breaking news
Sankranti 2026
-
Y జంక్షన్ వద్ద ప్రయాణికుల ఇక్కట్లు
-
దారి దోపిడీకి కూటమి ప్రభుత్వం పచ్చ జెండా!
-
పల్లెబాట పట్టిన హైదరాబాద్ వాసులు
-
సంక్రాంతికి వస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్/చౌటుప్పల్/సూర్యాపేట టౌన్ : నగరం నుంచి పండుగ ప్రయాణాలు మొదలయ్యాయి. శనివారం ఉదయం నుంచే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనంతో పోటెత్తాయి.ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, మియాపూర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, ఈసీఐఎల్, మెహిదీపట్నం, అమీర్పేట, సాగర్ రింగ్ రోడ్డు, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి శనివారం ప్రయాణికులు భారీ ఎత్తున సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 3,500 రెగ్యులర్ బస్సులతోపాటు మరో 300 బస్సులను అదనంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సిటీ బస్సులను సైతం దూర ప్రాంతాలకు నడుపుతున్నారు. శనివారం 75 సిటీ బస్సులను విజయవాడ, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట తదితర ప్రాంతాలకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాల్లో సైతం పెద్ద ఎత్తున తరలివెళ్లారు. దీంతో విజయవాడ, వరంగల్, కర్నూలు రహదారులు వాహనాలతో పోటెత్తాయి. రైళ్లలో కిక్కిరిసిన జనరల్ బోగీలు... సాధారణ రైళ్లతోపాటు వివిధ మార్గాల్లో సుమారు 60 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. రద్దీ దృష్ట్యా అన్ని రైళ్లలోనూ బెర్తులు బుక్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు జనరల్ బోగీల్లో తరలి వెళ్లారు. సికింద్రాబాద్, చర్లపల్లి, లింగంపల్లి తదితర స్టేషన్ల నుంచి శనివారం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బయలుదేరారు. సాధారణంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నిత్యం సుమారు 1.85 లక్షల మంది ప్రయాణం చేస్తారు. శనివారం సుమారు 2.20 లక్షల మంది తరలి వెళ్లినట్లు అంచనా, లింగంపల్లి, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. జాతీయ రహదారిపై రద్దీ పండుగ నేపథ్యంలో ప్రజానీకం సొంతూళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఏర్పడింది. ఈ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా నుంచి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం సాయంత్రం 5గంటల వరకు విజయవాడ వైపు 55వేల వాహనాలు వెళ్లాయి. పంతంగి టోల్ప్లాజా వద్ద మొత్తం 16టోల్బూత్లు ఉన్నాయి. ప్రస్తుతం రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ వైపునకు 12బూత్లు కేటాయించారు. హైదరాబాద్ మార్గంలో నాలుగు బూత్ల ద్వారా వాహనాలను పంపిస్తున్నారు. అయితే, అదనంగా కేటాయించిన టోల్బూత్లకు ఫాస్టాగ్ స్కానింగ్ చేసే అవకాశం ఉండదు. స్కానింగ్ వ్యవస్థ వెనుక భాగంలో ఉండడంతో విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలకు ఆటోమెటిక్ స్కానింగ్కు అవకాశం లేదు. దీంతో ఆ నాలుగు బూత్ల వద్ద హ్యాండ్ మిషన్ ద్వారా స్కానింగ్ చేస్తున్నారు. ఇందుకుగాను అక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రద్దీని తట్టుకునేలా సిబ్బంది హ్యాండ్ గన్లతో సిద్ధంగా ఉంటూ స్కాన్ చేస్తున్నారు. -
ఆంధ్రప్రదేశ్లో దారి దోపిడీకి పచ్చజెండా... సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు తలాడిస్తున్న కూటమి ప్రభుత్వం
-
సంక్రాంతికి పల్లె బాట.. ఒక్కసారిగా పెరిగిన వాహనాల రద్దీ
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు పల్లెలకు క్యూ కట్టారు. ఏపీకి వెళ్లే వారి వాహనాలతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగిపోయింది. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంతంగి టోల్ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి.ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద..ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ జామ్తో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్... విజయవాడ హైవే ఇబ్రహీంపట్నం వద్ద వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు, రేపు(శని, ఆది) ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉందని.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఐ చంద్రశేఖర్ అన్నారు.హైదరాబాద్లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్..హైదరాబాద్లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిటీ కాలేజీ, ఎంజే మార్కెట్, బేగంబజార్, హైకోర్టు, ఆఫ్జల్గంజ్, నయాపూల్ భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. వీకెండ్ సంక్రాంతి సెలవులు, ఎగ్జిబిషన్ కారణంగా రద్దీ నెలకొంది.విజయవాడలో..పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతికి సొంత గ్రామాలకు ప్రజలు ప్రయాణమయ్యారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కావడంతో రద్దీ పెరిగింది. ఇవాళ ఉదయం నుండి ప్రయాణికులతో బస్టాండ్లు రద్దీగా మారాయి. -
ట్రాఫిక్ దెబ్బకు కారు వదిలేసి నడుచుకుంటూ..
-
సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్
రైల్వేస్టేషన్(విజయవాడ): తెలుగింట పెద్ద పండుగ సంక్రాంతికి అనేక ప్రాంతాల నుంచి వారి స్వగ్రామాలకు తరలివెళ్లే ప్రజలతో రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలోని జంట నగరాల నుంచి ఏపీలోని ముఖ్యపట్టణాలకు బయలుదేరే ప్రయాణికులతో ఇప్పటికే నడుస్తున్న రెగ్యూలర్ రైళ్లు రిజర్వేషన్లు పూర్తయ్యి వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ కోసం అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్లాట్ఫాంలు కిటకిట.. సంక్రాంతి పండుగకు పాఠశాలలు, కశాశాలలకు సెలవులు రావటంతో విద్యార్థులు, ఉద్యోగులు రైళ్లలో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో విజయవాడ రైల్వేస్టేషన్కు చేరుకుంటుండటంతో అన్ని ప్లాట్ఫాంలు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఒకటి, ఆరు, ఏడు ప్లాట్ఫాంలలో ఈ రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులతో పాటుగా విజయవాడ, పరిసర ప్రాంతాలలో చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువగా విజయనగరం, విశాఖ, కాకినాడ, భీమవరం, నర్సాపూర్, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు స్టేషన్కు వస్తుండటంతో ప్లాట్ఫాంలు రద్దీగా మారాయి. ప్రైవేటు బస్సులలో చార్జీలు రెట్టింపు వసూలు చేస్తుండటంతో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రైలు మార్గం ఎంచుకోవడంతో రెగ్యులర్ రైళ్లు నెలరోజుల కిత్రమే నిండిపోయి భారీగా వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోయింది. దీంతో రైల్వేఅధికారులు ఎప్పటికప్పుడు రద్దీకి అనుగుణంగా డిమాండ్ ఉన్న మార్గాలలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు.విజయవాడ మీదుగా 150 ప్రత్యేక రైళ్లు.. హైదరాబాద్, సికింద్రాబాద్ల నుంచి ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, నర్సాపూర్, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఆ మార్గంలో నడిచే రైళ్లలో తీవ్ర రద్దీ నెలకొంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 21 వరకు 150 సంక్రాంతి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సంఖ్యను తగ్గించేందుకు సమీపంలోని సికింద్రాబాద్తో పాటు కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి, లింగంపల్లి, వికారాబాద్ నుంచి విజయవాడ మీదుగా కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతుండటంతో పాటుగా హైటెక్ సిటీ, లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్లలో పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా స్టాపేజీ సదుపాయం కల్పించారు. -
పందెం కోడి కయ్యానికి రెఢీ..!
సంక్రాంతి వచ్చిందంటే..కోడి పందేల జోషే వేరు. పండుగ ముందుగానే బరులు సిద్ధమవుతాయి. పందెంకోళ్లు యుద్ధ క్షేత్రంలోకి దిగుతాయి. శిక్షణ పొందిన కోళ్లు హోరా హోరీగా పోట్లాడుతాయి. ఊపిరి ఆగేదాక రక్తం చిందించి మరీ పోరాడతాయి.బరిలో దిగిన కోడి గెలిస్తే ప్రపంచాన్ని జయించిన సంతోషం. ఈ పందేల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. పందేలు నిర్వహించేందుకు పోలీసుల అనుమతి కోసం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సంక్రాంతి పండుగ సంబరాల్లో కోడి పందేలు ప్రత్యేకం. మూడు రోజుల ముందుగానే జిల్లాలో బరులు సిద్ధమయ్యాయి. తీరప్రాంతాల్లోని గ్రామాల్లో కోడి పందేల నిర్వాహకులు ఢీ అంటే ఢీ అంటున్నారు. కత్తి కట్టి కదనరంగానికి దూకేందుకు కోళ్లను దువ్వుతున్నారు. జిల్లాలోని తూర్పు ప్రాంతం, తీర ప్రాంతాలు, పశి్చమ ప్రకాశంలోని కొన్ని గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించనున్నట్లు సమాచారం. అధికార టీడీపీ నాయకులు బరులు తమ ఆ«దీనంలో ఉంచుకునేందుకు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. పల్లెసీమల్లో కోడి పందేల జోష్... జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించడానికి సన్నాహాలు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రతిసారి కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లోని తీర ప్రాంతాల్లో ఎక్కువగా కోడి పందేలు నిర్వహిస్తుంటారని వినికిడి. ఈ ఏడాది కూడా ఆయా ప్రాంతాల్లో మూడు రోజులు ముందుగానే బరులు సిద్ధం చేసినట్లు చెప్పుకుంటున్నారు. కొత్తపట్నం మండలంలోని మోటుమాల, రాజుపాలెం, గవండ్లపాలెం, మడనూరు, రాజుపాలెం పట్టపుపాలెం, గుండమాల గ్రామాల్లో కోడి పందేలు నిర్వహిస్తుంటారని సమాచారం. ఒంగోలు మండలంలోని కరవది, గుండాయిపాలెం సముద్రం ఒడ్డున, చేజర్ల, పాతపాడు తదితర గ్రామాల్లో ఇప్పటికే బరులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సింగరాయకొండ మండలంలోని పాకల, పాత సింగరాయకొండ, ఊళ్లపాలెం, సోమరాజుపల్లి, జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు, పొన్నలూరు మండలంలోని కె.అగ్రహారం గ్రామాల్లో పోటాపోటీగా పందేలు నిర్వహించేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం. టంగుటూరు మండలంలోని కొణిజేడు, కొత్తపట్నం మండలంలోని రాజుపాలెం, గవళ్లపాలెం, సింగరాయకొండ మండలంలోని పాకల గ్రామాల్లో జరిగే పోటీలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి జనాలు అత్యధికంగా వస్తుంటారని చెప్పుకుంటున్నారు. చీమకుర్తి మండలంలోని తొర్రగుడిపాడు, ఎర్రగుడిపాడు గ్రామాల్లో భారీ ఎత్తున పందేలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. అలాగే గుడ్లూరు సరిహద్దులోని రామాయపట్నం, కొండపి, సంతనూతలపాడు సరిహద్దుల్లోని మద్దలూరు వాగు ఒడ్డులో కోడి పందేలు నిర్వహించేందుకు గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామాల శివారు ప్రాంతాల్లో కోడి పందేలు పుంజుకుంటున్నాయి. అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి, జె.పంగులూరు, సంతమాగులూరు, కొరిశపాడు మండలాల్లో కూడా అక్కడక్కడా కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ.... జిల్లాలో పందెం కోళ్లను ప్రత్యేకంగా పెంచి అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. చీమకుర్తి రోడ్డు, దర్శి దగ్గర రాజంపల్లి, తాళ్లూరు, తూర్పు గంగవరం, కొత్తపట్నం మండలంలోని మడనూరు గ్రామాల్లో పందెం కోళ్లను ప్రత్యేకంగా పెంచుతున్నట్లు తెలుస్తోంది. పందెం కోళ్లకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. కోడి పుంజులను వాటి రంగు, ఎత్తు, పోరాట పటిమ ఆధారంగా ధర నిర్ణయిస్తారు. ఒక్కో కోడి రూ.10 వేల నుంచి లక్ష రూపాయలు విక్రయిస్తుంటారని సమాచారం. ఈ కోళ్లను కొందరు ఇళ్ల వద్దనే పెంచితే మరికొందరు మాత్రం పొలాలు, చెరువుల వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంటారు. వీటికి బాదంపప్పు, పిస్తా, జీడిపప్పుతో పాటుగా కోడిగుడ్లు, మటన్ వంటి పౌష్టికాహారాన్ని తినిపిస్తారు. అలాగే పందేలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.రూ.కోట్లలో పందేలు... జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించే కోడి పందేల్లో భారీగా చేతులు మారుతాయని ప్రచారం జరుగుతోంది. పందెంకాసిన దానికి రెట్టింపు లాభం వస్తుండడంతో బెట్టింగ్ రాయుళ్లు కొందరు అప్పులు చేసి మరీ పందెం కాస్తుంటారని ప్రచారం జరుగుతోంది. రెండు గ్రూపులను కలిపి జోళ్లు అని పిలుస్తుంటారని, జోళ్లు పందెం కాసినవాళ్లు లక్ష, రెండు లక్షల రూపాయలు కాస్తుంటారని చెబుతున్నారు. ఇలాంటి పోటీలకు నెల్లూరు, గుంటూరు నుంచి ఇక్కడకు వస్తుంటారని సమాచారం.నెమలి...అబ్రాస్...సీతువా... పందెం కోళ్లను చాలా మక్కువగా పెంచుతుంటారు. వాటికి ఖరీదైన ఆహారం ఇస్తుంటారు. అంతేకాకుండా ముద్దుగా నెమలి, అబ్రాస్, సీతువా వంటి పేర్లతో పిలుచుకుంటుంటారు. కాకిడేగ, కక్కెర, రసంగి, పింగల, కాశీ, కొక్కెరాయి వంటి పేర్లతో పిలుస్తుంటారు. కత్తి కట్టి కదన రంగంలోకి... కోడి పందేల సమయంలో పందెం కోళ్లకు కత్తి కట్టి బరిలోకి దింపుతారు. హోరాహోరీగా జరిగే పోరులో ఓటమిపాలైన కోడి కత్తి గాయాలతో తీవ్రంగా గాయపడి మరణిస్తుంటాయి. వన్యప్రాణి ప్రేమికుల విజ్ఞప్తి మేరకు పందెం సమయంలో కత్తి కట్టకూడదని ప్రభుత్వం ఆదేశాలున్నాయి. అయితే ప్రభుత్వం విధించిన నిబంధనలు పట్టించుకునే వారు లేరు. సంప్రదాయం ప్రకారం సరదాగా కోడి పందెం నిర్వహిస్తున్నట్లు చెబుతున్న నిర్వాహకులు దీన్ని ఫక్తు వ్యాపార ధోరణిలోనే సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో పందెం కోళ్లకు కత్తులు తయారు చేసేవారున్నారు. నగరంతో పాటుగా అనేక మండలాల్లో కత్తులు తయారు చేస్తున్న సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పోలీసుల అనుమతి కోసం ఒత్తిళ్లు... సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లాలో కోడి పందేలు నిర్వహించుకోడానికి పోలీసుల అనుమతి కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఎస్పీ హర్షవర్థన్ రాజు విముఖంగా ఉండడంతో ప్రభుత్వ పెద్దల నుంచి చక్రం తిప్పేందుకు కొందరు ఎమ్మెల్యేలు ప్రయతి్నస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కోడి పందేలకు ఇలాగే అనుమతి తెచ్చుకున్నారు. ఈ ఏడాది కూడా పోలీసుల అనుమతి ఇప్పించాలని అధికార పార్టీకి చెందిన నిర్వాహకులు కోరుతున్నారు. -
సంక్రాంతి రష్.. భారీగా ట్రాఫిక్ జామ్
-
సంక్రాంతి ప్రయాణం.. MGBSలో భారీ రద్దీ..
-
హెవీ ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసిన పంతంగి టోల్ ప్లాజా
-
Hyd: సంక్రాంతి పండుగ రద్దీ షురూ..
హైదరాబాద్: సంక్రాంతి పండుగ హడావుడి మొదలైంది. ప్రధానంగా నగరాలను నుంచి పల్లెలకు వెళ్లే జనం.. శుక్రవారం(జనవరి 9వ తేదీ) నుంచే క్యూకట్టేశారు. దాంతో హైదరాబాద్ బిజీబిజీగా కనిపిస్తోంది. నిన్న రాత్రి నుంచే సొంతూళ్లకు పయనమవుతున్నారు నగరవాసులు. ప్రధానంగా ఏపీకి వెళ్లే ప్రయాణికులతో అటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారిపోయాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. మరొకవైప ఇప్పటికే పంతంగి టోల్ప్లాజా వద్ద బారులు తీరాయి వాహనాలు. సంక్రాంతి నేపథ్యంలో హైవే 65పై ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు.విజయవాడ వైపు టేకుమట్ల వద్దపాత డైవర్షన్ ఎత్తివేశారు. రాజమండ్రి-విశాఖ వైపు వెళ్లే వాహనాలు నకిరేకల్వైపు మళ్లిస్తున్నారు. హైదరాబాద్-గుంటూరు వెళ్లేవాహనాలు నార్కెట్పల్లి వైపు మళ్లిస్తున్నారు. నియంత్రణకు చర్యలు..సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల రాకపోకలు సాఫీగా సాగేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, చర్లపల్లి, కాచిగూడ స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైళ్ల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ప్రతిరోజూ 2.2 లక్షల మంది.. సికింద్రాబాద్ స్టేషన్లో ప్రస్తుతం సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రతి రోజు సగటున 2.2 లక్షల మంది ప్రయాణం చేయనున్నారు. లింగంపల్లి నుంచి 50 వేల మంది, నాంపల్లి నుంచి మరో 35 వేల మంది ప్రయాణం చేయనున్నట్లు అంచనా. దీంతో అన్నిచోట్లా అదనపు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ స్టేషన్లో 17 టిక్కెట్ బుకింగ్ కేంద్రాలతో పాటు 20 ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్లను అందుబాటులో ఉంచారు. తొక్కిసలాటకు తావివ్వకుండా.. రైళ్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తొక్కిసలాట వంటివి చోటుచేసుకోకుండా ఆరీ్పఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో అవసరమైన సహాయ సహకారాలను అందజేసేందుకు టీటీఈలను అదనంగా నియమించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రవేశ, నిష్క్రమణ కేంద్రాల వద్ద నిఘాను కట్టుదిట్టం చేశారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరభివృద్ధి పనుల దృష్ట్యా, ప్రస్తుతం ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు పార్కింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ.. పరిమితంగా పికప్,డ్రాప్ సదుపాయం మాత్రం ఉంటుంది. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు విశాలమైన పార్కింగ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, తదితర అన్ని సదుపాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు.అదనపు ఏర్పాట్లు ఇలా.. పదో నెంబర్ ప్లాట్ఫామ్ గేట్– 2, గేట్– 4 వద్ద కొత్త హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లోని 24 రైళ్లకు లింగంపల్లి, హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో అదనపు హాల్టింగ్ సదుపాయాన్ని కల్పించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పటిష్టమైన సీసీటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. టికెట్ బుకింగ్ కౌంటర్లను పెంచారు. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లను అందుబాటులో ఉంచారు. రైల్వేశాఖ ఇటీవల ప్రవేశపెట్టిన ‘రైల్వన్’ యాప్ ద్వారా సాధారణ టికెట్లు బుక్ చేసుకొనే ప్రయాణికులకు 3 శాతం రాయితీ లభించనుంది. ఈ నెల 14 నుంచి జూలై 14వ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.


