-
ప్రాణం తీసిన పబ్జీ గేమ్.. ఏకంగా సెల్ టవర్ ఎక్కి.. పైనుంచి..
సాక్షి, ఆదిలాబాద్: పబ్జీ గేమ్కు బానిసై ఏడాది క్రితం మానసిక స్థితి కోల్పోయిన ఓ యువకుడు సెల్ టవర్ పైనుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, ఎస్సై సునిల్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన దుర్వ జగదీశ్–మోహన్బాయి దంపతుల కుమారుడు వికాస్(19) ఇంటర్ మధ్యలోనే మానేశాడు. పబ్జీ గేమ్కు అలవాటు పడి ఇంట్లోనే ఉంటూ ఏడాది క్రితం మానసిక స్థితి కోల్పోయాడు. శనివారం రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కుటుంబసభ్యులు గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. రాత్రి దేవాపూర్ నుంచి ముత్నూర్ గ్రామానికి చేరుకొని గ్రామ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి పైనుంచి కింద పడి మృతిచెందాడు. గ్రామస్తులు ఆదివారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మానసిక స్థితి సరిగా లేక సెల్టవర్ ఎక్కి పైనుంచి పడిపోవడంతోనే మృతిచెందినట్లు నిర్ధారించారు. తల్లి మోహన్బాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మరో ‘పబ్జీ’ దారుణం: తల్లిదండ్రులపై దాడికి తెగబడి..
ఉత్తరప్రదేశ్లోని జాన్సీకి చెందిన ఒక యువకుడు పబ్జీ ఆడుతూ, తన మనసుపై నియంత్రణ కోల్పోయి, తల్లిదండ్రులను అత్యంత దారుణంగా చావబాదాడు. రోజూ పాలుపోసే వ్యక్తి వారి ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం వెలుగుచూసింది. పాలుపోసే వ్యక్తి వారి ఇంటిలోకి వెళ్లి చూడగా ఇంటి యజమాని, అతని భార్య రక్తపు మడుగులో అతనికి కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందించిన పాలుపోసే వ్యక్తి ఈ దారుణ ఘటన జాన్సీ పట్టణంలోని నవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుమనాబాద్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మీప్రసాద్(60) అతని భార్య విమల(55) కుమారుడు అంకిత్(28) ఉంటున్నారు. ఉదయం పాలుపోసే వ్యక్తి వారి ఇంటి తలుపు తట్టాడు. లోపలి నుంచి ఎటువంటి సమాధానం వినిపించలేదు. దీంతో అతను ఇంటిలోనికి వెళ్లి చూశాడు. అక్కడ రక్తపుమడుగులో లక్ష్మీప్రసాద్, విమల అతనికి కనిపించారు. వారి పక్కనే అంకిత్ కూర్చుని ఉన్నాడు. ఆసుపత్రికి చేరుకునేలోగానే.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ దంపతులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోగానే లక్ష్మీప్రసాద్ మృతిచెందగా, చికిత్స పొందుతూ విమల కన్నుమూసింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడు అంకిత్ను అరెస్టు చేసి, అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులపై కర్రతో తీవ్రంగా దాడి ఈ కేసు గురించి పోలీసు అధికారి రాజేష్ మాట్లాడుతూ నిందితుడు అంకిత్ తన తల్లిదండ్రులపై కర్రతో తీవ్రంగా దాడి చేశాడని, ఫలితంగానే వారు మృతి చెందారని తెలిపారు. మానసిక స్థితి దెబ్బతినడంతోనే తాను అలా చేశానని అంకిత్ పోలీసుల ముందు తన తప్పు ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం పబ్జీ గేమ్ ఆడుతూ.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అంకిత్కు రెండేళ్లుగా మానసిక స్థితి సరిగా లేదు. నిత్యం పబ్జీ గేమ్ ఆడుతుంటాడు. ఈ గేమ్ కారణంగా అతని మానసిక స్థితి మరింత దిగజారింది. ఈ ఘటనలో అంకిత్ తొలుత తండ్రిపై, తరువాత తల్లిపై దాడి చేశాడని సమాచారం. ఇది కూడా చదవండి: టమాటాలను వదలి అవకాడోలపై పడుతున్న జనం! -
పబ్జీ లవ్స్టోరీ: పాకిస్థాన్లో నిన్ను ప్రేమించేవాడే దొరకలేదా?
గ్రేటర్ నోయిడా: 'పాకిస్తాన్ ప్రియురాలు - భారత ప్రేమికుడు'.. ఈ కథ ఆ జంట దృష్టిలో సుఖాంతమైంది కానీ లోకం దృష్టిలో మాత్రం డైలీ సీరియల్లా సాగుతూనే ఉంది. చట్టం ఎలాగు తన పని తాను చేసుకుంటూ పోతుంది. వచ్చిన సమస్యల్లా ఇరుగుపొరుగు వారితోనే. మొన్నామధ్య వీరి ఇంటికి పొరుగున ఉండే ఒకామె సచిన్ పైనా సీమా హైదర్ పైనా వ్యాఖ్యలు చేసి ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె వీడియోనే హల్చల్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఆ వ్యాఖ్యలతో మీమర్లకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. తాజాగా ఆమె మరోసారి అదే అంశంపై సరికొత్త కామెంట్లతో తెరపైకి వచ్చింది. Anger issues comedy: "Lappu sa Sachin" & "Jhingur sa ladka" 😂😂pic.twitter.com/2DI4dliGls — Marathi Walter 🇮🇳 𝕏 (@dotnagpur) July 19, 2023 ఈసారైతే ఆమె ర్యాగింగ్ నెక్స్ట్ లెవెల్లో చేసింది... ఆ మహాతల్లికి ఒక తోడు కావాలి? వాడు మగవాడైతే చాలు. వీడు చూస్తే ఎండిపోయి మిడత పురుగులా ఉంటాడు, బలంగా గాలి వీస్తే చాలు, ఎంత దూరం వెళ్లి పడతాడో ఎవ్వరికీ తెలియదు. మీరంతా కలిసి వెతికినా వాడిని కనుగొనలేరు. ఇక ఆమె విషయానికి వస్తే ఆవిడకి పాకిస్థాన్లో ఎక్కడా ప్రేమ దొరకలేదు. వీడిని ప్రేమించి నలుగురు పిల్లలతో సహా వాలిపోయిందని ఆగకుండా మాట్లాడుతూనే ఉంది. Her kids learning alphabet: J for Jhingoor K for Keeda L for Lappu pic.twitter.com/TEmqGyp75A — Sagar (@sagarcasm) August 2, 2023 ఈ వీడియో కూడా మొదటి వీడియోలాగే ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. కామెంట్లు చేసేవారు పాకిస్తాన్ జోడీ గురించి పక్కనబెట్టి ఈమె గురించే కామెంట్లు పెడుతున్నారు. 'ఈ మహాతల్లిని ఆ మహానుభావుడు(మహిళ భర్త) ఎలా భరిస్తున్నాడో' అంటూ ఒకరు, 'నీ బాధ ఏంటమ్మా.. వాడి తల్లిదండ్రులు కూడా నీ అంత బాధపడి ఉండరు..' అని మరొకరు ఇలా సరదా కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా యాష్ రాజ్ ముఖతే అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఈమె చేసిన కామెంట్లనే పాటగా రాగం కట్టారు. ఈ వీడియో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది. Haha haha. “Kya hai Sachin mey” has been immortalised 😂#SeemaHaider pic.twitter.com/8GFpat6V17 — Smita Prakash (@smitaprakash) August 4, 2023 ఇది కూడా చదవండి: సుప్రీం తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీకి లాలూ డిన్నర్ పార్టీ -
రాజకీయాల్లోకి పాక్ మహిళ సీమా హైదర్.. ఆమెకు టికెట్ ఇస్తాం.. కానీ
సీమా గులామ్ హైదర్.. ఇటీవల ఈ మహిళ పేరు వార్తల్లో నిలుస్తోంది. ఆన్లైన్ ప్రియుడి కోసం ఏకంగా పాకిస్తాన్ నుంచి ఉత్తరప్రదేశ్కు తన నలుగురు పిల్లలను వెంటేసుకుని మరీ వచ్చిన ఈమె.. భారత్లో అడుగుపెట్టినప్పటి నుంచి నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే ఓ బాలీవుడ్ చిత్రంలో అవకాశం రాగా, ఆశ్చర్యకరంగా రాజకీయాల్లో కూడా ఆమెకు ఆహ్వానం దక్కింది. దీంతో నెటిజన్లు సైతం షాక్లో ఉన్నారు. తాజాగా దీనిపై ఆ పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పందించారు. టికెట్ అక్కడికి ఇస్తాం పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ ఆర్పీఐలో చేరడంపై ఆయన మాట్లాడుతూ.. సీమాతో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. పాక్ నుంచి భారత్కు వచ్చిన సీమా హైదర్ను తమ పార్టీలో ఎలా