పబ్జీ ఆడొద్దన్నందుకు కుటుంబాన్నే కాల్చేశాడు..!

Pak Boy 14 Shoots Dead Entire Family Under PUBG Influence: Police - Sakshi

ఇస్లామాబాద్​: సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆన్​లైన్ క్లాసులు వినడానికి మొబైల్​ ఫోన్​లు కొనిస్తున్నారు. అయితే, కొందరు పిల్లలు వీటిని ఆటల కోసం, అశ్లీల వీడియోలు చూస్తూ ఫోన్​ను దుర్వినియోగం చేస్తున్నారు. అయితే, కొందరు పిల్లలు పబ్జీ ఆటలకు, ఇతరవాటికి బానిసలుగా మారి వికృతంగా ప్రవర్తిస్తున్నారు. పబ్జీ గేమ్​కు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు బానిసలుగా మారిన విషయం మనకు తెలిసిందే.

పబ్జీ ఆటకు బానిసలుగా మారి కొందరు తమ విచక్షణను కోల్పోతున్నారు. దీని కోసం..  కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు ఆడొద్దని వారించిన వారిని చంపిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి పాకిస్తాన్​లో పంజాబ్​ ప్రావిన్స్​లో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..  నహిద్​ ముబారక్​ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కహ్నా ప్రాంతంలో ఉండేవాడు.

ఈ క్రమంలో అతనికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా,  14 ఏళ్ల అతని కుమారుడు కొన్ని రోజులుగా చదువుపై శ్రద్ధపెట్టడంలేదని అతని తల్లి వారించింది. అతను పబ్జీ ఆటను మానేయాలని హెచ్చరించింది. దీంతో విచక్షణ కోల్పోయిన బాలుడు.. తన తల్లితో సహా ఇద్దరు మైనర్​ సోదరీమణులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు.

ఆ తర్వాత సదరు బాలుడు.. ఇంటి బయటకు వచ్చి అలారం  శబ్ధం చేశాడు. తన కుటుంబాన్ని ఎవరో చంపారని తెలిపాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కాగా, నహిద్​ తన కుటుంబ రక్షణ కోసం లైసెన్స్​డ్​ రివాల్వర్​ను తన ఇంట్లో పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల తర్వాత నిందితుడు గన్​ను ఎక్కడ పారేశాడో తెలియలేదు.  

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు. కాగా, పాక్​ పత్రిక డాన్​ ప్రకారం.. ఆన్​లైన్​ పబ్జీ గేమ్​   సంబంధించి ఇది నాల్గవ నేరమని తెలిపింది. కాగా, డబ్ల్యూహెచ్​వో ఇప్పటికే  గేమింగ్​ డిజార్డర్​ను ఒక వ్యాధిగా గుర్తించింది. వీరు ఈ ఆటకు బానిసలుగా మారి తమ విచక్షణను కోల్పోయి విపరీతంగా ప్రవర్తిస్తారని తెలిపింది. 

చదవండి: బీజేపీని ఓడించడమే తమ ఉమ్మడి సంకల్పం: అఖిలేష్ యాదవ్

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top