.. ఎవరినైనా లోబరచుకుంటాడన్నారు. దొంగ తెలివితేటలున్న వ్యక్తి చంద్రబాబు. పార్టీ పెట్టిన ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. అక్టోబర్ 2 నుంచి ఏ క్షణమైనా మున్సిపాల్టీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి చంద్రబాబు మేయర్ల ప్రత్యక్ష ఎన్నికలు పెట్టడం లేదు. చంద్రబాబుకు కూటమి చీలిపోతుందనే భయం పట్టుకుంది. అందుకే పంచాయతీల కంటే ముందు మున్సిపాల్టీలకు ఎన్నికలు పెడుతున్నాడు. పోలీసులను అడ్డంపెట్టుకుని మున్సిపాల్టీలను గెలవాలనుకుంటున్నాడు’’ అని పేర్ని నాని మండిపడ్డారు. -
‘అందుబాటులో ఉంటా.. ఎప్పుడైనా ఫోన్ చేయండి’
విజయనగరం: కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 11వ తేదీ) విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో బొత్స సమావేశమయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా కార్యకర్తలకు బొత్స దిశా నిర్దేశం చేశారు. ‘ప్రభుత్వ వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలి. చట్ట వ్యతిరేకమైన పోస్టులకు, అబద్ధపు ప్రచారాలకు దూరంగా ఉండాలి.ఇక మీదట ప్రతి కార్యకర్త నేరుగా జిల్లా పార్టీ కార్యాలయంలో అనుసంధానం కావాలి. నేను ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటాను.. ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చు’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి:పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్తత -
‘కూన రవి వందల నకిలీ సర్టిఫికెట్లు అమ్ముకున్నారు’
శ్రీకాకుళం: ఏపీలో జరిగిన డీఎస్సీ అక్రమాలు తవ్వే కొద్దీ ఒక్కొక్కటిగా బయటకొస్తూనే ఉన్నాయని ఆముదాలవలస వైఎస్సార్సీపీ సమన్వకర్త చింతాడ రవి విమర్శించారు. సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చేసిన అక్రమాలే ఎన్నో ఉన్నాయన్నారు. తమ జిల్లాలోనే కూన రవికుమార్ వందల నకిలీ సర్టిఫికెట్లను అమ్ముకుని కోట్ల రూపాయలను సంపాదించడన్నారు. ఒకవేళ కూన రవి కుమార్ తాను ఏ తప్పూ చేయలేదని నిరూపించుకోవాలంటే తమతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. తాము అడిగే ప్రశ్నలకు కూన రవికుమార్ సమాధానం చెప్పాలని చింతాడ రవి సవాల్ విసిరారు. డీఎస్సీలో ఈ వెన్నుపోటు పార్టీ చేసిన అక్రమాలు తవ్వే కొద్దే బయటకు వస్తూనే ఉన్నాయన్నారు. పరీక్షలు పెట్టకుండా ఉద్యోగం ఇవ్వడమనేది దేశంలోనే ఇప్పటివరకూ ఎక్కడా జరగలేదని, కానీ ఏపీలో మాత్రం అందుకు అతీతంగా ఉందని విమర్శించారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయి కాబట్టే సీబీఐ విచారణ అంటే ప్రభుత్వం పారిపోతుందని మండిపడ్డారు. ఇదీ చదవండి:అమరావతిలో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం: వడ్డే -
క్రెడిట్ వెనుక కాంట్రవర్సీ.. లోకేష్కు అగ్నిపరీక్ష!
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు తన అనుభవ రాహిత్యం ఏమిటో ఇప్పటికైనా తెలిసి ఉండాలి. గాజు ఇంటిలో కూర్చుని ఎదుటివాళ్లపై రాళ్లు వేస్తే ఏమవుతుందో అర్దం అయి ఉండాలి. తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి బుకాయింపులు, అసత్యాలు వల్లె వేయడం వంటివి నేర్చుకున్నారు కాని, ఆయన మాదిరి ఎదుటివారిపై నెట్టివేయడం అలవాటైనట్లు లేదు. అందువల్లే ఇప్పుడు లోకేష్ సవాళ్ల పర్వం నుంచి పనిచేసేవారికే రాళ్ల దెబ్బలు అంటూ సెంటిమెంట్ ప్రయోగించే యత్నం చేశారు. లేదంటే కోర్టుకు వెళ్లండని అంటున్నారు. కొందరు అభ్యర్దులు కోర్టులకు కూడా వెళ్లారు. కానీ అవి ఎప్పటికి విచారణకు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు.ఏపీలో టీచర్ల ఎంపికలో ఎన్ని గందరగోళాలు జరిగాయో రోజురోజుకు తేటతెల్లమవుతున్నప్పటికీ, చర్చకు సవాల్ అంటూ లోకేష్ డాంబికంగా మాట్లాడి దెబ్బతిన్నారు. పదిసార్లు తాను చర్చకు సవాల్ విసిరినా మాజీ సీఎం జగన్ సిద్దం కాలేదని ఒక అసత్యపు ప్రచారం చేయడం ద్వారా ఈ స్కామ్ నుంచి బయటపడవచ్చని తొలుత అనుకున్నట్లున్నారు. కానీ నిజం నిప్పులాంటిది అంటారు. అది ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంటుంది. అలాగే క్రీడల కోటాలో నకిలీ సర్టిఫికెట్తో, పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందినవారి బాగోతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అక్కడితో ఆగకుండా ఇతర కేటగిరీలలో కూడా కొన్ని అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ కుల ధృవీకరణ పత్రాలు సమర్పించి టీచర్ ఉద్యోగాలు పొందినవారూ ఉన్నారు. తొలుత ఎస్ఈఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ మొదటి ర్యాంకు సాధించడం, ఆ తర్వాత అతనిని బ్లాక్ లిస్టులో పెట్టడం ద్వారా అక్కడ పరీక్ష పత్రం లీక్ అయిందన్న అనుమానంతో మొదలైన ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ, తిరుగు లేని ఆధారాలతో స్కామ్ బయటపడిందన్న విషయం బోదపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాని, ఆయన పార్టీ నేతలు వీటికి సంబంధించి అనేక ప్రశ్నలు వేస్తున్నా వాటికి జవాబు ఇవ్వడంలో మంత్రి లోకేష్, టీడీపీ నేతలు విఫలం అయ్యారు. సవాళ్లు చేస్తూ టీడీపీ కేడర్లో ఒక నమ్మకం కలిగించడానికి లోకేష్ ప్రయత్నించారు. ఆయనను రక్షించడానికి చంద్రబాబు కృషి చేశారు. అందులో భాగంగానే లోకేష్ గురుపూజోత్యవం నాడు మాట్లాడుతూ పనిచేసే వాళ్లకే రాళ్ల దెబ్బలు అని అన్నారు. ఇక్కడ సమస్య ఏమిటి?.డీఎస్సీ పెట్టింనందుకు కాదు.. అక్రమాలు జరిగినందుకు.. ఆ విషయాన్ని కప్పిపుచ్చాలనుకుంటే ఎలా కుదురుతుంది?. సమాజంలో గౌరవంగా, నిజాయితీగా ఎలా బతకాలో నేర్పించింది తన తండ్రి చంద్రబాబు అని ఆయన అన్నారు. చంద్రబాబు సంగతి ఎలా ఉన్నా, యువకుడిగా ఉన్న లోకేష్ అసత్యాలు చెప్పడం మాని, అహంకారంతో ప్రవర్తించడం మాని, హుందాగా రాజకీయాలు చేస్తే ఆయనకే పేరు వస్తుంది. చంద్రబాబు రాజకీయ జీవితం గురించి నిత్యం అంతా మాట్లాడుకునేదే. జగన్కు డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియదని అనడం ద్వారా ఏదో ఆత్మ సంతృప్తి చెంది ఉండవచ్చు కానీ, ఆయన విసిరిన సవాల్ గురించి లోకేష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?. డీఎస్సీ అన్న పదం రెండుసార్లు వాడినందుకే తప్పుపడుతున్న లోకేష్ తెలుగులో ఎన్ని తప్పులు మాట్లాడతారో మర్చిపోతే ఎలా?. అదే జగన్ తన టైమ్ లో జరిగిన ఏపీపీఎస్సీపై చేస్తున్న అభియోగాలు, కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరారే!. తాను పదిసార్లు సవాల్ చేసినా చర్చకు రాలేదని, అసందర్భ వ్యాఖ్యలు చేస్తే ఏం ప్రయోజనం?. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి.చంద్రబాబు నాయుడు తాను ప్రభుత్వపరంగా ఏ తప్పు చేసినా, తెలివిగా అధికారుల మీద తోసేసి తప్పించుకుంటారు. ఉదాహరణకు ఈ మధ్య ఆయా సభలలో అధికారులను నిలబెట్టి వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే యత్నం చేశారు. రోడ్లు బాగోలేదు కదా అని ప్రజలను ప్రశ్నించి అధికారులను నిందిస్తే ఏం లాభం. నిధులు ఇవ్వకుండా తమపై రుద్దడం ఏమిటా అని అధికారులు నెత్తి కొట్టుకుంటున్నారు. ఏదైనా స్కామ్ జరిగితే, అందులో తనకు ఇబ్బంది వస్తుందనుకుంటే వ్యూహాత్మకంగా సంబంధిత అధికారులపై చర్య తీసుకుంటామని డ్రామా నడిపిస్తారు. ఎవరో కొందరిని ఆ సమయానికి బలి చేసి కథ ముగిస్తారు. ఉదాహరణకు గాదె సాయికృష్ణ అనే నిందితుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలు పెట్టడం వల్ల మరణించిన ఘటనను కేవలం అక్కడి సీఐ, ఆ దిగువ ఉండే కానిస్టేబుళ్ల వద్దే ఆపేశారు తప్ప, పై అధికారుల దాకా వెళ్లకుండా సిట్ పేరుతో కధ నడిపించేశారు. ఎందుకంటే అది పై దాక వెళితే తనకు కూడా తలనొప్పి అవుతుందని తెలుసు కాబట్టి అన్నమాట.రాజమండ్రి పుష్కరాలలో పబ్లిసిటీ కారణంగా తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారన్న అభియోగాలు వచ్చాయి. ఆ ఘటనలో తను చిక్కుకోకుండా ఎలా తప్పించుకున్నారో అందరికీ తెలుసు. పైగా రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలలో చనిపోవడం లేదా? అని ఎదురుదాడి చేశారు. తిరుమలలో 20 మంది ఎన్కౌంటర్ అయితే దేశవ్యాప్తంగా అది సంచలన ఘటన. దానిని కూడా ఎలా ముగించారో చూశాం. పైగా ఎర్రచందనం స్మగ్లర్లను చంపడం తప్పుకాదన్నట్లు ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించారు. చంద్రబాబు ధోరణి అలా ఉంటుంది. వాగ్దానాలు చేయడం, వాటిని తుస్సు మనిపించడం, తాను అబద్దం ఆడుతున్నానని తెలిసినా, ప్రజలను నమ్మించడానికి వాటినే వల్లించడం వంటివి చంద్రబాబు చేయగలరన్న అభిప్రాయం వివిధ పక్షాల నేతలలో ఉంది. ఈ విషయం వరకు బాగానే నేర్చుకున్నట్లు కనిపించిన లోకేష్, తన అనుభవ రాహిత్యంతో డీఎస్సీ అక్రమాల కేసులో ఇరుకున్నట్లయిందన్న విశ్లేషణ వస్తుంది.వైఎస్ జగన్ ఈ అభియోగాలను సాక్ష్యాధారాలతో సహా మీడియాకు వివరించిన వెంటనే, ఆధారాలు ఉన్నట్లయితే తప్పక చర్చ తీసుకుంటామని, ఇందులో తనకు పాత్ర లేదని, అధికారులదే తప్పేమైనా ఉందేమోనని అని ఉంటే కొంతైనా తప్పించుకోగలిగేవారేమో. కానీ లోకేష్ మొత్తం వ్యవహారాన్ని తన భుజాన వేసుకుని డీఎస్సీ క్రెడిట్ అంతా తనదేనని ప్రొజెక్టు చేసుకునే క్రమంలో అందులోని డెబిట్ మొత్తం తన ఖతాలో వేసుకోవలసి వచ్చింది. ఇదే సమయంలో యువగళం పాదయాత్ర సమయంలో తనతో పాటు ఉన్నవారికి క్రీడా కోటాలో టీచర్ ఉద్యోగాలు ఇప్పించారన్న ఆరోపణను వైఎస్సార్సీపీ చేస్తోంది. అది నిజమైతే వారికి టీచర్ల ఉద్యోగాలు ఇప్పించానన్న సంతోషం కన్నా, అది స్కాంగా మారి అన్ని విషయాలు బయటకు వస్తున్నాయన్న టెన్షన్ లోకేష్కు ఏర్పడుతుంది. జగన్ వీటన్నిటిపైన ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్పలేక ఎదురుదాడి చేస్తూ మరిన్ని అనుమానాలను చంద్రబాబు, లోకేష్ కలిగించారు.చిత్రంగా ఉద్యోగాలు వచ్చిన టీచర్ల ఇళ్లకు మంత్రులు, ఎమ్మెల్యేలను పంపించి మరిన్ని డౌట్లు క్రియేట్ చేసుకున్నారు. టీచర్ పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయని నేరుగా ఆరోపిస్తున్న అభ్యర్దుల ఇళ్లకు వెళ్లి వారి నుంచి ఆధారాలు తీసుకుని చర్యలు చేపట్టి ఉంటే బాగుండేది కదా!. ఎంపికైన టీచర్లందరిని వైఎస్సార్సీపీ తప్పుపట్టకపోయినా వాళ్లతో కర్నూలు, విశాఖపట్నం తదితర చోట్ల ర్యాలీలు తీయిస్తే ఏం ప్రయోజనం?. చిత్తశుద్ది ఉంటే ఉద్యోగాలలో తమకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో కాని, ఇతరత్రా కాని కొందరు అభ్యర్దులు చెబుతున్న వాటిలో నిజానిజాలు ఏమిటో తేల్చడానికి ఎందుకు లోకేష్ సిద్దపడలేకపోయారు. తాము జవాబు ఇవ్వలేకపోతుండటం, సంబంధిత అధికారులతో మీడియా సమావేశాలు పెట్టించారు. వారు మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక సతమతమయ్యారు. కొన్ని అంశాలలో విచారణ జరుగుతోందని, పరిశీలిస్తున్నామని తప్పించుకునే ధోరణిలో అధికారులు చెప్పవలసి వచ్చింది.జగన్ టైమ్లో సుమారు లక్షన్నర మంది సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేస్తే ఒక్క అక్రమం జరిగినట్లు కూడా ఆరోపణలు రాలేదు. గతంలో ఏ అంశంపైన అయినా, ఏ ఆరోపణ వచ్చినా, ఎలాంటి విచారణకైనా జగన్ ఆదేశించేవారు కదా!. ఆ ధైర్యం చంద్రబాబు, లోకేష్లలో ఎందుకు కొరవడుతోంది?. దీనికి తోడు సుప్రీంకోర్టు తాజాగా వేరే రాష్ట్రంలో టీచర్ల ఎంపిక కేసులో చేసిన వ్యాఖ్యలు కూడా వీరికి మరింత ఆందోళన కలిగిస్తుండవచ్చు. కాగా, ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించకపోవడం కూడా ఆసక్తికరమే. చిత్రంగా పవన్తో కలిసి టీచర్ నియామక పత్రాలు అందించామని చంద్రబాబు ఒక స్పీచ్లో చెప్పారు. కానీ అసలు ఆ ప్రోగ్రాంలో తండ్రి, కొడుకులు తప్ప పవన్ లేరు కదా అని సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. అంటే పవన్కు కూడా ఈ బురద అంటిస్తే బెటర్ అనుకున్నారా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స్కామ్ నేపథ్యంలో పోలీసులను ప్రయోగించి అణచివేత చర్యలు, సోషల్ మీడియాలో పోస్టులు తొలగించడం వంటి చర్యలు చేస్తున్న కొద్దీ స్కామ్పై జనంలో మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కాక్రోచ్లు ఊరికే రావు..! మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్లే
అక్రమాలు జరిగాయని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన కింద పనిచేసే అధికారులు చేసే విచారణలు నిజాయతీగా, సక్రమంగా జరుగుతాయా? అనే అనుమానం ఆ పార్టీ వాళ్లకు కూడా వస్తుంది. చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన కింద పని చేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయతీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టుల్లోనూ పోరాడుతున్నాం.– మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయని, చంద్రబాబు స్కామ్ల చరిత్రలో అదో ఆణిముత్యం.. చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీలతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, నిజాయతీపరులైన అభ్యర్థులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దగా చేశారని నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీ కుంభకోణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాధారాలతో మరోసారి ఎండగట్టారు. ఆ అక్రమాలను రుజువులతో సహా వెలుగులోకి తెచ్చామని, వాటి ఆధారంగా తాను సంధించిన నాలుగు ప్రశ్నలకు ఇంతవరకూ తండ్రీ, కుమారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతుంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. అభ్యర్థుల సర్టిఫికెట్లు ఏడు సార్లు వెరిఫికేషన్ చేశామని అధికారులు చెబుతున్నారని.. మరి అన్ని నకిలీ (ఫేక్) సర్టిఫికెట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు నిఖార్సైనవని అధికారులు చెప్పలేకపోయారన్నారు. జరగని పోటీలు, టోర్నీలతో సర్టిఫికెట్లు జారీ చేశారని.. అవి బోగస్ అని స్వయంగా అసోసియేషన్లు వెల్లడించినా వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం పట్టించుకోకుండా తమవారికి అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత గేట్లు మూసేసిందన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. అసలు ఏ పరీక్షా లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం, అందులోనూ టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద స్కామ్ అని స్పష్టం చేశారు. ఇదే బాటలో అటవీ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేశారని, అయితే మెగా డీఎస్సీ స్కామ్ బయటపడడంతో 40 ఉద్యోగాలకు బ్రేక్ వేయడమే కాకుండా, మిగిలిన పోస్టులకూ నియామకాలు చేపట్టలేదని వెల్లడించారు. ఇది ఉద్యోగార్థులకు తీవ్ర అన్యాయం చేయడం కాదా? అని సీఎం చంద్రబాబును నిలదీశారు. వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు కల్పిస్తేనే కాక్రోచ్లు పుట్టుకొస్తాయని, తప్పు చేసిన వారి మెడలు వంచేందుకు తానూ కాక్రోచ్గా మారతానని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. బాబుకు బీపీ పెరిగి బెదిరిస్తున్నారుడీఎస్సీ 2025 కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా బయటకు వచ్చిన మరికొన్ని సాక్ష్యాలు, ఆధారాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత కూడా ఈ స్కామ్ నుంచి తప్పించుకోగలరా? అలాంటి నివ్వెరపోయే వాస్తవాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ స్కామ్ రూపాలన్నీ అనకొండలా అనిపిస్తున్నాయి. అందుకే ఇవి బయటకు వచ్చే కొద్దీ చంద్రబాబుకి బీపీ పెరుగుతోంది. ఎవరైనా తప్పులు, ఆధారాలు బయటపెడితే వారిపై కేసులు పెడతాం, జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. జర్నలిస్టుల మీద సైతం కేసులు పెడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ నిలదీయకూడదంటూ అకౌంట్లు బ్లాక్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు.ఈ ప్రశ్నలకు బదులేది?మెగా డీఎస్సీ స్కామ్ ఎలా జరిగిందో సాక్ష్యాలు, ఆధారాలతో చూపించా. దీనిపై నేను అడిగిన ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా చంద్రబాబుగానీ ఆయన సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రిగానీ సూటిగా సమాధానం చెప్పలేదు. అవన్నీ స్కామ్ పునాదులు. నేను అడిగిన ఆ నాలుగు ప్రశ్నలు చాలా సింపుల్. వాటిని మరోసారి గుర్తు చేస్తున్నా.1? రాష్ట్ర డీఎస్సీ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రశ్న పత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ.. ఈ రెండిటినీ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు? పారదర్శకతకు ఎందుకు పాతరేశారు? ఇది స్కామ్కు ద్వారాలు తెరిచినట్లు కాదా? అని అడిగితే చంద్రబాబు నోరు విప్పలేదు.2? స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ)లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? అతడికి మొదటి ర్యాంకు వచ్చినా ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అతడి పేరును సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎందుకు తీసేశారు? అతడి డీఎస్సీ క్యాండిడేట్ లాగిన్ ఐడీని ఎందుకు బ్లాక్ చేశారు? అతడిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఎందుకు పిలవలేదు? తనను పిలవలేదని డీఎస్సీ కన్వీనర్కు నవీన్ లేఖ కూడా రాశాడు. నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడు? ఇదంతా స్కామ్ను దాచిపెట్టడానికి చేసిన ప్రయత్నం కాదా? డీఎస్సీ ప్రశ్నపత్రంలో ప్రశ్నలను కూడా అమ్ముకున్నారని కొంతమంది అభ్యర్థులు చెప్పడం ఇటీవల సోషల్ మీడియాలో చూస్తున్నాం.. మెగా డీఎస్సీలో లీకేజీ జరిగిందనడానికి ఇది మరింత బలాన్ని ఇవ్వడం లేదా?3? స్పోర్ట్స్ కోటా జీవోను మార్చి గతంలో ఉన్న 2 శాతం కోటాను 3 శాతానికి పెంచడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ పరీక్షా రాయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా భర్తీ చేసుకోవడానికి జీవో నెం.4, జీవో నెం.47 ఎందుకు తీసుకువచ్చారు? ఈ జీవోలతో గేట్లు ఎత్తి 372 మందిని రిక్రూట్ చేసి, పనైపోయిన తరువాత జీవో నెం.23, జీవో నెం.25, జీవో నెం.56తో గేట్లు మూసేశారు. ఎందుకు ఇంత అడ్డగోలు జీవోలు ఇచ్చారు? అసలు పరీక్షే లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మీ ఇష్టం వచ్చినట్లు ఇస్తారా? ఎందుకు జీవోలు ఇచ్చారు? ఎందుకు ఉపసంహరించుకున్నారు?4? టీచర్ పోస్టుల కోసం డబ్బులు తీసుకున్నారంటూ ఏకంగా ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చిన తరువాత కూడా కేసును ఎందుకు నిర్వీర్యం చేశారు? ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే వరకూ కేసును నీరుగార్చారు.అంత క్లియర్గా ఆడియో కాల్లో నెంబర్ కనిపిస్తుంటే ఆ వ్యక్తిని కనిపెట్టడం కష్టమా? కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం గుర్తు తెలియని (సస్పెక్ట్) వ్యక్తి అని రాశారు. కేసు నమోదుకు ఆలస్యం ఎందుకు అయ్యిందంటే..? ఉన్నతాధికారులతో సంప్రదించడం వల్ల అని రాసుకొచ్చారు. చంద్రబాబు, ఆయన తనయుడు మాత్రం.. అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపించామని అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్)లో చూస్తే రిమాండ్కు పంపలేదని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇవన్నీ సింపుల్ ప్రశ్నలు. ఆరేళ్ల పిల్లాడికైనా అర్థం అవుతాయి. ఇవే మెగా డీఎస్సీ కుంభకోణానికి పునాదులు. ఇప్పుడు బయటకు వస్తున్న ఉదాహరణలన్నీ వీటికి సంబంధించిన కోణాలే. వెన్నుపోటు పార్టీ నాయకుడికి తనను, తన తనయుడిని కాపాడుకోవడమే ప్రధానం.అయితే ఇచ్చేయ్ టీచర్ ఉద్యోగం...! ఒక అక్రమాన్ని తవ్వుతుంటే, మరొకటి బయట పడుతోంది. బాబు కుంభకోణాల చరిత్రలో డీఎస్సీ స్కామ్ ఆణిముత్యంగా నిలిచిపోతుంది. నిరుద్యోగ యువకులను నట్టేట ముంచిన స్కాం ఇది. స్పోర్ట్స్ కోటా పేరుతో చేసిన అక్రమాలు చూస్తే.. వీడు మనవాడా! డబ్బులు ముట్టాయా! అయితే ఇచ్చేయ్ టీచర్ ఉద్యోగం అన్నట్లుగా డీఎస్సీ పోస్టులు భర్తీ చేశారు. జరగని పోటీలు జరిగినట్లుగా, ఆ పోటీల్లో పాల్గొని అద్భుతంగా ఆడినట్లుగా, తప్పుడు సర్టిఫికెట్లతో పోస్టులు ఇచ్చారు.పైస్థాయి నుంచి ఆదేశాలతో కింది స్థాయి వరకూ కుమ్మకై, ఒక పద్ధతి ప్రకారం (మోడస్ ఆపరాండీ) ఈ పోస్టులన్నిటినీ భర్తీ చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరగాల్సిన అవసరం ఉందని ప్రతి కేస్ స్టడీ చెబుతోంది.జూడోలో పరీక్ష లేకుండా పోస్టులు..మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అసలు పరీక్షలే లేకుండా 372 మందిని నియమిస్తే.. ఒక్క జూడో కింద 39 మందికి ఎలాంటి పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చారు. వీరిలో కొందరు సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్ షిప్ 2013 ఖమ్మంలో జరిగినట్లుగా, అందులో పాల్గొని గెలిచినట్లుగా ధ్రువీకరిస్తూ ఏపీ జూడో అసోసియేషన్ ఇచ్చిన సర్టిఫికెట్లు పెట్టారు. తీరా చూస్తే అసలు ఆ తేదీల్లో (2013 అక్టోబర్ 19–21 మధ్య) ఆ ఛాంపియన్షిప్ ఖమ్మంలో జరగలేదని, తెలంగాణ జూడో అసోసియేషన్, ఖమ్మం జిల్లా జూడో అసోసియేషన్ చాలా స్పష్టంగా రాతపూర్వకంగా చెప్పాయి. ఇంతకీ ఈ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరని చూస్తే.. చంద్రబాబు తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్కు స్వయనా తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్. దీని అర్థం.. దొంగ సర్టిఫికెట్లు పుట్టించారని, మళ్లీ ఆ దొంగ సర్టిఫికెట్లకు మన రాష్ట్రంలోని పెద్దలే ధృవీకరణ కూడా చేసి ఇచ్చారని చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. సాఫ్ట్బాల్ పేరిట మరో 38 మందికి ఇలానే పరీక్ష లేకుండానే టీచర్ పోస్టులు ఇచ్చారు. ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరంటే.. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ఆయన సంతకం చేసిన 21 సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలిచ్చేశారు.పైనుంచి ఫోన్.. అంతా సెట్బసవేశ్వరరావు అనే మరో అభ్యర్థి 49వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ గుడివాడలో జరిగిందని, అందులో పాల్గొన్నానని సర్టిఫికెట్ పెట్టాడు. కానీ అతడి సర్టిఫికెట్ ఫేక్ అని ఆంధ్రా ఖోఖో అసోసియేషన్ అధికారికంగా శాప్కు లేఖ ఇచ్చింది. అయినా సరే దానిని పక్కన పడేసి, ఫేక్ సర్టిఫికెట్ పెట్టిన వాడికి ఉద్యోగం ఇచ్చేశారు. ఎందుకంటే పైనుంచి ఫోన్.. అంతా సెట్ అయిపోయింది ఉద్యోగం ఇచ్చేయమని! ప్రగడ కళ్యాణి అనే అభ్యర్థి కబడ్డీలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ టోర్నమెంట్ 2003 నాగార్జున యూనివర్శిటీలో ఆడినట్లుగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్తో, పరీక్ష రాయకుండానే ఉద్యోగం ఇచ్చారు. కానీ ఆ యూనివర్శిటీలో ఆ గేమ్స్ జరగలేదని, సౌత్ వెస్ట్ జోన్ కబడ్డీ పోటీలు మాత్రమే జరిగాయని తేలింది. అయినా సరే 7 అంచెల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తున్నారు! టెట్ క్వాలిఫై కాకున్నా ఉద్యోగాలు..మరికొన్ని కేసుల్లో అయితే టెట్ పాసవకుండానే అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఒక కేటగిరీలో టెట్ మార్కులు చూపించి, మరో కేటగిరీ టీచర్ పోస్టులు ఇచ్చారు. ఇంకొన్ని కేసుల్లో.. అభ్యర్థికి ఒక కులానికి సంబంధించి రిజర్వేషన్ ఉంటే, మరో కులానికి సంబంధించిన రిజర్వేషన్లో ఉద్యోగం ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఈడిగ ప్రభాకర్ అనే అభ్యర్థికి ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారు. అతడి రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఎస్జీటీ పోస్టుకు టెట్లో 75 మార్కులు రావాలి. కానీ ఆయనకు 65 మాత్రమే వచ్చాయి. ఇదే విషయాన్ని కర్నూలు డీఈవో కూడా ఒప్పుకున్నారు. మరి ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు? ఎవరు చెబితే ఇచ్చారు? దీనిని కవర్ చేసుకోవడానికి తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. ప్రభాకర్కు టెట్లో 77 మార్కులు 2018లో వచ్చాయని అధికారులు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ హాల్టికెట్ నంబర్ ఆధారంగా వెబ్సైట్లోకి వెళ్లి టెట్ డేటా చూస్తే ఆ 77 మార్కులు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే 2 బీ కేటగిరీకి సంబంధించిన మార్కులని తేలింది. అవి చూపించి ఆయనకు టెట్ 1 ఏ కేటగిరీలో ఉన్న పోస్టు ఎలా ఇచ్చారు? సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ధ్రువీకరించి ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా టీచర్ ఉద్యోగాలు పొందిన 21 మంది వివరాలు ‘ఈడబ్ల్యూఎస్’ మరో పెద్ద రాకెట్..ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరిట పెద్ద ఎత్తున రాకెట్ నడిచినట్లు ఒక్కొక్కటిగా కేసులు బయటకు వస్తున్నాయి. ఇతర కులాలకు చెందిన వారికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉద్యోగాలిచ్చారు. కడప, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇలాంటి కేసులు చాలా వెలుగులోకి వచ్చాయి. కడప జిల్లాలో రసూల్ 2008, 2012, 2018లో బీసీ–ఈ కేటగిరీ కింద డీఎస్సీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఇప్పుడు మాత్రం ఓసీ–ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఉద్యోగం ఇచ్చారు. 1 : 1 రేషియోలో అధికారులు వెరిఫికేషన్ చేశాక కూడా పోస్టు ఎలా ఇచ్చారు? ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్లను 7 సార్లు వెరిఫై చేశామని చెబుతున్నప్పుడు ఇన్ని అక్రమాలు ఎలా జరిగాయి? అర్హత లేదని తెలిసి కూడా ఎలా పోస్టులు ఇచ్చారు? ఎవరు చెబితే ఈ పని చేశారు? డీఎస్సీ స్కామ్ పునాదుల నుంచి ఈ కేస్ స్టడీస్ అన్నీ బయటకు వస్తున్నాయి. ‘ఏపీపీఎస్సీ’లోనూ ఇదే చేయాలనుకున్నారు!ఇంకా నిర్ఘాంతపోయే అంశం మరొకటి ఉంది. అదేమిటంటే.. ఏపీపీఎస్సీలోనూ పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలిచ్చేయాలని చూశారు. అటవీ శాఖలో 814 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, అందులో 40 పోస్టులు స్పోర్ట్స్ కోటా పేరిట పరీక్ష లేకుండా, కేవలం ఇలాంటి సర్టిఫికెట్లతో భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీలో ఉపయోగించిన జీవో నెం.4ను వీళ్లు వాడుకున్నారు. అంటే డీఎస్సీ కుంభకోణం బయటకు రాకపోయి ఉంటే ఏపీపీఎస్సీలోనూ ఈ 40 పోస్టులు ఇచ్చేసేవారు. డీఎస్సీ అక్రమాలు బయటపడటంతో ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో మిగతా 774 పోస్టుల భర్తీ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు. 40 మంది జాబితా బయటపెట్టాల్సి వస్తుందని కాదా? అని నేను అడుగుతున్నా. ప్రభుత్వం, వ్యవస్థలపై నమ్మకం ఎలా ఉంటుంది?పోటీ పరీక్షల కోసం లక్షల మంది పిల్లలు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. నిరుద్యోగులు ఇంత కష్టపడుతుంటే చివరికి స్కామ్లు చేసి, లంచాలు తీసుకుని నచ్చిన వాళ్లకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఇక ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఎలా ఉంటుంది? దీన్ని మార్చాలి. వ్యవస్థలోకి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మార్చాలంటే ఎలా జరుగుతుంది? పారదర్శకంగా సీబీఐ విచారణ జరపాలి. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి. లేదంటే కాక్రోచ్లు రాక తప్పదు. వీరి మెడలు కూడా వంచక తప్పదు. కచ్చితంగా అదే జరుగుతుంది.అందుకే సీబీఐ విచారణ అవసరంఅసలు పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు, అందులోనూ టీచర్ ఉద్యోగాలు ఇవ్వడమే ఓ స్కామ్. జీవోలు ఇవ్వడం.. స్పోర్ట్స్ కోటాలో 372 పోస్టులు నింపడం.. ఆ తరువాత జీవోలను రద్దు చేయడం ఇదంతా పెద్ద స్కామ్! అక్రమాలు జరిగాయని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన కింద పనిచేసే అధికారులు చేసే విచారణలు నిజాయతీగా, సక్రమంగా జరుగుతాయా? అనే అనుమానం ఆ పార్టీ వాళ్లకు కూడా వస్తుంది. చంద్రబాబు కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన కింద పని చేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయతీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టుల్లోనూ పోరాడుతున్నాం. కాక్రోచ్లు ఊరికే రావు. వ్యవస్థలను పాలకుడు ఇలా దగ్గరుండి చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు.తప్పులు ఒప్పుకోక తప్పలేదు..!తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు ఐఏఎస్ అధికారులతో మాట్లాడించారు. ఐఏఎస్అధికారుల ప్రెస్మీట్ తర్వాత అంతిమంగా తేలింది ఏమిటంటే...⇒ టెట్ పాస్ అర్హత లేకపోయినా, పోస్టులు ఇచ్చామని ఒప్పుకోక తప్పలేదు.⇒ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు నిఖార్సైనవి అని చెప్పలేకపోయారు.⇒ వెరిఫికేషన్ ఒక బోగస్ అని చెప్పకనే చెప్పారు.⇒ టోర్నమెంట్లు జరగకుండానే సర్టిఫికెట్లు ఇచ్చారని ఒప్పుకోక తప్పలేదు.⇒ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంతకం చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా పోస్టులు ఇచ్చామని కూడా ఒప్పుకున్నారు.⇒ లోకేశ్ తోడల్లుడు అధ్యక్షుడిగా ఉన్న జూడో అసోసియేషన్లో పోటీలు జరగకపోయినా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారని ఒప్పుకోక తప్పలేదు. ⇒ కులాలు మార్చి కూడా పోస్టులు ఇచ్చామని అంగీకరించక తప్పలేదు.చక్రం తిప్పిన శాప్..మరికొన్ని కేసుల్లో శాప్ స్వయంగా చక్రం తిప్పింది. విశాఖపట్నంలో ఏ పరీక్షా లేకుండా స్పోర్ట్స్ కోటాలో సీహెచ్ యోగేశ్వరరావు అనే అభ్యర్థికి సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగం ఇచ్చారు. ఆయన చెల్లికి కూడా ఇచ్చారు. కుటుంబం మొత్తం ప్యాకేజీ మాట్లాడుకున్నట్లున్నారు! నల్గొండలో జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2009లో యోగేశ్వరరావుకు ఫస్ట్ ప్లేస్, ఆయన చెల్లి మోహినిదేవికి సెకండ్ ప్లేస్ వచ్చినట్లు సర్టిఫికెట్లు చూపించారు. అయితే విజేతల జాబితాలో వీళ్లు లేరని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్పష్టంగా తేల్చి చెప్పింది. ఆ రోజు పోటీలో గెలుపొందిన క్రీడాకారుల వివరాలు, పేర్లతో కూడిన రికార్డులను కూడా బయటపెట్టింది. అంటే ఈవెంట్లు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసుకుని, ఆ మేరకు దొంగ సర్టిఫికెట్లు పుట్టించారని అర్థం అవుతోంది. కానీ ఇచ్చిన ఈ ఉద్యోగాలన్నీ ఏడు సార్లు వెరిఫికేషన్ అయిన తరువాత, ప్రతీ దానిని స్రూ్కటినీ చేసి, స్క్రీనింగ్ చేసి, తనిఖీ చేసి ఇచ్చామని అధికారుల చేత చంద్రబాబు చెప్పిస్తున్నారు. -
‘లోకేష్కు మంత్రిగా కొనసాగే హక్కు లేదు’
గుంటూరు: డీఎస్సీ స్కాంలో అడ్డంగా దొరికిపోయిన లోకేష్కు మంత్రిగా కొనసాగే హక్కు లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. డీఎస్సీ పరీక్షల్లో ఎన్నడూ జరగనంత అవినీతి జరిగిందని, లోకేష్ అడ్డంగా దొరికిపోయాడని మండిపడ్డారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీపై సీబీఐ వ విచారణ జరిపించాలని అంబటి డిమాండ్ చేశారు.‘డీఎస్సీ పై ప్రభుత్వానికి మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు. అందుకే చంద్రబాబు గానీ, లోకేష్ గానీ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై మాట్లాడలేదు. లోకేష్... లవ్ క్యాష్ అన్న సంగతి తెలుసు. లోకేష్ దొరికిపోయిన దొంగ. లోకేష్ రాజకీయాలకు పనికి రారు...మంత్రిగా కూడా పనికి రారు. లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటున్నారట ముఖ్యమంత్రిని చేస్తే దేశాన్నే అమ్మేస్తారు. లోకేష్ ఉద్యోగాలను బఠానీలు అమ్మినట్లు అమ్మేశారు. ఆయన రాజీనామా చేయాలి. లోకేష్తోనే టీడీపీ సర్వ నాశనం అవుతుంది. డీఎస్సీ అక్రమాలపై ఐఏఎస్ల చేత మాట్లాడిస్తున్నారు. ఇంకా రెండు డిఎస్సీలు పెడతామంటున్నారు. లోకేష్కు మంత్రి సీటులో కూర్చునే హక్కు లేదు’ అని ధ్వజమెత్తారు.ఇదీ చదవండి:చంద్రబాబుది టెన్షనా.. ఫ్రస్టేషనా? -
‘నమ్మినవాళ్లే మోసం చేశారు..’ ఏడ్చేసిన బొత్స
సాక్షి, విజయనగరం: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవలి పరిణామాలతో కలత చెందిన ఆయన.. కష్టకాలంలో నిలబడే కార్యకర్తలే పార్టీకి నిజమైన వెన్నుదన్ను అంటూ కంటతడి పెట్టారు. అయితే తండ్రి బొత్స సత్యనారాయణ కంటితడి పెట్టడంపై ఆయన కుమార్తె బొత్స అనూష చలించిపోయారు. తండ్రిని ఓదార్చారు. గురువారం గరివిడిలో చీపురుపల్లిలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమయంలో బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాస్(చిన్న శ్రీను) ఇటీవలె పార్టీ మారడం.. పార్టీతో కలిసి నడిచిన రోజుల్ని, అనుబంధాన్ని కొందరు కార్యకర్తలు ప్రస్తావించారు. ఆ ప్రసంగాల సమయంలో.. నమ్మినవాళ్లు మోసం చేశారంటూ బొత్స ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఆపై తనను తాను సముదాయించుకుని.. ‘‘వ్యక్తులు రావొచ్చు.. పోవచ్చు.. పార్టీ మాత్రం శాశ్వతం. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. పార్టీ పటిష్టత కోసం నిరంతరం పని చేయాలి. వైఎస్ జగన్ ఆశయాల కోసం కలిసి పని చేద్దాం. కష్టకాలంలో నిలబడే కార్యకర్తలే పార్టీకి నిజమైన వెన్నుదన్ను’’ అని అన్నారాయన.ఇదీ చదవండి: నేనూ ఓ కాక్రోచ్గా మారొచ్చు: వైఎస్ జగన్ -
జనసేన, బీజేపీ సిగ్గుపడాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్పై సీబీఐ విచారణ జరగాలి.. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ రాజీనామా చేయాలి అనే డిమాండ్లను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి వినిపించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించిన ఆయన.. స్కామ్కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపెట్టారు.డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిస్తున్నాయి. అర్హత లేని వారికి ఎవరు చెబితే పోస్టులు ఇచ్చారు?. టెట్ అర్హత లేకుండా పోస్టులు ఇచ్చామని ఒప్పుకున్నారు. స్పోర్ట్ సర్టిఫికెట్లు నిఖార్సయినవి కావని చెప్పలేకపోయారు. జూడో పోటీల్లో దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. లంచాలు తీసుకుని స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఏడుసార్లు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది కూడా బోగస్సే. అసలు ఏ పరీక్ష లేకుండా ఉద్యోగాలివ్వడమే పెద్ద స్కాం....ఏపీపీఎస్సీలోనూ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారు. దొడ్డిదారిన జీవో నెంబర్ 4 తేవాలని చూశారు. మా హయాంలో క్లియరెన్స్ పొందిన 814 పోస్టుల్లో.. పరీక్ష లేకుండా 40 పోస్టులు ఇవ్వాలని చూశారు. డీఎస్సీ స్కాం బయటకు రావడంతో ఆగిపోయారుచంద్రబాబు, లోకేశ్లు వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఆయన దగ్గర పని చేసే అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయగలరా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. నిరుద్యోగ యువత కోసం కోర్టులోనూ పోరాడుతున్నాం అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కాయలున్న చెట్టుకే రాళ్లదెబ్బలు తగులుతాయి అంటూ డీఎస్సీ వ్యవహారంపై నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యపైనా వైఎస్ జగన్ స్పందించారు. లోకేశ్, ఆయన తండ్రి చంద్రబాబు చెప్పే సమాధానాలు కూడా అబద్ధాల రూపంలోనే ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. డీఎస్సీ స్కామ్పై ఇంతరాద్ధాంతం జరుగుతుంటే.. బీజేపీ, జనసేన మౌనంగా ఉండడంపై వైఎస్ జగన్ స్పందించారు. జగన్ అడిగే అంశం సరైందే అయినప్పుడు నోరు మెదపాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉంటుందని అన్నారు. బీజేపీ, జనసేన స్పందించకపోవడంపై వాళ్లనే అడగాలని మీడియాకు సూచించారు. ఇలాంటి చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నందుకు.. ఇలాంటి వ్యవస్థను బలపరుస్తూ తప్పుచేసుకున్నందుకు వాళ్లు సిగ్గుపడాలని వైఎస్ జగన్ అన్నారు. -
దొంగ సర్టిఫికెట్లు.. ఫ్యామిలీ ప్యాకేజీలా ఉద్యోగాలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్లో వాస్తవాలు బయటపడుతున్నా.. దాన్ని కప్పిపుచ్చేందుకు కూటమి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. స్పోర్ట్స్ కోటాలో అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని, ఏడుసార్లు వెరిఫికేషన్ చేసిన తర్వాతే నియామకాలు చేపట్టామని అధికారుల ద్వారా చెప్పిస్తూ ఇప్పుడు కవర్అప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెట్ పాస్ కాకుండానే కొందరికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏ పరీక్ష రాయకుండానే విశాఖపట్నంకు చెందిన యోగేశ్వరరావుకు స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. ఆయనతో పాటు ఆయన సోదరికి కూడా ఉద్యోగం ఇచ్చారని, కుటుంబం మొత్తానికీ ‘ఫ్యామిలీ ప్యాకేజీ’లా పోస్టులు కట్టబెట్టారని విమర్శించారు. ఈ వ్యవహారంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కీలకంగా వ్యవహరించిందన్నారు.యోగేశ్వరరావు, మోహినీదేవి పేర్లు తాము నిర్వహించిన ఈవెంట్లో లేవని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్పష్టం చేసిందని జగన్ తెలిపారు. అయినప్పటికీ వారు పోటీల్లో పాల్గొన్నట్లు చూపించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ప్రగడ కల్యాణి విషయంలోనూ ఇదే తరహా వ్యవహారం జరిగిందన్నారు. ఆమె కబడ్డీ పోటీలో పాల్గొన్నట్లు పేర్కొన్నప్పటికీ.. 2003లో నాగార్జున యూనివర్సిటీలో సౌత్జోన్ కబడ్డీ పోటీలు జరిగాయని, కాబట్టి ఆమె సమర్పించింది నకిలీ సర్టిఫికెట్గా తేలిందని ఆయన చెప్పారు.ఈడిగ ప్రభాకర్ వ్యవహారాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఆయన టెట్కు క్వాలిఫై కాలేదని, కనీస విద్యార్హత కూడా లేదని డీఈవో స్వయంగా వెల్లడించారని తెలిపారు. అయినా ఉద్యోగం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.మరోవైపు ‘ఏడుసార్లు వెరిఫికేషన్ అయ్యాకే ఉద్యోగాలు ఇచ్చాం’ అని అధికారులు డీఎస్సీ స్కాం గురించి ప్రెస్మీట్ పెట్టి చెప్పారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. డీఎస్సీ స్కామ్పై ప్రశ్నలు తలెత్తిన తర్వాత.. కొందరు అభ్యర్థులు చాలాసార్లు టెట్ రాసి ఉండొచ్చని, అందువల్ల ఉద్యోగం వచ్చి ఉండొచ్చంటూ కవర్అప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసలు ఆ వెరిఫికేషన్ కూడా బోగస్ అని ఆయన అభివర్ణించారు. ఇలా తప్పుడు సర్టిఫికెట్లు, అర్హతలు, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.ఇదీ చదవండి: ఆధారాలు చూపిస్తే అక్రమ కేసులా? -
కాక్రోచ్లు పుట్టుకొచ్చేది ఇందుకే..: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కుంభకోణాల చరిత్రలో.. డీఎస్సీ స్కామ్ అనేది ఓ ఆణిముత్యమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో డీఎస్సీ అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.డీఎస్సీ స్కామ్ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు. కొడుకు నారా లోకేశ్ను కాపాడుకోవాలనే ఆరాటంలో చంద్రబాబు ఉన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఇలాంటి స్కామ్ల వల్లే కాక్రోచ్లు(కాక్రోచ్ జనతా పార్టీ.. జెన్జీ ఉద్యమంను ఉద్దేశించి) పుట్టుకొస్తున్నాయి అని వైఎస్ జగన్ అన్నారు.వ్యవస్థలు చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. ఇలాంటి స్కామ్లతో కాక్రోచ్లు రాక తప్పదు. ఆఖరికి నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు అని వైఎస్ జగన్ కామెంట్ చేశారు.డీఎస్సీ కుంభకోణంలో పై నుంచి కింది స్థాయి వరకు కుమ్మక్కయ్యారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేశారు అని ఖమ్మం(తెలంగాణ)లో జరగని ఈవెంట్లతో ఉద్యోగాలిచ్చిన కేసును ఆధారాలతో సహా చూపించారు. ఆ జూడో అసోషియేషన్ అధ్యక్షుడు ఎవరో కాదు.. చంద్రబాబు దగ్గరి బంధువు.. నారా లోకేశ్ తోడల్లుడు.. టీడీపీ ఎంపీ భరత్ అని చెప్పారు. సాఫ్ట్ బాల్ విషయంలోనూ ఇదే జరిగిందని.. దాని అధ్యక్షుడు ఎమ్మెల్యే కూన రవి అని గుర్తు చేశారు. వీటి ఆధారంగా దొంగ సర్టిఫికెట్లు గుర్తించినట్లు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. కుంభకోణం జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని వైఎస్ జగన్ అన్నారు.ఇదీ చదవండి: డీఎస్సీ స్కాంతో బాబుకి హైబీపీ -
డీఎస్సీ స్కామ్తో చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి.. సుదీర్ఘంగా ఈ కుంభకోణంపై కొత్త విషయాలతో మాట్లాడారాయన.డీఎస్సీ కుంభకోణంలో తవ్వే కొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి. స్కామ్ జరిగిందని ఎవరైనా ఆధారాలు చూపిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది. వాళ్లను జైల్లో పెడుతున్నారు. జర్నలిస్టులు కొందరు వాస్తవాలు బయటపెడితే.. వాళ్లపైనా తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధించాం. నా ప్రశ్నలకు చంద్రబాబు, నారా లోకేశ్ దగ్గరి నుంచి సమాధానమే లేదు అని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నాపత్రం తయారీ.. పర్యవేక్షణ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు?. ఇక్కడే డీఎస్సీ స్కామ్కు ద్వారాలు తెరిచారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పుకుండా బుల్డోజ్ చేస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు. మెరిట్ లిస్ట్లో ఫస్ట్ర్యాంకర్ పేరు ఎందుకు లేదు?. సెకండ్ లిస్ట్లో అతని పేరు ఎందుకు మాయమైంది?. అతని డీఎస్సీ లాగిన్ ఎందుకు బ్లాక్ చేశారు. ఎందుకు అతన్ని వెరిఫికేషన్కు ఎందుకు పిలవలేదు?. కోర్టుకు ఆ ఫస్ట్ ర్యాంకర్ ఎందుకు వెళ్లాడు?. స్కామ్ను దాచిపెట్టే ప్రయత్నంలోనే ఇదంతా చేశారు అని వైఎస్ జగన్ అన్నారు. స్పోర్ట్ కోటాలో పరీక్షే లేకుండా 372 మందికి ఉద్యోగాలు కట్టబెట్టారు. అందుకోసం ప్రత్యేక జీవోలు రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ అయ్యాక ఆ జీవోలు మార్చేశారు. డీఎస్సీ ఉద్యోగాల కోసం జరిగిన బేరసారాల ఆడియో, వీడియోలు బయటకు వచ్చాయి. తూతూమంత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది స్కామ్ను దాచిపెట్టే ప్రయత్నం కాదా? అని వైఎస్ జగన్ నిలదీశారు. -
చంద్రబాబు హామీలు.. మోసాలు.. ఇంటింటా ఇదే చర్చ
వచ్చే సెప్టెంబర్లో పాదయాత్ర చూస్తుండగానే కళ్లు మూసి తెరిచేసరికి దాదాపు రెండున్నర ఏళ్లు గడిచాయి. ఇప్పుడు సెప్టెంబరు నెలలో ఉన్నాం. మళ్లీ కళ్లు మూసి తెరిచేలోగా ఏడాది గడిచి మళ్లీ సెప్టెంబరు వస్తుంది. వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో నా పాదయాత్ర మొదలవుతుంది. పర్చూరు మీదుగా కూడా నా యాత్ర జరుగుతుంది. చంద్రబాబు చేసిన మోసమే ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చనీయాంశమైంది. జగన్ మోసం చేయలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేశారు. ఆ టైంలో కనీసం నాలుగువేళ్లు నోట్లోకి పోయాయి. కానీ, చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాం. ఇవాళ నోట్లోకి ఏదీ పోవడం లేదు. చంద్రబాబు పుణ్యాన మా బతుకులు బస్టాండ్ అయిపోయాయి అన్న చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది.‘‘జగన్ ఇస్తున్న పథకాల కంటే మూడింతలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపాడు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో పాటు ప్రమాణం చేసే మాటలు. జగన్ ఇచ్చినవే కాకుండా సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్ల పేరిట ఇంకా ఎక్కువ, మూడింతలు ఇస్తామన్నారు.’’‘‘చంద్రబాబు అనే వ్యక్తి, తనను ప్రశ్నించే గొంతు వినడానికి సిద్ధంగా లేని మనిషి. ఎవరు ప్రశ్నించినా వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, నిర్బంధించడం, ప్రలోభాలు పెట్టడం, దిగజారిన రాజకీయాలు చేయడం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు హయాంలో మనం చూస్తోంది రోజుకో డ్రామా. రోజుకో నటన. రోజుకో డైవర్షన్.’’‘‘స్థానిక ఎన్నికలు ఎలా జరిగినా ప్రజలకు తోడుగా వైఎస్సార్సీపీ ఉంటుంది అన్న భరోసా మాత్రం కచ్చితంగా ఇవ్వాలి. ఎన్నికలు కనుక సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎక్కడైనా సరే విజయం సాధిస్తారు. ఒకవేళ ఎన్నికలు సాఫీగా జరగకపోయినా, ప్రజలకు తోడుగా పోటీలో గట్టిగా మనం నిలబడదాం.’’‘‘ప్రజలకు మంచి చేసి.. ఫలాన మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే నిబద్ధత, చిత్తశుద్ధి పాలకుడికి ఉండాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రజలు తోడుగా నిలబడతారు. కానీ చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, దౌర్జన్యాలు చేయడం, డైవర్షన్స్ చేస్తూ ఉండడాన్ని దేవుడు కరుణించడు. ప్రజలు హర్షించరు’’ – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని, ఇది ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు హామీలు, మోసాలపైనే ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందని, వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనను, చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనను ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు, ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా నిలబడాలని, పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు నిజాయితీగా జరిగితే విజయం తప్పకుండా వైఎస్సార్సీపీదే అని స్పష్టం చేశారు. పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ గాదె మధుసూదన్రెడ్డి, పలువురు నేతలు సమావేశానికి హాజరయ్యారు. వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే..కార్యకర్తలు గర్వపడేలా మన పాలనమన 5 ఏళ్ల పాలన, బాబు రెండున్నర ఏళ్ల పాలనలో ఎంతో తేడా ఉంది. దీనిపైనే ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఆ ఐదేళ్ల మన పరిపాలనలో ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకుని ఫలానావాడు మా నాయకుడు, ఫలానా పార్టీ మా పార్టీ అని గర్వంగా చెప్పుకోగలిగే పరిస్థితి. మ్యానిఫెస్టోకు అర్థం తీసుకొచ్చిన పార్టీ రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. రాజకీయ నాయకులు, పార్టీలు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలు ఇస్తారు. చంద్రబాబు లాంటి వాళ్లు అయితే ఏకంగా ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంచిపెడతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మ్యానిఫెస్టో, అందులో ఇచ్చిన హామీలు చెత్తబుట్టలో కనిపిస్తాయి. అలాంటి పరిస్థితిని మార్చిన పాలన మనది. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావిస్తూ, అందులో చెప్పిన వాటిలో 99 శాతం అమలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే అని గర్వంగా చెప్పగలుగుతాం. అంతగా మాట ఇస్తే ఆ మాటపై నిలబడాలి అని తాపత్రయపడ్డాం. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ పథకం ఏ నెలలో ఎప్పుడు ఇస్తాము అని ముందుగానే షెడ్యూల్ ప్రకటించి, ఒక్క పథకం కూడా మిస్ కాకుండా బటన్లు నొక్కి అమలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే. గతంలో ఎప్పుడూ చూడని విధంగా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వ పథకాలు లంచాలు లేకుండా ఇవ్వగలిగే పరిస్థితి ఉంటుందా? అన్న సందేహాలను పటాపంచలు చేశాం. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఏర్పాటు చేసి, ప్రతి 50, 60 ఇళ్లకు ఒక వలంటీర్ను తీసుకొచ్చి, ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేశాం. ఇది వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది.వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు.. మన ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లకు పోటీగా మారాయి. ఇంగ్లీష్ మీడియం చదువులు, మూడో తరగతి నుంచి టోఫెల్ పీరియడ్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ అమలు చేయడం, నాడు–నేడు మనబడితో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మార్చడం, ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటలైజ్డ్ బోధన తీసుకొచ్చేలా డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ చేయడం వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగాయి. గోరుముద్ద అనే పేరుతో పిల్లలు ఏం తింటున్నారో, తినే ఆ తిండి బాగుందా లేదా అని పట్టించుకునే ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవరైనా ఉంటారో లేదో తెలియదు కానీ జరిగింది ఒక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. మొట్టమొదటిసారిగా బైలింగ్వల్ టెక్స్ట్బుక్స్.. ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీషుతో బుక్స్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం మనది. ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ట్యాబ్లు పెట్టింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఆరోగ్యశ్రీ పేదవాడికి ఇంకా తోడుగా ఉండేలా చాలా మార్పు చేశాం. మనం రాకముందు ఆరోగ్యశ్రీ పరిధి 1,000 ప్రొసీజర్లు. మనం వచ్చిన తర్వాత 3,300 ప్రొసీజర్లకు తీసుకెళ్లాం. ప్రతి పేదవాడికి రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందించాం. నాడు–నేడుతో హాస్పిటల్స్ రూపురేఖలు మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ జీఎంపీ ప్రమాణాలతో కూడిన మందులు అందుబాటులో ఉంచాం. అదీ మన చరిత్ర. ఇంకా ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల కొరత జాతీయస్థాయిలో 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో అది కేవలం 4 శాతం మాత్రమే. ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీలు యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టడం అన్నది కూడా గతంలో ఎప్పుడూ చూడని విషయం. గ్రామస్థాయిలోనే విలేజ్ క్లినిక్ ఏర్పాటు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రామస్థాయిలోనే ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం. ఇంకా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ప్రతి మండలంలో రెండు పీహెచ్సీలు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు. ప్రతి డాక్టర్కు నాలుగైదు ఊళ్లు కేటాయింపు. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఉంటే, మరో డాక్టర్ తనకు కేటాయించిన గ్రామాలకు 104 అంబులెన్సులో పర్యటన. అలా ఆయా గ్రామాలు, అక్కడి వారితో డాక్టర్కు సాన్నిహిత్యం. అత్యుత్తమ వైద్య సేవలు. ఊరిలో పేషెంట్ను పేరు పెట్టి పిలవగలిగే పరిస్థితిలోకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఇది కూడా గతంలో ఎప్పుడూ, ఎక్కడా జరగలేదు. నష్టాల్లో ఉన్న రైతు. రైతు బ్రతుకంతా ఎప్పుడూ కష్టమే. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి నుంచి, రైతును పట్టించుకునే నాధుడు ఉండడు అన్న పరిస్థితి నుంచి, మొట్టమొదటిసారిగా రైతును చెయ్యి పట్టుకొని నడిపించాలని తపన పడింది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. అందుకోసం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. ఆ ఆర్బీకేలో అసిస్టెంట్గా అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్. ప్రతి ఎకరా ఈ–క్రాపింగ్. వాటన్నింటి ద్వారా ప్రతి అడుగులోనూ రైతును చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం. ఆ ఆర్బీకేల్లో పంటల గిట్టుబాటు ధరల ప్రకటన. ఆ మేరకు పోస్టర్లు. ఏరోజైనా రైతుకు రేటు రాకపోతే వెంటనే ఆర్బీకేలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ సీఎం–యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా యాక్టివేట్ చేస్తే, వెంటనే జాయింట్ కలెక్టర్, మార్క్ ఫెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జోక్యం చేసుకోవడం, ఆ ఆర్బీకే పరిధిలో పంటలు కొనుగోలు చేయడం, అలా మార్కెట్లో పోటీని సృష్టించి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేయడం అన్నది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. సచివాలయంలో మన కళ్ళ ముందే దాదాపు పది మంది కళకళలాడుతూ సేవలు అందించే కార్యక్రమం. ప్రతి 50,60 ఇళ్లకు ఒక వలంటీర్. ఇళ్లకే వెళ్లి సేవలు అందించే కార్యక్రమం. ఇవన్నీ ఎప్పుడూ చూడలేదు, ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తప్ప. వ్యవస్థలో కనీవిని ఎరుగని మార్పులు మన హయాంలోనే జరిగాయి.చంద్రబాబు పచ్చి దగామనం ఇస్తున్న పథకాల కంటే మూడింతలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపాడు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో పాటు ప్రమాణం చేసే మాటలు. మనం ఇచ్చినవే కాకుండా సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్ల పేరిట ఇంకా ఎక్కువ, మూడింతలు ఇస్తామన్నారు. అప్పుడు చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు ఏమిటి? జగనైతే అమ్మఒడి కింద ఎంత మంది పిల్లలు ఉన్నా ఒకరికే రూ.15 వేలు ఇస్తున్నాడు. మేమైతే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే, అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నాడు. అంతటితో ఆగిపోలేదు. ఆడబిడ్డ నిధి కింద నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు ఇస్తామని చెప్పాడు. ఇంకా అంతటితో కూడా ఆగిపోలేదు. రైతు కనపడితే ఏమన్నాడు? జగన్ రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తే, తాను రూ.26 వేలు ఇస్తానన్నాడు. అంతటితో ఆగిపోలేదు. 45 ఏళ్ళు దాటిన మహిళలకు చేయూత కింద జగన్ ఇచ్చేది కేవలం రూ.18,750 అయితే, తాము 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు. అలా నీకు రూ.48 వేలు, నీకు రూ.48 వేలు ఇస్తామని ప్రచారం చేసుకున్నారు. ఇంకా దాంతోనూ ఆగిపోలేదు. 20 ఏళ్ల పిల్లోడు కనపడితే ఏమన్నాడు? నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని చెప్పాడు. అలా జగన్ కంటే అన్నీ ఎక్కువే ఇస్తానని నమ్మించాడు. ఆఖరికి వలంటీర్లను కూడా చంద్రబాబు మోసం చేశారు.దౌర్జన్యంతో పాలకులు రాజ్యం చేయలేరుఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే దౌర్జన్యంతో ఎప్పుడూ కూడా పాలకులు రాజ్యం చేయలేరు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో నా పాదయాత్రకు ముందు నంద్యాల ఉపఎన్నిక జరిగింది. ఆ ఉపఎన్నికల్లో విపరీతంగా పోలీసుల ద్వారా అధికార దుర్వినియోగం చేశారు. దాంతో నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 34 వేల ఓట్లతో ఓడిపోయింది. కానీ ఆ తర్వాత ఏమైంది? మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబునాయుడు తన పార్టీలో చేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది? దాని తర్వాత నా పాదయాత్ర జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏం జరిగింది? ఒక సునామీ వచ్చింది. దేవుడు చంద్రబాబుకి ఎలా మొట్టికాయలు వేశాడో చూశాం. అదే నంద్యాలలో దాదాపు 40 వేల ఓట్లతో మనం గెలిచాము. చంద్రబాబు మన పార్టీ నుంచి చేర్చుకున్న 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు. సరిగ్గా ఆ సంఖ్యలోనే ఆ పార్టీ గెలిచింది. మన దగ్గర నుంచి వెళ్లిన వాడు ఎవడూ గెలవలేదు ఒకడు తప్ప. అందరూ ఓడిపోయినారు.’’జరగబోయేది కురుక్షేత్రంఇప్పటి ఈ ఎన్నికల కంటే కూడా రేపు పొద్దున జరగబోయే కురుక్షేత్రం ముఖ్యం. ఈ ఎన్నికల్లో చిన్న ప్రాణులను ఓడించడం కోసం చంద్రబాబు చేసిన అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగంపై కసి అన్నది ఆ ఎన్నికల్లో రావాలి. అలాంటి కసి కార్యకర్తలకు రావాలి. ఆ కార్యకర్తకు పార్టీ అన్ని రకాలుగా తోడుగా అండగా నిలబడుతుంది. ఇది కార్యకర్తల కోసం జరుగుతున్న ఎన్నికలు. మనం కార్యకర్తలకు తోడుగా ఉండాల్సిన ఎన్నికలు. ప్రజలకు తోడుగా కార్యకర్త నిలబడతాడు. కార్యకర్తకు తోడుగా పార్టీ నిలబడుతుంది అన్న సంకేతం ఈ ఎన్నికల ద్వారా మనం ఇవ్వాలి.స్థానిక ఎన్నికలపైనా చంద్రబాబు డ్రామా.. కుట్రఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే చంద్రబాబు ఆ ఎన్నికలు పెడతాడో లేదో తెలియదు. కానీ మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిజంగా స్థానిక ఎన్నికలు పెట్టే వాడే అయితే, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చే వాడు కాదు. దీనికి సంబంధించి నాడు మన హయాంలో ఇచ్చిన జీఓను కోర్టు కొట్టేసింది. అయినా అంతకన్నా ఎక్కువ పదవులు మనం బీసీలకు ఇచ్చాం. ఆ జడ్జిమెంట్ ఇప్పుడు కనిపిస్తోంది. ఆ బీసీ రిజర్వేషన్లు తెలంగాణాలోనూ కొట్టేశారు. అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా ఆ అవకాశం ఉందని తెలిసినా, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు డ్రామా చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ఎన్నికలు జరగకూడదు. వాయిదా పడాలన్నదే ఆయన కుట్ర. మరొకటి ‘సర్’. (ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ) వీళ్ళే అంటున్నారు ఇక్కడ 44 లక్షల ఓట్లు లేవు అని. అయితే పాత జాబితాలతో ఎన్నికలు పెడతాడా? దానికి ఏ కోర్టయినా ఒప్పుకుంటుందా? మరి చంద్రబాబు ఎన్నికలు పెట్టాలని ఇవన్నీ చేస్తున్నాడా? పెట్టకూడదని చేస్తున్నాడా? ఇది మేకపోతు గాంభీర్యం కాకపోతే ఇదంతా ఏమిటి? సరే, ఏదైనా కానీ, చంద్రబాబుగారు స్థానిక ఎన్నికలు పెడతాడని అనుకుని, ముందుకు పోదాం.ఎన్నికలు సాఫీగా జరిగే వీలు లేదుచంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికలు సాఫీగా జరుగుతాయని నేను అనుకోవడం లేదు. చంద్రబాబు అనే వ్యక్తి, తనను ప్రశ్నించే గొంతు వినడానికి సిద్ధంగా లేని మనిషి. చంద్రబాబుని ఎవరు ప్రశ్నించినా వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, నిర్బంధించడం, ప్రలోభాలు పెట్టడం, దిగజారిన రాజకీయాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు హయాంలో మనం చూస్తోంది రోజుకో డ్రామా. రోజుకో నటన. రోజుకో డైవర్షన్. ఇది కాక రెడ్బుక్ రాజ్యాంగం. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నికలు సాఫీగా జరుగుతాయని అనుకోవడం లేదు.సాఫీగా జరిగితే మనదే విజయంఎన్నికలు ఎలా జరిగినా ప్రజలకు తోడుగా వైఎస్సార్సీపీ ఉంటుంది అన్న భరోసా మాత్రం కచ్చితంగా ఇవ్వాలి. ఎన్నికలు కనుక సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎక్కడైనా సరే విజయం సాధిస్తారు. ఒకవేళ ఎన్నికలు సాఫీగా జరగకపోయినా, ప్రజలకు తోడుగా పోటీలో గట్టిగా మనం నిలబడదాం. చంద్రబాబు ఒకవేళ ఓడించే కార్యక్రమం, అధికార దుర్వినియోగం చేసే కార్యక్రమం, పోలీసులు జులుంను ఉపయోగించే కార్యక్రమం చేస్తే ఎవరిని ఓడించడం కోసం? ఆ చిన్న ప్రాణాన్ని ఓడించడం కోసం. ఆ చిన్న ఎంపీటీసీ స్థానం, ఆ చిన్న సర్పంచ్ స్థానం, ఆ చిన్న వార్డ్ మెంబర్ స్థానంలో ఉన్న వ్యక్తులను ఓడించడం కోసం. అందుకే అటువంటి చిన్న ప్రాణాలకు తోడుగా ఉండాలి. -
‘చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగిపోయారు’
సాక్షి, గుంటూరు: చంద్రబాబు పాలనను చూసి ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, చంద్రగిరి ఏసురత్నం, నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, అంబటి మురళీకృష్ణ, నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్ర బాబు, నియోజకవర్గ పరిశీలకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బయటపడకుండా చంద్రబాబు, లోకేష్ పోలీసులను అడ్డం పెట్టుకుని వ్యవహారం నడుపుతున్నారు. టీడీపీ వెన్నుపోటు పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి ప్రాణం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాల్సిందే.. గెలవాల్సిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డాం. వైఎస్ జగన్ సంక్షేమ పాలన అందిస్తే.. కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని ఆమె మండిపడ్డారు.మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. కూటమిలో ఉన్న పార్టీలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు మనకు సెమీ ఫైనల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు మిమ్మల్ని గెలిపిస్తారు.. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు నాయకులను గెలిపించాలి. పార్టీ జెండా మోసిన ప్రతి వ్యక్తి మా మా బిడ్డ లాంటి వాళ్లే. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. -
అరెస్ట్ను సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు: వీరశేఖర్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తే పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని, వారి భాషలోనే అంతకన్నా బలంగా సమాధానం ఇస్తామని.. తమ హుందాతనాన్ని చేతకానితనంగా భావించవద్దని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహనం నశించేలా తమను రెచ్చగొడితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు సంబంధించిన అంశాలపై కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.2014 నుంచి 2019 మధ్య కాలంలో ఫైబర్ నెట్, ఇసుక, మద్యం, అమరావతి భూములు, స్కిల్ డెవలప్మెంట్ వంటి అనేక స్కామ్లకు పాల్పడి, కోట్లు కొల్లగొట్టి, జైలుకు వెళ్లి మెడికల్ బెయిల్పై బయటికి వచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టస్ పేరుతో ఆ కేసులను కొట్టేయించుకున్న విధానంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మా సహనాన్ని తక్కువ అంచనా వేయొద్దు:వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేస్తే చూస్తూ ఊరుకోం. మా హుందాతనం చేతకానితనం అనుకోవద్దు. మీరు రాళ్లు వేస్తే మేము బండలు వేయగలం. మీరు పూలు పెడితే మేము పుష్పగుచ్ఛాలు ఇవ్వగలం. మీరు బూతులు తిడితే మేము కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము హుందాగా మాట్లాడుతున్నామంటే చేతకాక కాదు. మాపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయంగా విమర్శిస్తే రాజకీయంగానే సమాధానం ఇస్తాం. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి అనే దానిపై మాట్లాడాలి.కానీ చంద్రబాబు మాట్లాడటం మొదలుపెడితే బూతులు, అబద్ధ ప్రచారం, విషప్రచారం తప్ప మరేమీ కనిపించడం లేదు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ స్థాయికి దిగజారడం దురదృష్టకరం. మాజీ ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిపై వ్యక్తిగతంగా, నీచంగా మాట్లాడటం సరైంది కాదు. ముఖ్యమంత్రి అనే స్థాయిని చంద్రబాబు మర్చిపోకూడదు.2014 నుంచి 2019 మధ్య ఫైబర్నెట్, ఇసుక, మద్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, అమరావతి అసైన్డ్ భూములు, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన అనేక ఆరోపణలు వచ్చాయి. స్కిల్ కేసులో వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల ఆరోపణలతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే కోర్టు జైలుకు పంపింది. అలాంటిది కేసులు, అరెస్టులు, రిమాండ్లకు సంబంధించిన విషయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఏ విధమైన రాజకీయ సంస్కతి? తప్పు చేయకుండా ఒక సిద్ధాంతం కోసం పోరాడి జైలుకు వెళ్లినవాళ్లు గొప్పగా చెప్పుకుంటారు.కానీ తన అరెస్టును చంద్రబాబు సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు. స్కిల్ కేసులో అరెస్టు కాబటి జైల్లో ఉండొచ్చిన చంద్రబాబు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాడు? ఆయన మెడికల్ గ్రౌండ్స్పై బెయిల్ వచ్చాడే కానీ కేసుల్లో నిజాయితీ పరుడిగా నిర్ధారణ కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసులను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ పేరుతో తొలగించేసుకుంటున్నాడు.ముఖ్యమంత్రి పదవి చేపట్టింది తనపై ఉన్న కేసులను తొలగించుకోవడానికా? లేక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. కేసుల విషయంలో కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం, పోలీసులు తీసుకునే నిర్ణయాలపై కూడా ప్రజలకు వివరణ ఇవ్వాలి.లోకేశ్ బాగోతం బయట పెట్టమంటారా?వైఎస్ జగన్ చదువుల కోసం అమెరికా వెళ్లి హోమ్సిక్తో తిరిగి రావడం ఏమైనా పెద్ద తప్పా? చదువు కోసం అమెరికా వెళ్లి తల్లిదండ్రులను విడిచి ఉండలేక తిరిగి రావడాన్ని కూడా రాజకీయ విమర్శగా ఉపయోగించుకోవడం అన్యాయం. అప్పట్లో వైఎస్సార్.. చంద్రబాబు వ్యాఖ్యలకు ఇచ్చిన సమాధానం ప్రజలకు తెలుసు. వైఎస్ జగన్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్న చంద్రబాబు.. ముందుగా తన కుటుంబానికి సంబంధించిన ఆరోపణలపై సమాధానం చెప్పాలి. నారా లోకేష్కు సంబంధించి గతంలో వచ్చిన ఆరోపణలపై ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఇతరుల వ్యక్తిగత జీవితాలను ప్రశ్నించే ముందు తన కుటుంబంపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనాలు అన్నీ మర్చిపోయారు, తాను ఏది చెప్పినా నమ్ముతారు అనుకోవద్దు.దస్తగిరి టీడీపీ ఆఫీస్కు ఎందుకు వెళ్లారు?వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరికి టీడీపీ కార్యాలయంలో ఏం పని? ఆయనకు న్యాయ సహాయం ఎవరు అందించారు? ఈ అంశాలపై రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. వీటికి సమాధానం చెప్పిన తర్వాత వైఎస్ జగన్ గురించి మాట్లాడాలి. మేము హుందాగా మాట్లాడుతున్నాం. అంతే తప్ప, అది తమ బలహీనత కాదన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలని వీరశేఖర్రెడ్డి స్పష్టం చేశారు.