చేర్చుకుంటామన్నారు. మాసూమ్ కిషోర్ తనను సంప్రదించకుండానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆమెకు టికెట్ ఇవ్వాల్సి వస్తే భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లేందుకు టికెట్ ఇస్తామని, ఎన్నికల్లో పోటీ కోసం కాదని తేల్చి చెప్పారు. కాగా కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) నేత మాసూమ్ కిషోర్ దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీమా హైదర్ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా చేస్తామని చెప్పారు. అలాగే సీమా హైదర్ హిందీ, ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతుండటంతో పార్టీ అధికార ప్రతినిధి అయ్యే అవకాశం కూడా ఉందన్నారు. అంతేగాక తమ పార్టీ తరుఫున ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. సీమా హైదర్ గురించి దర్యాప్తు జరుగుతుండటంతో సంబంధిత సంస్థల నుంచి క్లీన్చిట్ కోసం తాము ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ..సీమా హైదర్ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆమె సోదరుడు అసిఫ్, మామ గులాం అక్బర్ కూడా పాక్ సైన్యంలో పని చేస్తుండటంతో సీమాపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం పోలీసులు కూడా ఆమెను పలుమార్లు విచారించారు. -
సినిమాల్లోకి సీమా హైదర్.. 'రా' ఏజెంట్గా పబ్జీ లవర్!
ఫోన్లో గేమ్స్ అనేవి కాలక్షేపానికి. కానీ ఇక్కడ వీళ్లిద్దరు మాత్రం సీరియస్గా తీసుకున్నారు. పబ్జీ ఆటలో పరిచయమైన ఓ యువకుడి కోసం ఓ వివాహిత తన భర్తనే వదిలేసింది. ఆన్లైన్ ప్రియుడి కోసం ఏకంగా పాకిస్తాన్ నుంచి ఉత్తరప్రదేశ్కు తన నలుగురు పిల్లలను వెంటేసుకుని మరీ వచ్చింది. అతడి పేరు సచిన్, ఆమె పేరు సీమా గులామ్ హైదర్. వీరి లవ్ స్టోరీ కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. భర్తకు గుడ్బై.. నా భార్యను పంపించండి మహాప్రభో అని అటు భర్త లబోదిబోమని మొత్తుకుంటుంటే ఇటు సీమ మాత్రం పాక్కు తిరిగి వెళ్లేదే లేదని భీష్మించుకుని కూర్చుంది. మే 13న ఆమె ఇండియాలోకి ప్రవేశించగా జూలై 4న పోలీసులకు ఈ విషయం తెలిసింది. అక్రమ చొరబాటు కేసు నమోదు చేసి సీమాను ఆమెకు నివాసం ఇచ్చిన సచిన్ను, అతడి తండ్రిని అరెస్ట్ చేయగా బెయిల్పై బయటకు వచ్చారు. సీమా హైదర్ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆమె సోదరుడు అసిఫ్, మామ గులాం అక్బర్ కూడా పాక్ సైన్యంలో పని చేస్తుండటంతో సీమాపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం పోలీసులు కూడా ఆమెను పలుమార్లు విచారించారు. ఆడిషన్స్ కూడా! ఇంత సీన్ చేసిన సీమా త్వరలో సినిమాల్లోకి రానుందట! ఎ టైలర్ మర్డర్ స్టోరీ అనే చిత్రం కోసం ఆమె ఆడిషన్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన రాజస్థాన్ ఉదయ్పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న జానీ ఫైర్ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ గ్రేటర్ నోయిడాలో సీమాకు ఆడిషన్స్ నిర్వహించింది. ఈ క్రమంలో డైరెక్టర్స్ జయంత్ సిన్హా, భరత్ సింగ్ను ఆమె కలిసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె ఐఎస్ఐ ఏజెంటా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తను ఏకంగా రా ఆఫీసర్గా నటించేందుకు సిద్ధమవుతోందట! చదవండి: ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య.. అప్పుల బాధ తట్టుకోలేకే..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement