పబ్‌ జీ ఓడిపోయాడని రూ. 3 లక్షల దొంగతనం! | 12 Old Boy Steals Rs 3 Lakhs From Parents For Losing PubG Game In Gujarat | Sakshi
Sakshi News home page

పబ్‌ జీ ఎఫెక్ట్‌: ఇంట్లో దొంగతనం చేసిన బాలుడు

Mar 3 2020 4:48 PM | Updated on Mar 3 2020 6:58 PM

12 Old Boy Steals Rs 3 Lakhs From Parents For Losing PubG Game In Gujarat - Sakshi

గాంధీనగర్‌: గుజరాత్‌లో మరో పబ్‌జీ కేసు నమోదైంది. పబ్‌జీ ఆటలో ఓడిపోయినందుకు ఓ 12 ఏళ్ల బాలుడు తన ఇంట్లో దొంగతనం చేసిన వింత ఘటన కచ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం విషయం వెలుగులోకి వచ్చింది. కిరాణ దుకాణం నడుతున్న బాలుడి తల్లిదండ్రులు తమ బిరువాలో డబ్బు దొంగతనానికి గురవుతున్నట్లు గుర్తించారు. ఇక ఈ విషయంపై నిఘా పెట్టిన వారికి సోమవారం రాత్రి బాలుడు డబ్బులు దొంగతనం చేస్తూ తల్లిదండ్రులకు దొరికిపోయాడు. ఈ విషయంపై కొడుకుని పట్టుకుని ప్రశ్నించడంతో.. అతను తన స్నేహితులతో కలిసి పబ్‌ జీ ఆడుతూ ఓడిపోవడంతో ఇంట్లోని బిరువాలో ఉన్న రూ. 3 లక్షలను దొంగతనం చేశానని ఒప్పకున్నట్లు బాధిత తల్లిదండ్రలు పోలీసులకు తెలిపారు.

కాగా.. కొంత మంది యువకులు తమ కొడుకుని ఖరీదైనా మొబైల్‌ ఫొన్‌లకు, గేమ్‌లకు ఆకర్షితుడు అయ్యేలా చేశారని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఈ కోణంలో బాలుడిని విచారించడంతో తాను దొంగలించిన డబ్బును వారికి ఇచ్చానని.. వారు ఆ డబ్బుతో ఖరిదైనా ఫోన్‌లు కొనుకున్నట్లు పోలీసులకు చెప్పాడు. ​కాగా వారు కావాలనే తమ కొడుకుని దొంగతనం చేసేలా ప్రొత్సహించి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసుపై దర్యాప్తు చేపట్టి యువకులను అదుపులోకి తీసుకుని విచారించడంతో వారు డబ్బు కోసమే బాలుడిని ట్రాప్‌ చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇక వారంత మైనర్లు కావడంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement